KAPU SRINIVAS

KAPU SRINIVAS https://youtube.com/?si=uDLt4UFhImOpHfEY
� సబ్ స్క్రయిబ్ చేయండి

23/08/2025
బిజెపి అవినీతిరహిత పార్టీ అని మోడీ మాట్లాడటం ఎంత అర్ధరహితమో చూడండి.   పాత మేటర్ బిజెపి గూటికి చేరితే పునీతులే.. 23 మంది ...
23/08/2025

బిజెపి అవినీతిరహిత పార్టీ అని మోడీ మాట్లాడటం ఎంత అర్ధరహితమో చూడండి. పాత మేటర్

బిజెపి గూటికి చేరితే పునీతులే..
23 మంది ప్రతిపక్ష నేతలపై ‘నో యాక్షన్ ‘

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది నేతలు బిజెపి గూటికి చేరడంతో కేసుల నుండి ఉపశమనం పొందినట్లు మీడియా విచారణలో తేలింది.

బిజెపి కండువా కప్పుకుంటే చట్టం కూడా తన తీరుని మార్చుకుంటుందని స్పష్టమైంది.కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. బిజెపిని ‘వాషింగ్‌ మెషీన్‌’ గా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.

2014 నుండి, అవినీతి కేసులపై కేంద్ర ఏజెన్సీల నుండి దాడులను ఎదుర్కొంటున్న 25 మంది ప్రముఖ రాజకీయ నేతలు బిజెపిలో చేరారు. వీరిలో పది మంది కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌సిపి, శివసేన (విభజనకు ముందు) పార్టీల నుండి నలుగురేసి చొప్పున, టిఎంసి నుండి ముగ్గురు. టిడిపి నుండి ఇద్దరు, ఎస్‌పి, వైఎస్‌ఆర్‌సిపి నుండి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.వీటిలో 23 కేసుల్లో,వారి రాజకీయ ఎత్తుగడలతో ఇడి,సిబిఐ నుండి ఉపశమనం పొందినట్లు విచారణలో తేలింది.

వీటిలో మూడు కేసులను మూసివేయబడ్డాయి. మరో 20 మందిపై కేసు విచారణను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ జాబితాలో ఉన్న ఆరుగురు రాజకీయ నేతలు సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు బిజెపిలో చేరడం గమనార్హం.

2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 95 శాతం మంది ప్రముఖ ప్రతిపక్ష నేతలు ఇడి, సిబిఐ దాడులను ఎదుర్కొన్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2022లో వెల్లడించింది.

వరుసగా 2022,2023 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం మహారాష్ట్ర రాజకీయాలను టార్గెట్‌ చేసింది. 2022లో ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేనపై తిరుబాటు ప్రకటించి, మహా వికాస్‌ అఘాడీ (కాంగ్రెస్‌, శివసేన, ఎన్‌సిపి)లో ప్రభుత్వాన్ని కూల్చివేసింది. తర్వాత బిజెపితో చేతులు కలపడంతో షిండే, ఫడ్నవీస్‌ సిఎం, డిప్యూటీ సిఎంలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.

మరుసటి ఏడాది ఎన్‌సిపిలో చీలికలు తీసుకువచ్చిన అజిత్‌ పవార్‌ వర్గం.. ఎన్‌డిఎ కూటమిలో చేరింది. దీంతో ఎన్‌సిపి నేతలు అజిత్‌ పవార్‌,ప్రఫుల్‌ పటేల్‌లపై కేసులను మూసివేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

25 మందిలో మహారాష్ట్రకు చెందిన 12 మంది ప్రముఖ నేతలు ఉన్నారు. వీరిలో 11 మంది 2022, ఆ తర్వాత ఏడాదిలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సిపికి చెందిన నలుగురితో సహా బిజెపి తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.

ఎపిలో ‘అవినీతి మార్కు’ ని ఎదుర్కొన్న నేతలు
ఈ 25 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నేతలు బిజెపిలో చేరి అవినీతి మార్కుని వదిలించు కున్నారు. వీరిలో టిడిపి నుండి ఇద్దరు, వైసిపి నుండి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. టిడిపి, వైసిపిల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బిజెపిలో చేరిన సుజనాచౌదరి, సిఎం రమేష్‌, కె. గీతలను ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది.

