09/08/2026
మామిడి తోట రోడ్డు కోసం ప్రజా పాదయాత్ర
గున్నేపల్లి అగ్రహారం పరిధిలోని మామిడి తోట – బుల్లిగా కాలనీ రహదారి దుస్థితిపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈరోజు ప్రజల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
గత ఎన్నో సంవత్సరాలుగా అధ్వాన్నంగా ఉన్న ఈ రహదారి కారణంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఆటోలు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.
“మాటలు వద్దు – రోడ్డు కావాలి!”
“మామిడి తోట రోడ్డు నిర్మించాలి – ప్రజల కష్టాలు తీర్చాలి!”
అనే నినాదాలతో ప్రజలు తమ నిరసనను తెలియజేశారు.
ఈ పాదయాత్రలో మేడిచర్ల ఆదినారాయణ, మేడిచర్ల కృష్ణ, ఆకుల నాగబాబు, మేడిచర్ల నాగేశ్వరావు, ఆకుల గంగరాజు, వాకపల్లి శ్రీను, కుడిపూడి నాగరాజు, సాపే రాంబాబు, లంక వీరాంజనేయులు, కాండ్రేగుల భాస్కరరావు, చాగంటి గంగా భవాని, సిద్ధాబత్తుల శ్రీను, గోగి శ్రీరామమూర్తి, కొత్తపల్లి వెక్కన్నబాబు, కొత్తపల్లి సత్యనారాయణ, కేతా శివ, వాకపల్లి దొరబాబు (ఎంపీటీసీ), నూకల సూర్యచంద్రరావు, కాండ్రేగుల రాంబాబు, సప్పిడి రామకృష్ణ, వాకపల్లి జయరాజు, మద్దింశెట్టి ప్రసాదరావు, బాలిశెట్టి శివ, మద్దింశెట్టి రాజేష్, చింతపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అలాగే మామిడి తోట, బుల్లిగా కాలనీ, చాకలిపాలెం గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రహదారి నిర్మాణం కోసం తమ గళాన్ని వినిపించారు.
ప్రజల ప్రాథమిక అవసరమైన రహదారి కోసం చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి మామిడి తోట రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్
మా డిమాండ్ ఒక్కటే —
మామిడి తోట రోడ్డు నిర్మించాలి!
ప్రజల కష్టాలు తీర్చాలి!
#ప్రజాపాదయాత్ర #మామిడితోటరోడ్డు #గున్నేపల్లి #రోడ్డుకోసంపోరాటం