TIMES BIZ

TIMES BIZ ● వార్తలు, విశ్లేషణలు, విజయగాథలను తెలుగులో అందించే న్యూస్ పోర్టల్

● కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌ - 65 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ ధర రూ.62 కోట్లు
11/08/2026

● కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌ - 65 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ ధర రూ.62 కోట్లు

10/08/2026

● హైదరాబాద్, బోనాలు జాతరలో విన్యాసాలు

10/08/2026

● దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు వేగం పుంజుకున్నందున రాబోయే కొద్ది రోజుల్లో కేరళ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్టల్ కర్ణాటక, లక్షద్వీప్‌లలో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువ కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆ వానలు పడే సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ దేశంలోని వాతావరణ పరిస్థితులను వివరించింది.

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కే...
09/08/2026

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి)

ప్రియమైన సంజీవ్,

ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి వచ్చినప్పుడు కృతనిశ్చయురాలైన నీ సహచరి శ్వేతా భట్ ఈ ఉత్తరం ప్రతిని నీకు తెచ్చి ఇవ్వవచ్చు. కాని ఇప్పుడైతే ఆమె ఎంతో పోరాడవలసి ఉంది, ఎంతో సంబాళించుకోవలసి ఉంది. నా ఉత్తరం అనే చిన్న విషయం ఆమె మరిచిపోవచ్చు కూడ.

మొత్తానికి నీకీ ఉత్తరం చేరినప్పుడు, జామ్ నగర్ జిల్లాలోని ఆ కష్టభరితమైన జైలు బారక్ లో ఒంటరితనంలో నువ్విది ఎలా చదువుకుంటావా అని ఊహిస్తుంటేనే నాకు బాధగా ఉంది. సివిల్ సర్వీస్ అధికారిగా నేను దేశంలోని ఎన్నో జైళ్లలోపల ఎలా ఉంటుందో చూశాను. అది నీకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో నేనూహించగలను. రోజువెంటరోజు అదే అదే విసుగెత్తించే ఒకే రకమైన జీవితం, కటిక నేల మీద పడక, కంపు కొట్టే ఉమ్మడి పాయిఖానా, మండుటెండల వేడి నుంచీ, ఈగల నుంచీ, దోమల నుంచీ రక్షణ లేని పరిసరాలు.

ఇప్పటికే నువ్వు తొమ్మిది నెలలు జైలులో గడిపావు. ఆ కాలం ఎంత ఇబ్బందికరమైనదైనా అప్పుడు నీకు ఒక ఆశ ఉండి ఉంటుంది. ఏదో ఒక కోర్టు – అది జిల్లా సెషన్స్ కోర్టు గాని, లేదా అహ్మదాబాద్ లో, ఢిల్లీలో ఉన్న అత్యున్నత కోర్టులలో ఏదో ఒకటి గాని – న్యాయం చేస్తుందని ఆశ ఉండి ఉంటుంది.
అందుకు బదులుగా, జామ్ నగర్ జిల్లా సెషన్స్ కోర్టు నీకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించడం గొడ్డలిపెట్టులా తోచి ఉండవచ్చు. అయితే నువ్వు ధైర్యం, స్థిరనిశ్చయం నిండిన యోధుడివని నాకు తెలుసు. నువ్వు న్యాయం కోసం, నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం కోసం, ఒకానొక రోజున స్వేచ్ఛగా విడుదల కావడం కోసం పోరాడుతూనే ఉంటావు.

ఇబ్బందికరమైన, హింసాత్మకమైన నీ చెరసాల కొట్టులో ఏకాకిగా ఒంటరి క్షణాలు అనుభవిస్తున్న నీకు నేనొకటి చెప్పదలచాను. జీవితంలోకెల్లా కఠినమైన పోరాటాన్ని నువ్వు సాగిస్తున్నప్పుడు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎందరెందరో నీతోనే ఉన్నారు, నీకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాకు నువ్వు అమాయకుడివనే విశ్వాసం ఉంది. ఈ దేశంలోకెల్లా శక్తిమంతుడైన మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అపూర్వ సాహసం ప్రదర్శించినందుకు మాత్రమే నీ మీద ఈ వేధింపు జరుగుతున్నదని మాకు తెలుసు. 2002లో జరిగిన, స్వతంత్ర భారత చరిత్రలోకెల్లా అత్యంత దారుణమైన, క్రూరమైన మారణకాండలో ఆ మనిషి పాత్ర ఉన్నదనే నిజాన్ని నువ్వు స్థాపించదలచావు గనుకనే ఈ వేధింపు.

నీకు ఇప్పుడు జరుగుతున్నదంతా, ఆ మనిషికీ, దేశంలో ఇప్పుడు అత్యంత శక్తిమంతుడిన రెండో మనిషికీ ఉన్న మితిమీరిన అహంకారపు పర్యవసానమేనని తేటతెల్లమవుతున్నది. ఒక సాహసికుడైన, మడమ తిప్పని యోధుడి మీద చౌకబారు ప్రతీకారం తీసుకోవడానికి వాళ్లు రాజ్యాధికారాన్ని దారుణంగా వాడుకుంటున్నారు. దేశంలో నీలా జాగరూకుడైన కాపలాదారుగా ఉన్న మరొకరు నాకు గుర్తు రావడం లేదు. అత్యున్నత అధికారాన్ని ఆక్రమించినవారికి వ్యతిరేకంగా గొంతెత్తిన కాపలాదారుగా ఒక సీనియర్ అధికారి ఉన్న ఉదాహరణ లేదు. అలాగే రానున్న మూడు దశాబ్దాలు జైలులో గడపాలని నీ వంటి శిక్ష పొందిన అధికారి ఉదాహరణ కూడ లేదు.

నీకు ఇటువంటి శిక్ష విధించడం దేశంలో న్యాయవ్యవస్థ నిర్మాణాలు తమ సమగ్రతనూ, స్వాతంత్ర్యాన్నీ కోల్పోయి, కుప్పకూలిపోయాయనడానికి దర్పణం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, అధికారిక మానవహక్కుల సంస్థలు అన్నీ ధ్వంసమయ్యాయి. చివరికి ఖాకీ దుస్తులలో ఉన్న నీ సోదరులు, సోదరీమణులు కూడ నీ శిక్ష తర్వాత మౌనం వహించి నిన్ను వదిలేశారు.