రూ.100 కోట్ల నగదు అవతవకలు జరిగాయంటూ టిడిపి ఎంపిగా ఉన్న సిఎం రమేష్‌కి చెందిన కంపెనీలపై 2018 అక్టోబర్‌లో ఐటి శాఖ దాడులు జరిపింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బిజెపి ఎంపి జివిఎల్‌.నరసింహారావు పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీకి లేఖ రాశారు. భారీ ఆర్థిక కుంభకోణాలతో ‘ఆంధ్రా మాల్యాలు’గా పేరు గడించినందుకు ఆయనను ఎంపిగా తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే 2019 జూన్‌లో సిఎం రమేష్‌ బిజెపి తీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై ఐటి దాడులు నిలిచిపోయాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపి సుజనాచౌదరిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బిసిఇపిఎల్‌) సుజనా చౌదరికి చెందినవని, బ్యాంకుల కన్సార్టియం నుండి మోసపూరితంగా రూ. 360 కోట్లకు పైగా రుణాలు పొంది, డిఫాల్ట్‌ చేసిందని ఎఫ్‌ఐఆర్‌లు పేర్కొన్నాయి. 2016లో ఇడి కేసు నమోదు చేయగా, 2018 అక్టోబర్‌లో ఆయన కంపెనీలపై ఇడి దాడులు చేసింది. 2019 ఏప్రిల్‌లో రూ.315 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసుకుంది.

చార్జిషీటు నమోదైన అనంతరం 2019 జూన్‌లో బిజెపి కండువా కప్పుకోవడంతో ఈ కేసు తిరిగి విచారణకు వెళ్లింది. ప్రస్తుతం సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగారు.

వైసిపికి చెందిన కె.గీతను మార్చి 28న బిజెపి అరకు అభ్యర్థిగా ప్రకటిచింది. 2015 వైఎస్‌ఆర్‌సిపి ఎంపిగా ఉన్న సమయంలో వాస్తవాలను తప్పుగా చూపి, రూ.42 కోట్ల రుణాలు తీసుకుని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేశారంటూ ఆమె సంస్థ విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసు నమోదైంది. గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావులపై 2015లో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది.

2019 జులైలో బిజెపిలో చేరారు. దీంతో 2022 సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు ఇరువురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు జైలు శిక్షపై స్టే విధించడంతో పాటు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు జైలు శిక్షపై మరోసారి స్టే విధించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు స్టేను సిబిఐ సవాలు చేసింది.

దేశంలో 40 వేల రోహింగ్యాలు----------------------------------------భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిన లెక్క  ఇది. ఒక క...
23/08/2025

దేశంలో 40 వేల రోహింగ్యాలు
----------------------------------------
భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిన లెక్క ఇది.

ఒక కేసు విచారణ సందర్భంగా ఇటీవలనే అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు కోర్టుకు ప్రభుత్వం సమర్పించిన లెక్క ఇది.

కానీ వీరి సంఖ్యపై జాతీయ అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు భిన్నమైన లెక్కలు చెబుతున్నారు.

సర్కారు చెప్పిన లెక్కకు నాయకులు చెబుతున్న లెక్కలకు దోమ-ఏనుగుల మధ్య ఉన్నంత వ్యత్యాసం కనపడుతున్నది.

లక్షన్నర మంది రోహింగ్యాలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి నిన్నటి సాధారణ ఎన్నికల్లో జాతీయ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినావిడ పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇప్పటికీ అదే సంగతిని చెబుతూ వస్తున్నారావిడ.

తెలంగాణ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్న నాయకుడూ ఇదే తరహాలో మాట్లాడారు.

అనేక వేదికల్లో ఇవే సంగతులను ఆయన చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు.ఇటీవలే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఒక శాసనసభ్యుడు కూడా ఇదే తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు.

ప్రభుత్వం వెలుపల ఉన్నవారు ఇలాంటి అర్థం లేని పొంతన లేని మాటలు మాట్లాడడం వేరు.ప్రభుత్వంలో ఉన్నవారు కూడా అదే తీరులో మాట్లాడడాన్ని ఎలా చూడాలి?

రోహింగ్యాల అంశాన్ని చూడవలసిన హోం శాఖ సహాయ మంత్రి కూడా ప్రభుత్వ లెక్కకు భిన్నంగా అతిశయోక్తితో కూడిన మాటలు మాట్లాడడం ఏమిటి?

వాళ్లు ఎంత మంది ఉన్నారనేది ప్రభుత్వమే చెప్పాలి. ఆకుకు, పోకకు అందని ఇలాంటి భిన్నమైన పొంతన లేని లెక్కలు చెప్పడం, ప్రచారం చేయడం బాధ్యతా రాహిత్యమే అవుతుంది కదా.

అంతే కాదు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సంబంధం లేని ఇతర సామాజిక అంశాలకు ముడి వేయడం కూడా ఈ మధ్య బాగా పెరిగి పోతున్నది.

తమ పార్టీ కానీ వారు,ప్రతిపక్ష నాయకులు, తాము ప్రత్యర్థులుగా,శత్రువులుగా భావించే వారు ఏమి మాట్లాడినా రోహింగ్యాల అంశానికి ముడి వేసి మాట్లాడడం జాతీయ అధికార పార్టీ నాయకుల తీరుగా మారిపోయింది.

రోహింగ్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుంది కదా?

