𝐀𝐧𝐢𝐥 𝐁𝐮𝐬𝐚𝐫𝐚𝐩𝐮

𝐀𝐧𝐢𝐥 𝐁𝐮𝐬𝐚𝐫𝐚𝐩𝐮 If You Don't Build Your Dreams
Some One Will Hire U to Work Their Dreams..!

12/07/2026

🙏🙏🙏🙏
Never Compromised to Others

🌿 **వరల్డ్ సింప్లిసిటీ డే – 12 జూలై** 🌿**"ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో...అదే నిన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది."** ✨సరళ...
12/07/2026

🌿 **వరల్డ్ సింప్లిసిటీ డే – 12 జూలై** 🌿

**"ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో...
అదే నిన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది."** ✨

సరళత అనేది బలహీనత కాదు... అది గొప్ప వ్యక్తిత్వానికి గుర్తు.
వినయం మనిషిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.

💚 **ప్రపంచ సరళత దినోత్సవం (World Simplicity Day) శుభాకాంక్షలు!**

నిన్నటి దాకా ప్రపంచానికే క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) రారాజుగా వెలుగొందిన దేశం.. ఈరోజు మన ఇంటి తలుపు తట్టి "కాస్త పెట్రోల్ ...
08/07/2026

నిన్నటి దాకా ప్రపంచానికే క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) రారాజుగా వెలుగొందిన దేశం.. ఈరోజు మన ఇంటి తలుపు తట్టి "కాస్త పెట్రోల్ ఇవ్వండి ప్లీజ్" అని అడుగుతోందంటే నమ్ముతారా?

​అవును, ప్రపంచం చూసిన అతిపెద్ద 'బిజినెస్ రివర్స్ స్వింగ్' ఇదే! ఇదంతా చూస్తుంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది.

వాళ్ల ట్యాంకర్ల నిండా క్రూడ్ ఆయిల్ ఉంది, కానీ బండిలో పోసుకోవడానికి పెట్రోల్ లేదు.
​దీనికంతటికీ కారణం.. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలోని రిఫైనరీలన్నీ కాలి బూడిదవ్వడమే.

ఎండాకాలం వచ్చేసరికి మాస్కోలోని పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు. ధరలు ఆకాశాన్ని తాకాయి. సరిగ్గా అప్పుడే రష్యా చూపు మన ఇండియా వైపు పడింది.

​వెంటనే ఓడల్లో ముడి చమురును గుజరాత్‌కు పంపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ అయిన మన జామ్‌నగర్ దాన్ని అందుకుంది. దానికి వాడినార్‌లోని 'నయారా' కూడా తోడైంది. అంతే!

అతి తక్కువ ఖర్చుతో, అతి వేగంగా ఆ క్రూడ్ ఆయిల్ కాస్తా మన దగ్గర ‘Made in India’ పెట్రోల్‌గా మారిపోయింది. ఏ ఓడలైతే ముడిచమురును తెచ్చాయో.. అవే ఓడల్లో పెట్రోల్ నింపుకుని మళ్ళీ రష్యాకు పయనమయ్యాయి.

​కుమ్మరి వాడికే కుండలు అమ్మే గట్స్ అంటే ఇవేనేమో!

​ఇక నాకో విషయం స్పష్టంగా అర్థమైంది. నిన్నటి దాకా కొనేవాళ్ల లిస్టులో ఉన్న మనం.. ఈరోజు క్రూడ్ ఆయిల్ బాస్‌కే పెట్రోల్ అమ్మి పెడుతున్నాం.

ఎందుకిలా? రష్యాతో పోలిస్తే మన దగ్గర ముడి చమురును శుద్ధి చేసే ఖర్చు 25 నుంచి 35 శాతం తక్కువ. మన జామ్‌నగర్ రిఫైనరీ రోజుకు 14 లక్షల బ్యారెళ్లను ప్రాసెస్ చేయగలదు. ఓడలు ఖాళీగా వెళ్లే పనే లేదు.. క్రూడ్ దించగానే, పెట్రోల్ నింపుకుని తిరుగు ప్రయాణం. టైమ్ సేవ్, డబ్బు సేవ్!

