TG9 TV Telugu

  • Home
  • TG9 TV Telugu

TG9 TV Telugu TG9 TV channel is about the update of news in and around us, political, Recipe, Health, Amazing fact

17/11/2021

కమలం. కాషాయం. కరసేవకలు. పదాలు వేరైనా వారి టార్గెట్ మాత్రం ఒక్కటే. అదే అధికారం. దేశమంతా తాము ఉండాలన్నదే.. వారి తాపత్రయం. అంతే కాదు ఆరాటం కూడా. అందు కోసం ఎంత దూరమైన వెళ్తారు. ఏమైనా చేస్తారు. రాజకీయం అంటే ఇప్పుడు బిజెపిదే. అది ఆడిందే ఆట. పాడిందే పాట లా ప్రస్తుతం దేశమంతా మారింది. వీటన్నింటి వెనుక ఉంది ఒక్కటే అదే సంఘ్ పరివార్. అసలు కమలనాథులు చేసేది రాజకీయమా.. అధికార దాహమా?

చాపకింద నీరులా పాకడం అనేది ఒక్క బిజెపికి తెలిసినట్లుగా ఏ పార్టీకి తెలియదేమో. గత మంతా ఒక ఎత్తు.. ఇప్పటి రాజకీయు ఒక్కఎత్తు. అప్పటి లెక్క వేరు.. ఇప్పుడు వేరు. అన్ని పార్టీలు ఎలా ఉన్నా.. కమలం మాత్రం సైలెంట్ గా ఒక్కో రాష్ట్రంలో తన జెండా పాతుతూ పోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసే పాలిటిక్స్.. ఇప్పుడు కమలం చేస్తోంది. కాదా కాదు అంతకు మించి చేస్తోంది. జనం ఓట్లు వేసినా.. వేయకపోయానా.. ప్రతి రాష్ట్రంలో తాము ఉండాలి. తామే ఉండాలి. తతిమ్మ అన్ని పార్టీలు ప్రతిపక్షంలో ఉండాలి. ఇదే సిద్ధాంతం ఇప్పుడు కమలం పాటిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చి అధికారంలోకి వచ్చింది. అటు దక్షిణాదిన కర్ణాటకలో నాటకీయ పరిణామాలు తెరలేపి.. కూమారస్వామి సర్కార్‌ను కూల్చేసింది. నానా హంగామా చేసింది. చివరికి కాంగ్రెస్, జెడిఎస్ వారిని చేర్చుకొని అధికారం చేపట్టింది. ఇలా చెప్పుకూంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒకలా పాలన పగ్గాలు చేపట్టింది. దీన్నంతటిని బట్టి చూస్తే జనం అభిప్రాయాలు కానీ.. వారి ఓటుకు కాని ఏ మాత్రం విలువ లేదు. వారు ఎవరికి ఓటు వేసినా.. ఎవరిని ఎన్నుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక వేళ ఇతర పార్టీల నుంచి గెలిచినా చివరికి వారిని లాగేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యమా అన్న ప్రశ్న మేధావులు లేవనెత్తిన పట్టించుకనే నాధుడే లేడు.

అధికారం దక్కుతుందనుకున్న చోట్ల ఏదో ఒక్క ఇష్యూను పట్టుకొని నిలదొక్కుకోవాలని చూస్తుంది. మొదట కనీసం పార్టీ లీడర్లు లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో దోస్తీ చేస్తుంది. దోస్తీ చేస్తూనే చిన్న చిన్నగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తుంది. అందు ముందుగా సంఘ్ ఎంటర్ అవుతుంది. అది అన్నింటిని సెట్ చేశాక.. ఇక రంగంలోకి దిగుతారు కమలనాథులు. ఇక దాని తర్వాత కొన్ని స్థానాలు దక్కించుకుంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో లోపాయి కార దోస్తీ చేస్తూనే.. సెంట్రల్ లో లడాయి నడిపిస్తారు. కాదు కాదు నడిచేలా చేస్తారు.