అలాంటి చట్ట పరమైన చర్యలను తీసుకోకుండా ప్రభుత్వానికి ఎవరైనా అడ్డు పడుతున్నారా?

అడ్డుపడే అవకాశం లేదు కాదా.
వాస్తవ స్థితి ఇది కాగా....
అలాంటి చర్యలు ఏమీ తీసుకోకుండా తప్పుడు లెక్కలు చెప్పడం,ఇతర అంశాలతో దాన్ని ముడి వేయడం పసిపిల్లలు, అటు ఇటు కాని టీనేజి వయసు పిల్లల అపరిపక్వ మానసిక స్థితి లాంటిదే అవుతుంది.

అది కాని పక్షంలో ఈ తీరు పచ్చి అవకాశవాద, రాజకీయ ధోరణి అయినా కావాలి.

ఐక్య రాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోహింగ్యాల సంఖ్య 2.8 మిలియన్లు. మయాన్మార్ కు చెందిన వీళ్లు విధిలేక అనేక దేశాలకు వలస వెళ్లారు. వాటిల్లో ఇండియా ఒకటి.

ఇండియా లోని ఢిల్లీ, హైదరాబాద్, జమ్ము లాంటి ప్రాంతాలకు వలస వచ్చారు.

వీళ్లు సక్రమ వలసదారులా? అక్రమ వలస దారులా? అనేది ఇక్కడి చట్టం ప్రకారం నిర్ధారించి, చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం భారత ప్రభుత్వానికి ఉన్నది.

11 ఏళ్లుగా బిజెపి ఏ కేంద్రంలో అధికారంలో ఉంది. అదేమీ ప్రతిపక్ష పార్టీ కాదు.

క్షేత్రపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో....
-------------

@ప్రకాష్ రాజ్ కుట్ర సిద్ధాంతంప్రియమైన సుప్రీం లా మేకర్, "A" అనే రాష్ట్రంలో, మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి మ...
22/08/2025

@ప్రకాష్ రాజ్
కుట్ర సిద్ధాంతం

ప్రియమైన సుప్రీం లా మేకర్,

"A" అనే రాష్ట్రంలో, మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి మీ మాట వినకపోతే వారిని అరెస్టు చేసి, డిప్యూటీ ముఖ్యమంత్రిని మీ మాట వినే ముఖ్యమంత్రిగా ఎత్తి చూపే కొత్త బిల్లు వెనుక ఏదైనా ఎజెండా ఉందా?

#కొత్త బిల్లు #పార్లమెంట్

22/08/2025

Albert Camus once said that The Trial is “the most perfect expression of modern anxiety.” It is a haunting sentence, and the haunting only deepens when we realize how little exaggeration it contains. For Kafka’s novel is not merely a story, but a mirror held up to the human condition — and like all true mirrors, it shows us more than we wish to see.

The tale is simple enough. Josef K., a bank clerk, is arrested one morning without explanation. He is told neither the nature of his crime nor the name of his accusers. He wanders through courts without doors, judges without faces, laws without logic. His trial is endless, his guilt presumed, his defense meaningless. In the end, he is executed “like a dog,” still not knowing what he has done.

That is the skeleton. But the flesh of the book is something far stranger.

When one first encounters The Trial, the temptation is to treat it as allegory. To say, “Here is a parable about bureaucracy. Here is a warning against totalitarianism. Here is the nightmare of the modern State.” And certainly, these things are present. But if you read with the patience that the best books demand, you find that Kafka’s vision goes deeper than politics. It is not simply a critique of a system; it is an unveiling of existence itself.

For what is Josef K.’s plight if not the plight of us all? To live is to stand accused. Not always by governments or institutions, but by the very fact of being. We wake each day under a judgment we do not understand. We are guilty without knowing why. The law — whether divine, social, or personal — is always above us, always beyond us, and never fully explained. In Kafka’s world, guilt is not the result of a deed; it is the atmosphere we breathe.

C. S. Lewis once wrote that the modern mind suffers from “chronological snobbery,” the belief that whatever is newest is truest. Kafka stands as the refutation of that disease. His novel is utterly modern in its imagery, yet ancient in its terror. It recalls Job arguing with God from the ash heap, Ecclesiastes declaring the futility of toil, Augustine confessing that even an infant cries in selfishness. Kafka’s universe is a fallen one, only stripped of its cathedral ceiling. There is no comfort of ultimate justice, no assurance that the Judge is good. Only corridors, paperwork, whispers in the dark.

And yet, paradoxically, The Trial gives us not despair but recognition. We may close the book with horror, but we also close it with a strange relief: we are not alone in our bewilderment. To read Kafka is to realize that the labyrinth we wander has been mapped, however incompletely, by another soul. He does not provide us with a way out, but he does give us a lantern.

