𝐀𝐝𝐢𝐭𝐲𝐚 𝐓𝐫𝐚𝐝𝐞𝐫𝐬

𝐀𝐝𝐢𝐭𝐲𝐚 𝐓𝐫𝐚𝐝𝐞𝐫𝐬 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐀𝐝𝐢𝐭𝐲𝐚 𝐓𝐫𝐚𝐝𝐞𝐫𝐬, Karimnagar.

11/05/2026

కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ :

అంతర్జాతీయ యుద్ధ భయాలు, దేశీయంగా ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు కలిసి భారత స్టాక్ మార్కెట్‌ను పాతాళానికి తొక్కేశాయి.

క్రూడ్ ఆయిల్ 105 డాలర్ల వద్ద మండుతుండటం, రూపాయి విలువ భారీగా క్షీణించడం ఇన్వెస్టర్లలో గుబులు రేపుతోంది.

ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు ఆవిరవ్వగా, నిఫ్టీ 23,800 స్థాయిని కాపాడుకోలేకపోతే మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..

సోమవారం ఉదయం నుంచే దలాల్ స్ట్రీట్‌లో సెగలు కనిపిస్తున్నాయి.

కేవలం గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోవడం సామాన్యమైన విషయం కాదు.

సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 1% పైగా పతనమై ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఏదో చిన్నపాటి లాభాల స్వీకరణ అనుకుంటే పొరపాటే.. దీని వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ ఆర్థిక పరిణామాలు పెను తుపానులా చుట్టుముట్టాయి.

ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు విడిపోకపోవడం, ముడిచమురు ధరలు సెంచరీ దాటడం మన మార్కెట్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

మార్కెట్ పతనానికి దారితీసిన ఆ 5 ప్రధాన కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

1) విఫలమైన ఇరాన్-అమెరికా చర్చలు :

మార్కెట్ కోలుకుంటుందని ఆశించిన తరుణంలో ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికొచ్చాయి. ఇరాన్ పెట్టిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం యుద్ధ భయాన్ని రెట్టింపు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా ముప్పుగానే ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.

2) ప్రధాని మోదీ 'మితవ్యయం' పిలుపు :

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా దెబ్బతీసింది.

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని ఆయన కోరారు.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. "ఇరాన్ సంక్షోభం కంటే ప్రధాని మోదీ మితవ్యయ పిలుపు మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపింది.

వినియోగం తగ్గితే అది కార్పొరేట్ లాభాల మీద, ఆర్థిక వృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇదే ఇప్పుడు మార్కెట్‌ను భయపెడుతోంది" అని విశ్లేషించారు.

3) భయపెడుతున్న ముడిచమురు ధరలు :

బ్రెంట్ క్రూడ్ ఏకంగా 105 డాలర్ల మార్కును తాకడం భారత్ లాంటి దేశాలకు పెద్ద తలనొప్పి. మనం వాడే చమురులో 85-90 శాతం దిగుమతి చేసుకుంటాం కాబట్టి, ధర పెరిగితే మన కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుంది.

హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా నిలిచిపోవడం చమురు మంటకు కారణమైంది.

ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.

4) పాతాళానికి పడిపోయిన రూపాయి :

చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. సోమవారం డాలరుతో పోలిస్తే రూపాయి 94.88కి పడిపోవడం రికార్డు స్థాయి పతనం.

రూపాయి బలహీనపడితే దిగుమతులు ప్రియమవడమే కాకుండా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) ఇండియన్ మార్కెట్ నుంచి నిధులు తరలించడానికి ఆసక్తి చూపుతారు.

5) సాంకేతిక లోపాలు - సపోర్ట్ లెవల్స్ బ్రేక్ :

సాంకేతికంగా చూస్తే నిఫ్టీ తన కీలక మద్దతు స్థాయి అయిన 24,000 మార్కును కోల్పోవడం ప్రమాద ఘంటికగా మారింది.

ఆక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వీయ అభిప్రాయం ప్రకారం.. "నిఫ్టీ 24,000 వద్ద నిలదొక్కుకోవాలి.

ఒకవేళ 23,800 స్థాయిని కూడా కోల్పోతే మరిన్ని అమ్మకాలు చూసే అవకాశం ఉంది.

మార్కెట్ కోలుకోవాలంటే కనీసం 24,340 పైన ముగియడం అత్యవసరం." రానున్న రోజుల్లో నిఫ్టీ 23,800-24,400 రేంజ్‌లో ఊగిసలాడే అవకాశం ఉందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే...