ఈ శిక్ష మీద ప్రచారసాధనాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శ రాలేదంటే రాజ్యాధికారాన్ని ఇంత బహిరంగంగా, ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తుంటే ప్రచారసాధనాలు ఆగ్రహంతో నిరసన వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేవని అర్థం. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) తో సహా రాజ్యవ్యవస్థలన్నిటి విధ్వంసం కూడ నీ శిక్ష సందర్భంలో మరొకసారి ఘోరంగా బైటపడింది. సివిల్ సర్వీస్ అధికారుల స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి రాజ్యాంగం 315 అధికరణం ప్రకారం ఏర్పడిన యుపిఎస్ సి 2015లో నిన్ను సర్వీస్ నుంచి తొలగించినప్పుడు పిరికిగా మౌనం వహించింది. అప్పుడు స్క్రోల్ లో రాసిన వ్యాసంలో నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను. నిన్ను తొలగించడానికి వారు చూపినది నువ్వు కొద్ది రోజుల పాటు అనధికారికంగా సెలవు తీసుకున్నావనే అతి స్వల్ప కారణం.

కాని ఒక అధికారిని తొలగించడమనే శిక్ష అత్యంత తీవ్రమైన పాలనా చర్య. అది అరుదైనవాటిలోకెల్లా అరుదైన సందర్భంలోనే తీసుకోవాలి. ప్రభుత్వాధికారులు అతి తీవ్రమైన నేరాలు చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కాని యుపిఎస్ సి ఆ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నీకు నీ వాదన వినిపించుకోవడానికి కూడ అవకాశం ఇవ్వలేదు. నాకు తెలిసి ఎందరో ఐ ఎ ఎస్ అధికారులు చెప్పాపెట్టకుండా సంవత్సరాల తరబడి అనధికారిక సెలవులు తీసుకున్నారు. ఆ సమయంలో విదేశాలలోనో, ప్రైవేట్ కంపెనీలలోనో ఉద్యోగాలు కూడ చేశారు. కాని వారి మీద, తొలగింపు కాదు సరిగదా, కనీస చర్యలు కూడ తీసుకోలేదని నేనా వ్యాసంలో రాశాను.

నీ సెలవు అనధికారికమైనది కాదని నువ్వు ఖండించావు గాని, ఒకవేళ అది అనధికారికమైనదే అనుకున్నా, ‘అటువంటి అనుచిత ప్రవర్తనకు సకారణమైన, ఉచితమైన శిక్ష ఒక లిఖితపూర్వక అసంతృప్తిప్రకటనా లేఖ తోనో, జీతం లేని సెలవుగా పరిగణించడం తోనో సరిపోయి ఉండేది’ అని నేనప్పుడు రాశాను.
దేశంలో అత్యున్నత అధికారంలో ఉన్నవారు నువ్వు ఎట్లాగైనా ఉద్యోగం నుంచి తొలగించబడాలని అంతగా ఎందుకు కోరుకున్నారనే చిక్కుముడి ఆ ‘అనధికార సెలవు’ రోజుల్లో నువ్వు ఏం చేశావనేది చూస్తే సులభంగా విడిపోతుంది. ఆ రోజుల్లో నువ్వు, ఇండియన్ పోలీస్ సర్వీస్ కు చెందిన గుజరాత్ కాడర్ అధికారిగా, ధైర్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నావు. మోడీకి జనహననపు మారణకాండతో సంబంధం ఉన్నదని చూపుతున్నావు.

నువ్వు ఆ సాక్ష్యాన్ని సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ముందు, సుప్రీం కోర్టుకు సహాయకుడుగా వ్యవహరిస్తున్న రాజు రామచంద్రన్ ముందు ఇచ్చావు (ఆ తర్వాత ఆ సాక్ష్యమే లిఖితపూర్వక అఫిడవిట్ గా సుప్రీం కోర్టుకు చేరింది). వారు అప్పుడు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపణలపై విచారిస్తున్నారు. ఎహ్సాన్ జాఫ్రీని, ఆయనతో పాటు మరొక 70 మందిని అహ్మదాబాద్ లో గుల్బర్గ్ సొసైటీలో, 2002లో అత్యంత దారుణంగా చంపారు. ప్రాణాలనూ ఆస్తులనూ కాపాడడంలో “ఉద్దేశపూర్వకంగానే, తెలిసితెలిసీ వైఫల్యం చెందారు” అనే కారణంతో నరేంద్ర మోడీ ఈ హత్యాకాండలో మొదటి ముద్దాయి అని ఆమె ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ తన రాజ్యాంగబద్ధ విధులను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు.

నిన్ను ఉద్యోగం నుంచి తొలగించడం అసాధారణమూ దిగ్భ్రాంతికరమూ. కాని ఇక అంతకంటె దారుణం చేయలేరని మేమప్పుడు అనుకున్నాం. ఇంకా దారుణాలు రానున్నాయని అప్పుడు మేం ఊహించలేకపోయాం. నిన్ను జీవితాంతం జైలులో గడిపేలా చేసేదాకా వాళ్ల పగ చల్లారదని మేం ఊహించలేకపోయాం.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైన మతోన్మాద హింసా మారణకాండ నేరానికి సంబంధించిన కేసులో నీ సాక్ష్యం ఎంత బలమైనదో, నేరస్తులను ఎంత భయపెడుతున్నదో నీకు వేసిన శిక్షే చెప్పకనే చెపుతున్నది. నువ్వు వెల్లడించిన సాక్ష్యాధారాలు ఎంతో ప్రమాదకరమైనవి. ఈ శిక్ష నీ ఒక్కడికి మాత్రమే హెచ్చరిక కాదు, ఈ దేశంలో శక్తిమంతులైన మనుషులకు ఎదురుచెప్పే సాహసం చేసేవాళ్లందరికీ ఇది ఒక హెచ్చరిక. ఒక సీనియర్ పోలీస్ అధికారికే ఈ గతి పడితే, ఒక సాధారణ పౌరుడికి ఏం రక్షణ ఉంటుంది?

2002 ఫిబ్రవరి 27 రాత్రి పొద్దుపోయిన తర్వాత మోడీ నేతృత్వంలో జరిగిన అత్యంత వివాదాస్పద సమావేశంలో నీతోపాటు ఇతర పోలీసు అధికారులు కూడ పాల్గొన్నారు. కాని వాళ్లందరూ ఆ సమావేశానికి హాజరైనట్టు గుర్తు లేదన్నారు. లేదా, ఆ సమావేశంలో నువ్వు చెపుతున్నట్టుగా మోడీ ఆదేశాలు ఇచ్చిన సంగతి గుర్తు లేదన్నారు. లేదా ఆ సమావేశంలో నువ్వు ఉన్నట్టు గుర్తు లేదన్నారు. కాని నీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఆ సమావేశానికి వెళ్లడానికి ముందు నీతో ఉన్న బిబిసి విలేఖరి చెప్పిన ప్రకారం నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావన్నది నిస్సందేహం.