What, then, is the verdict on The Trial? It is not a book to be enjoyed — it is a book to be endured. And yet, in that endurance, it becomes unforgettable. It is scripture for an age that has lost faith in scripture, prophecy for a world without prophets. Like the best of literature, it forces us to ask questions we would rather ignore: What if our guilt is inescapable? What if the law is unknowable? What if justice never arrives?

Kafka does not answer these questions. But in refusing to answer, he forces us to wrestle. And perhaps that is the true genius of The Trial. It is not a novel that hands us solutions. It is a novel that strips away our illusions, leaving us naked before the mystery of existence.

Camus was right. The Trial is the perfect expression of modern anxiety. But it is more than that. It is also an x-ray of the eternal human soul — showing us that beneath our suits, our laws, our rituals, we remain fragile, bewildered, and on trial. Always on trial.

22/08/2025

విమర్శనాత్మక వ్యాస సంపుటి

ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ విమర్శకులు, నిరంతర అధ్యయనశీలి. వారు వందలాది సమీక్షలు, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాసియున్నారు. అవన్నీ పక్కనపెట్టి 'మూసి' పత్రికలో రాసిన పరిశోధనాత్మక వ్యాసాలతో "గ్రంథాంతరంగం" పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు.ఈ " గ్రంథాంతరంగం" లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన 30 పుస్తకాల పరిచయాత్మక, విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. ఇందులో వివిధ విభాగాలకు చెందిన సాహిత్య చరిత్రలు, విశేష గ్రంథాలు, ప్రత్యేక సంచికల మీద విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు తప్ప మిగతా వ్యాసాలన్నీ శతాబ్దం, అర్థ శతాబ్దం నాటికి సంబంధించినవి. కనుమరుగైపోయిన ఈ అమూల్య గ్రంథాలన్నింటిని వెతికి, వాటిని లోతుగా పరిశీలించి అందులోని కొత్తదనాన్ని , గొప్పదనాన్ని ఈనాటి పాఠకులకు తెలియజేయడం కోసమే ఈ వ్యాసాలను రచయిత రాశారు. ముందుగావంగూరి సుబ్బారావు పంతులుగారు తన 32వ ఏట మొట్టమొదటి తెలుగు సాహిత్య చరిత్ర "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము" ను 1920లో రచించి చరిత్ర కెక్కారు. సుబ్బారావు గారు బౌద్ధ జైన బ్రాహ్మణ మతాల స్థితిగతుల నేపద్యాన్ని, తెలుగు కావ్య రచనపై వాటి ప్రభావాన్ని చర్చించడం ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రలోని ప్రత్యేకత . తిక్కన భారత భాగము తెలుగు తేనెలో నూరవేసి సంస్కృత భారతమును తెలుగు భారతముగా చేసివేసినాడు అంటూనే శ్రీనాధుని కావ్యాల్ని ఇలా అంచనా వేశారు.' ఇతడు స్వతంత్ర కావ్యములు వ్రాయగల బుద్ధి సూక్ష్మత కలవాడయ్యు, పండితుడై నూతన సృష్టి నొనర్చలేకపోయెను. ప్రబంధ సృష్టికి బీజములు మాత్రం నాటగలిగెను.' అంటారు. గ్రంథకర్త 'ఆంధ్ర వాంగ్మయ చరిత్ర' లో కేవలం 9 పేజీలే కేటాయించినా 1920 నాటికి 500కు పైగా శతకాలు ఉన్నాయని గుర్తించగలిగారు. తెలుగు సాహిత్యకారులు ఎవ్వరూ చూపని, చూపలేని విధంగా తమ అభిప్రాయాన్ని ధైర్య సాహసాలతో ప్రకటించారు. వీరి భావజాలం, అభిప్రాయ ప్రకటనలపై కట్టమంచి రామలింగారెడ్డి గారి "కవిత్వ తత్వ విచారం" ప్రభావం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. బసవరాజు అప్పారావు గారి "ఆంధ్ర కవిత్వ చరిత్రము "1921 తెలుగు కవిత్వ తత్వాన్ని పరిశీలించిన లాక్షణిక గ్రంథం.భావ కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బసవరాజు అప్పారావు గారు కవిత్వతత్వ విచారాన్ని ఇంత లోతుగా చేయడం, అందులోనూ గ్రాంథిక భాషలో ఈ గ్రంథాన్ని వెలువరించడం ఆశ్చర్యకరమే. అక్కిరాజు ఉమాకాంతం గారు తన "నేటి కాలపు కవిత్వం" లో భావ కవిత్వం పై విరుచుకుపడ్డారు. అయోమయత్వాధికరణం, పులుముడు, ఘటనాదికరణం, శబ్ద వాచ్యతాధికరణం అన్న చోట్ల భావ కవిత్వ దోషాల్ని చించి చెండాడారు. ఉమాకాంతం గారు భావ కవిత్వం లోనూ, ఎంకిపాటల్లోనూ, నారాయణమ్మ- నాయుడు బావ పాటల్లోనూ ,ఇతరత్రా వ్యక్తమైన శృంగారాన్ని మెచ్చుకోకపోగా నిరసించారు కూడా. కరుణాది భావవ్యంజనకు ఉత్తమ నాయకుల ఆవశ్యకత లేదని, సాధారణ ప్రజల భావాలు కూడా ఆర్ద్రత కలిగించగలవని పంతులుగారు భావించి గౌరవించడం ఆశ్చర్యకరమే. 1924లో ప్రచురితమైన భోగరాజు నారాయణమూర్తి గారి " ఆంధ్ర కవిత్వ చరిత్రము" లో ఆంగ్ల సాహిత్య అధ్యయన ప్రభావం వల్ల కవిత్వ నిర్వచన, లక్షణ ప్రయోజనాల్ని సంస్కృతాంధ్ర లాక్షణికుల అభిప్రాయాలతో మేళవించి తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. కవిత్వ తత్వ విచారం చేస్తూ, సమాంతరంగా తెలుగు ప్రాచీన కవుల రచనల్ని కూడా పరిశీలించారు. నారాయణమూర్తి గారు తెలుగు కవిత్వ రచన యుగధర్మాన్ని ప్రతిబింబించిందనీ, కాలపరివర్తనంతో పాటు తన స్వరూప స్వభావాన్ని కూడా మార్పు చేసుకుంటూ నడిచిందని నూరేళ్ళ కిందటనే గుర్తించడం విశేషం. కల్లూరు వెంకటనారాయణ రావు గారు తమ "ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము"ను 5 ఖండాలుగా విభజించి, ఒక్కో ఖండాన్ని కొన్ని యుగాలుగా భావించి, ఆ యుగ కాలావధిని పేర్కొని సంఘ చరిత్ర, వాన్మయ చరిత్ర, కావ్య విమర్శ ,యుగలక్షణ సమన్వయము అనే అంశాల వారీగా పరిశీలించారు. మునుపటి, తర్వాతి తెలుగు సాహిత్య చరిత్రకారులు ఎవరూ ఈ దృష్టితో తెలుగు సాహిత్య చరిత్రను పరామర్శించిన వైఖరి లేదు. కల్లూరు వారు ఒక్కో యుగం కాల పరిమితిలోని దేశ సాంఘిక, రాజకీయ, మత పరిస్థితుల్ని సమీక్షించి - ఆ కాలంలో వెలువడ్డ కవిత్వానికి ప్రేరకమైన స్థితిగతుల్ని నిరూపించారు.