రూ. 1.35 లక్షల కోట్లతో గూగుల్ AI హబ్ ;  భారీ ప్రయోజనం పొందే స్టాక్స్ :విశాఖపట్నంలో గూగుల్ చేపట్టిన రూ. 1.5 లక్షల కోట్ల ఏ...
01/05/2026

రూ. 1.35 లక్షల కోట్లతో గూగుల్ AI హబ్ ; భారీ ప్రయోజనం పొందే స్టాక్స్ :

విశాఖపట్నంలో గూగుల్ చేపట్టిన రూ. 1.5 లక్షల కోట్ల ఏఐ హబ్ ప్రాజెక్ట్ భారతదేశాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చనుంది.

అదానీ, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాల సహకారంతో సాగుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు టెలికాం రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలకు భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది.

ఇన్వెస్టర్లు ఈ 'డిజిటల్ విప్లవం'పై నిఘా ఉంచడం అత్యవసరం.

విశాఖపట్నం తీరంలో ఇప్పుడు అలల సడి కంటే 'ఏఐ' సందడే ఎక్కువగా వినిపిస్తోంది.

గూగుల్ తన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా భారత్‌ను తన ఏఐ సామ్రాజ్యానికి కేంద్రబిందువుగా మార్చుకుంటోంది.

ఈ క్రమంలో వైజాగ్‌లో ప్రారంభించిన రూ. 1.35 లక్షల కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్, కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా దేశానికి ఒక పెద్ద బూస్ట్ ఇవ్వబోతోంది.

ముఖ్యంగా అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలతో గూగుల్ చేతులు కలపడం భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ విశిష్టత గురించి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ..

విశాఖపట్నంలో ఈ హబ్ నిర్మాణం భారతదేశ ఏఐ-నేటివ్ భవిష్యత్తుకు ఒక కీలక మలుపు.

ఇది కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కొత్త ఆర్థిక అవకాశాలకు బాటలు వేసే పునాది." అన్నారు.

భాగస్వామ్య కంపెనీలదే హవా
ఈ ప్రాజెక్ట్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ కనెక్స్ (AdaniConneX) మరియు ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా (Nxtra) కీలక పాత్ర పోషిస్తున్నాయి.

1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ డేటా సెంటర్లకు అవసరమైన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సిస్టమ్స్ మరియు కనెక్టివిటీని ఈ రెండు సంస్థలే సమకూర్చుతున్నాయి.

డేటా సెంటర్లకు అపారమైన విద్యుత్ అవసరం ఉంటుంది, ఇక్కడే అదానీ గ్రీన్ ఎనర్జీ పాత్ర తెరపైకి వస్తోంది.

క్లీన్ ఎనర్జీ ద్వారా ఈ హబ్‌ను నడపాలని గూగుల్ భావిస్తుండటంతో, అదానీ గ్రూప్ షేర్లకు ఇది దీర్ఘకాలికంగా ప్లస్ పాయింట్ కానుంది..

భారతీ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ..

"మా అల్ట్రా-లో లేటెన్సీ ఫైబర్ నెట్‌వర్క్ మరియు నెక్స్ట్-జెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా వైజాగ్‌ను ప్రపంచ ఏఐ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలుపుతాము.

గూగుల్, అదానీతో మా భాగస్వామ్యం డిజిటల్ ఇండియా లక్ష్యాలను వేగవంతం చేస్తుంది." అన్నారు.

ఏయే సెక్టార్లకు లాభం ?

కేవలం ఎయిర్‌టెల్, అదానీ మాత్రమే కాకుండా, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ కంపెనీలు, పవర్ జనరేషన్ సంస్థలు మరియు ఐటీ సర్వీసెస్ కంపెనీలు (TCS, Infosys) కూడా దీని వల్ల లబ్ధి పొందనున్నాయి.

ఏఐ శిక్షణ మరియు ఇన్ఫరెన్స్ (Inference) కోసం హై-స్పీడ్ డేటా మూవ్‌మెంట్ అవసరం.

దీనికోసం గూగుల్ ఏర్పాటు చేస్తున్న సబ్-సీ కేబుల్స్ వల్ల టెలికాం ఇన్ఫ్రా రంగంలో కొత్త విప్లవం రాబోతోంది.

ఇన్వెస్టర్లు ఇప్పుడు డిజిటల్ బ్యాక్‌బోన్ బలంగా ఉన్న కంపెనీలపై కన్నేయడం లాభదాయకంగా ఉండవచ్చు..

గమనిక : ఈ కథనం సమాచారం కోసం మాత్రమే..