మన వాళ్ల బిజినెస్ బ్రెయిన్ అలాంటిది మరి.

​ఇలా మన ఇండియన్ బుర్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఇదేం తొలిసారి కాదు.

​ఒకప్పుడు వజ్రాల వ్యాపారానికి బెల్జియంలోని ఆంట్వెర్ప్ రాజధానిగా ఉండేది, అదంతా యూదుల గుత్తాధిపత్యం. కానీ మన సూరత్ గుజరాతీలు అక్కడికెళ్లి, కట్ చేసి, పాలిష్ చేసి తక్కువ ధరకే అమ్మడం మొదలుపెట్టారు. రిజల్ట్? ఈరోజు ప్రపంచంలో ఏ 10 వజ్రాలు తీసుకున్నా.. అందులో 9 సూరత్ మీదుగా వెళ్లినవే. 60 శాతం వ్యాపారం మన చేతుల్లోనే ఉంది.

​నిన్న వజ్రాలు!
ఈరోజు చమురు!
రేపు సెమీకండక్టర్లు!
గేమ్ మారుతోంది..!

​"సౌత్ ఏషియా రెడ్ జోన్.. అక్కడెవరు పెట్టుబడులు పెట్టరు" అని పెదవి విరిచిన వాళ్లంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

ఎందుకంటే అదే సౌత్ ఏషియాలో జపాన్ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సంతకాలు చేసేసింది. ఆపిల్ ఇక్కడే ఐఫోన్లు తయారు చేస్తోంది. టెస్లా ఫ్యాక్టరీకి స్థలం వెతుకుతోంది. గుజరాత్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటి మధ్యలో రష్యా నుంచి ఈ పెట్రోల్ ఆర్డర్.

ఇదే 'రైసింగ్ ఇండియా' అంటే!
ఇది వట్టి మాట కాదు,
సముద్రం మీద వెళ్తున్న పెట్రోల్ ఓడల మీద రాసిపెట్టున్న నిజం.

​యుద్ధం వచ్చినప్పుడు యూరప్ వణికిపోయింది. బంకుల ముందు క్యూలు పెరిగాయి. కానీ మన ఇండియన్స్ టెన్షన్ పడలేదు.

ఎక్కడి నుంచి క్రూడ్ తేవాలి?
ఎక్కడ రిఫైన్ చేయాలి?
ధరలు ఎలా కంట్రోల్ చేయాలి?
అని ఢిల్లీలో కూర్చున్నవాళ్లు పక్కాగా క్యాలిక్యులేట్ చేశారు.
ఒక దేశానికి ఉండాల్సిన ముందుచూపు అంటే ఇదే.

​ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర తక్కువేం కాదు. IOC, BPCL, HPCL మనకు వెన్నెముక అయితే.. దానికి రిలయన్స్, నయారా లాంటి ప్రైవేట్ సంస్థలు ఉక్కు బలాన్ని ఇచ్చాయి.

పబ్లిక్-ప్రైవేట్ బ్యాలెన్స్ ఉంటే అభివృద్ధి ఎలా ఉరకలేస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఫార్ములా.
​దీనిలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే..!

భూమి కింద ముడి చమురు ఉన్నంత మాత్రాన ఏ దేశమూ గొప్పది అయిపోదు. దాన్ని శుద్ధి చేసే టెక్నాలజీ ఉండాలి, అమ్మి క్యాష్ చేసుకునే బిజినెస్ బుర్ర ఉండాలి, దేశ ప్రయోజనాల కోసం తెలివిగా వ్యవహరించే దౌత్యం (Diplomacy) ఉండాలి.

ఇప్పుడు మన ఇండియా దగ్గర ఈ మూడూ ఉన్నాయి.

​1947లో అమెరికా గోధుమల ఓడల కోసం మనం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాం.

కానీ 2026 నాటికి.. ప్రపంచ చమురు రారాజు మన ఓడరేవులో పెట్రోల్ కోసం ఎదురుచూస్తున్నాడు.

80 ఏళ్లలో చేయి చాచి అడిగే స్థాయి నుంచి.. ఇచ్చే స్థాయికి ఎదిగాం. ఇంతకంటే గొప్ప ఎదుగుదల ఏముంటుంది?

​అయితే ఇక్కడో చిన్న మాట..
ఇంత లాభదాయకంగా వ్యాపారం జరుగుతున్నప్పుడు, ఆ లాభంలో కొంత భాగం సామాన్యుడి వంటగదికి కూడా చేరాలి కదా!

పంపు దగ్గర సామాన్యుడికి 'ఓ 10 రూపాయల ఉపశమనం' దొరికితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 'ఆత్మనిర్భర్ భారత్' అంటే కేవలం కొన్ని కంపెనీలు బాగుపడటం కాదు,

140 కోట్ల మంది ప్రజలు స్వయం సమృద్ధి సాధించడం. ఇది ఒక సామాన్యుడిగా నా మనసులో ఉన్న మాట.

​ఏదేమైనా.. ఉక్రెయిన్ రష్యాను గెలికింది, రష్యాకు దెబ్బ పడింది.. మధ్యలో ఇండియా బిజినెస్ పట్టేసింది.

​ప్రపంచం నడి నెత్తి మీద కూర్చున్నవాడు కాదు, ఆ శిఖరం వైపు ఎదుగుతున్నవాడే నిజమైన రాజు.

ఆ ఎదుగుదల పేరే 'నవ భారతం'.. (ఆత్మ నిర్బర్ భారత్) తలవంచకుండా, తలెత్తుకుని బిజినెస్ చేసి గెలుస్తున్న భారతం!!



09/06/2026

30 ఏళ్లు రాకముందే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక సామాన్య ఉద్యోగి కథ ఇది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు, భారీ వడ్డీలతో సతమతమైన అతను.. పక్కా ప్లానింగ్‌తో ఒక 'బాస్'లా ఎలా మారాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నేటి కాలంలో విలాసవంతమైన జీవనశైలి కోసం అప్పులు చేస్తూ ఇబ్బంది పడుతున్న ఎంతోమంది యువతకు ఇదొక స్ఫూర్తిదాయక ప్రయాణం. విచ్చలవిడి ఖర్చులు, సోషల్ మీడియాలో గొప్పల కోసం చేసిన అప్పులు అతన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. సరైన బడ్జెట్ (Monthly Budget) లేకపోవడంతో నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగిలేది కాదు. పెరిగిపోతున్న వడ్డీల భారం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో, తన ఆర్థిక పరిస్థితిని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతను చేసిన తప్పులేంటి? వాటిని ఎలా సరిదిద్దుకున్నాడు? అప్పుల నుంచి బయటపడటానికి అతను 'డెట్ స్నోబాల్' (Debt Snowball) పద్ధతిని ఎంచుకున్నాడు. అంటే, ముందుగా చిన్న చిన్న అప్పులను తీర్చేస్తూ మానసిక ధైర్యాన్ని పెంచుకున్నాడు. తన ఖర్చులను (Cash Flow) ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనవసరమైన వాటిని కట్ చేశాడు. ఆర్థిక స్వేచ్ఛ వైపు అతను వేసిన మొదటి అడుగు ఇదే. కేవలం ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా, ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాడు. ఖాళీ సమయంలో గిగ్ ఎకానమీ (Gig Economy) ద్వారా అదనపు సంపాదన మొదలుపెట్టాడు. ఆ డబ్బునంతా అప్పులు తీర్చడానికే వాడాడు. అలా నిరంతర కృషితో, తక్కువ కాలంలోనే ఊహించని విధంగా అప్పుల నుంచి విముక్తి పొందాడు. పెట్టుబడి అలవాటు.. అదనపు ఆదాయంతో ప్రయాణం అప్పులన్నీ తీరిపోయాక, మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ (SIP) ప్రారంభించాడు. జీతం రాగానే ముందుగా పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. పెట్టుబడిని ఎంత త్వరగా మొదలుపెడితే 'కాంపౌండింగ్' వల్ల అంత ఎక్కువ లాభం ఉంటుందని గ్రహించాడు. ఈ క్రమశిక్షణతో కేవలం కొన్నేళ్లలోనే భారీ మొత్తాన్ని వెనకేశాడు. ఆర్థిక అంశం (Financial Metric) గతంలో పరిస్థితి ప్రస్తుత విజయం పొదుపు శాతం సున్నా శాతం 40 శాతం క్రెడిట్ అప్పులు భారీ వడ్డీలు అప్పుల్లేవు పోర్ట్‌ఫోలియో ఖాళీ ఖాతా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఉన్న టేబుల్ చూస్తే అతని ఆర్థిక స్థితిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అప్పుల్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఎలా 'బాస్'లా మారాడో ఇది వివరిస్తుంది. చిన్న చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తన ఆదాయం, ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 30 ఏళ్ల వయసు అతనికి టెన్షన్ కాకుండా, ఒక సక్సెస్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని అతని కథ నిరూపిస్తోంది. తెలివైన పెట్టుబడులు, అదనపు ఆదాయ మార్గాలే సంపదను పెంచుకోవడానికి ఉత్తమ మార్గాలు.