" ఆంధ్ర గద్య వాన్మయ చరిత్ర" కర్త గొబ్బూరు వెంకటానంద రాఘవరావు తమ గ్రంధంలో నన్నయ భారతంలోని గద్యాన్ని లక్ష్యంగా స్వీకరించి సంస్కృతం, ఆంగ్ల సాహిత్య లక్షణ పుస్తకాల ఆధారంగా తమ విమర్శన ప్రారంభించారు. ఇందులో నన్నయ్య వచన రచనా వైశిష్యంతో పాటు నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, శ్రీనాధుడు, పోతన మొదలైన పద్య కవుల గద్యాన్ని, దక్షిణాంధ్ర యుగ కవుల వచన రచనలను, చిన్నయ సూరి, వీరేశలింగం పంతులు గార్ల గద్యరచనలు ,దేశ చరిత్రలు, స్వీయ చరిత్రలు, నవలలు, శాస్త్ర గ్రంథాల్లోని గద్యరీతుల్ని విమర్శనాత్మకంగా పరిశీలించారు." ప్రాకృత గ్రంథకర్తలు- ప్రజా సేవానూ" అనే గ్రంథం రాసిన పంచాజ్ఞుల ఆదినారాయణ శాస్త్రి గారు దీని ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం లేని ప్రాకృత కావ్యాల విశేషాలను తెలియజేయడం మొదటి కారణం కాగా, ఆ కావ్యాల విశిష్టతను వ్యవాహారిక భాషలో తేటతెల్లం చేసి, వాడుక భాష శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడం రెండవ కారణం. ఈ రచన జరిగిన కాలానికి అంటే 1933 నాటికి ఇంత ఘనమైన విషయాన్ని ఇంత తేట తెలుగులో వెల్లడించడం అపూర్వం, అద్భుతం. కురుగంటి సీతారామయ్య విద్యార్థి దశలోనే " అలంకార తత్వ విచారము" అన్న 97 పేజీల విమర్శనాకృతిని వెలయించడం ఆశ్చర్యం. కురుగంటి వారు భారతీయ కావ్య సంప్రదాయాన్ని అనుసరించిన విమర్శకులే. సందర్భానుసారంగా పాశ్చాత్య కావ్య సంప్రదాయాన్ని కూడా గౌరవించి తమ విమర్శను కొనసాగించారు. సీతారామయ్య గారు కవిత్వ లక్షణాల గురించి, కవి స్వాతంత్ర్యం గురించి, విమర్శకుని లక్షణాలు -కర్తవ్యం గురించి, కావ్య పఠన ఉద్దేశం గురించి పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయాలతో ఏకీభవించారు. సాహిత్య అభివృద్ధికి విమర్శ అవసరమని విశ్వసించారు. కురుగంటి సీతారామయ్య గారి" అలంకార తత్వ విచారం"( 1915) అప్పుడప్పుడే తల ఎత్తుతున్న తెలుగు సాహిత్య విమర్శకు తార్కాణం.

