Mega Minds

Mega Minds Mega Mind is a platform
To educate and create awareness for the greatest history and current affairs of the country. To involve the youth in social activities

To share so many intellectual's views and ideas for creating a strong nation.

15/10/2025

పాకీ గాడ్ని ఐదే ఐదు సెకన్లలో నాకౌట్ చేసిన భారత సింహం...

సెక్యూరిటీ గార్డ్ నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు - అబ్దుల్ అలిమ్ విజయగాథ.*********************************************తమ...
15/10/2025

సెక్యూరిటీ గార్డ్ నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు - అబ్దుల్ అలిమ్ విజయగాథ.
*********************************************
తమిళనాడులోని ఒక చిన్న గ్రామం, పేదరికం, పోరాటం, ఆశల మధ్య జన్మించిన ఒక యువకుడు పేరు అబ్దుల్ అలిమ్. ఆర్ధిక సమస్యలతో మధ్యలోనే ఆగిపోయిన చదువు. కానీ అలిమ్ మాత్రం ఎప్పటికి అలా ఉండి పోవాలి అనుకోలేదు ఏదో ఒకటి సాధించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలి అనుకునే మనస్తత్వం “ఒకరోజు నేను కూడా ఎదుగుతా, నా జీవితాన్ని నేనే మార్చుకుంటా అనే నమ్మకం అతనిలో తొణికసలాడేది. ఆ పట్టుదలతోనే జీవించేవాడు.

పూట గడవాలంటే ఏదో ఒక పని చేస్తే కానీ గడవని పరిస్థితి, జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ రోజు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుని చూసే వాడు. గేటు బయట సెక్యురిటీ కాపలా కాస్తూ లోపల ఇంజినీర్లు టెక్నాలజీతో ప్రపంచంను మార్చే సన్నివేశాలను చూస్తూ ఉండేవాడు. అక్కడే ఓ ఆలోచన మొదలైంది “నేను ఎందుకు ఇంజినీర్ కాకూడదు?”

చేతిలో డబ్బు లేదు, గురువు లేడు, ఎవరి సహాయం లేదు. కానీ “దృఢ సంకల్పం” మాత్రం మెండుగా ఉంది. ప్రతి రాత్రి డ్యూటీ అయిపోయాక అలసిపోయిన నయనాలతో, పాత ల్యాప్‌టాప్ ముందు కూర్చుని, యూట్యూబ్ వీడియోలతో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. ప్రతి లైన్ కోడ్ వెనుక తెలివి, ప్రతి బగ్ వెనుక కన్నీరు, కానీ ఆ మనసు మాత్రం వెనక్కి తగ్గలేదు. నెలలు గడుస్తున్నాయి, కానీ అతని కృషిని జోహోలోని ఇంజినీర్లు గుర్తించకుండ ఉండలేకపోయారు.
అతను ఏ గేటు దగ్గర కాపలా కాసాడో అదే గేట్ తనకు మార్గం సుగమం చేసింది. జోహో నుండి కాల్ రానే వచ్చింది, తనకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టు ఆఫర్ చేసింది.

గేటు బయట నిలబడి కాపలా కాస్తున్న మనిషి ఇప్పుడు ఆఫీసు లోపల కోడ్ రాస్తున్నాడు. గార్డ్ యూనిఫార్మ్ వేసుకున్న చేతులు ఇప్పుడు టెక్‌ వర్డ్‌ తయారు చేస్తున్నాయి. ఒకప్పుడు తలుపులు తెరిచిన వ్యక్తి, ఇప్పుడు తన భవిష్యత్తు తలుపు తానే తెరుచుకున్నాడు.

"సెక్యూరిటీ గార్డ్ నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వరకు" ఇది కేవలం రాజ్ కథ కాదు, ఎవరైనా ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించగలరనే స్ఫూర్తి కథ అని రాజ్ నిరూపించాడు. పరిస్థితులు కాదు, మన దృఢ సంకల్పమే మన భవిష్యత్తును మార్చగలదు.