ఆ సమావేశంలో అధికారులకు మోడీ ఇచ్చిన ఆదేశాల గురించి బైటపెడితే విస్ఫోటనం సంభవిస్తుందని నీకు తెలుసు.

అయినా నువ్వు మాట్లాడదలచుకున్నావు. నువ్వు ఆ మాట అనడానికి, ఆ మాటకు కట్టుబడి ఉండడానికి హెచ్చుస్థాయిలో ధైర్యం కూడగట్టుకోవలసి ఉండింది. “హిందువులలో తీవ్రమైన భావోద్వేగాలున్నాయని, అందువల్ల వారు తమ కోపం తీర్చుకోవడానికి అనుమతించడమే ఉచితమ”ని ఆ సమావేశంలో మోడీ అన్నాడని నువ్వు సిట్ ముందు, సుప్రీం కోర్టు ముందు చెప్పావు. ఈ ‘హిందూ ఆగ్రహం’ అనబడేది సకారణమైన ప్రతిస్పందన అని మోడీ అప్పుడే తన బహిరంగ ప్రకటనల్లో కూడ అని ఉన్నాడు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో సహకరించడానికి వెళ్లి తిరిగివస్తూ రైలు బోగీలో గోధ్రాలో 58 మంది తగులబడిపోవడానికి ప్రతిస్పందన అది అని ఆయన అన్నాడు.

ఆనాటి సమావేశంలో “ఎంతో కాలంగా గుజరాత్ లో మతకల్లోలాలతో వ్యవహరించేటప్పుడు గుజరాత్ పోలీసులు హిందువులకూ ముస్లింలకూ మధ్య సమతౌల్యం పాటించాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని, ప్రస్తుతం మాత్రం ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పవలసిందే”నని అక్కడివారిని ముఖ్యమంత్రి మోడీ ఉద్బోధించాడని నువ్వు సుప్రీంకోర్టు ముందు చెప్పావు. నీ ఆరోపణలను అంగీకరిస్తే, మోడీ మీద అతి తీవ్రమైన నేరారోపణలు చేయవలసి వచ్చేది. దేశంలో అత్యున్నత అధికార పీఠానికి అధిరోహించకుండా అది ఆటంకమయ్యేది.

సిట్ లో ఉన్న నీ సహోద్యోగులు, ఐపిఎస్ అధికారులు, నీ ఆరోపణలను పూర్తిగా కొట్టివేశారు. నిన్ను అవిశ్వసనీయ సాక్షిగా ప్రకటించారు. అసలు ఆ సమావేశంలో నువ్వు పాల్గొననే లేదన్నారు. కాని, సుప్రీం కోర్టు సహాయకుడిగా పనిచేసిన రాజు రామచంద్రన్ నీ ఆరోపణలను సిట్ తోసివేయడాన్ని అంగీకరించలేదు. నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావా లేదా అనేది నిజానికి న్యాయస్థానంలో తేల్చాలని, సమావేశంలో పాల్గొన్నామని చెప్పిన కొందరు అధికారుల సాక్ష్యాన్నికూడ సిట్ తోసిపుచ్చింది గనుక, నీ ఆరోపణలను కూడ పూర్తిగా కొట్టివేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని అన్నారు. నీ మాటలను ఒక న్యాయస్థానంలో పరీక్షకు గురి చేయవలసిందేనని ఆయన అన్నారు. ఆయన సూచనను అంగీకరించి, నీ సాక్ష్యాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి ఉంటే భారత చరిత్రే మరొక రకంగా ఉండేది. నీ జీవితం కూడ మరొక రకంగా ఉండేది.

సిట్ కు అధినేతగా ఉండిన అధికారి ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండగానే ఒక అసాధారణ, గౌరవనీయ పదవికి ఎంపిక కావడం యాదృచ్చికం కావడానికి వీలు లేదు. ఆ పోలీసు అధికారికి పదవీ విరమణ తర్వాత విదేశంలో రాయబారి పదవి దక్కింది. మరొక పక్క నువ్వు యావజ్జీవితం జైలు శిక్షకు గురి చేయబడ్డావు.

దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన మనుషులు నీ మీద కోపం పెట్టుకోవడానికి తగిన కారణం ఉంది. కాని భారత రాజ్యాంగ సంస్థలు తమను తాము బలహీన పరచుకుని, ఆ వ్యక్తుల చౌకబారు ప్రతీకారవాంఛకు, రాజ్యాధికార దుర్వినియోగానికి వంతపాడి ఉండవలసింది కాదు.

ఇవాళ నీకు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు, కస్టడీలో ఒక వ్యక్తి మరణించడానికి నీకు సంబంధం ఉన్నదని న్యాయస్థానం నిర్ధారించిన తర్వాత, నిన్ను నేనెట్లా సమర్థిస్తానని వాళ్లు అడుగుతున్నారు. నేను సివిల్ సర్వీస్ అధికారిగా ఉన్నప్పుడూ, అది అయిపోయి బైట ఉన్నప్పుడూ కూడ కస్టడీ హింసనూ, చట్టవ్యతిరేక హత్యలనూ గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. కాని, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే గుజరాత్ లో 2001 నుంచి 2016 వరకు 180 కస్టడీ మరణాలు సంభవించాయని, అన్ని మరణాలకుగాను ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారికి కూడ శిక్ష పడలేదని తెలుస్తున్నది. కనుక నీ మీద చర్య సక్రమంగా జరిగిందని నేను అంగీకరించలేను.

ఆ కస్టడీ మరణాలన్నీ లేదా కనీసం వాటిలో చాలభాగం దర్యాప్తు జరిగి ఉంటే, ఆ హత్యలకు కారకులైన చాలమంది పోలీసు అధికారులకు శిక్షలు పడి ఉంటే, ఇప్పుడు నీ మీద చర్యను కూడ నేను న్యాయమైనదని సమర్థించి ఉండేవాడిని. కాని, ముప్పై సంవత్సరాల కింద, కస్టడీ నుంచి విడుదల అయిన తొమ్మిది రోజుల తర్వాత మరణించిన ఒక వ్యక్తి విషయంలో నీకూ మరొక అధికారికీ శిక్ష పడడం నేను అంగీకరించలేను.
స్వతంత్ర భారతం చూసిన అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరి మీద, క్షమాగుణం అనేదే తెలియని వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంలో నువు చూపిన అద్భుతమైన సాహసానికి నిన్ను అభిమానించే వాళ్లెందరో ఉన్నారని తెలుసుకోవడం జైలులో నీ ఇబ్బందులనూ, వేదననూ ఎంతమాత్రం తగ్గించదు. నీ ముందున్న న్యాయపోరాటం దీర్ఘకాలికమైనదనీ, అనిశ్చితమైనదనీ, ఎన్నెన్నో నిరాశలకూ, హృదయవేదనలకూ దారి తీసేదనీ నీకూ, శ్వేతకూ, నీ పిల్లలకూ తెలిసినట్టుగానే నాకు కూడ తెలుసు.

కాని ధైర్యంగా నిలబడడానికి, తట్టుకోవడానికి, పోరాటం కొనసాగించడానికి, నువ్వు సత్యమనీ న్యాయమనీ విశ్వసించిన వాటికోసం దృఢంగా నిలబడడానికి కావలసిన శక్తీ, సహిష్ణుతా నీకున్నాయని నాకు తెలుసు. అలాగే ఏదో ఒక రోజు నువ్వు స్వేచ్ఛగా బైటికి వస్తావనీ నాకు తెలుసు. శ్వేతతో, పిల్లలతో, మన దేశపు అసంఖ్యాక స్త్రీ పురుషులతో నేను కూడ ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను.

- హర్ష్ మందర్

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

● Neha borah: విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ నాయకత్వం వైపు కనిపిస్తున్న ఒక కొత్త స్వరంభారతదేశంలో ప్రతి తరం తనకు తానుగా కొ...
09/08/2026

● Neha borah: విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ నాయకత్వం వైపు కనిపిస్తున్న ఒక కొత్త స్వరం

భారతదేశంలో ప్రతి తరం తనకు తానుగా కొందరు విద్యార్థి నాయకులను చూస్తుంది. వారిలో కొందరు ఉద్యమం ముగిసిన తర్వాత చరిత్రలో కలిసిపోతారు. మరికొందరు మాత్రం తమ ఆలోచనలు, నాయకత్వం, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం కారణంగా జాతీయ రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో చర్చకు వస్తున్న పేరు నేహా బోరా. ఆమె భవిష్యత్తు ఏమిటో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. అయితే ఆమె ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తే, భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశమున్న యువ నాయకుల్లో ఆమె ఒకరిగా కనిపిస్తున్నారు.

భారతదేశంలో విద్యార్థి రాజకీయాలు కేవలం క్యాంపస్ ఎన్నికలతో ముగిసిపోయే ప్రక్రియ కాదు. అవి దేశ రాజకీయాలకు నాయకత్వాన్ని అందించే పునాది. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి అనేక ప్రజా ఉద్యమాల వరకు విద్యార్థుల పాత్ర కీలకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి నాయకుడిని అంచనా వేయాలంటే, ఆయన లేదా ఆమె ఎన్ని సభలు నిర్వహించారన్నది కాదు; సమస్యలను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంత నిబద్ధత చూపుతున్నారు, రాజ్యాంగంపై ఎంత అవగాహన కలిగి ఉన్నారన్నదే అసలు ప్రమాణం.

నేహా బోరా ఉత్తరాఖండ్‌లోని ఖటీమా ప్రాంతానికి చెందినవారు. చిన్ననాటి కొంతకాలం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గడిపారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆమె, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీలో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్‌లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పరిశోధకురాలిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలిగా విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేసిన మాజీ సైనిక అధికారి. తన రాజకీయ అభిప్రాయాలు కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నమైనప్పటికీ, తన విశ్వాసాల విషయంలో రాజీపడనని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

నేహా బోరా ప్రసంగాలను గమనిస్తే, ఆమె కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా, తన వాదనలను రాజ్యాంగం, విద్యా విధానం, సమాన అవకాశాలు, విద్యార్థుల హక్కులు వంటి అంశాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. నినాదాలతో ఉద్యమాలు ప్రారంభమవుతాయి. కానీ వాస్తవాలు, తర్కం, స్పష్టమైన ఆలోచనలతోనే అవి ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తాయి. ఒక విద్యార్థి నాయకురాలిగా ఈ లక్షణం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఇటీవలి విద్యార్థి ఉద్యమాల్లో ఆమె పోషించిన పాత్ర దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల విశ్వసనీయత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఆమె నిరంతరం గొంతెత్తారు. దీర్ఘకాల నిరాహార దీక్షలో పాల్గొని కూడా తన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గకపోవడం వల్ల ఆమె పేరు జాతీయ స్థాయిలో విస్తృత చర్చకు వచ్చింది. ఈ ఉద్యమం ఆమెను ఒక సాధారణ విద్యార్థి నాయకురాలి నుంచి జాతీయ చర్చలో నిలిచే ముఖంగా మార్చింది.

ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. క్లిష్టమైన అంశాలను సాధారణ విద్యార్థికి అర్థమయ్యే భాషలో వివరించడం, మీడియా ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వడం, తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తీకరించడం వంటి లక్షణాలు ఆమెను యువతకు చేరువ చేశాయి. నేటి రాజకీయాల్లో ప్రజలతో నేరుగా సంభాషించగలిగే నాయకత్వం అరుదుగా కనిపిస్తున్న సమయంలో, ఈ లక్షణం ఆమెకు ప్రత్యేక బలంగా మారింది.

అయితే ఏ నాయకుడినైనా ప్రసంగాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సరైంది కాదు. ఉద్యమాల సమయంలో కనిపించే ఉత్సాహం కంటే, ఉద్యమం ముగిసిన తర్వాత చూపే బాధ్యతే నాయకత్వాన్ని నిరూపిస్తుంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, విమర్శలను స్వీకరించడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే విలువలకు కట్టుబడి ఉండటం వంటి అంశాలే ఒక నాయకుడి అసలు బలం.

చరిత్ర మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ప్రతి గొప్ప నాయకుడు ఒకప్పుడు సాధారణ విద్యార్థే. ప్రతి పెద్ద ఉద్యమం ఒక చిన్న ప్రశ్నతోనే ప్రారంభమైంది. ఆ ప్రశ్న సమాజాన్ని ఆలోచింపజేసినప్పుడు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. నేహా బోరా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. అయితే విద్యార్థుల సమస్యలను జాతీయ చర్చలోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య విలువలపై చర్చను విస్తరించడం, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆమెను గమనించాల్సిన యువ నాయకుల్లో ఒకరిగా నిలబెడుతున్నాయి.

ఉద్యమాలు నాయకులను పరిచయం చేస్తాయి. కానీ చరిత్ర వారిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో నిలబడేది కేవలం ప్రజాదరణ కాదు; ప్రజల పట్ల నిజాయితీ, విలువల పట్ల నిబద్ధత, రాజ్యాంగంపై విశ్వాసం, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం. నేహా బోరా ఆ ప్రమాణాలను ఎంతవరకు నిలబెట్టుకుంటారో కాలమే నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆమె భారత విద్యార్థి రాజకీయాల్లో ఆశాజనకంగా ఎదుగుతున్న ఒక యువ నాయకురాలిగా గుర్తింపు పొందడం మాత్రం విశేషమే.

● శ్రీనివాస్ ముద్దం.
---------------------

Exclusive Story: ఉచిత యూపీఐకి ఛార్జీల తలుపులు.. చివరికి భారం సామాన్యుడిపైనేనా?దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూని...
08/08/2026

Exclusive Story: ఉచిత యూపీఐకి ఛార్జీల తలుపులు.. చివరికి భారం సామాన్యుడిపైనేనా?

దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వెన్నెముకగా మారింది. ఒకప్పుడు నగదు చేతిలో లేకపోతే చెల్లింపు చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. యూపీఐ అందుబాటులోకి రావడంతో డిజిటల్ లావాదేవీలు సామాన్యుడి జీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, చిరు దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఇప్పటివరకు సాధారణ యూపీఐ లావాదేవీలపై వినియోగదారుల నుంచి నేరుగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇదే యూపీఐ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే తాజాగా యూపీఐతో సహా డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) విధించే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టంలో మార్పులు తీసుకురావడం కొత్త చర్చకు తెరలేపింది.

ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చట్టంలో మార్పు చేసినంత మాత్రాన రేపటి నుంచి ప్రతి యూపీఐ లావాదేవీపై ఛార్జీ పడటం లేదు. వినియోగదారుల వ్యక్తిగత లావాదేవీలపై ఛార్జీ విధించే తుది నిర్ణయం కూడా ఇంకా లేదు. అయితే, ఇంతకాలం ఉచితంగా కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఛార్జీలకు చట్టపరమైన తలుపులు తెరవడమే అసలు ఆందోళన.

● మొదటి భారం వ్యాపారులపై

ప్రస్తుత విధానంలో మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ ద్వారా వ్యాపార లావాదేవీలపై ఛార్జీ విధించే అవకాశం ఉంది. అంటే మొదటి దశలో భారం వ్యాపారులపై పడుతుంది. ఒక వ్యాపారి తన వ్యాపారం ద్వారా వచ్చే ప్రతి డిజిటల్ చెల్లింపుపై కొంత శాతం చెల్లించాల్సి వస్తే, అది అతని వ్యాపార వ్యయాన్ని పెంచుతుంది.

వ్యాపారి ఆ అదనపు ఖర్చును తనే పూర్తిగా భరిస్తాడని చెప్పలేం. సాధారణంగా వ్యాపారంలో పెరిగిన ఖర్చును ఉత్పత్తుల ధరలు, సేవల ధరలు లేదా ఇతర ఛార్జీల రూపంలో వినియోగదారుడికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మొదటి చూపులో ఛార్జీ వ్యాపారిపై పడినా, దాని పరోక్ష ప్రభావం చివరకు వినియోగదారుడిపైనే పడుతుంది. ఇదే ఈ వ్యవహారంలో కనిపిస్తున్న తొలి సమస్య.

● రెండో ప్రశ్న.. రేపటి వ్యక్తిగత లావాదేవీలు?

ప్రస్తుతం వ్యక్తిగత యూపీఐ లావాదేవీలపై ఛార్జీ విధించే నిర్ణయం లేదు. ఇది స్పష్టంగా చెప్పాల్సిన విషయం. కానీ మరో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. ఒకసారి ఉచితంగా ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఛార్జీలకు చట్టపరమైన అవకాశం కల్పించిన తర్వాత, భవిష్యత్తులో ఆ పరిధి ఎటువైపు వెళ్తుంది?

ఈరోజు వ్యాపార లావాదేవీలు కావచ్చు. రేపు పెద్ద వ్యాపార లావాదేవీలు కావచ్చు. ఆ తర్వాత మరిన్ని డిజిటల్ చెల్లింపులు కావచ్చు. భవిష్యత్తులో వ్యక్తిగత లావాదేవీలపైనా ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తుందా? ప్రస్తుతం అలాంటి నిర్ణయం లేదని ప్రభుత్వం చెబుతున్నా, ఈ సందేహానికి పూర్తిగా తెరపడాలంటే భవిష్యత్తులోనూ వ్యక్తిగత యూపీఐ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయని స్పష్టమైన హామీ అవసరం.

ఎందుకంటే ప్రజలు యూపీఐని కేవలం సౌకర్యంగా మాత్రమే ఉపయోగించడం లేదు. అది ఇప్పుడు రోజువారీ జీవితంలో అవసరంగా మారింది. కూరగాయల కొనుగోలు నుంచి విద్యుత్ బిల్లు వరకు, హోటల్ బిల్లు నుంచి ఆన్‌లైన్ కొనుగోళ్ల వరకు కోట్లాది మంది దీనిపైనే ఆధారపడుతున్నారు.

● డిజిటల్ ఇండియా లక్ష్యానికి విరుద్ధమా?

ప్రభుత్వం ఒకవైపు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపులను పెంచాలని ప్రజలకు చెబుతోంది. ప్రతి చిన్న వ్యాపారి డిజిటల్ చెల్లింపులు స్వీకరించేలా ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ వ్యవస్థపై కొత్త ఖర్చులు పెడితే, చిన్న వ్యాపారులు దానిని ఎలా స్వీకరిస్తారన్నది ప్రశ్న.

చిన్న వ్యాపారికి ప్రతి రూపాయి ముఖ్యం. అతనిపై వరుసగా కొత్త ఖర్చులు పడితే, డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ ఖర్చును కస్టమర్ నుంచి వసూలు చేస్తే, డిజిటల్ చెల్లింపుల ఉద్దేశమే దెబ్బతింటుంది.

● ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల సౌకర్యం ముఖ్యం

ప్రభుత్వానికి ఆదాయం అవసరం. దేశ అభివృద్ధికి పన్నులు, రుసుములు అవసరమే. కానీ ప్రతి కొత్త ఆదాయ మార్గాన్ని ప్రజలపై అదనపు భారంగా మార్చడం సరైన ఆర్థిక విధానం కాదు.