పాటిబండ మాధవ శర్మ" ఆధునికాంధ్ర భావ కవిత్వం" అనే లఘు సిద్ధాంత వ్యాసాన్ని పింగళి లక్ష్మీకాంతం గారి పర్యవేక్షణలో రాశారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్య పరిశోధన పురిటి నొప్పులు పడుతున్న రోజులవి. ఆ దినాల్లో పాతికేళ్ల పాటిబండ వారు ఎంతో శ్రమకోర్చి పత్రికల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న కవితల్ని పోగు చేసి, శ్రద్ధతో పరిశీలించి ఆత్మవిశ్వాసంతో సంతరించి పెట్టిన ఆత్మ మూల్య పరిశోధనా గ్రంథం ఇది. పాటిబండ వారు పుస్తకం చివరి పేజీల్లో భావ కవిత్వ వికాసాన్ని సమీక్షిస్తూ, భావకవుల కవిత్వంలోని వైశిష్యాన్ని తైపారువేసిన విధానం గమనించదగ్గది. దక్షిణాంధ్ర యుగ నాయక రాజుల చరిత్ర, సాహిత్య పోషణల గురించి పరిశోధన చేసి దానికి ఇనాలోక యోగం కల్పించిన పరిశోధకులలో ప్రథమగణ్యులు

వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆ మహనీయుడు మద్రాసు ప్రాచ్య పరిశోధనా వ్రాతప్రతుల గ్రంథాలయంలోని మెకంజీ కైఫియత్తులు, ఇతర లిఖిత తాళపత్ర గ్రంథాలని అధ్యయనం చేసి తంజావూరులోని సరస్వతీ మహలు గ్రంథాలయంలోని ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్య నాటకాదుల్ని గాలించి 1914లో "తంజావూర్ ఆంధ్ర నాయక చరిత్ర"ను రచించి పాఠక లోకానికి అర్పించారు. దక్షిణాంధ్ర యుగ చరిత్ర సాహిత్యాన్ని అంచనా వేసిన తొలి విమర్శనా గ్రంథం ఇదే. 1940 లో ముద్రింపబడ్డ "సమీక్ష" అనే వ్యాస సంకలనం విద్వాన్ విశ్వం గారి సాహితీ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని, భంగిమను ,సరళ సుందర రీతిలో వ్యక్తం చేస్తుందని భావించారు. వంగూరి సుబ్బారావు గారి వేమన ( 1922) తర్వాతి పరిశోధకులకు విమర్శకులకు కైదివ్వే లాంటిది. ఈ మహానుభావుడు అంతకుముందు వెలువడ్డ వేమనను గురించిన గ్రంథాల్ని లోతుగా చదివి, కొందరి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, మరికొందరితో విభేదించిన వంగూరి వారి "వేమన"ను విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒకరిద్దరు గమనించారు. కానీ రాళ్లపల్లి వారు మాత్రం లోతుగా చదివారని చెప్పవచ్చు. రాళ్లపల్లి వారి వేమన విషయసూచిక, వంగూరి వారి వేమన విషయ సూచిక క్లుప్త రూపమనే తోస్తుంది. సుబ్బారావు గారు వేమన గురించి సమృద్ధమైన విశేష సేకరణ చేస్తే, అనంత కృష్ణుల వారు ఆ సమృద్ధితకు లోతుపాతుల్ని ,కళాత్మకతను సంతరించి పెట్టారని చెప్పవచ్చు. అంగీకారాన్ని గాని ,అభిప్రాయ భేదాల్ని కానీ తెలియజేయడంలో నయము, నాజూకు, స్పష్టతలు ఎలా ప్రదర్శించాలో నేటితరం విమర్శకులకు ఈ రెండు సద్గ్రంథాలు, సత్ఫథాన్ని చూపుతాయి.

