02/04/2026
జిల్లా బూత్ కమిటీ విభాగం విస్తృత స్థాయి సమావేశం..!!
పల్నాడు జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన పల్నాడు జిల్లా బూత్ కమిటీల విభాగం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడనుంది. ఈ సమావేశం పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించుటకు ముఖ్య వేదికగా నిలవనుంది.
ఈ సమావేశానికి పల్నాడు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పల్నాడు జిల్లా పార్లమెంట్ మరియు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అనుబంధ అన్ని విభాగాల అధ్యక్షులు, పల్నాడు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
📍 స్థలం: పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, నరసరావుపేట
📅 తేదీ : 04-04-2026
⏰ సమయం: సాయంత్రం 4.00
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి, భారీగా పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయండి.
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ – మాచర్ల