12/03/2026

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు :

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టబుడులు పెడుతుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో షేర్లు ఈరోజు ఫోకస్లో నిలిచాయి.

ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి,టెక్సాస్ లో ప్రారంభించే చమురు శుద్ధి కర్మాగారంతో రిలయన్స్ దీర్ఘకాల ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ అమెరికాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో షేర్లు ఫోకస్లో నిలిచాయి.

టెక్సాస్ లోని బ్రౌన్స్ విల్లేలో నిర్మించే ఆయిల్ రిఫైనరీకి రిలయన్స్ సాయం అందిస్తుందని ట్రంప్ చెప్పారు.

అమెరికా 50 ఏళ్లలో మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని పొందుతున్నట్లు చెప్పారు.

చరిత్రలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. దీంతో ఈరోజు సెషన్ ప్రారంభంలోనే రిలయన్స్ షేర్లు లాభాలతో మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం రిలయన్స్ షేర్లు స్వల్పంగా తగ్గాయి. రూ. 1,403 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ట్రంప్ ఏమన్నారంటే ?

'టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో 50 సంవత్సరాలలో మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని అమెరికా ప్రారంభిస్తుందని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను' అని ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఈ రిఫైనరితో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక సాయం అందించనుంది.

టెక్సాస్ శుద్ధి కర్మాగారం అనేది ఎలిమెంట్ ఫ్యూయల్స్ ద్వారా గతంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్. ఇది 2024 జూన్లో సైట్ తయారీని పూర్తి చేసిందని మరియు రోజుకు 160,000 బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేయగల సౌకర్యాన్ని నిర్మించడానికి అవసరమైన అనుమతులను పొందిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

ఎలిమెంట్ ఫ్యూయల్స్ వెబ్ చిరునామా ఇప్పుడు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ వెబ్‌సైట్‌కు మళ్ళించినట్లు నివేదిక తెలిపింది.

డొనాల్డ్ ట్రంప్ కొత్త రిఫైనరీని అభివృద్ధి చేస్తారని చెప్పిన కంపెనీ ఆ కంపెనీయే అని నివేదిక పేర్కొంది.

మంగళవారం అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, కంపెనీ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో రిఫైనరీ ప్రారంభించనుంది.

అది ఉత్పత్తి చేసే ఇంధనాలను విక్రయించడానికి ఇప్పటికే 20 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో దీర్ఘకాలిక అమ్మకాల ఒప్పందం కుదిరింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ సంవత్సరం ఇప్పటివరకు 10 శాతానికిపైగా తగ్గింది. అయితే గత ఆరు నెలల్లో 1 శాతం పెరిగిం. గత సంవత్సరంలో దాదాపు 12 శాతం ర్యాలీ చేసింది.

గత మూడు సంవత్సరాలలో దాదాపు 31 శాతం రాబడిని అందించింది.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే...

యుద్ధం... పొగ... వర్షం...నిన్నటెహ్రాన్ లో వర్షం పడింది.నీటి వర్షం కాదు.పెట్రోల్ వర్షం.ఇజ్రాయిల్ఇరాన్ లోనిఐదు ఆయిల్ స్టోర...
10/03/2026

యుద్ధం... పొగ... వర్షం...

నిన్న
టెహ్రాన్ లో వర్షం పడింది.

నీటి వర్షం కాదు.

పెట్రోల్ వర్షం.

ఇజ్రాయిల్
ఇరాన్ లోని
ఐదు ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులను
పేల్చింది.

మిలియన్ల టన్నుల క్రూడ్ ఆయిల్
ఒక్కసారిగా కాలిపోయింది.

సల్ఫర్
నైట్రోజన్
పొగ
మేఘాలుగా మారాయి.

ఆకాశం నుండి
మళ్లీ
అదే నగరంపై
యాసిడ్ వర్షం కురిసింది.

టెహ్రాన్ లో
కొంతమంది
గాలి పీల్చుకోవడానికి కూడా
భయపడ్డారు.

కొన్ని యుద్ధాలు
బాంబులతో చంపుతాయి.

కొన్ని యుద్ధాలు
గాలినే విషంగా మార్చి
చంపుతాయి.

కానీ…

ఈ యుద్ధం
మరో నిజం కూడా చూపించింది.

అమెరికా
10 వేల కోట్ల విలువైన
THAAD రాడార్ వ్యవస్థ పెట్టింది.

ఇరాన్
20 లక్షల విలువైన
షాహెద్ డ్రోన్స్ పంపింది.