ఇప్పటికే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, సెస్‌లు, ఇతర రకాల ఆర్థిక భారాలను ప్రజలు భరిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం మధ్య సామాన్య కుటుంబం తన ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యం సాధించడానికి ఇబ్బంది పడుతోంది. అలాంటి సమయంలో ఇప్పటివరకు ఉచితంగా లభించిన ఒక ప్రాథమిక డిజిటల్ సేవపై కూడా అదనపు ఖర్చుకు మార్గం సుగమం చేయడం ప్రజల దృష్టిలో సహజంగానే ప్రశ్నలను లేవనెత్తుతుంది.

యూపీఐ దేశానికి కేవలం చెల్లింపు వ్యవస్థ కాదు. అది డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది. చిన్న వ్యాపారి నుంచి సాధారణ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చిన వ్యవస్థ. అందుకే దీనిని ఆదాయ వనరుగా చూసే ముందు, దాని సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రభుత్వం నిజంగా డిజిటల్ ఇండియాను బలోపేతం చేయాలనుకుంటే, యూపీఐని మరింత చౌకగా, సులభంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. ఉచితంగా ఉన్న వ్యవస్థలో ఛార్జీలకు తలుపులు తెరిచి, ముందుగా వ్యాపారులపై భారం వేసి, ఆ తర్వాత ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే పరిస్థితి రాకుండా స్పష్టమైన రక్షణలు కల్పించాలి.

లేకపోతే.. ఈరోజు వ్యాపారిపై పడే యూపీఐ ఛార్జీ, రేపు వస్తువుల ధరల రూపంలో సామాన్యుడి జేబుకు చేరుతుంది. ఇప్పటికే పన్నులు, సెస్‌లు, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలకు.. ఉచితంగా ఉన్న డిజిటల్ చెల్లింపులపైనా కొత్త భారం మోపే ప్రయత్నం ఆదాయాన్ని పెంచే విధానం కంటే, సామాన్యుడి సహనాన్ని పరీక్షించే నిర్ణయంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ...
08/08/2026

రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసాదిత్య మాల్ మల్టీప్లెక్స్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో పలుమార్లు ఢీకొట్టిన ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం తర్వాత ప్రియాంక కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రియాంకకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె తల్లిదండ్రులకు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వివరించినట్లు సమాచారం. ఆమె కోలుకునే అవకాశాలు లేవని, ఇక ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్ర్యూ విలియం జోసెఫ్‌ను నిందితులుగా గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో నిందితులు మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించినట్లు సమాచారం. డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో పలుమార్లు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగ్‌కు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపైనే అందరి దృష్టి నెలకొంది. ఆమె కోలుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వైద్యులు వెల్లడించినట్లు వస్తున్న ఆందోళనకర సమాచారం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

■ భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమం, ...
07/08/2026

■ భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమం, డిజిటల్ విప్లవం, యువ జనాభా, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం..ఈ ఐదు శక్తులు దేశంలో కొత్త వ్యాపార సంస్కృతికి బలమైన పునాది వేశాయి. 2026 మార్చి నాటికి DPIIT గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2.23 లక్షలు దాటగా, వాటి ద్వారా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఈ గణాంకాలు అవకాశాల పరిమాణాన్ని చెబుతున్నాయి. కానీ అవి విజయానికి హామీ కావు.

స్టార్టప్‌ల ప్రపంచంలో అత్యంత ఖరీదైన తప్పు డబ్బు కోల్పోవడం కాదు... మార్కెట్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం. చాలామంది కొత్త పారిశ్రామికవేత్తలు తమ ఐడియాను ప్రేమిస్తారు. కానీ కస్టమర్ సమస్యను అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించరు. "నా ప్రొడక్ట్ గొప్పది" అనేది వారి నమ్మకం. "ఈ ప్రొడక్ట్ నాకు ఎందుకు అవసరం?" అనేది వినియోగదారుడి ప్రశ్న. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరమే అనేక వ్యాపారాల పతనానికి కారణమవుతోంది.

వ్యాపారంలో ఒక గొప్ప సత్యం ఉంది.

Customers don't buy products. They buy solutions.

కస్టమర్ ఉత్పత్తిని కొనడు. తన సమస్యకు పరిష్కారాన్ని కొనుగోలు చేస్తాడు. మీ ఉత్పత్తి అతని జీవితాన్ని సులభతరం చేస్తేనే మార్కెట్ మిమ్మల్ని అంగీకరిస్తుంది. లేదంటే ఎంత భారీ ప్రకటనలు చేసినా, ఎంత పెట్టుబడి సమీకరించినా ప్రయోజనం ఉండదు.

ప్రపంచ వ్యాపార చరిత్ర ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. గూగుల్ మొదటి సెర్చ్ ఇంజిన్ కాదు. ఫేస్‌బుక్ మొదటి సోషల్ నెట్‌వర్క్ కాదు. అమెజాన్ మొదటి ఈ-కామర్స్ సంస్థ కాదు. అయినప్పటికీ అవే ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. కారణం ఒకటే—అవి కొత్త మార్కెట్‌ను సృష్టించలేదు; ఇప్పటికే ఉన్న మార్కెట్‌ను ఇతరుల కంటే మెరుగ్గా అర్థం చేసుకున్నాయి.

Ex*****on eats ideas for breakfast. అనే ప్రసిద్ధ వ్యాపార సూక్తి యాదృచ్ఛికంగా పుట్టలేదు. గొప్ప ఆలోచనలు వేల మందికి వస్తాయి. కానీ వాటిని క్రమశిక్షణతో అమలు చేసే వారే చరిత్రలో నిలుస్తారు.

ఇటీవలి కాలంలో భారత స్టార్టప్ రంగంలో ఒక కీలకమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్టుబడిదారులు కంపెనీ వృద్ధి వేగాన్ని మాత్రమే చూసేవారు. ఇప్పుడు వారి మొదటి ప్రశ్న "మీ వ్యాపారం ఎప్పుడు లాభాల్లోకి వస్తుంది?". ఎందుకంటే గత కొన్నేళ్లలో భారీ విలువలు సంపాదించిన అనేక స్టార్టప్‌లు కూడా నగదు ప్రవాహ సమస్యలు, అధిక వ్యయాలు, స్పష్టమైన వ్యాపార నమూనా లేకపోవడం వల్ల తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. దీంతో పెట్టుబడుల ప్రపంచంలో కొత్త మంత్రం మొదలైంది.

Growth is vanity. Profit is sanity. Cash flow is reality.

వృద్ధి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. లాభదాయకత సంస్థను నిలబెడుతుంది. కానీ నగదు ప్రవాహమే వ్యాపారానికి అసలైన ప్రాణవాయువు.

