17/11/2021
కమలం. కాషాయం. కరసేవకలు. పదాలు వేరైనా వారి టార్గెట్ మాత్రం ఒక్కటే. అదే అధికారం. దేశమంతా తాము ఉండాలన్నదే.. వారి తాపత్రయం. అంతే కాదు ఆరాటం కూడా. అందు కోసం ఎంత దూరమైన వెళ్తారు. ఏమైనా చేస్తారు. రాజకీయం అంటే ఇప్పుడు బిజెపిదే. అది ఆడిందే ఆట. పాడిందే పాట లా ప్రస్తుతం దేశమంతా మారింది. వీటన్నింటి వెనుక ఉంది ఒక్కటే అదే సంఘ్ పరివార్. అసలు కమలనాథులు చేసేది రాజకీయమా.. అధికార దాహమా?
చాపకింద నీరులా పాకడం అనేది ఒక్క బిజెపికి తెలిసినట్లుగా ఏ పార్టీకి తెలియదేమో. గత మంతా ఒక ఎత్తు.. ఇప్పటి రాజకీయు ఒక్కఎత్తు. అప్పటి లెక్క వేరు.. ఇప్పుడు వేరు. అన్ని పార్టీలు ఎలా ఉన్నా.. కమలం మాత్రం సైలెంట్ గా ఒక్కో రాష్ట్రంలో తన జెండా పాతుతూ పోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసే పాలిటిక్స్.. ఇప్పుడు కమలం చేస్తోంది. కాదా కాదు అంతకు మించి చేస్తోంది. జనం ఓట్లు వేసినా.. వేయకపోయానా.. ప్రతి రాష్ట్రంలో తాము ఉండాలి. తామే ఉండాలి. తతిమ్మ అన్ని పార్టీలు ప్రతిపక్షంలో ఉండాలి. ఇదే సిద్ధాంతం ఇప్పుడు కమలం పాటిస్తోంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ను కూల్చి అధికారంలోకి వచ్చింది. అటు దక్షిణాదిన కర్ణాటకలో నాటకీయ పరిణామాలు తెరలేపి.. కూమారస్వామి సర్కార్ను కూల్చేసింది. నానా హంగామా చేసింది. చివరికి కాంగ్రెస్, జెడిఎస్ వారిని చేర్చుకొని అధికారం చేపట్టింది. ఇలా చెప్పుకూంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒకలా పాలన పగ్గాలు చేపట్టింది. దీన్నంతటిని బట్టి చూస్తే జనం అభిప్రాయాలు కానీ.. వారి ఓటుకు కాని ఏ మాత్రం విలువ లేదు. వారు ఎవరికి ఓటు వేసినా.. ఎవరిని ఎన్నుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక వేళ ఇతర పార్టీల నుంచి గెలిచినా చివరికి వారిని లాగేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యమా అన్న ప్రశ్న మేధావులు లేవనెత్తిన పట్టించుకనే నాధుడే లేడు.
అధికారం దక్కుతుందనుకున్న చోట్ల ఏదో ఒక్క ఇష్యూను పట్టుకొని నిలదొక్కుకోవాలని చూస్తుంది. మొదట కనీసం పార్టీ లీడర్లు లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో దోస్తీ చేస్తుంది. దోస్తీ చేస్తూనే చిన్న చిన్నగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తుంది. అందు ముందుగా సంఘ్ ఎంటర్ అవుతుంది. అది అన్నింటిని సెట్ చేశాక.. ఇక రంగంలోకి దిగుతారు కమలనాథులు. ఇక దాని తర్వాత కొన్ని స్థానాలు దక్కించుకుంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో లోపాయి కార దోస్తీ చేస్తూనే.. సెంట్రల్ లో లడాయి నడిపిస్తారు. కాదు కాదు నడిచేలా చేస్తారు.
పక్కా వ్యూహం. ఫర్ఫెక్ట్ స్కెచ్తో రంగంలోకి దింపుతోంది ఆర్ఎస్ఎస్. వారి మార్గదర్శకాలను పకడ్భందిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తారు కమల నాథులు. అయితే ఇతర పార్టీలో ఇలా ఉండదు. వారు గ్రూప్ వార్, లడాయిలతో కాలక్షేపం చేస్తారు. కానీ ఇక్కడ సంఘ్ పరివార్ గీత దాడితే వాత తప్పదు. సంఘ్ చెప్పినట్లు ఎంతటి పెద్ద లీడర్ అయిన బిజెపిలో నడుచుకోవాల్సిందే. అందుకే కమలం రోజు రోజుకు వికసిస్తూ వస్తుంది. మిగతా పార్టీలు నానాటికి కనుమరుగు అవుతున్నాయి.