Navya News

Navya News https://www.facebook.com/profile.php?id=61568153855401


For More Updates Plz Fallow Navya news

వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధులు, జ్వరాలు ప్రభలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ముఖ్య కార...
08/07/2025

వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధులు, జ్వరాలు ప్రభలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి సిఎస్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో అధికంగా జ్వరాల కేసులు నమోదైతే ఆ ప్రాంతాలలో తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. దిగువ ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుబంధ శాఖలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. డెంగ్యూ చికెన్ గునియా, మలేరియా, వైరల్ ఫీవర్ లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వెంకట మురళి ,అధికారులు పాల్గొన్నారు .

వేటపాలెం టౌన్ సెక్షన్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు 36 బంధాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మొత్తం 323...
08/07/2025

వేటపాలెం టౌన్ సెక్షన్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు 36 బంధాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మొత్తం 3232 సర్వీసులను అధికారులకు తనిఖీలు చేపట్టారు.తనిఖీలలో విద్యుత్ సంస్థ నుంచి తీసుకున్నఅనుమతులకు మించి విద్యుత్ వాడుతున్న 66 మంది విద్యుత్ వినియేగదారులకు రూ 2,35,000 /- జరిమానాలను విధించినట్లు ,,,ఇదే క్రమంలో అనుమతి కేటగిరిలో కాకుండా వేరొక కేటగిరీలో వాడుతున్న12 మందికి రూ 10000 /- జరిమానా విధించినట్లు బాపట్ల జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ గువ్వల ఆంజనేయులు తెలిపారు .తనిఖీలలో విజిలెన్స్ డిఈM .భాస్కర్ ,విజిలెన్స్ ఏడి విజయ శ్రీనివాస్ , చీరాల ఆపరేషన్ డివిజన్ డిఈ జాన్ థామస్ , వేటపాలెం ఏడిపెరుగు శ్రీనివాస్ రావు,వేటపాలెం AEవేదవ్యాస్ , చీరాల డివిజన్ ఏడీలు ,ఏఈలు ,సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకుని రైతులు లాభాలు పొందాలని చీరాల ఎమ్మెల్యే  మద్దుల...
08/07/2025

ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకుని రైతులు లాభాలు పొందాలని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకంలో రైతు సతీష్ బాబు పొలంలో ఎమ్మెల్యే కొండయ్య మామిడి మొక్కలను నాటే పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల సాగుతో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక లాభాలు పొందవచ్చన్నారు.

08/07/2025

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఫై జరుగుతున్న భౌతిక దాడులకు నిరసన చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం చీరాల కోర్ట్ సముదాయంలో న్యాయవాదుల విధులు బహిష్కరించి ,,నిరసన ప్రదర్శన చేపట్టారు .

08/07/2025

జిల్లా పోలీస్ వాహన డ్రైవర్లకు నిర్వహించే "డ్రైవర్ ప్రొఫిషియెన్సీ స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ క్యాప్సూల్ కోర్స్" ను సోమవారం బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. శిక్షణలో భాగంగా ప్రదర్శించిన వాహన విడిభాగాలను అయన క్షుణంగా పరిశీలించారు.

08/07/2025

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ డిమేండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు.అనంతరం సమస్యలతో కుడిన వినతిపత్రాన్నిరెవిన్యూ అధికారులకు అందజేశారు .

08/07/2025

చీరాల విజయనగర్ కాలనీ MRPS 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ,వేడుకలకు ముఖ్యఅతిధిగా ఏపి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్య రావు హజారేయ్యారు .

08/07/2025

బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాపియూ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి అద్యక్షతన నిర్వహించారు .కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి కలెక్టర్ కు వివిధ సమస్యల ఫై అర్జీలను స్వీకరించారు .

08/07/2025

చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అర్దాంతంరంగా నిలిచిపోయింది.చీరాల రైల్వే స్టేషన్ కు సుమారు 500 మీటర్ల దూరంలో రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఎం జరుగుతోందో ..? తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురియ్యారు.

06/07/2025

వేటపాలేం , సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి కలశాలకు చెందిన విద్యార్ధిని జె.యన్‌.టి.యు కె , కాకినాడ లో 2020`24 బి.టెక్‌ పరీక్షలలో యూనివర్సిటి స్ధాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది .ఈక్రమంలో విద్యార్థినికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ చేతులమీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, శ్రీమంతుల లక్ష్మణ రావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

06/07/2025

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది . కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ ప్రజల జీవనోపాదులు మెరుగుపరచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా అందిస్తున్న రుణాలను లబ్ధిదారులు సద్వినియెగం చేసుకోవాలన్నారు .

06/07/2025

పర్చూరు YCP ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో " బాబు షూరిటి మోసం గ్యారంటీ " కార్యక్రమాన్ని ఇంకోల్లు మండలం, పావులూరులో నిర్వహించారు .కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బాపట్ల జిల్లా వైసీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, మేరుగ నాగార్జున హజారేయ్యాయి ,,,ప్రసంగించారు .

Address

Chirala
523157

Website

Alerts

Be the first to know and let us send you an email when Navya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share