ఈరోజు AI, ఫిన్‌టెక్, డీప్‌టెక్, హెల్త్‌టెక్, అగ్రిటెక్ వంటి రంగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయి. అయితే అవకాశాలు పెరిగినంత వేగంగా పోటీ కూడా పెరుగుతోంది. అందుకే వ్యాపారంలో విజయానికి ఉత్సాహం సరిపోదు. డేటాను చదివే సామర్థ్యం, వినియోగదారుడి ప్రవర్తనను అర్థం చేసుకునే దృష్టి, మార్కెట్ మార్పులను ముందుగానే గుర్తించే విజన్ అవసరం. నిర్ణయాలు భావోద్వేగాలతో కాదు, సమాచారం ఆధారంగా తీసుకోవాలి.

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు తరచూ ఒక ప్రశ్న అడుగుతారు.

"ఇప్పటికే ఈ రంగంలో వంద కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు రావాలి?"

నిజానికి ఈ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.

వంద కంపెనీలు ఉన్నాయంటే... వంద అవకాశాలు ఉన్నాయని కాదు; ఒక పెద్ద మార్కెట్ ఉందని అర్థం. మార్కెట్‌లో స్థానం ఖాళీగా ఉండదు. దాన్ని సృష్టించుకోవాలి. కస్టమర్‌కు ఇతరుల కంటే ఎక్కువ విలువను అందించగలిగితే, 101వ కంపెనీ కూడా రేపు నంబర్-1 బ్రాండ్‌గా ఎదగగలదు.

ప్రతి వ్యాపారవేత్త ప్రతిరోజూ తనను తాను మూడు ప్రశ్నలు అడగాలి.

నేను ఏ సమస్యను పరిష్కరిస్తున్నాను?
నన్ను కస్టమర్ ఎందుకు గుర్తుంచుకోవాలి?
నన్ను పోటీదారుల నుంచి వేరు చేసేది ఏమిటి?

ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉన్న వ్యాపారమే దీర్ఘకాలం నిలబడుతుంది.

చివరికి వ్యాపారంలో గెలిచేది ముందుగా వచ్చినవాడు కాదు. ఎక్కువ డబ్బు పెట్టినవాడు కాదు. ఎక్కువ ప్రచారం చేసుకున్నవాడు కాదు.

మార్కెట్‌ను వినగలిగినవాడు...
డేటాను అర్థం చేసుకున్నవాడు...
మార్పును స్వీకరించినవాడు...
వినియోగదారుడి విశ్వాసాన్ని సంపాదించినవాడే నిజమైన విజేత.

వ్యాపారానికి ఐడియా జన్మనిస్తుంది. అమలు ఎదుగుదలను ఇస్తుంది. కానీ నిలకడను నిర్ణయించేది ఒక్కటే..మార్కెట్‌పై లోతైన అవగాహన.

అందుకే గుర్తుంచుకోవాల్సిన చివరి మాట

"వ్యాపారంలో అత్యంత విలువైన పెట్టుబడి డబ్బు కాదు... సరైన నిర్ణయం. అత్యంత గొప్ప ఆస్తి సాంకేతికత కాదు... వినియోగదారుడి నమ్మకం. అత్యంత పెద్ద పోటీదారు మరో కంపెనీ కాదు... నిన్నటి నువ్వే."

■ శ్రీనివాస్ ముద్దం, ఓనర్: ఫిన్ నౌ,
www.timesbiz.in నుంచి.

● రేపటి నుంచి సమ్మె.. ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ-జొమాటో సేవలకు అంతరాయం?తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా, డెలివరీ రంగానికి చెం...
07/08/2026

● రేపటి నుంచి సమ్మె.. ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ-జొమాటో సేవలకు అంతరాయం?

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా, డెలివరీ రంగానికి చెందిన కార్మిక సంఘాలు రేపటి (ఆగస్టు 8) నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మొత్తం 16 వాహన, గిగ్ వర్కర్ల సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం, యాప్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ కంపెనీలు తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించినా పరిష్కరించలేదని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

ఈ సమ్మెలో ఆటోరిక్షాలు, యాప్ ఆధారిత క్యాబ్ సేవలు (ఓలా, ఉబర్, ర్యాపిడో), లారీలు, అలాగే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర ఫుడ్, క్విక్ కామర్స్ డెలివరీ సేవలకు చెందిన డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు పాల్గొననున్నట్లు జేఏసీ తెలిపింది. దీంతో ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రవాణా, ఆహార, కిరాణా డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే సేవలు పూర్తిగా నిలిచిపోతాయా లేదా అనేది సమ్మెలో పాల్గొనే కార్మికుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

సంఘాల ప్రధాన డిమాండ్లలో యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం కనీస బేస్ ఫేర్ ప్రకటించడం, ప్రతి కిలోమీటర్‌కు, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను నోటిఫై చేయడం ఉన్నాయి. దీంతో డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, ఇతర గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వారు పేర్కొన్నారు. అలాగే ప్లాట్‌ఫారమ్ కంపెనీలు వసూలు చేస్తున్న అధిక కమిషన్లపై కూడా నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు.

అదేవిధంగా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ రూల్స్ను వెంటనే నోటిఫై చేసి, గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరాయి.

మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను పూర్తిస్థాయిలో అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించే కనీస చార్జీలను తప్పనిసరిగా అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. యాప్ ఆధారిత సేవల్లో ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరికీ సమాన న్యాయం జరిగేలా నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది.

మరో కీలక డిమాండ్‌గా, మోటర్ వెహికల్స్ చట్టం–1988 మరియు మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు వినియోగించడాన్ని నిషేధించాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందువల్ల నిబంధనలు పాటించే కమర్షియల్ డ్రైవర్లకు నష్టం జరుగుతోందని వారు వాదిస్తున్నారు.

జూలై 22న నిర్వహించిన రాష్ట్రవ్యాప్త హెచ్చరిక సమ్మె అనంతరం ప్రభుత్వం, యాప్ కంపెనీల నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతోనే ఇప్పుడు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ, తమ జీవనోపాధి, న్యాయమైన ఆదాయం కోసం ఈ పోరాటం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

ఒకటి కాదు… రెండూ కావాలి: జెన్‌ జెడ్‌ మనసును అర్థం చేసుకునే కొత్త మార్కెటింగ్‌ దారిజెన్‌ జెడ్‌ గురించి మాట్లాడేటప్పుడు తర...
06/08/2026

ఒకటి కాదు… రెండూ కావాలి: జెన్‌ జెడ్‌ మనసును అర్థం చేసుకునే కొత్త మార్కెటింగ్‌ దారి

జెన్‌ జెడ్‌ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపించే మాట—వాళ్లు చాలా విరుద్ధంగా ఆలోచిస్తారని. డబ్బు ఆదా చేయాలనుకుంటారు, కానీ అనుభవాలపై ఖర్చు చేస్తారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు, కానీ సలహా కోసం వెతుకుతారు. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు, అదే సమయంలో తమలాంటి సమూహంలో భాగం కావాలనుకుంటారు. రోజంతా ఆన్‌లైన్‌లో ఉంటారు, కానీ నిజమైన మనుషులతో గడిపే సమయాన్ని కోరుకుంటారు.