పక్కా వ్యూహం. ఫర్ఫెక్ట్ స్కెచ్‌తో రంగంలోకి దింపుతోంది ఆర్ఎస్‌ఎస్. వారి మార్గదర్శకాలను పకడ్భందిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తారు కమల నాథులు. అయితే ఇతర పార్టీలో ఇలా ఉండదు. వారు గ్రూప్ వార్, లడాయిలతో కాలక్షేపం చేస్తారు. కానీ ఇక్కడ సంఘ్ పరివార్ గీత దాడితే వాత తప్పదు. సంఘ్ చెప్పినట్లు ఎంతటి పెద్ద లీడర్ అయిన బిజెపిలో నడుచుకోవాల్సిందే. అందుకే కమలం రోజు రోజుకు వికసిస్తూ వస్తుంది. మిగతా పార్టీలు నానాటికి కనుమరుగు అవుతున్నాయి.

08/11/2021

తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారబోతున్నాయి. నువ్వా నేనా అంటూ ఢీ అంటే ఢీ అంటూనే ప్రజలను మభ్యపెట్టేలా చేయబోతున్నారు. ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ ఓట్ల పాలిటిక్స్ కి తెరలేపారు. ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు. మరి ఓట్ల రాజకీయం ఏంటి అనుకుంటున్నారా? అదే అసలు మాయామంత్రం. కనిపించని మర్మం వెనుక తెలియని మర్మాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి ఏ నాడు బండిపై మాటెత్తని కేసీఆర్ ఇప్పుడు బండి టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నారు. అసలు వీటన్నింటి వెనుక ఏం జరగబోతుంది. వెయిట్ అండ్ సీ..!

28/10/2021

హుజూరాబాద్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ముప్పుగానే ఉంది. దీనిపైనే కొన్ని పార్టీల అగ్రనేతల భవితవ్యం ఆధారపడిందని ఆ పార్టీల నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత ప్రయోజనాలో ఇప్పటికే ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కమలానికి కష్టం. కమలం గెలిస్తే కాంగ్రెస్‌కి కష్టం. టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్‌కి లాభం. మరి ఎవరు గెలుస్తారో మరో కొద్ది రోజుల్లో తెలిపోతుంది.

మోడీ నీ కిది న్యాయమేనా?ఫస్ట్ వేవ్ కరోనాను తట్టుకొని నిలబడ్డాం! మోడీ నిర్ణయాలే దేశాన్ని రక్షించాయి! కరోనాను జయించాం! ప్రప...
29/04/2021

మోడీ నీ కిది న్యాయమేనా?

ఫస్ట్ వేవ్ కరోనాను తట్టుకొని నిలబడ్డాం! మోడీ నిర్ణయాలే దేశాన్ని రక్షించాయి! కరోనాను జయించాం! ప్రపంచానికి భారత్ మార్గదర్శిగా మారింది! ఇలా కమలనాథులు ఎన్నో రకాలుగా సంకలు గుద్దుకొని సొంత డబ్బా కొట్టుకున్నారు. మరి ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా గురించి ఎవరు సమాధానం చెబుతారు? పిట్టల్లా రాలుతున్న ప్రజల గోస ఎవరు చూస్తారు? ఏసీలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే మీరా? లేదా మేమే తోపు, తురుములమ్ అని చెప్పుకునే మీ పార్టీనా? కరోనా చావులకు బాధ్యత ఎవరిది? ఆ మరణాలన్ని ప్రభుత్వ హత్యలు కావా?

దేశాన్ని పణంగా పెట్టిన కమలనాథులు?

