Jananetri

Jananetri ప్రతి సంఘటన ప్రతి విషయం ప్రజల ముందుక?

07/02/2025

విజయవాడ, 07.02.2024.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర MPC మరియు BiPC విద్యార్థులకు వారి ప్రాక్టికల్ హాల్ టికెట్లు సదరు కాలేజీ లాగిన్‌లో మరియు https://bie.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. విద్యార్థులు తమ గత హాల్ టికెట్ నంబర్ లేదా IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యా సేవల ఎంపికను ఎంచుకొని, గత హాల్ టికెట్ నంబర్ లేదా IPE మార్చి 2025 హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గుండె, గ్యాస్‌ నొప్పికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలిఆధ్వర్యంలో వైద్య అవగాహన సదస్సుడాక్టర్‌ అనూప్‌ వెలగ ఏమన్నారంటే.. ఛాతి...
29/10/2024

గుండె, గ్యాస్‌ నొప్పికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలిఆధ్వర్యంలో వైద్య అవగాహన సదస్సు

డాక్టర్‌ అనూప్‌ వెలగ ఏమన్నారంటే..
ఛాతి భాగంలో నొప్పి వస్తే దాన్ని గుండె నొప్పిగానే భావించాల్సి ఉంటుంది. గ్యాస్‌ నొప్పి అనేది కడుపులో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో వచ్చే మంటను గ్యాస్‌ నొప్పిగా చెప్పవచ్చు. గుండె బరువుగా అనిపించినా, ఛాతీలో నొప్పి వచ్చినా వీలైనంత త్వరగా రోగిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. గుండె నొప్పి వచ్చిన గంటన్నరలోపే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుంది. చిన్నవయసులో గుండె నొప్పి రావడానికి వారి ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలే కారణం. 50 ఏళ్లకు పైబడిన వారిలో సహజంగానే గుండెకు సంబంధించిన ధమనులు, సిరలు కొంతమేర శక్తిని కోల్పోతుంటాయి. అటువంటి వారిలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయనడానికి శాస్త్రీయంగా ఎటువంటి నిర్ధారణ కాలేదు. ఇది అపోహ మాత్రమే. ఎవరికైనా ఛాతీలో తట్టుకోలేనంత నొప్పి వచ్చి ఎక్కువగా చెమటలు పట్టి కళ్లు తిరుగున్నట్లనిపిస్తే అది కచ్చితంగా గుండె పోటు కావచ్చు. ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.

డాక్టర్‌ భాను శైలజ ఏమన్నారంటే..

గర్భిణులకు మొదటి మూడు వారాలు ఎంతో కీలకం. క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించి రక్త, ఇతర పరీక్షలు చేయించుకోవాలి. గర్భం దాల్చిన వారికి వారాలు గడుస్తున్న కొద్దీ రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం. ప్రతిరోజు నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర చాలా ముఖ్యం. గర్భిణుల్లో జన్యుపరమైన సమస్యలు, వారాల ప్రకారం బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవడానికి స్కానింగ్‌ చేయించుకోవాలి. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టేలోగా మహిళ బరువు 8 నుంచి 10 కిలోల వరకు పెరుగుతుంది. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ శ్వాస సంబంధిత సమస్యలూ ఉత్పన్నం కావచ్చు. థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవడం అవసరం. నెలలు నిండక ముందే ప్రసవం జరగకుండా ఉండాలంటే వైద్యుల సూచనలు పాటించాలి. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవాలి. ప్రొటీన్, కార్బొహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు తినాలి. రక్తహీనత నివారణకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొందరు మహిళలు అవసరం లేకపోయినా గర్భ సంచిని తొలగింపజేయించుకోవాలని చూస్తుంటారు. ఇది మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వైద్యుల సలహాతో గర్భ సంచిని తొలగింపజేయించుకోవాలి. అనవసరంగా తొలగిస్తే హార్మోన్ల సంఖ్య తగ్గి వ్యాధులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నెలసరి ముందుగా వచ్చినా లేదా ఆలస్యంగా వచ్చినా వైద్యులను సంప్రదించాలి.

సందేహాల నివృత్తి

సమస్య: సమయానికి తినకపోతే గ్యాస్‌ ఇబ్బంది వస్తుందా? గ్యాస్‌ నొప్పికి, గుండె నొప్పికి తేడా ఎలా తెలుస్తుంది?

పి.సాంబశివరావు, ప్రైవేటు ఉద్యోగి

సమాధానం: దైనందిన జీవితంలో సమయానికి ఆహారం తీసుకోకపోతే గ్యాస్‌ ఉత్పన్నం అవుతుంది. దాన్ని తగ్గించడానికి మందు లేదు. గ్యాస్‌ను తగ్గించేందుకు పరగడుపున వేసుకునే మాత్రలు కడుపులో మంట రాకుండా ఉండేందుకే ఉపయోగపడతాయి. తల నొప్పి, మోకాళ్ల నొప్పి, ఇతర శరీర భాగాల్లో నొప్పి వస్తే గ్యాస్‌ నొప్పిగా భావించరు గానీ.. ఛాతీలో నొప్పి వస్తే చాలామంది గ్యాస్‌ నొప్పి అని సరిపెట్టుకుంటారు. పదే పదే గుండెల్లో మంట, నొప్పి వస్తే వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలి. లేదంటే అది ముదిరి గుండె పోటుకు దారి తీయవచ్చు. ఆదిలోనే మేల్కొంటే మంచిది.

గుండెపోటుకు గురవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుండె పోటు వచ్చిందనే దానికి సంకేతాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె వాల్వులు మూసుకుపోతే ఆయుర్వేద, యునానీ, ప్రకృతి సిద్ధమైన మందులు వినియోగిస్తే నయమవుతాయా?

బాలకృష్ణారావు, సీనియర్‌ సిటిజన్‌

గుండెపోటుకు గురవకుండా ఉండాలంటే చక్కని ఆహారపు అలవాట్లు పాటించాలి. మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా నడక, ఇతర వ్యాయామాలు చేయాలి. కొంతమందికి జన్యుపరంగా గుండె సంబంధిత ఇబ్బందులు వస్తాయి. ఒళ్లంతా చెమటలు పట్టడం, ఛాతీలో భరించరాని నొప్పి, కళ్లు తిరగడం వంటివి గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి. గుండె పోటు వస్తే 2 గంటల్లోగా వైద్య సేవలు పొందాలి. ఆలస్యమైతే గుండెకు నష్టం ఎక్కువగా జరుగుతుంది. గుండె బలహీన పడుతుంది. మొదటి గంట చాలా కీలకం.

ఇటీవల మహిళలు, బాలికలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బయట మార్కెట్లో ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేక పోవడం వల్లే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా?. మహిళల్లో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి ఎందుకని? నివారణ చర్యలు ఏమిటి?

షేక్‌ రెహమతుల్లా

కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గించవచ్చు. జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం మంచిది కాదు. చిన్న సమస్య ఉన్నప్పుడే తగ్గించుకోవాలి. పెద్దది చేసుకోకూడదు. ఆలస్యం చేయకుండా వైద్యుడి సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మహిళలు ఎక్కువగా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారిని ఏ విధంగా గుర్తించాలి. ?

జిల్లెళ్లమూడి వరప్రసాద్, న్యాయవాది

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన అవసరం. ఇది మహిళలకు ఎక్కువగా వచ్చే వ్యాధి. దీనికి సంబంధించి స్క్రీనింగ్, ముందస్తు రోగనిర్ధారణ చేయించుకోవాలి. కొన్ని రక్త పరీక్షల్లో క్యాన్సర్‌ కారకాలు బయటపడతాయి. మగవాళ్లు ధూమపానానికి దూరంగా ఉండాలి. పాన్‌పరాగ్‌లు, కిళ్లీలు కూడా ప్రమాదకరం. చక్కని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మెరుగైన జీవన శైలిని అలవర్చుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.

28/10/2024

ఘనంగా వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు

కాకినాడ

కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సిటీ ,రూరల్ పెదపూడి మండలాల ఆధ్వర్యంలో కాకినాడ గాంధీ భవన్ నందు సర్వసభ్య సమావేశం,వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు యూనిట్ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కాకినాడ అరుణ హాస్పిటల్ వారిచే న్యూరో సర్జరీపై వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగినది. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బి రాజా గోపి కృష్ణచే పక్షవాతం వచ్చిన వెంటనే రోగికి సరైన సమయంలో వైద్య చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా పూర్తిగా నివారించవచ్చు అని తెలిపారు.బ్రెయిన్ సంబంధిత వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి సభ్యులకు వివరించారు.ఈ సమావేశానికి అరుణ హాస్పిటల్ అధినేత డాక్టర్
చవ్వాకుల శేషగిరిరావు, డాక్టర్ చవ్వాకుల హిమబిందు,అరుణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నూకల బలరాం నాయుడు, మేనేజింగ్ పార్ట్నర్ కె ఎస్ ఎన్ బాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్, సెక్రటరీ కె.శ్రీనివాసరావు ట్రెజరర్ రవికుమార్ కాజులూరు, కరప మండల అధ్యక్షులు జె వి వి సూర్య నారాయణమూర్తి, సెక్రెటరీ ఆర్.వినాయక కుమార్, కే ఎస్. ఆచార్యులు,షేక్ బాబ్జి, రేవు రాంబాబు, తాళ్ళరేవు సెక్రెటరీ షేక్ రెహమాన్, షరీఫ్ మొదలైన సభ్యులు విచ్చేసారు.

26/10/2024
25/10/2024

నూతన( DEO) జిల్లా విద్యాశాఖ అధికారులు

శ్రీ ఎన్.టి. నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), పార్వతీపురం మన్యం జిల్లా.

శ్రీ యూ. మాణిక్యం నాయుడు – జిల్లా విద్యా అధికారి (DEO), విజయనగరం.

శ్రీ ఎన్. ప్రేమ్ కుమార్ – జిల్లా విద్యా అధికారి (DEO), విశాఖపట్నం.

శ్రీ జీ. అప్పారావు నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), అనకాపల్లి.

శ్రీ స్కెచ్. సలీం బాషా – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

శ్రీమతి ఎం. వేంకటలక్ష్మమ్మ – జిల్లా విద్యా అధికారి (DEO), ఏలూరు.

శ్రీ EWSSSBL నారాయణా – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), పశ్చిమ గోదావరి.

శ్రీ పి.వి.జె. రామరావు – జిల్లా విద్యా అధికారి (DEO), కృష్ణ.

శ్రీమతి ఎల్. చంద్రకల – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), పల్నాడు.

శ్రీమతి సి.వి. రెణుక – జిల్లా విద్యా అధికారి (DEO), గుంటూరు.

శ్రీ ఎస్. పురుషోత్తం – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), బాపట్ల.

శ్రీ ఎ. కిరణ్ కుమార్ – జిల్లా విద్యా అధికారి (DEO), ప్రకాశం.

శ్రీ ఆర్. బాలాజీ రావు – జిల్లా విద్యా అధికారి (DEO), ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు.

శ్రీ కె.వి.ఎన్. కుమార్ – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), తిరుపతి.

శ్రీమతి బి. వరలక్ష్మి – జిల్లా విద్యా అధికారి (DEO), చిత్తూరు.

శ్రీ కె. సుబ్రహ్మణ్యం – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), అన్నమయ్య.

శ్రీమతి యు. మీనాక్షి – జిల్లా విద్యా అధికారి (DEO), వైఎస్ఆర్ జిల్లా.

శ్రీ జి. క్రిస్టప్ప – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), శ్రీ సత్యసాయి జిల్లా.

శ్రీ ఎం. ప్రసాద బాబు – జిల్లా విద్యా అధికారి (DEO), అనంతపురం.

శ్రీ ఎస్. స్యామ్యూల్ పాల్ – జిల్లా విద్యా అధికారి (DEO), కర్నూలు.

శ్రీ పి. జనార్ధన రెడ్డి – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), నంద్యాల

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)

24/10/2024

భీమవరం మున్సిపాలిటీలో కోడి వ్యర్ధాల గోల్ మాల్ .. .!
నెలకు లక్ష రూపాయల పెట్టు 10 లక్షల వరకు ఆదాయం పట్టు
వ్యర్ధాల తరలింపుకు మున్సిపాలిటీలో ఒప్పందం చేసుకున్న ఒక వ్యక్తి.
నాలుగు నెలలైనా మున్సిపాలిటీకి చెల్లించవలసిన రుసుము చెల్లించని వైనం సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు
సదరు వ్యక్తికి అండగా వైసీపీకి చెందిన బడా నేత ఉన్నట్లు సమాచారం !
వ్యర్ధాలను చేపల చెరువులకు తరలిస్తున్నారు అంటున్న పర్యావరణ వేత్తలు
భీమవరం
అక్టోబర్ 24:: భీమవరం మున్సిపాలిటీ పరిధిలో కోడి వ్యర్ధాల సేకరించి తరలించే మాఫియా రెచ్చిపోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యర్ధాలను విచ్చలవిడిగా చేపల చెరువులకు తరలిస్తున్నారంటన్న పర్యావరణ వేత్తలు దానితో పర్యావరణానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న కానీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే సుమారు నాలుగు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి భీమవరం మున్సిపాలిటీలో కోడి మాంసం దుకాణాల వద్ద ఉన్న వ్యర్ధాలను సేకరించి పర్యావరణానికి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని డిస్పోజల్ మెకానిజం చేసే ప్రక్రియ తన వద్ద ఉందంటూ మున్సిపల్ అధికారులను నమ్మించి కోడి వ్యర్ధాల సేకరణకు అనుమతి పొందారు. అనుమతి పత్రంలో కోడి వ్యర్ధాల సేకరణకు ఒక్కో షాపు నుండి 800 వందల రూపాయలు నెలకు సేకరించి వాటిలో మున్సిపాలిటీకి ఒక్కో షాపు నుండి 500 రూపాయలు చెల్లిస్తానని మిగిలిన 300 తో వ్యర్ధాలను భీమవరం మున్సిపల్ పరిధికి దూరంగా తీసుకువెళ్లి డిస్పోజల్ మెకానిజం చేస్తానని సదరు వ్యక్తి తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. కానీ సదరు వ్యక్తి ఇంతవరకు మున్సిపాలిటీకి ఒక పైసా కూడా కట్టకపోవడం అధికారులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కోడి వ్యర్ధాల మాఫియా వ్యక్తుల వెనుక బడా బడా రాజకీయ నాయకులు ఉన్నారని సమాచారం. వ్యర్ధాలు సేకరించే వ్యక్తి మున్సిపాలిటీ అధికారులకు చెప్పినదొకటి చేస్తున్నది మరొకటి అని పలువురు ఆరోపిస్తున్నారు. కోడి వ్యర్ధాలు మాఫియా వెనకున్న బడా రాజకీయ నాయకులు ఎవరు? కోడి వ్యర్ధాలు సేకరించే మాఫియా లక్షలకు లక్షలు ఎలా సంపాదిస్తున్నారు కోడి వ్యర్ధాలను ఎక్కడికి తరలిస్తున్నారు కోడి వ్యర్ధాలు సేకరించే వ్యక్తులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారు ఎంతమంది ఫిర్యాదు చేసిన సదరు కాంట్రాక్టర్ జోలికి అధికారులు వెళ్లకపోవడానికి కారణాలేంటి అనే విషయాలు రేపటి సంచికలో వివరంగా ప్రచురించగలం......

దీపావళి ఆఫర్ బాబు.. దోచుకున్నోడికి దోచుకున్నంత.. భీమవరం/పాలకొల్లు/నర్సాపురం: దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో బాణసంచా వ్య...
24/10/2024

దీపావళి ఆఫర్ బాబు.. దోచుకున్నోడికి దోచుకున్నంత..
భీమవరం/పాలకొల్లు/నర్సాపురం:
దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో బాణసంచా వ్యాపారం ఊపందుకుంటోంది. ఈ నెల 31వ తేదీన పండుగ నేపథ్యంలో ఇప్పటి నుంచి పాత బాణసంచా సరుకుతో పాటు, కొత్తది కూడా కొంత రప్పించుకుని అధిక లాభాలు ఆర్జించే పనిలో వ్యాపారులు నిమగ్నమవుతున్నారు.
కొందరైతే నాణ్యతలేని, నిషేధిత చైనా టపాకాయలను కూడా తెచ్చుకుని ఎక్కువ లాభార్జన మార్గాలు వెతుక్కుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలు, ఏలూరు జిల్లా పట్టణ మండలాల్లో కొందరు అక్రమ బాణసంచా వ్యాపారాలకు తెర తీసినట్లు ప్రచారం. ఇదే పరిస్థితి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గోడౌన్ల వద్ద రక్షణ తూతూమంత్రమే..
మందుగుండు సామాగ్రిని నిల్వ చేసే గోదాముల వద్ద రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. గోదాముల వద్ద ఇసుక, నీటి వనరులు, కార్బన్ డయాక్సైడ్స్ సిలిండర్, తగినన్ని సిద్ధంగా ఉంచడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని వినియోగించే శిక్షణ పొందిన సిబ్బంది కూడా లేరని సమాచారం. లైసెన్స్ పొందిన డీలర్లు ఆయా గోదాములలోను, దుకాణాల్లోనూ అంత మేరకే బాణసంచా సరుకు నిల్వలు ఉంచుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ పరిమాణంలో నిల్వలు పెట్టుకుని, వాటిని విక్రయించుకుని అధిక లాభాలు పొందుతున్నట్లు తెలిసింది. టపాకాయల ప్యాకెట్‌లపై కూడా అసలు ధరలు కంటే 10 రెట్లు అధికంగా ధరలు ముద్రించి దోపిడీకి తెర లేపుతున్నారు. ఈ దోపిడీ నీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది.
మామూళ్ల మత్తులో అధికారులు..
లైసెన్సుల పరిమితికి మించి బాణసంచా సరుకులు దొడ్డి దారిలో విక్రయించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంకు రావల్సిన కోట్లాది రూపాయల పన్నులకు గండి కొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జీఎస్టీ అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు సమాచారం. వీరు కనుక బాణసంచా గోదాములు, దుకాణాలు తనిఖీ చేసి పన్నులు కట్టిస్తే ఇలా ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండేదని పలువురు అంటున్నారు. వీరంతా మామూళ్ల మత్తులో ఉండడం వల్లే ఇలాంటి అక్రమాలు సాగిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది.. అర్థం ఏమిటో తెలుసా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గంటకు 15 ...
23/10/2024

దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది.. అర్థం ఏమిటో తెలుసా
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఇది తీరం దాటనుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను భయపెడుతున్న ఈ తుపాను దానా అని పేరు ఎలా వచ్చింది. భారతదేశమే ఈ పేరు పెట్టిందా? లేక ఇతర దేశం ప్రతిపాదించిందా?.. దానా పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రమైనదిగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున సమయంలో పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఈ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అత్యంత తీవ్రమైన తుపాను కావడంతో ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ హడలిపోతున్నాయి. అత్యంత పకడ్బందీగా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తుపాను ఏపీపై కూడా పాక్షిక ప్రభావం చూపనుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
ఇంతకీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపానుకు ‘దానా’ అనే పేరు ఎలా వచ్చింది? దీనికి అర్థం ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
దానా అర్థం ఏమిటంటే..
దానా అనే పేరుకు అరబిక్‌లో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. అరబిక్ భాషలో ఈ పదానికి ‘అందమైన ముత్యం’, అత్యంత సంపూర్ణ పరిమాణం, ఎంతో విలువైనది వంటి అర్థాలు వస్తాయి. సాధారణంగా ఈ పేరు పర్షియన్ గల్ఫ్‌లోని అరబ్ దేశాలలో ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ వేర్వేరు రకాల ముత్యాలకు ప్రత్యేకమైన పేర్లు పెడుతుంటారు. ‘దానా’ పేరు అత్యుత్తమమైన ముత్యాన్ని సూచిస్తుంది. ఇక పర్షియన్‌ భాషలో దానా అంటే ‘వివేకం’ అని అర్థం వస్తుంది. ‘దానా’ అనే పేరుని ఖతార్ సూచించింది. అంతర్జాతీయ తుఫాను నామకరణ విధానంలో భాగంగా ఈ పేరుని ప్రతిపాదించింది. తుపానుల గుర్తింపును సులభంగా మార్చడానికి, వాటి గమనాన్ని అంచనా వేయడానికి, సంభావ్య ముప్పు నుంచి ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించేందుకు వీలుగా తుపానులకు ఈ విధంగా పేర్లు పెడుతుంటారు. కాగా తుపానులకు పేర్లు పెట్టే పద్దతి ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రమాణంగా మారిపోయింది. దేశాల మధ్య పరస్పర సమాచారం పంపిణీ, తుపానుల గమనాన్ని గుర్తించడానికి ఈ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టేందుకు ఏప్రిల్ 2020 నాటికి 13 దేశాలు ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఈ దేశాల జాబితాలో భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. కాగా తుపానులకు పేర్లు పెట్టే ఈ ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. తుపానులకు పెట్టే పేర్లు చక్కగా సాంస్కృతికంగా, ఉచ్చరించడానికి సులభంగా, ఏ సమూహాన్ని, వర్గాన్ని కించపరచని విధంగా ఉంటాయి. తుపానుల పేర్లను వార్షిక లేదా ద్వైవార్షిక సమావేశాల సమయంలో సభ్య దేశాలు ప్రతిపాదిస్తాయి. ఈ పేర్లను ఆమోదించాలంటే ప్రతి పేరు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది

Address

Rajahmandri
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Jananetri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jananetri:

Share