ఒకటి కాదు.
ఒకేసారి
ఇరవై.

రాడార్
పదహారు డ్రోన్లను
మిసైళ్లతో ఆపింది.

మిగిలిన నాలుగు డ్రోన్స్
నేరుగా
రాడార్ పై పడ్డాయి.

10 వేల కోట్ల రక్షణ వ్యవస్థను
ఐదు కోట్ల డ్రోన్స్
నిశ్శబ్దంగా కూల్చేశాయి.

కొన్నిసార్లు
యుద్ధంలో
నాణ్యత గెలవదు.

సంఖ్య గెలుస్తుంది.

ఇంకా పెద్ద దెబ్బ…

ఇరాన్
హర్మూస్ సముద్ర మార్గాన్ని
మూసేసింది.

ప్రపంచంలో
దాదాపు
20% ఆయిల్
ఆ ఒక్క దారిలోనే వెళ్తుంది.

ఆ దారి మూసుకుంటే
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
గొంతు పట్టుకున్నట్టే.

మిడిల్ ఈస్ట్ లోని
అమెరికా మిలిటరీ బేసెస్
నిశ్శబ్దంగా ఖాళీ అవుతున్నాయి.

యుద్ధం
ఎక్కడో ఒక దేశంలో జరుగుతోంది.

కానీ
దాని పొగ
ప్రపంచం మొత్తం
ఉపిరిలోకి చేరుతోంది.

కొన్ని దేశాలు
దీపాలు వెలిగిస్తాయి.

కొన్ని దేశాలు
దీపాలను ఆర్పేస్తాయి.

కానీ కొన్ని యుద్ధాలు…

దీపాలే ఉండనివ్వవు.

బదులుగా
ఆకాశాన్ని
బాంబుల మంటలతో
నింపేస్తాయి.

— Viswa A

10/03/2026

*ముఖ్య అంశాలు*

• చమురు ధరలలో పదునైన దిద్దుబాటును కాల్పుల విరమణ అంచనాలు సూచిస్తున్నాయి.

• అదుపులో ఉన్న ప్రమాదం మధ్య బంగారం తగ్గుముఖం పట్టవచ్చు

• చైనా ఎగుమతులు దాదాపు 22% పెరిగాయి

• దృష్టి సారించిన US డేటా

01/03/2026

🚨మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం

ఈరోజు అనగా 28 ఫిబ్రవరి, 2026 నాడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ ముందస్తు దాడులు చేయడంతో అధికారికంగా ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం మొదలైనట్లు చెప్పవచ్చు.

ఇరాన్ కూడా పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ మీద దాడులు చేసింది. దీంతో ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి.

🔥 మంటల్లో మధ్యప్రాచ్యం

ఇరాన్ ఒక్క ఒమన్ దేశం తప్ప మిగతా అన్ని అరబ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాల మీద ఏకకాలంలో క్షిపణులతో దాడులు చేసింది.

⁉️ అసలేం జరిగింది

డిసెంబర్, 2025లో ఇరాన్ కరెన్సీ పతనంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రభుత్వ మార్పు కోసం నినదించారు. అయితొల్లా ఖోమేని ప్రభుత్వం ఈ నిరసనకారుల మీద కాల్పులు జరపడం, వందల మందిని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే నెపంతో ఎటువంటి విచారణ జరపకుండా రాత్రికి రాత్రే ఉరితీయడం వంటి చర్యలతో తీవ్రంగా అణిచివేసింది. ఒక అంచనా ప్రకారం సుమారు 50 వేల మందిని ఇరాన్ ప్రభుత్వం హత్య చేసింది.

కొన్ని వారాల క్రితం 800 వందల మంది నిరసనకారుల ఉరి తీయడం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో గొడవలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

కానీ అమెరికా తన యుద్దవాహక నౌకలను పూర్తి తయారీతో మధ్యప్రాచ్యంలోకి పంపడంతో ఎదోరోజు ఇరాన్ మీద దాడి జరుగుతుందని అనుకున్నది ఈరోజు జరిగింది.

ఇరాన్ ప్రతిస్పందన చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా అయితే లేదు. పవిత్ర రంజాన్ మాసం మొదలైన వారం రోజులకే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవగా ఈరోజు ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్యనే కాకుండా అరబ్ దేశాలన్నింటినీ మీద క్షిపణులు విరుచుకు పడుతుండటం శోచనీయం.