వాస్తవానికి విరుద్ధంగా ఉన్నది జెన్‌ జెడ్‌ కాదు. వాళ్లు జీవిస్తున్న ఆధునిక ప్రపంచం.

ఒకవైపు వేగంగా ఎదగాలనే ఆశ, మరోవైపు ఆర్థిక ఒత్తిడి. ఒకవైపు కృత్రిమ మేధతో పని సులభమవుతోంది, మరోవైపు తమ ప్రతిభకు విలువ తగ్గుతుందేమోననే భయం. ప్రపంచంతో నిరంతరం అనుసంధానమై ఉన్నా, వ్యక్తిగతంగా ఒంటరితనం పెరుగుతోంది. అందుకే వాళ్ల నిర్ణయాలు ఒకే వైపు ఉండవు. ప్రతి నిర్ణయంలో రెండు అవసరాలు ఒకేసారి పనిచేస్తాయి.

భారతీయ జెన్‌ జెడ్‌కు ఈ పరిస్థితి మరింత ప్రత్యేకం. వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, కానీ కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టలేరు. పెద్ద కలలు ఉన్నాయి, కానీ ప్రతి రూపాయి విలువ తెలుసు. అంతర్జాతీయ సంస్కృతిని ఆస్వాదిస్తారు, కానీ తమ ప్రాంతీయ గుర్తింపును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు; తమకు సరిపోయే విధంగా తిరిగి నిర్వచించుకోవాలని కోరుకుంటున్నారు.

అందుకే జెన్‌ జెడ్‌ను చేరుకోవాలనుకునే బ్రాండ్‌ మొదట వాళ్ల జీవితాన్ని మరింత కష్టతరం చేయడం ఆపాలి. ఇంకో పని ఇవ్వడం, ఇంకో అలవాటు నేర్పడం, ఇంకో నియమం చెప్పడం కాకుండా—ఒక నిర్ణయాన్ని సులభం చేయాలి. ఉపయోగాన్ని మాత్రమే అమ్మితే నిరుత్సాహంగా ఉంటుంది. ఆనందాన్ని మాత్రమే అమ్మితే నమ్మకం రాదు. ఉపయోగం కూడా ఉండాలి, అనుభూతి కూడా ఉండాలి.

వాళ్లు బ్రాండ్‌ నుంచి సలహా కోరుకుంటారు; కానీ తుది నిర్ణయాన్ని బ్రాండ్‌ తీసుకోవడాన్ని ఇష్టపడరు. అందుకే “ఇదే ఉత్తమం” అని ప్రకటించడం కంటే, ఎంపికలు, ప్రయోజనాలు, పరిమితులు నిజాయితీగా చూపించాలి. జెన్‌ జెడ్‌కు ఆదేశాలు అవసరం లేదు. స్పష్టత అవసరం. వాళ్ల తరఫున నిర్ణయం తీసుకోవద్దు; మంచి నిర్ణయం తీసుకునే శక్తిని వాళ్లకు ఇవ్వాలి.

తెలుగు మార్కెటింగ్‌లో భాషను కేవలం అనువాద సాధనంగా చూడటం మరో పెద్ద పొరపాటు. తెలుగు అనేది సంబంధాన్ని నిర్మించే భాష. ఇంగ్లీష్‌ ఒక ఉత్పత్తికి ఆధునికత, వర్గం లేదా స్థాయి ఇవ్వవచ్చు. కానీ తెలుగు భావోద్వేగం, హాస్యం, సాన్నిహిత్యం, నమ్మకాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇంగ్లీష్‌లో రాసిన వాక్యాన్ని తెలుగులోకి మార్చడం సరిపోదు. నిజంగా మనుషులు ఎలా మాట్లాడతారో అలా వినిపించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మాట తీరు, హాస్యం, సందర్భం, సంస్కృతిలోని సూక్ష్మతలను గౌరవించాలి.

క్రియేటర్ల విషయంలో కూడా సంఖ్యల వెనక పరుగెత్తడం తగ్గించాలి. ఒక నెల కోసం వారి చేరువను అద్దెకు తీసుకోవడం కంటే, బ్రాండ్‌ ప్రపంచంలో స్థిరంగా ఉండే స్వరాలను నిర్మించాలి. వాళ్లు అనువాదకులు, విషయాన్ని సులభంగా చెప్పేవారు, సమూహాన్ని ఒకచోట చేర్చే ఆతిథ్యకర్తలు కావాలి. ఫాలోవర్ల సంఖ్య కంటే వాళ్ల మాటను ఎవరు నమ్ముతున్నారు, వాళ్ల చుట్టూ ఎలాంటి సంభాషణ జరుగుతోంది అనేదే ముఖ్యం.

డిజిటల్‌ ప్రచారం చివరి గమ్యం కాకూడదు. ఒక వీడియో ఆసక్తిని రేపాలి. ఆ ఆసక్తి వెతుకులాటకు దారి తీసాలి. వెతుకులాట సంభాషణగా మారాలి. ఆ సంభాషణ సాధ్యమైనప్పుడు నిజమైన కలయికగా మారాలి. ఫీడ్‌లో మొదలైన సంబంధం, జీవితంలో ఎక్కడో ఒకచోట అనుభవంగా కనిపించాలి.

జెన్‌ జెడ్‌ను ఒకే మూడ్‌, ఒకే భాష, ఒకే వేదిక లేదా ఒకే నిర్వచనంలో బంధించలేం. బ్రాండ్‌లు కూడా వాళ్లను ఒకే వైపు ఎంచుకోమని అడగకూడదు. పని చేయాలి—అలాగే ఊపిరి పీల్చాలి. సలహా తీసుకోవాలి—తుది నిర్ణయం తమదే కావాలి. ప్రత్యేకంగా కనిపించాలి—తమవాళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో జీవించాలి—ఆఫ్‌లైన్‌లో నిజంగా కలవాలి.

వాళ్ల సమాధానం చాలా స్పష్టం:

“ఒకటి కాదు. రెండూ కావాలి.”

Address

Hyderabad
500037

Alerts

Be the first to know and let us send you an email when TIMES BIZ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TIMES BIZ:

Shortcuts

Share

Category