11/05/2026

కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ :

అంతర్జాతీయ యుద్ధ భయాలు, దేశీయంగా ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు కలిసి భారత స్టాక్ మార్కెట్‌ను పాతాళానికి తొక్కేశాయి.

క్రూడ్ ఆయిల్ 105 డాలర్ల వద్ద మండుతుండటం, రూపాయి విలువ భారీగా క్షీణించడం ఇన్వెస్టర్లలో గుబులు రేపుతోంది.

ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు ఆవిరవ్వగా, నిఫ్టీ 23,800 స్థాయిని కాపాడుకోలేకపోతే మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..

సోమవారం ఉదయం నుంచే దలాల్ స్ట్రీట్‌లో సెగలు కనిపిస్తున్నాయి.

కేవలం గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోవడం సామాన్యమైన విషయం కాదు.

సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 1% పైగా పతనమై ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఏదో చిన్నపాటి లాభాల స్వీకరణ అనుకుంటే పొరపాటే.. దీని వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ ఆర్థిక పరిణామాలు పెను తుపానులా చుట్టుముట్టాయి.

ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు విడిపోకపోవడం, ముడిచమురు ధరలు సెంచరీ దాటడం మన మార్కెట్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

మార్కెట్ పతనానికి దారితీసిన ఆ 5 ప్రధాన కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

1) విఫలమైన ఇరాన్-అమెరికా చర్చలు :

మార్కెట్ కోలుకుంటుందని ఆశించిన తరుణంలో ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికొచ్చాయి. ఇరాన్ పెట్టిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం యుద్ధ భయాన్ని రెట్టింపు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా ముప్పుగానే ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.

2) ప్రధాని మోదీ 'మితవ్యయం' పిలుపు :

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా దెబ్బతీసింది.

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని ఆయన కోరారు.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. "ఇరాన్ సంక్షోభం కంటే ప్రధాని మోదీ మితవ్యయ పిలుపు మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపింది.

వినియోగం తగ్గితే అది కార్పొరేట్ లాభాల మీద, ఆర్థిక వృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇదే ఇప్పుడు మార్కెట్‌ను భయపెడుతోంది" అని విశ్లేషించారు.

3) భయపెడుతున్న ముడిచమురు ధరలు :

బ్రెంట్ క్రూడ్ ఏకంగా 105 డాలర్ల మార్కును తాకడం భారత్ లాంటి దేశాలకు పెద్ద తలనొప్పి. మనం వాడే చమురులో 85-90 శాతం దిగుమతి చేసుకుంటాం కాబట్టి, ధర పెరిగితే మన కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుంది.

హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా నిలిచిపోవడం చమురు మంటకు కారణమైంది.

ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.

4) పాతాళానికి పడిపోయిన రూపాయి :

చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. సోమవారం డాలరుతో పోలిస్తే రూపాయి 94.88కి పడిపోవడం రికార్డు స్థాయి పతనం.

రూపాయి బలహీనపడితే దిగుమతులు ప్రియమవడమే కాకుండా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) ఇండియన్ మార్కెట్ నుంచి నిధులు తరలించడానికి ఆసక్తి చూపుతారు.

5) సాంకేతిక లోపాలు - సపోర్ట్ లెవల్స్ బ్రేక్ :

సాంకేతికంగా చూస్తే నిఫ్టీ తన కీలక మద్దతు స్థాయి అయిన 24,000 మార్కును కోల్పోవడం ప్రమాద ఘంటికగా మారింది.

ఆక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వీయ అభిప్రాయం ప్రకారం.. "నిఫ్టీ 24,000 వద్ద నిలదొక్కుకోవాలి.

ఒకవేళ 23,800 స్థాయిని కూడా కోల్పోతే మరిన్ని అమ్మకాలు చూసే అవకాశం ఉంది.

మార్కెట్ కోలుకోవాలంటే కనీసం 24,340 పైన ముగియడం అత్యవసరం." రానున్న రోజుల్లో నిఫ్టీ 23,800-24,400 రేంజ్‌లో ఊగిసలాడే అవకాశం ఉందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే...

12/03/2026

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు :

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టబుడులు పెడుతుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో షేర్లు ఈరోజు ఫోకస్లో నిలిచాయి.

ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి,టెక్సాస్ లో ప్రారంభించే చమురు శుద్ధి కర్మాగారంతో రిలయన్స్ దీర్ఘకాల ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ అమెరికాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో షేర్లు ఫోకస్లో నిలిచాయి.

టెక్సాస్ లోని బ్రౌన్స్ విల్లేలో నిర్మించే ఆయిల్ రిఫైనరీకి రిలయన్స్ సాయం అందిస్తుందని ట్రంప్ చెప్పారు.

అమెరికా 50 ఏళ్లలో మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని పొందుతున్నట్లు చెప్పారు.

చరిత్రలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. దీంతో ఈరోజు సెషన్ ప్రారంభంలోనే రిలయన్స్ షేర్లు లాభాలతో మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం రిలయన్స్ షేర్లు స్వల్పంగా తగ్గాయి. రూ. 1,403 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ట్రంప్ ఏమన్నారంటే ?

'టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో 50 సంవత్సరాలలో మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని అమెరికా ప్రారంభిస్తుందని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను' అని ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఈ రిఫైనరితో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక సాయం అందించనుంది.

టెక్సాస్ శుద్ధి కర్మాగారం అనేది ఎలిమెంట్ ఫ్యూయల్స్ ద్వారా గతంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్. ఇది 2024 జూన్లో సైట్ తయారీని పూర్తి చేసిందని మరియు రోజుకు 160,000 బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేయగల సౌకర్యాన్ని నిర్మించడానికి అవసరమైన అనుమతులను పొందిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.

ఎలిమెంట్ ఫ్యూయల్స్ వెబ్ చిరునామా ఇప్పుడు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ వెబ్‌సైట్‌కు మళ్ళించినట్లు నివేదిక తెలిపింది.

డొనాల్డ్ ట్రంప్ కొత్త రిఫైనరీని అభివృద్ధి చేస్తారని చెప్పిన కంపెనీ ఆ కంపెనీయే అని నివేదిక పేర్కొంది.

మంగళవారం అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, కంపెనీ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో రిఫైనరీ ప్రారంభించనుంది.

అది ఉత్పత్తి చేసే ఇంధనాలను విక్రయించడానికి ఇప్పటికే 20 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో దీర్ఘకాలిక అమ్మకాల ఒప్పందం కుదిరింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ సంవత్సరం ఇప్పటివరకు 10 శాతానికిపైగా తగ్గింది. అయితే గత ఆరు నెలల్లో 1 శాతం పెరిగిం. గత సంవత్సరంలో దాదాపు 12 శాతం ర్యాలీ చేసింది.

