10/06/2026
సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని చీరాల DSP.MD.మొయిన్ హెచ్చరించారు.బుధవారం చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజల మధ్య కుల,మత,ప్రాంతీయ విద్వేషాలు రగిలించేలా ఉండే పోస్టులు,వీడియోలు,ఫోటోలు,దుష్ప్రచారాలు ప్రచారం చేయడం చట్ట విరుద్ధమన్నారు.ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్స్టాగ్రామ్,వాట్సాప్,వంటి సామాజిక మాధ్యమాల్లోఇతరులను కించపరిచే పోస్టులపై ఇప్పటికై నిఘా ఉంచామన్నారు.ఆయా వాట్సాప్ గ్రూపులతో తెలియని వీడియోలు,ఫోటోలు ఎటువంటి ధృవీకరణ లేకుండా షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.ఇదే క్రమంలో గ్రూపులో నిరాధార పోస్టులు ఫార్వార్డ్ చేస్తే సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.సోషల్ మీడియాను సమాజ హితానికే ఉపయోగించాలని,శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వాడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు.