GTV News Telugu

GTV News Telugu Digital Media

14/10/2022
06/10/2022
06/10/2022

Shambarao Sreenivaasulu shared a post on Instagram: "". Follow their account to see 441 posts.

26/09/2022

IT Jobs: ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. జీతాల చెల్లింపుల నుంచి రిక్రూట్ మెంట్ వరకు అన్నింటిలోనూ ఉద్యోగులకు అన్నాయమే జరుగుతోంది.
కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించటం, మరికొన్ని వేరియబుల్ పే నిలిపివేయటం లేదా తగ్గించటం వంటి ఇబ్బందులకు గురిచేయటం మనందరం చూస్తున్నాం. ఈ క్రమంలో మరో సంచలన విషయంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.

విప్రో మోసం..
ఉద్యోగులను తొలగించి, వేరియబుల్ పే తగ్గించటం చేసిన విప్రో విషయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కంపెనీ అవసరాల కోసం అదనంగా నియమించుకున్న సిబ్బందికి ప్లేస్‌మెంట్లు ఇచ్చినట్లే ఇచ్చింది కానీ వారికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపలేదు. దీనివల్ల చాలా మంది ఐటీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అక్టోబర్ 2021లో ఎంపిక చేసిన చాలా మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలను ఇవ్వలేదు.

ఆన్‌బోర్డింగ్ నిలిపివేత..
దాదాపు 11 నెలలు గడుస్తున్నా సెలెక్ట్ అయిన వారికి ఆన్‌బోర్డింగ్ చేయకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌బోర్డింగ్ అనేది సంస్థకు ఎంచుకున్న ఉద్యోగిని అధికారికంగా చేర్చడం. అంటే వీరందరూ కంపెనీ ఎప్పుడు పిలుస్తుందా అని నిరీక్షించేవారు. దీంతో ఆగ్రహం చెందిన అనేక మంది ఎంపికైన టెక్కీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విప్రోలో సెలెక్ట్ అయినందుకు పాత కంపెనీల్లో ఉద్యోగం మానేశామని.. ప్రస్తుతం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. ఇలా వేచి ఉండటం వల్ల వారు దాదాపు 11 నెలల జీతాన్ని కోల్పోయారు.

ఉద్యోగుల ఆవేదన..
2021 సెప్టెంబర్‌లోనే 2000 మంది విద్యార్ధులను క్యాంపస్‌ ఇంటర్వ్యూల విధానంలో విప్రో ఎంపిక చేసుకుంది. శిక్షణ పూర్తైనప్పటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోవటంపై నాస్సెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ కేంద్ర కార్మిక శాఖను కోరింది. పైగా శిక్షణ కోసం అయ్యే రూ.30 నుంచి రూ.40 వేలను విద్యార్థులే భరించాలని కంపెనీ తెలిపింది. ఇంటర్నషిప్‌ కాలంలో విద్యార్ధి ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. నియామకాలను వాయిదా వేస్తూ వస్తోందని తన ఫిర్యాదులో వెల్లడించింది. కేంద్ర కార్మిక శాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

26/09/2022

వచ్చే నెల 1 నుంచి 5జీ సేవలు

ప్రధాని నరేంద్ర మోదీ (Modi) 5జీ (5G) సర్వీసులు ఆవిష్కరించబోతున్నారు. అక్టోబర్ 1న ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో 5జీ సేవలను అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. దీంతో టెలికం యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో కూడిన 5జీ సేవలు అందబాటులోకి రానున్నాయి.
అహ్మదాబాద్, బెంగళూరు, ఛండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్ నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే వంటి పట్టణాల్లో తొలిగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Address

HASTINAPURAM, Sagar Road
Hyderabad
500079

Telephone

+919491684523

Website

Alerts

Be the first to know and let us send you an email when GTV News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GTV News Telugu:

Shortcuts

Share