ఇది అబ్దుల్ అలిమ్ విజయగాథ. కాబట్టి ఒకటే అలిమ్ ని ఆదర్శంగా తీసుకుని జీవితం లో ఎదగడానికి ఇదొల ప్రేరణాదాయకమైన కథ....

జయ్ హింద్ - జయ్ భారత్

Karunakar Buduru , Mega Minds
085005 81928

భారతదేశం, మంగోలియా 70 సంవత్సరాల సంబంధాలకు గుర్తుగా ఒక ప్రత్యేక స్టాంపును విడుదల చేశాయి. భారతదేశపు రామ్‌లీలా & మంగోలియా జ...
14/10/2025

భారతదేశం, మంగోలియా 70 సంవత్సరాల సంబంధాలకు గుర్తుగా ఒక ప్రత్యేక స్టాంపును విడుదల చేశాయి. భారతదేశపు రామ్‌లీలా & మంగోలియా జానపద నృత్యం బియెల్గీ సంస్కృతిని వర్ణిస్తూ.

వీళ్ల గురించి ఎవరు మాట్లాడతారు? మౌనాన్ని వీడండి!!*******************************************ఎందుకు ప్రపంచం అంతా మౌనంగా ఉ...
14/10/2025

వీళ్ల గురించి ఎవరు మాట్లాడతారు? మౌనాన్ని వీడండి!!
*******************************************
ఎందుకు ప్రపంచం అంతా మౌనంగా ఉండిపోయింది. ఈ నిశ్చబ్దాన్ని నేను చేదిస్తానని భావిస్తూ నా మౌనాన్ని వీడుతున్నాను, నా గళాన్ని విప్పుతున్నాను, నా కలాన్ని కన్నీటితో తడిపి ఈ వాఖ్యాలు వ్రాస్తున్నాను.

మనం ఎప్పుడూ వినని ఒక తెగ యజిడి. ISIS వాళ్లు పూర్తిగా యజిడీలను నాశనం చేయాలని చూశారు. కానీ వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉత్తర ఇరాక్‌లోని అత్యంత పురాతన జాతి. మతం పరంగా మైనారిటీ అయిన యజీడీలు, శతాబ్దాలుగా హింసను ఎదుర్కొంటూ సొంత నేలపై బానిసలుగా ఉండిపోయారు. 2014లో ISIS వారిని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించింది.

యజీడీ మతం అనేది జొరాస్ట్రియన్ మతం, ఇస్లాం, క్రైస్తవం మతాల మేళవింపు. శతాబ్దాలుగా వారిని‌ క్రైస్తవం, ఇస్లాం సైతానులుగా దూషించాయి. ఈ సైతాన్ లుగా భావించడం వలన ఇస్లాం మతం వారిపై ద్వేషాన్ని పెంచింది. వారిపై జరిగిన మారణహోమాలకు పునాదిగా మారింది. ఈ చరిత్రాత్మక తప్పిదమే ISIS చేసిన మారణ హోమానికి దారితీసింది. 2014 ఆగస్టు, ISIS యజిడీల ప్రధాన కేంద్రం సింజార్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది పురుషులను చంపేశారు. మహిళలు, బాలికలు బానిసలుగా అమ్మబడ్డారు, మరియు పక్కా అత్యాచారాలకు గురయ్యారు. ఐక్యరాజ్యసమితి పరిశోధకులు దీన్ని అధికారికంగా “మారణహోమంగా”గా గుర్తించారు.

ISIS యజిడీ మహిళలు మరియు పిల్లలను కొనుగోలు, అమ్మకం చేసే బానిస మార్కెట్లు నిర్వహించింది. 9 ఏళ్ల పసిపిల్లల్నీ “భార్యలుగా” అమ్మేశారు. కుటుంబాలు విడిపోయాయి, అనేకమంది మహిళలు సిరియా, ఇరాక్ అంతటా పదుల సార్లు మార్చి మార్చి తిరిగి బానిసలుగా అమ్మబడ్డారు. వేలాది మంది సింజార్ కొండపైకి పారిపోయారు, ఆహారం, నీరు లేకుండా అలమటించారు. అలా ఆకలితో, దాహంతో విలవిలలాడుతున్న యజిడీ కుటుంబాల చిత్రాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. అమెరికా వైమానిక దాడులు, కుర్ద్ సైనికుల సహాయంతో ఆ ముట్టడి చివరకు ముగిసింది కానీ అప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి.

