Maa konaseema News

Maa konaseema News maa konaseema news
(1)

26/08/2026

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితం

నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక సమీప సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను అధికారులు, స్థానిక మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వారం రోజుల క్రితం వేటకు సముద్రంలోకి వెళ్లారు. అంతర్వేది సాగర సంగమం సమీపంలో భైరవస్వామికి చెందిన సోనా బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలోనే నిలిచిపోయింది. దీంతో మరో బోటులో ఉన్న మత్స్యకారులు తాడు సహాయంతో ఆ బోటును ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే చినమైనవానిలంక సమీప సముద్రంలో ఇసుక తిన్నెలు తగలడంతో సహాయక బోటుకు కూడా రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ బోటు వెనుదిరిగింది. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో ఏడుగురు మత్స్యకారులు బోటులోనే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న నర్సాపురం పోలీసులు, అంతర్వేది మెరైన్ పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో రక్షణ చర్యలు చేపట్టి ఏడుగురు మత్స్యకారులను బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సముద్రంలో చిక్కుకున్న బోటును పూర్తిగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు, స్థానిక మత్స్యకారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంనర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక సమీప స...
26/08/2026

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితం

నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక సమీప సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను అధికారులు, స్థానిక మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వారం రోజుల క్రితం వేటకు సముద్రంలోకి వెళ్లారు. అంతర్వేది సాగర సంగమం సమీపంలో భైరవస్వామికి చెందిన సోనా బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలోనే నిలిచిపోయింది. దీంతో మరో బోటులో ఉన్న మత్స్యకారులు తాడు సహాయంతో ఆ బోటును ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే చినమైనవానిలంక సమీప సముద్రంలో ఇసుక తిన్నెలు తగలడంతో సహాయక బోటుకు కూడా రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ బోటు వెనుదిరిగింది. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో ఏడుగురు మత్స్యకారులు బోటులోనే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న నర్సాపురం పోలీసులు, అంతర్వేది మెరైన్ పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో రక్షణ చర్యలు చేపట్టి ఏడుగురు మత్స్యకారులను బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సముద్రంలో చిక్కుకున్న బోటును పూర్తిగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు, స్థానిక మత్స్యకారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

నాలుగు నూతన పుస్తక నిక్షిప్త కేంద్రాలకు అనుమతులుకాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నూతన పుస్తక నిక్షిప్త కేంద...
26/08/2026

నాలుగు నూతన పుస్తక నిక్షిప్త కేంద్రాలకు అనుమతులు

కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నూతన పుస్తక నిక్షిప్త కేంద్రాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు) అనుమతులు మంజూరు చేశారు.

కేశవరం, కాట్రేనిపాడు, రాజులపాలెం, జువ్విగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పుస్తక నిక్షిప్త కేంద్రాలను పాఠకులకు, గ్రామీణ యువతకు అందుబాటులో ఉండేలా నిర్వహించాలని కేంద్రాల పరిరక్షకులను సాయిబాబు రాజు ఆదేశించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞానాన్ని విస్తరించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కే.జే.ఎస్.ఎల్. కుమారి, కే. కిషోర్, ఎం. శ్రావ్య, సాయి తదితర గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం తాళ్లరేవు గ్రంథాలయాన్ని సాయిబాబు రాజు సందర్శించి, పాఠకులతో ముచ్చటించారు. గ్రంథాలయ సేవలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

24/08/2026

శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే చినరాజప్ప ప్రత్యేక పూజలు

కాకినాడ జిల్లా: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే చినరాజప్ప, నిమ్మకాయల రంగనాగ్‌కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో అడబాల కుమారస్వామి, కంటే బాబు, యార్లగడ్డ చిన్ని, బలుసు వాసు, తాతపూడి వంశీ తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోటలో రూ.16 లక్షలతో నిర్మించిన నూతన రహదారి ప్రారంభంకాకినాడ జిల్లా: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంల...
24/08/2026

సామర్లకోటలో రూ.16 లక్షలతో నిర్మించిన నూతన రహదారి ప్రారంభం

కాకినాడ జిల్లా: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలోని 29వ వార్డులో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నూతన రహదారితో స్థానికులకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, పెంకె శ్రీనివాస్ బాబా, బడుగు శ్రీకాంత్, అడబాల కుమార్ స్వామి, కంటే బాబు, యార్లగడ్డ చిన్ని, బలుసు వాసు, వల్లూరు దొరబాబు, తాతపూడి అరుణ్ వంశీ, నిడదవోలు వీర్రాజు, బొందల రామలక్ష్మీ, జనసేన నాయకులు సరోజ వాసు, పిట్ట జానకి రామయ్య, తాతపూడి కృష్ణబాబు, గుడాల శంకర్, అడ్డాల వెంకన్నబాబు, కొల్లి నాగ సునీత, పిల్లాడి సత్యవతి, కాటమరెడ్డి అరుణ వాసవి, దేవుళ్ళ జయలక్ష్మి, నిమ్మకాయల కరణ్, గోలి సత్తిరాజు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామర్లకోటలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంకాకినాడ జిల్లా: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట పట్టణం 29వ వార్...
24/08/2026