సోమవారం నుండి స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు
బంగారం, వెండి మళ్ళీ రెక్కలు రావచ్చు
చమురు ధరలు తీవ్ర ఊగిసలాటకు గురికావచ్చు.
మనమైతే ఈరోజు పాకిస్థాన్, శ్రీలంక టీ20 మ్యాచ్ చూద్దాం.

24/02/2026

IDFC Bank is Next HDFC Bank
Down From All Time High: -30%

Yes Bank is Next HDFC Bank
Down From All Time High: -95%

RBL Bank is Next HDFC Bank
Down From All Time High: -55%

Bandhan Bank is Next HDFC Bank
Down From All Time High: -77%

But HDFC Bank
Down From All Time High: -10%

టారిఫ్ల రద్దుతో మార్కెట్లకు జోష్ :అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్లను రద్దు చేసిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఈర...
23/02/2026

టారిఫ్ల రద్దుతో మార్కెట్లకు జోష్ :

అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్లను రద్దు చేసిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి.

ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెషన్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగింది.

నిఫ్టీ 140 పాయింట్లకుపైగా పెరిగింది.

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం మంచి లాభాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,294.66 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 25,713 వద్ద ముగిసింది.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మిక్స్‌డ్ పనితీరు చూపాయి.

BSE 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం తగ్గింది, BSE 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం పెరిగింది. BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 467 లక్షల కోట్ల నుంచి రూ. 469 లక్షల కోట్లకు పెరిగింది.

ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది..

మార్కెట్ ఎందుకు పెరిగింది ?

అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఇది భారత మార్కెట్‌కు బాగా నచ్చింది.

బ్యాంకులు, పవర్, ఫార్మా, FMCG రంగాల్లో స్టాక్ స్పెసిఫిక్ కొనుగోళ్లు జరిగాయి. ఆర్థిక వృద్ధి, డిమాండ్ మెరుగుపడుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యారు.

ఐటీ రంగం మాత్రం AI వల్ల సమస్యల భయంతో కొంచెం తగ్గింది..

నిఫ్టీ 50లో టాప్ గెయినర్లు :

అదానీ పోర్ట్స్ (2.93%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.22%), HDFC లైఫ్ ఇన్సూరెన్స్ (1.89%) టాప్‌ గెయినర్స్ గా నిలిచాయి.

నిఫ్టీ 50లో టాప్ లూజర్లు :

హిండాల్కో (2.08% తగ్గింది), విప్రో (1.89%), ఇన్ఫోసిస్ (1.90%) ఎక్కువగా నష్టపోయాయి.

సెక్టార్లపరంగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ :

1.36 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 0.87 శాతం, ఆటో 0.83 శాతం, ఎఫ్ఎంసీజీ 0.70 శాతం, బ్యాంక్ 0.15 శాతం పెరిగాయి.

మరోవైపు నిఫ్టీ ఐటీ 1.42 శాతం తగ్గింది. మెటల్ సూచీ 0.23 శాతం, రియల్టీ 0.19 శాతం తగ్గాయి.

ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అయిన షేర్లు :

IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా ట్రేడ్ అయ్యాయి. ఏకంగా 62 కోట్ల షేర్లు చేతులు మారాయి.

వోడాఫోన్ ఐడియా 38.6 కోట్లు, టాటా సిల్వర్ ఈటీఎఫ్ 27.1 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి.

BSEలో 1,900కిపైగా షేర్లు పెరిగాయి. దాదాపు 2,400 షేర్లు తగ్గాయి..

15 శాతం కంటే ఎక్కువ పెరిగిన షేర్లు
మోర్పెన్ ల్యాబొరేటరీస్, సిటీ పల్స్ మల్టీవెంచర్స్, కౌరా ఫైన్ డైమండ్ జ్యువెల్లరీ వంటి 7 షేర్లు ఈరోజు 15 శాతానికిపైగా పెరిగాయి.

IDFC ఫస్ట్ బ్యాంక్, టెక్నోప్యాక్ పాలీమర్స్ వంటి 10 కంపెనీల షేర్లు 15 శాతానికిపైగా తగ్గాయి.

52 వీక్ హై తాకిన షేర్లు :

SBI, లార్సెన్ అండ్ టూబ్రో, ఎన్టీపీసీ వంటి 124 షేర్లు ఈరోజు 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

విప్రో, సుజ్లాన్ ఎనర్జీ, ఇన్ఫో ఎడ్జ్, మ్యాన్‌కైండ్ ఫార్మా వంటి 238 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి.

రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 16.7 కోట్లు చేసిన ఇన్ఫోసిస్ :స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంచాయని చాలా మంది చెబ...
22/02/2026

రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 16.7 కోట్లు చేసిన ఇన్ఫోసిస్ :

స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంచాయని చాలా మంది చెబుతుంటారు.

ఇందుకు ఇన్ఫోసిస్ షేర్లు మంచి ఉదాహరణ. 1993లో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు రూ. 16.7 కోట్లు అయి ఉండేవి.

కంపెనీ పనితీరుకు ఈ గణాంకాలే నిదర్శనం.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత శక్తివంతమైనదో తెలియజేయడానికి ఇన్ఫోసిస్ షేర్ ఒక గొప్ప ఉదాహరణ.

1993 జూన్‌లో ఇన్ఫోసిస్ లిస్ట్ అయినప్పుడు షేర్ ధర రూ. 145 మాత్రమే.

అప్పుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే సుమారు 689 షేర్లు వచ్చేవి.ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ సుమారు రూ. 16.7 కోట్లు అయింది.

ఎలా ఇంత పెరిగింది ?

ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాభాల వల్ల కాదు. బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్, కంపెనీ బలమైన బిజినెస్ మోడల్ వల్ల స్థిరమైన కాంపౌండింగ్ జరిగింది. కంపెనీ 1994, 1997, 1999లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేసింది.

2004లో 3:1 నిష్పత్తిలో 2006, 2014, 2015, 2018లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చింది.

2000లో స్టాక్ స్ప్లిట్ చేసింది. ఒక్క షేరును రెండు షేర్లుగా విభజించింది.

ఈ కారణాలతో ఒక ఒరిజినల్ షేర్ ఇప్పుడు సుమారు 176 షేర్లుగా మారింది.

దీంతో 689 షేర్లు సుమారు 1,21,264 షేర్లు అయ్యాయి.

లేటెస్ట్ క్లోజింగ్ ధర రూ. 1,373.70 వద్ద లెక్కిస్తే రూ. 16.7 కోట్లు వస్తాయి.

ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్ ఎందుకు ప్రెషర్‌లో ఉంది?

ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. 2020 డిసెంబర్లో నమోదైన ఆల్ టైమ్ హై రూ. 2,006 నుంచి 31 శాతం పడిపోయింది.

గత ఏడాదిలో 26 శాతం తగ్గింది. గత నెలలో 19 శాతం తగ్గింది.

2026 ఫిబ్రవరి లో మాత్రమే 16 శాతానికిపైగా క్షీణించింది.

ఇండియన్ IT సెక్టార్ లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఎఫిషియన్సీ పెరిగి రెవెన్యూ తగ్గుతుందేమో అనే భయాల వల్ల సెల్ ఆఫ్ జరుగుతోంది.

దీంతో ఇన్ఫోసిస్ తో పాటు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

ఈరోజు, ఫిబ్రవరి 19న ఇన్ఫోసిస్ షేర్ ఇంట్రాడేలో 2 శాతం పెరిగి గరిష్టంగా రూ. 1,401.85 వరకు చేరింది.

మధ్యాహ్నం సమయంలో రూ. 1,385-1,395 చుట్టూ ట్రేడ్ అవుతోంది.

2026 AI డే లో కంపెనీ ఏం చెప్పింది..?
ఇన్ఫోసిస్ AI Day 2026 లో తమ AI ఫస్ట్ స్ట్రాటజీ వివరించింది.

ఆంథ్రోపిక్ (Claude AI తయారీ కంపెనీ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది.

టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగాల్లో అడ్వాన్స్‌డ్ ఎంటర్‌ప్రైజ్ AI సొల్యూషన్స్ ఇస్తారు.

AI ఏజెంట్స్ బిల్డ్ చేసి కాంప్లెక్స్ వర్క్‌ఫ్లోస్ ఆటోమేట్ చేస్తారు.

ఇన్ఫోసిస్ తోపాజ్ ప్లాట్‌ఫాం మరియు ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్ (Claude Code సహా) కలిపి పనిచేస్తాయి.

AI సర్వీసెస్ అవకాశం 2030 నాటికి 300-400 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా..

ప్రతి 7-10 సంవత్సరాలకు మార్కెట్ 30-60% క్రాష్ అవుతుంది :గత చరిత్రను పరిశీలిస్తే స్టాక్ మార్కెట్లు ప్రతి 7-10 సంవత్సరాలకు...
18/02/2026

ప్రతి 7-10 సంవత్సరాలకు మార్కెట్ 30-60% క్రాష్ అవుతుంది :

గత చరిత్రను పరిశీలిస్తే స్టాక్ మార్కెట్లు ప్రతి 7-10 సంవత్సరాలకు క్రాష్ అవుతున్నాయి.