గత మూడు సంవత్సరాలలో దాదాపు 31 శాతం రాబడిని అందించింది.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే...

10/03/2026

*ముఖ్య అంశాలు*

• చమురు ధరలలో పదునైన దిద్దుబాటును కాల్పుల విరమణ అంచనాలు సూచిస్తున్నాయి.

• అదుపులో ఉన్న ప్రమాదం మధ్య బంగారం తగ్గుముఖం పట్టవచ్చు

• చైనా ఎగుమతులు దాదాపు 22% పెరిగాయి

• దృష్టి సారించిన US డేటా

01/03/2026

🚨మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం

ఈరోజు అనగా 28 ఫిబ్రవరి, 2026 నాడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ ముందస్తు దాడులు చేయడంతో అధికారికంగా ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం మొదలైనట్లు చెప్పవచ్చు.

ఇరాన్ కూడా పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ మీద దాడులు చేసింది. దీంతో ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి.

🔥 మంటల్లో మధ్యప్రాచ్యం

ఇరాన్ ఒక్క ఒమన్ దేశం తప్ప మిగతా అన్ని అరబ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాల మీద ఏకకాలంలో క్షిపణులతో దాడులు చేసింది.

⁉️ అసలేం జరిగింది

డిసెంబర్, 2025లో ఇరాన్ కరెన్సీ పతనంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రభుత్వ మార్పు కోసం నినదించారు. అయితొల్లా ఖోమేని ప్రభుత్వం ఈ నిరసనకారుల మీద కాల్పులు జరపడం, వందల మందిని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే నెపంతో ఎటువంటి విచారణ జరపకుండా రాత్రికి రాత్రే ఉరితీయడం వంటి చర్యలతో తీవ్రంగా అణిచివేసింది. ఒక అంచనా ప్రకారం సుమారు 50 వేల మందిని ఇరాన్ ప్రభుత్వం హత్య చేసింది.

కొన్ని వారాల క్రితం 800 వందల మంది నిరసనకారుల ఉరి తీయడం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో గొడవలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

కానీ అమెరికా తన యుద్దవాహక నౌకలను పూర్తి తయారీతో మధ్యప్రాచ్యంలోకి పంపడంతో ఎదోరోజు ఇరాన్ మీద దాడి జరుగుతుందని అనుకున్నది ఈరోజు జరిగింది.

ఇరాన్ ప్రతిస్పందన చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా అయితే లేదు. పవిత్ర రంజాన్ మాసం మొదలైన వారం రోజులకే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవగా ఈరోజు ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్యనే కాకుండా అరబ్ దేశాలన్నింటినీ మీద క్షిపణులు విరుచుకు పడుతుండటం శోచనీయం.

సోమవారం నుండి స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు
బంగారం, వెండి మళ్ళీ రెక్కలు రావచ్చు
చమురు ధరలు తీవ్ర ఊగిసలాటకు గురికావచ్చు.
మనమైతే ఈరోజు పాకిస్థాన్, శ్రీలంక టీ20 మ్యాచ్ చూద్దాం.

24/02/2026

IDFC Bank is Next HDFC Bank
Down From All Time High: -30%

Yes Bank is Next HDFC Bank
Down From All Time High: -95%

RBL Bank is Next HDFC Bank
Down From All Time High: -55%

Bandhan Bank is Next HDFC Bank
Down From All Time High: -77%

But HDFC Bank
Down From All Time High: -10%

రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 16.7 కోట్లు చేసిన ఇన్ఫోసిస్ :స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంచాయని చాలా మంది చెబ...
22/02/2026

రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 16.7 కోట్లు చేసిన ఇన్ఫోసిస్ :

స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంచాయని చాలా మంది చెబుతుంటారు.