ఈ తీవ్రమైన గాయాల తర్వాత కూడా యజిడీలు ధైర్యాన్ని కోల్పోలేదు. తమ భాష, సంగీతం, పవిత్ర సంప్రదాయాలను కాపాడుకునేందుకు వారు పోరాడుతునేవున్నారు. వారి పుట్టిన మాతృభూమి నాశనాన్ని తలచుకుంటూనే యూరప్‌లో శరణార్థులుగా జీవిస్తూ, కొత్త జీవితం మొదలుపెట్టారు.

ISIS యజీదీలను నాశనం చేయాలని ప్రయత్నించింది. కానీ దాని బదులుగా, వారి కథ ధైర్యం మరియు స్థైర్యానికి ప్రతీకగా మారింది. వారిని చరిత్ర నుండి చెరిపేయాలని ప్రయత్నించినా, అన్ని ప్రతికూలతల మధ్య కూడా యజిడీలు తమ సంస్కృతిని ససజీవంగా ఉంచారు.

అయితే యజిడీల దీనగాథ ISISతో ముగియలేదు. 2023 సంవత్సరంలో 2014లో ISIS కిడ్నాప్ చేసిన ఒక యజిడీ మహిళ గాజాలో హమాస్ చేతుల్లో బంధిగా మారింది. ISIS మరియు హమాస్ మధ్య ఉన్న సంబంధం అదే సిద్ధాంతం, అదే తీవ్రవాద దృష్టికోణం. యజీదీ మహిళలను బానిసలుగా మార్చిన ఆ ఆలోచనే, ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతోంది. 2014 లో ISIS బందీలుగా చేసి బానిసలుగా వేలం చేసి మరీ అమ్ముకుంది అక్షరాలా 7000 మందిని అందులో 2599 మంది ఈ రోజు కీ ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలీదు.

ఇకపోతే యూదులు: ఇస్లాం, క్రైస్తవ మతాలకు పుట్టుకకు కారణమే యూదు జాతి అటువంటి వారినే పాలస్తీనా నేలపై లేకుండా ప్రపంచ వ్యాప్తంగా తరిమివేయబడ్డారు ఇస్లాం మత చాందసంతో అలా పారిపోయిన వారికి ఆశ్రమం ఇచ్చింది భారత దేశం. మరలా 1918 లో పాలస్తీనాని ఒట్టమన్ సామ్రాజ్యం నుండి విముక్తి గావించి మొదటి ప్రపంచ యుద్ధం లో వారికి ఇచ్చింది భారత కలవరీ దళాలు. ఆ తరువాత 1948 లో అమెరికా చొరవతో పూర్తిగా వారికి స్వాతంత్ర్యం లభించి ప్రపంచంలో ఉన్న యూదుల‌ందరూ అక్కడకు చేరి మరలా వారి వైభవాన్ని పున: ప్రారంభం చేశారు. మొత్తం ముస్లిం దేశాల మధ్య తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక పెద్ద సైనిక వ్యవస్థను ఏర్పరుచుకుని తమ జీవితాలను ఈ 76 ఏళ్లల్లో అద్బుతంగా తీర్చి దిద్దుకుంటే, బ్రిటీషర్స్ చేసిన ఒక చిన్న తప్పు పాలస్తీనా లో ఉన్న ఇతర మతస్తులను వెళ్లగొట్టవద్దు అన్న దానిని గౌరవించి, గాజా ప్రాంతాన్ని ముస్లింలకు వదిలేసి హాయిగా బ్రతుకుతుంటే గాజాలో ISIS తరహా సంస్థ హమాస్ 2023 అక్టోబర్ 7న హాయిగా ఎంజాయ్ చేస్తున్న యూదులపై ఇజ్రాయెల్ లో అతిభయంకరమైన దాడులు చేసి 1200 మందిని చంపి 251 మందిని సుమారుగా బందీలుగా చేసి తీసుకెళ్లారు. రెండేళ్లు పూర్తయ్యింది. హమాస్ ని భయంకరమైన దాడులతో భూస్థాపితం చేసే ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. ఎట్టకేలకు ట్రంప్ 20 బిందువులతో ఒక ప్రణాళిక తయారు చేసి హమాస్ బందీలను విడుదల చేస్తే శాంతికై ఇజ్రాయెల్ యుద్ధ విరమణ కు ఒప్పుకుంది. కానీ ఏమయ్యింది, 20 మందిని మాత్రమే వదిలింది హమాస్ మరి మిగతా 231 మంది ఏమయినట్లు. అనేది అతిపెద్ద ప్రశ్న.

