TIMES BIZ

TIMES BIZ ● వార్తలు, విశ్లేషణలు, విజయగాథలను తెలుగులో అందించే న్యూస్ పోర్టల్

28/12/2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్‌ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి ఒకటి తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు.. ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కేటాయించనున్నారు.

మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్ లేని ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారికి తీపికబురు వినిపిస్తూ.. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మరోవైపు జనవరి1, 2020 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులలో.. అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పిస్తారు. లేదా అదనపు ఆర్థిక సాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం సరసమైన ధరల్లో ఫ...
28/12/2025

తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం సరసమైన ధరల్లో ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచింది. గచ్చిబౌలిలో రూ.26 లక్షల నుంచే ఫ్లాట్స్ అందుబాటులో ఉండటం విశేషం. ఐటీ హబ్‌కు సమీపంలోని ఈ ఫ్లాట్స్‌కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లో రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్స్, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఫ్లాట్స్‌ను లాటరీ విధానంలో కేటాయిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 3, 2026గా పేర్కొన్నారు.

  తెలంగాణ ప్రభుత్వం 'విజన్-2047' లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి భారీ ప్రణాళిక సిద్ధం...
27/12/2025

తెలంగాణ ప్రభుత్వం 'విజన్-2047' లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, గ్రీన్ ఫీల్డ్ రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. గ్రామీణ రోడ్లను ప్రస్తుతం ఉన్న 46 వేల కిలోమీటర్ల రహదారులను 1,15,000 కిలోమీటర్లకు పెంచననున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రోడ్లను ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ వేలుగా విస్తరించనున్నారు. సుమారు 29,057 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

27/12/2025

విజయవాడలోని చిట్టినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. చపాతీ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసింది. చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయారు. ఈ ఘటన కేఎల్ రావు నగర్‌లోని ఆరో లైన్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికంగా ఉండే తోట ప్రసాద్ అనే వ్యక్తికి 80 ఏళ్ల వయసు. తోట ప్రసాద్ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో చపాతీ తింటున్నారు. అయితే అకస్మాత్తుగా చపాతీ ముక్క ప్రసాద్ గొంతులో చిక్కుకుపోయింది. గొంతుకు అడ్డంగా పడటంతో ప్రసాద్ ఊపిరాడక విలవిల్లాడిపోయారు. బాధతో విలవిల్లాడుతూ కిందపడ్డారు. కుటుంబసభ్యులు వెంటనే గుర్తించి నీళ్లు తాగించారు. అయినప్పటికీ చపాతీ ముక్క గొంతులో నుంచి అడ్డు తొలగలేదు. దీంతో 108కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోగానే ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఊహించని రీతిలో కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవటంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

హైదరాబాద్ నగరాన్ని మధ్య భారతదేశంతో కలిపే హైదరాబాద్-ఇండోర్ ఆర్థిక కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్ర...
26/12/2025

హైదరాబాద్ నగరాన్ని మధ్య భారతదేశంతో కలిపే హైదరాబాద్-ఇండోర్ ఆర్థిక కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల ప్రస్తుతం పట్టే 18 గంటల ప్రయాణ సమయం కేవలం 11 గంటలకు తగ్గుతుంది. తెలంగాణలో 100 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి.. సంగారెడ్డి నుండి బోధన్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. పారిశ్రామిక నగరమైన ఇండోర్‌ను ఐటీ హబ్ హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించడం ద్వారా వాణిజ్య రంగానికి పెద్ద పీట వేయనున్నారు. నర్మదా నదిపై వంతెనలు, సొరంగాల నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలోనే ఈ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

26/12/2025

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా 9 రోజులు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 10వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవులు మొదలై, జనవరి 18వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతాయి. తిరిగి జనవరి 19వ తేదీ సోమవారం బడులు తెరుచుకుంటాయి. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధంగా 9 రోజులు సెలవులు ఇచ్చారు. ఇవే కాకుండా జనవరి 1వ తేదీ కొత్త ఏడాది సందర్భంగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కూడా సెలవులు ఉంటాయి.

  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టరెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమ...
26/12/2025

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టరెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వాటి లైసెన్సులను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. మైత్రీవనం, నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌, కేబీఆర్‌ పార్క్‌ సహా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారికేడింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం ఆయన హెచ్‌-న్యూ, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, వెస్ట్‌జోన్‌, సీసీఎస్‌ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

  తెలంగాణలో చలితో వణికిపోతున్న ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శా...
26/12/2025

తెలంగాణలో చలితో వణికిపోతున్న ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్ళీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

26/12/2025

విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల 75 గ్రామాలను విలీనం చేసి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. పరిపాలనా విభజనతో వస్తున్న సమస్యల పరిష్కారానికి గ్రేటర్ హోదా దోహదపడుతుందని నివేదిక సమర్పించారు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే రామ్మోహన్ చెబుతున్నారు.

26/12/2025

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కు పెంచుతూ అధికారిక ప్రకటన జారీ చేసింది. వార్డుల సంఖ్య 300కు ఖరారు చేయబడింది. కొత్త జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పాలన సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా గుర్తింపు రూపాంతరం చెందింది.

Address

Hyderabad
500037

Alerts

Be the first to know and let us send you an email when TIMES BIZ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TIMES BIZ:

Share

Category