19/10/2024
పత్రికా ప్రకటన
-----------------------
*దళిత ఉద్యోగుల హక్కులను కాలరాయెద్దు*
*వారి మనోభావాలను దెబ్బ తీయొద్దు.*
*ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే..*
*చిత్తూరు ఎంపీ.., జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు*
చిత్తూరు
19-10-24
-------------------
దళిత ఉద్యోగుల హక్కులను కాలరాయొద్దని.. ప్రభుత్వ సంస్థలకు సూచించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. వారి మనోభావాలను దెబ్బతీయద్దని తెలియజేశారాయన.
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగపరంగా, శాసనపరంగా కల్పించిన హక్కులు,
ప్రత్యేక రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సంస్థలు ఎలా నడుచుకోవాలో అన్న అంశాల పై జాతీయ ఎస్సీ ,ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికే కేరళ రాష్ట్రంలోని మున్నార్, కొచ్చి ప్రాంతాల వేదికగా సదస్సులు నిర్వహించిన నేషనల్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు,.. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా
సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సారధ్యంలో నిర్వహించిన ఈ సమావేశాలలో కర్ణాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ షాలిని రాజ్ నీష్ తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.
దళిత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఈ సదస్సులకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హెచ్వోడీలు, కెనరా బ్యాంక్ ప్రతినిధులు, బి ఈ ఎల్, హెచ్ ఏ ఎల్, బెంగళూరుకు చెందిన ఐ ఐ ఎస్ సి వంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యుని హోదాలో దగ్గుమళ్ళ ప్రసాదరావు.. దళిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమకు సంబంధించిన పలు సమస్యలను చిత్తూరు ఎంపీ ప్రసాదరావు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వినతి పత్రాలను కూడా సమర్పించారు.
అనంతరం చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అభ్యున్నతే ధ్యేయంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ పని చేస్తోందన్నారు.