అయితే పడిన ప్రతిసారి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చాయి.

రికవరీ కూడా త్వరగానే జరిగింది. సెన్సెక్స్ ప్రారంభమైనప్పుడు రూ. 1 లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 6.66 కోట్లు చేతిలో ఉండేవి.

భారత స్టాక్ మార్కెట్‌లో ఒక్కోసారి భారీ క్రాష్ లు వస్తాయి. కానీ లాంగ్ టర్మ్ డేటా చూస్తే ఇవి తాత్కాలికమే అని తెలుస్తుంది.

మార్కెట్ ఎప్పుడూ రికవర్ అవుతుంది. ఫండ్స్ఇండియా రిపోర్ట్ ప్రకారం 1980 నుంచి 2026 వరకు సెన్సెక్స్ డేటాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.

సెన్సెక్స్ గత 46 సంవత్సరాల్లో 15.2 శాతం CAGR (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఇచ్చింది.

అంటే 46 ఏళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టినవారి సంపద ఇప్పుడు 666 రెట్లు పెరిగింది. సుమారు రూ. 6.66 కోట్లు అయ్యింది.

మార్కెట్లు ప్రతి 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పాజిటివ్ రిటర్న్స్ తోనే ముగుస్తాయి.

ప్రతి 7-10 సంవత్సరాలకు ఒకసారి పెద్ద క్రాష్‌లు వస్తాయి. అప్పుడు మార్కెట్ 30-60% తగ్గుతుంది. కానీ రికవరీ చాలా త్వరగా జరుగుతుంది.

పెద్ద క్రాష్‌లు :

1988: 41 శాతం క్రాష్ అయింది.

1991: 39 శాతం క్రాష్

1992: 54 శాతం తగ్గింది

2001: 56 శాతం తగ్గింది

2008 గ్లోబల్ క్రైసిస్ సమయంలో ఏకంగా 61 శాతం పడిపోయింది. 2 సంవత్సరాల 10 నెలల్లో రికవరీ అయింది.

2020 కోవిడ్ క్రాష్ సమయంలో 38 శాతం తగ్గింది,అప్పుడు కేవలం 8 నెలల్లోనే పూర్తి రికవరీ సాధించింది.

మార్కెట్ 30 లేదా 40 శాతం తగ్గినప్పుడు రివకరీకి 1-3 సంవత్సరాలు తీసుకుంది.

50 శాతంపైగా క్రాష్ అయినప్పుడు మాత్రం 1-2 ఏళ్లలోనే కోలుకుంది.

అయితే మార్కెట్ క్రాష్ తర్వాత రిటర్న్స్ చాలా బాగుంటాయి. 29 శాతం నుంచి 68 శాతం వరకు లాభాలు వచ్చాయి.

కొన్నిసార్లు 20-40 శాతం CAGR కూడా నమోదైంది.

బెస్ట్ ఇయర్స్‌లో నష్టాలు ఉంటాయ్

చాలా మంచి రాబడులు వచ్చిన సంవత్సరాల్లో కూడా 10-20 శాతం ఇంట్రా ఇయర్ తగ్గుదల వస్తుంది. అంటే సంవత్సరం మధ్యలో మార్కెట్ పడుతుంది.

కానీ సంవత్సరం ముగిసేసరికి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తాయి. ఉదాహరణకు 1999లో సెన్సెక్స్ 64 శాతం పెరిగింది. కానీ ఇంట్రా ఇయర్ లో 16 శాతం తగ్గింది.

2003లో 74 శాతం పెరిగింది. కానీ మద్యలో 14 శాతం తగ్గింది.
2009లో 76 శాతం పెరిగింది. కానీ మధ్యలో 21 శాతం తగ్గింది.

2021లో 22 శాతం పెరిగింది. కానీ మధ్యలో 10 శాతం క్షీణించింది.

బేర్ మార్కెట్ ఎంత కాలం ఉంటుంది ?

1980 దశాబ్దంలో బేర్ మార్కెట్, అంటే 20 శాతానికిపైగా తగ్గడం సంవత్సర కాలంలో 14 శాతం రోజులు ఉంది.

1990లలో అయితే 52 శాతం రోజులు బేర్ మార్కెట్ ఉంది.

2000లలో అయితే 51 శాతం రోజులు బేర్ మార్కెట్ ఉంది.

2010లలో కేవలం 6 శాతం రోజులే బేర్ మార్కెట్ ఉంది.