సామర్లకోటలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం

కాకినాడ జిల్లా: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట పట్టణం 29వ వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మకాయల రంగనాగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పెంకె శ్రీనివాస్ బాబా, బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కంటే బాబు, యార్లగడ్డ చిన్ని, బలుసు వాసు, వల్లూరు దొరబాబు, తాతపూడి అరుణ్ వంశీ, నిడదవోలు వీర్రాజు, బొందల రామలక్ష్మీ, జనసేన నాయకులు సరోజ వాసు, పిట్ట జానకి రామయ్య, తాతపూడి కృష్ణబాబు, గుడాల శంకర్, అడ్డాల వెంకన్నబాబు, కొల్లి సునీత, పిల్లాడి సత్యవతి, కాటమరెడ్డి అరుణ వాసవి, దేవుళ్ళ జయలక్ష్మి, నిమ్మకాయల కరణ్, గోలి సత్తిరాజు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

24/08/2026

బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం.. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఆధ్వర్యంలో బీసీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కొప్పవరంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా టీడీపీ బీసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు, తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. బీసీలకు గతంలో ఉన్న 20 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతానికి పెంచడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు.

బీసీలను అక్కున చేర్చుకునే ఏకైక పార్టీ టీడీపీ అని, బలమైన బీసీ నాయకత్వాన్ని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని నాయకులు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీవోల పేరుతో నాటకాలు ఆడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అన్ని విధాలా అండగా నిలుస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ బద్రినాధ్, శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, రాజనాల సత్యన్నారాయణ, టీడీపీ ఇంద్రపాలెం గ్రామాధ్యక్షురాలు వెంకటరమణమ్మ, పాలిక రామ్మోహన్, టీడీపీ బీసీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కామాది దశరధ, బొబ్బిలి గోవింద్, పనసపాడు సర్పంచ్ చీకటి వెంకటేశ్, బంగార్రాజు, అంకంరెడ్డి రామానాయుడు, కాకర్ల చలపతి, గెంజాల శ్రీనివాసు, కాలా శ్రీనివాసు, పాలిక సతీష్, కోడి సీతారాం, పెంకే శ్రీనివాస బాబా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

24/08/2026

పి.గన్నవరంలో శ్రీలక్ష్మి అడ్వాన్స్డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం

అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో శ్రీలక్ష్మి అడ్వాన్స్డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ రిహేబిలిటేషన్ సెంటర్ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి.గన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సెంటర్‌లో లేజర్ ఫిజియోథెరపీ, సాధారణ ఫిజియోథెరపీ, రోబోటిక్ హ్యాండ్ స్టిమ్యులేషన్, ఆక్యుప్రెషర్, కప్పింగ్, ఆక్యుపంక్చర్, ఎలక్ట్రో కప్పింగ్, ఎలక్ట్రో డ్రై నీడ్లింగ్ స్టిమ్యులేషన్, కైరోప్రాక్టర్ థెరపీ వంటి అధునాతన పద్ధతులతో సేవలు అందించనున్నట్లు ఉత్తమ ఫిజియోథెరపీ వైద్య పురస్కార గ్రహీత డాక్టర్ హనుమ నాయక్ తెలిపారు.

పి.గన్నవరం ప్రాంత ప్రజలు ఈ అధునాతన ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

పి.గన్నవరంలో శ్రీలక్ష్మి అడ్వాన్స్డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభంఅధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రా...
24/08/2026

పి.గన్నవరంలో శ్రీలక్ష్మి అడ్వాన్స్డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం

అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో శ్రీలక్ష్మి అడ్వాన్స్డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ రిహేబిలిటేషన్ సెంటర్ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి.గన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సెంటర్‌లో లేజర్ ఫిజియోథెరపీ, సాధారణ ఫిజియోథెరపీ, రోబోటిక్ హ్యాండ్ స్టిమ్యులేషన్, ఆక్యుప్రెషర్, కప్పింగ్, ఆక్యుపంక్చర్, ఎలక్ట్రో కప్పింగ్, ఎలక్ట్రో డ్రై నీడ్లింగ్ స్టిమ్యులేషన్, కైరోప్రాక్టర్ థెరపీ వంటి అధునాతన పద్ధతులతో సేవలు అందించనున్నట్లు ఉత్తమ ఫిజియోథెరపీ వైద్య పురస్కార గ్రహీత డాక్టర్ హనుమ నాయక్ తెలిపారు.

పి.గన్నవరం ప్రాంత ప్రజలు ఈ అధునాతన ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Address

Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa konaseema News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share