అనంతపంతుల రామలింగ స్వామి' కృష్ణపక్షం' ను గురి చేసుకుని "శుక్లపక్షము"ను అధిక్షేపకావ్యంగా తీర్చిదిద్దారే కానీ వైఫల్యమే మూట కట్టుకోగలిగారు. ఈ కావ్యం లో వ్యక్తమైన భావనాశక్తి, వస్తు చిత్రణాయుక్తి, రచనా శిల్పానురక్తులు గమనిస్తే, మౌలిక కావ్యాలు రచించి ఉంటే ఆయనకు సాఫల్య సిద్ధి లభించి ఉండేది. నిడదవోలు వెంకటరావు గారి" ఆంధ్ర కర్ణాటక సారస్వ్రతములు- పరస్పర ప్రభావము" తెలుగు కన్నడ ప్రాచీన కావ్యాల తులనాత్మక పరిశీలనకు ప్రేరణ కలిగించింది. లోతైన అధ్యయన, అనుశీలనకు దారితీసింది." శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి" ఈ పండిత పరిశోధకులు తెలంగాణ చరిత్ర సాహిత్య చరిత్రలోని ఎన్నో చీకటి కోణాలపై వెలుగు ప్రసరింపజేసిన వ్యాస సంపుటి ఇది.

కోలా శేషాచల కవి 'నీలగిరి యాత్ర'ను వినోదయాత్ర కథనంగా రూపొందిస్తే ,బేతపూడి సుందర రాయుడు 'నీలగిరి చరిత్ర'ను అటు ఉల్లాస యాత్ర గాను, ఇటు విజ్ఞాన యాత్రగా తీర్చిదిద్దారు. "జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర" ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ కాలం రీత్యానే కాదు, ఈ కాలం దృష్టితో చూసినా ఇది బహుళార్థ సాధక పర్యటనమే. ఆమె కొత్త ప్రదేశాల్ని చూసే చూపు, సుఖసంతోషాల్ని అనుభవించే రీతి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలని, పండుగ పబ్బాల్ని పరిశీలించి, పులకరించే విధానం ఆ ప్రాంతపు నాగరికత- సంస్కృతిని ఆకళించుకునే వైనం విశేషమైనవి, విలక్షణమైనవినూ. సి పి బ్రౌన్ "తాతాచారి కథలు" కు ముందు మాటలు రాస్తూ బంగోరే ఇలా అంటారు." బ్రౌన్ ఈ కథలను ఎందుకు సేకరించినట్లు? వీటిలోని భాషా సారళ్యం, సూటిదనం ఒకటే కారణమా? లేక ఇతివృత్తం కూడానా. చారిత్రిక అంశాలు ఉన్నాయనే స్పృహ కూడా ఒక కారణమా? స్పెక్యులేట్ చేయడం కష్టం. బ్రౌన్ వ్యక్తిత్వం ఒక మూసలో ఇమిడేది కాదు. ఒక కొలమానానికి అందేది కాదు. ఆయన పాండితి, ప్రజ్ఞ, సేవ బహుముఖమైనవి. గుడిపూడి సుబ్బారావు రాసిన" మునగాల పరగణా : కథలు- గాథలు" లో మనకు జమీందారుల భోగ విలాసాలు, డాబు దర్పాలు, పీడన తాడనలు, ప్రజల ఆక్రందనలు- అర్ధనాదాలు కనబడతాయి, వినిపిస్తాయి. పదేపదే ప్రతిధ్వనిస్తాయి కూడా. జానపద బాల గీతాలు సేకరించడంతోపాటు వాటి విమర్శకు భద్రమైన పునాదివేసిన ప్రాతః స్మరణీయులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. జూలూరి అప్పయ్య గారి' పసుచరిత్ర' టీకను తెలుగు కావ్య ప్రియులు కళ్ళకు అద్దుకున్నారు. జూలూరి వారి టీకా సారళ్యం,స్పష్టత, విశదతలు తరతరాల తెలుగు విద్వాంసుల, విద్యార్థుల మననల్ని మూట కట్టుకున్నాయి. ఆదిరాజు వీరభద్ర రావు గారు రచించిన "షితాబుఖాన్ అను సీతాపతి రాజు" పరిశోధన గ్రంథం కాకతీయుల తర్వాతి కాలం నాటి ఒక వీరుని శౌర్య చరిత్ర, తెలంగాణ చరిత్రలోని ఒక స్మరణీయ అధ్యాయం. తెలంగాణలోని ఒక నిరుపేద వీరోచిత విద్యలు నేర్చి ఓరుగల్లు గద్దినెక్కి అల్పకాలంలోనే అనల్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన అసమాన సూర్యుని పరాక్రమ గాధ ఈ పుస్తకం.