2020 దశాబ్దంలో ఇప్పటివరకు కేవలం 3 శాతం రోజులే బేర్ మార్కెట్ ఉంది. అంటే ఇటీవలి దశాబ్దాల్లో బేర్ మార్కెట్ సమయం చాలా తక్కువగా ఉంది.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే.

భారీ లాభాల్లో సెగరెట్ కంపెనీల షేర్లు :సిగరెట్ స్టాక్స్ ఈరోజు ర్యాలీ చేశాయి,ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ తో పాటు వీఎస్టీ ఇండ...
18/02/2026

భారీ లాభాల్లో సెగరెట్ కంపెనీల షేర్లు :

సిగరెట్ స్టాక్స్ ఈరోజు ర్యాలీ చేశాయి,ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ తో పాటు వీఎస్టీ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు ఉదయం సెషన్లోనే 11 శాతం జంప్ చేశాయి.

సిగరెట్ కంపెనీలు ధరలు పెంచడంటో ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం తక్కువగా ఉంటుందని భావించి ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ ను కొనుగోలు చేస్తున్నారు.

సిగరెట్ కంపెనీల షేర్లు ఈ రోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ITC, గాడ్‌ఫ్రీ ఫిలిప్స్ ఇండియా, VST ఇండస్ట్రీస్ షేర్లు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి.

కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచిన తర్వాత, సిగరెట్ కంపెనీలు ఇప్పుడు ధరలు పెంచాయి.

దీంతో మార్జిన్ల ప్రభావం తగ్గుతుందని ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. షేర్లు పెద్దఎత్తున కొనుగోలు చేయడంతో ఈ ర్యాలీ జరిగింది.

ఏం జరిగింది?

ఇప్పుడు కంపెనీలు ధరలు పెంచి ఎక్సైజ్ డ్యూటీ ప్రభావాన్ని తగ్గించాయి. EBIT (ఆపరేటింగ్ ప్రాఫిట్) 8-15% శాతం తగ్గుతందని మొదటి భావించగా, ఇప్పుడు 2 శాతం మాత్రమే తగ్గుతుందని అవుతుందని అనలిస్టులు చెబుతున్నారు.

సిగరెట్స్ స్టాక్స్ ర్యాలీ ఇలా
ITC షేరు ధర 1-2 శాతం పెరిగి రూ. 329-330 కి చేరింది. గత 3 రోజుల్లో 5 శాతం పెరిగింది. మూడు రోజూ లాభాల్లో ట్రేడ్ అవుతోంది.
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు ధర 11-12 శాతం పెరిగి రూ. 2,297-2,315 వరకు చేరుకుంది. గత 2 రోజుల్లో 14-15 శాతం పెరిగింది.
VST ఇండస్ట్రీస్ షేరు ధర 3 శాతం పెరిగింది.

సిగరెట్ ధరలు ఎంత పెరిగాయంటే..?

ITCలో 84 mm సిగరెట్లు రూ. 17 నుంచి రూ. 24కి పెరిగాయి. 64 mm సిగరెట్లు రూ. 5.9 నుంచి రూ. 7కి పెరిగాయి.

వాల్యూమ్, EBIT ఇంపాక్ట్ తక్కువగా ఉంచడానికి ప్రీమియం సిగరెట్ల ధరలు మాత్రం పెంచలేదు.

2026 ప్రారంభంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

దీంతో సిగరెట్ ధరలు 60 శాతం వరకు పెరిగాయి. సిగరెట్ పొడవు బట్టి టాక్స్ 1,000 స్టిక్స్‌కు రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు ఉంది.

టాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత జనవరిలో సిగరెట్ కంపెనీల షేర్లు 9-26 శాతం వరకు తగ్గాయి. మార్జిన్స్, వాల్యూమ్స్ పై భయాల వల్ల నష్టాలు చవిచూశాయి.

గాడ్‌ఫ్రేలో మార్ల్‌బోరో కాంపాక్ట్ ధర రూ. 9.5 నుంచి రూ. 11.5కి పెరిగింది.

ITC గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ బ్రాండ్లలో ధరలు 19-41 శాతం పెంచారు.

ప్రీమియం సిగరెట్ల ధరలు పెరగక పోవడంతో కంపెనీల ఆదాయం, లాభాలపై ఎక్కువ ప్రభావం పడదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అందుకే షేర్లు ఈరోజు ర్యాలీ చేశాయి..

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐀𝐝𝐢𝐭𝐲𝐚 𝐓𝐫𝐚𝐝𝐞𝐫𝐬 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share