ఇందుకు ఇన్ఫోసిస్ షేర్లు మంచి ఉదాహరణ. 1993లో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు రూ. 16.7 కోట్లు అయి ఉండేవి.

కంపెనీ పనితీరుకు ఈ గణాంకాలే నిదర్శనం.

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత శక్తివంతమైనదో తెలియజేయడానికి ఇన్ఫోసిస్ షేర్ ఒక గొప్ప ఉదాహరణ.

1993 జూన్‌లో ఇన్ఫోసిస్ లిస్ట్ అయినప్పుడు షేర్ ధర రూ. 145 మాత్రమే.

అప్పుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే సుమారు 689 షేర్లు వచ్చేవి.ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ సుమారు రూ. 16.7 కోట్లు అయింది.

ఎలా ఇంత పెరిగింది ?

ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాభాల వల్ల కాదు. బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్, కంపెనీ బలమైన బిజినెస్ మోడల్ వల్ల స్థిరమైన కాంపౌండింగ్ జరిగింది. కంపెనీ 1994, 1997, 1999లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేసింది.

2004లో 3:1 నిష్పత్తిలో 2006, 2014, 2015, 2018లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చింది.

2000లో స్టాక్ స్ప్లిట్ చేసింది. ఒక్క షేరును రెండు షేర్లుగా విభజించింది.

ఈ కారణాలతో ఒక ఒరిజినల్ షేర్ ఇప్పుడు సుమారు 176 షేర్లుగా మారింది.

దీంతో 689 షేర్లు సుమారు 1,21,264 షేర్లు అయ్యాయి.

లేటెస్ట్ క్లోజింగ్ ధర రూ. 1,373.70 వద్ద లెక్కిస్తే రూ. 16.7 కోట్లు వస్తాయి.

ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్ ఎందుకు ప్రెషర్‌లో ఉంది?

ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. 2020 డిసెంబర్లో నమోదైన ఆల్ టైమ్ హై రూ. 2,006 నుంచి 31 శాతం పడిపోయింది.

గత ఏడాదిలో 26 శాతం తగ్గింది. గత నెలలో 19 శాతం తగ్గింది.

2026 ఫిబ్రవరి లో మాత్రమే 16 శాతానికిపైగా క్షీణించింది.

ఇండియన్ IT సెక్టార్ లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఎఫిషియన్సీ పెరిగి రెవెన్యూ తగ్గుతుందేమో అనే భయాల వల్ల సెల్ ఆఫ్ జరుగుతోంది.

దీంతో ఇన్ఫోసిస్ తో పాటు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

ఈరోజు, ఫిబ్రవరి 19న ఇన్ఫోసిస్ షేర్ ఇంట్రాడేలో 2 శాతం పెరిగి గరిష్టంగా రూ. 1,401.85 వరకు చేరింది.

మధ్యాహ్నం సమయంలో రూ. 1,385-1,395 చుట్టూ ట్రేడ్ అవుతోంది.

2026 AI డే లో కంపెనీ ఏం చెప్పింది..?
ఇన్ఫోసిస్ AI Day 2026 లో తమ AI ఫస్ట్ స్ట్రాటజీ వివరించింది.

ఆంథ్రోపిక్ (Claude AI తయారీ కంపెనీ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది.

టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగాల్లో అడ్వాన్స్‌డ్ ఎంటర్‌ప్రైజ్ AI సొల్యూషన్స్ ఇస్తారు.

AI ఏజెంట్స్ బిల్డ్ చేసి కాంప్లెక్స్ వర్క్‌ఫ్లోస్ ఆటోమేట్ చేస్తారు.

ఇన్ఫోసిస్ తోపాజ్ ప్లాట్‌ఫాం మరియు ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్ (Claude Code సహా) కలిపి పనిచేస్తాయి.

AI సర్వీసెస్ అవకాశం 2030 నాటికి 300-400 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా..

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐀𝐧𝐢𝐥 𝐁𝐮𝐬𝐚𝐫𝐚𝐩𝐮 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share