కేవలం ఎన్నికల్లో గెలవాలన్న ఒకే ఒక్క స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెట్టారు. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికలు చేయబట్టి కరోనాను పట్టించుకోలేదు. కనీసం ముందు చూపుతో ఆక్సిజన్ ఏర్పాట్లు అయినా చేయలేదు. ఎన్నికల్లో గెలవడమే కావాలి కానీ... ఈ ప్రజలు ఎలా చస్తే మాకేంటి అని అనుకునే మీలాంటి నాయకులు అసలు నేతలేనా? మిమ్మల్నేనా ఎన్నుకుంటుంది ఈ జనం? ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశారో ఈ ప్రపంచానికి చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ప్రపంచం ముందు ఎందుకు భారత్‌ను బద్నాం చేస్తునారు?
భారత్‌లో ఉన్న వ్వవస్థ చేతకానిదా? పని చేయనిదా? మీ నిర్లక్ష్క్ష్యం వల్ల ఎంత మంది ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు? అసలు మరణించిన వారి లెక్కలైనా సరిగ్గా ఉన్నాయా? బడా సంస్థలకు కొమ్ము కాస్తు ప్రభుత్వ వ్యవస్థలను, సంస్థలను బలహీనంగా తయారు చేయడం వెనుక మతలభేంటి? మీ గుజరాత్‌లో హాస్పిటల్స్ బాగుంటే సరిపోతుందా? మిగతా రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితేంటి? దేశానికే తలమానికమైన ఢిల్లీని ఎందుకు పట్టించుకోరు? మీరు ఉండేది, పరి పాలించేది ఢిల్లీ నుంచి కాదా? ఎందుకు స్వార్థ పూరితంగా ఆలోచించగలుగుతున్నారు? ఇంత వరకు మీతో నడిచిన జనంను ఇప్పుడు నడవమని చెప్పే ధైర్యం ఉందా?

ఆక్సిజన్ కొరతను తీర్చడం లేదు ఎందుకు?

ఆక్సిజన్ అవసరం వస్తుందని ముందే తెలియదా? తెలిసి కూడా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు. కరోనాను కట్టడి చేయడంలో ఎందుకు కేంద్రం విఫలమైంది. ఎలక్షన్స్ మీద పెట్టిన ఫోకస్ కరోనాపై ఎందుకు పెట్టలేకపోయారు. ఎన్నికల్లో గెలిస్తే సరిపోతుందా? ప్రజల ప్రాణాలు మీకు అక్కరలేదా? కేవలం ఆక్సిజన్ కొరతను తీర్చినా.. వేల మంది బతికేవారు. అధికారులకు ఎందుకు పవర్ ఇవ్వడం లేదు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇప్పుడేమో ఎన్నికల ఫలితాలు వచ్చాక లాక్ డౌన్ పెట్టుదామని అనుకుంటున్నట్లు లీకులు ఎందుకు ఇస్తున్నారు. ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారా? లేదా ప్రజలు సచ్చాక నిర్ణయాలు తీసుకుంటారా?

ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ హత్యలే!

మద్రాస్ హైకోర్టు చెప్పినట్లు ముమ్మాటికి.. నూటికి నూరు కాదు కాదు.. వెయ్యి శాతం ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పిదమే ఈ కరోనా చావులు. ఎలక్షన్స్ ను నిలిపివేయాల్సిన కమిషన్ కంటిన్యూ చేస్తూ కరోనాను పట్టించుకోకుండా విస్తరించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను ఎందుకు నిలిపి వేయలేకపోయింది. ఇప్పుడు కరోనా చావులకు ఎవరు బాధ్యత వహిస్తారు?

చావుల కేకలు వినపడడం లేదా సార్?

ప్రజలను ఎందుకు పట్టి పీడిస్తున్నారు. ట్యాక్స్‌లు, జీఎస్టీలు అంటూ
వసూల్ చేయడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజారోగ్యంపై ఎందుకు పెట్టడం లేదు. అంటే ప్రజలు అడగరులే అని అనుకుంటున్నారా? ప్రతి పక్షం లేదు మేము చేసిందే రాజ్యం.. చెప్పిందే వేదం అని బావిస్తున్నారా? ఒక్కసారి జనం ఎదురు తిరిగితే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. స్వార్థపూరితమైన నిర్ణయాలను పక్కన పెట్టి.. ప్రజలను రక్షించడంపై దృష్టి పెట్టండి సార్. దయచేసి ప్రజలను కాపాడండి సార్. వాళ్ల అర్థనాధాలు వినండి సార్. వారి కన్నీళ్లను తుడవండి సార్. మీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి సార్. భారత్‌ను రక్షించండి సార్. జనంకు రక్షణగా నిలవండి సార్.

20/03/2021

Telangana Assembly Budget Session 2021 LIVE | CM KCR | Day-05 | TG9 TV

18/03/2021

Telangana Assembly LIVE | Telangana Budget Sessions 2021 LIVE | Day 3 | TG9 TV

17/03/2021

Telangana Legislative Assembly || Budget session || 17.03.2021 ||TG9 TV

Address


Alerts

Be the first to know and let us send you an email when TG9 TV Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share