" జనం మంచి శేషాద్రి శర్మ గారి షష్టి పూర్తి ఉత్సవ సన్మాన సంపుటము" కొండంత కవిని అద్దంలో కొంచంగా చూపించే అభినందన గ్రంథం. గ్రంథకర్త బసవరాజు అప్పారావు తన ప్రియ మిత్రులైన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వ్యక్తిత్వంలోని కాంతుల్ని ఎంతో ఆత్మీయంగా వర్ణించారు." శ్రీ ఆంధ్రరత్న జ్యోతులు" దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర కంటే జీవిత కథగా రూపొందిందనడం సూక్తం. తెలంగాణ నిజాం పరిపాలనలో నిద్రాణమై ఉండింది. అవిద్య ,ఆకలి దప్పులు, నిరాశా నిస్పృహలు, నాయకత్వ లోపం మొదలైన నిద్రాణావస్థల నుండి మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి వైతాళికుల సారథ్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి అస్తిత్వ అస్మితలను నిరూపించిన నేపథ్యంలో దేవులపల్లి రామానుజ రావు గారి "50 సంవత్సరాల జ్ఞాపకాలు" రచింపబడింది. అయ్యంకి వెంకట రమణయ్య గారు ఆంధ్ర దేశంలోనే కాక భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో గ్రంథాలయాల స్థాపనకు ప్రేరక శక్తిగా నిలిచారు వారు సుమారు 60 ఏళ్ల పాటు ఆవాల గోపాలానికి గ్రంధాలయ ప్రాముఖ్యత వివరిస్తూ ఊరువాడల్లో పుస్తకాలయాలు నిర్మింపజేస్తూ భారతదేశంలో గ్రంథాలయ జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయాల ఆవశ్యకతను పుస్తకాల ఎన్నిక ,సేకరణ, వర్గీకరణ పాఠకుల అభిరుచులు పల్లెల్లో పట్టణాల్లో స్థాపించవలసిన గ్రంథాలయాల స్వరూప స్వభావాల గురించి చేసిన ఉపన్యాసాలు రాసిన వ్యాసాన్ని వెలగా వెంకటప్పయ్య గారు ఎంతో శ్రమించి చక్కగా కూర్చి గ్రంథాలయ జ్యోతి అనే గ్రంధాన్ని సిద్ధపరిచారు. ఇంకొక వ్యాసంలో బ్రౌన్ 1854 లో ప్రచురించిన బ్రౌన్య మిశ్ర భాష నిఘంటు ప్రత్యేకతలను, విశిష్టతలను తెలియజేశారు. ప్రేమతో పలకరించే వ్యక్తులు దరిదాపుల్లో లేక, స్నేహ హస్తాలకు చేతులు చాస్తూ విలవిలలాడిన వేదం వెంకటరాయ శాస్త్రి గారి కడపటి దినాల్ని కరుణార్ధంగా చిత్రించిన పుస్తకం గుర్రం సుబ్బరామయ్య గారు రచించిన" గురు సంస్కృతి"." బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి షష్టిపూర్తి సంచిక "లో మల్లాది వారి జీవిత సాహిత్య వ్యాకరణ శాస్త్ర వైదుశ్యాల సంక్షిప్త పరిచయం ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాల గురించి విధ్వాన్సుల విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. మల్లాది వారి విధ్వత్ పూర్ణ వ్యాసాలు ఉన్నాయి. ఒక మహా పండితుడి ప్రతిభా విశేషాలు తెలపడంతో పాటు, ఈ సంచిక పండితాగ్రణుల సునీశిత ఆలోచనల్ని నమోదు చేసే రచనలు ఉన్నాయి.

అలభ్య గ్రంథాలను సేకరించడం ఒక ఎత్తు. వాటిని క్షుణ్ణంగా చదివి అందులోని ప్రత్యేకతలను, గొప్పదనాన్ని విశ్లేషించి వివరించడం మరో ఎత్తు. ఈ పనిని ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ సమర్థవంతంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పుస్తకాలు వెలువడిన కాలానికి ఇప్పటికీ ఎన్నో నూతన పరిశోధనలు జరిగి, మరెన్నో కొత్త విషయాలు బయటపడటంతో, వాటి ఆధారంగా కొత్త పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. వాటితో పోల్చుకొని చూస్తే ఈ పుస్తకాలు కాలదోషం పట్టినవిగా, అవుట్ డేటెడ్ అని పరిగణించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ పాత తరం వారి పాండిత్యం, పరిశోధనా పటిమ ఈతరం పాఠకులు తెలుసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. సాహిత్య రంగంలోని అధ్యాపకులు, పరిశోధకులకు మాత్రమే కాదు. సాహిత్యాభిమానులకు కూడా ఈ పుస్తకం సమాచారాత్మకంగా ఉండి ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.


కె.పి అశోక్ కుమార్

(" గ్రంథాంతరంగం"( విమర్శనాత్మక వ్యాస సంపుటి) ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ. ముద్రణ మరియు ప్రతులకు: ఏమెస్కో .వెల రెండు వందల రూపాయలు. పేజీలు 256)

11.8.2025 నాటి ప్రజాశక్తి "అక్షరం" లో ప్రచురితం

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when KAPU SRINIVAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share