అలగే హిందువులపై ఇస్లాం జరిపిన నరమేధం ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నాను, కాశ్మీరీ పండిట్‌ల నరమేధం 1990లో 4 లక్షలకు పైగా హిందువులు తమ ఇళ్లు విడిచి పారిపోవలసి వచ్చింది. వందలాది మందిని క్రూరంగా చంపేశారు.

ఇప్పుడు చెప్పండి ఇస్లాం తన పుట్టుకకు కారణమైన యూదులను, యజిడీ జాతులనే కాదు యావత్ ప్రపంచానికి జ్ఞానానిచ్చిన హిందూ జాతినే తుడిచిపెట్ట చూస్తుంటే మరి ఎందుకు? ఎందుకు? ఈ దేశ మేదావులుగా చలామణి అవుతు‌న్న అర్బన్ నక్సల్స్, సెక్యులర్లు, కమ్యునిష్ట్ లు, మానవ హక్కుల సంఘాల వాళ్లు మౌనాన్ని వహిస్తున్నారు.

ఎందుకు హిందువుల, యజిడీల, యూదుల బాధ వీరికి కనిపించదు? ఎందుకు వీళ్ల కన్నీళ్లు కనిపించవు? ప్రతిసారీ ఈ సమాజాలపై దారుణమైన దాడులు జరిగితే అదే మానవ హక్కుల సంఘాలు మౌనం పాటిస్తారు. లేదా వ్యతిరేక కథనాలు అల్లుతారు ఇజ్రాయెల్ ని తప్పుగా చూపిస్తారు, హిందువులపై నిందలేస్తూ కాషాయ తీవ్రవాదం అంటూ మండిపడతారు. ఒకవేళ బాధితుడు వేరే మతానికి చెందినవాడైతే వెంటనే ప్రెస్‌ కాన్ఫరెన్సులు, కొవ్వొత్తి ర్యాలీలు, ట్విట్టర్‌ తుఫాన్లు. ఇంత డబుల్‌ స్టాండర్డ్ ఎందుకు? ఎందుకు హిందూ, యూదు, యజిడీల రక్తం అంత నీచంగా కనిపిస్తోంది వీరి కళ్ళకు?

ఎందుకంటే వీళ్లు వారి ఇష్టమైన కథనాల్లో సరిపోరు. “హిందువులు మెజారిటీ కాబట్టి వారు బాధితులు కాలేరు” — ఇదే వారి లాజిక్. కానీ నిజం సంఖ్యలపై ఆధారపడదు. బాధ అంటే బాధే. నష్టం అంటే నష్టమే. అది మెజారిటీకి జరిగినా, మైనారిటీకి జరిగినా తేడా లేదు. ఈ మౌనం నిరపరాధం కాదు, ఇది వారి లెక్కలతో కూడిన మౌనం.

కానీ వారు ఎంచుకున్నప్పుడు మాత్రమే వేగంగా స్పందిస్తారు! నేరస్థుడి పేరు హిందూ అయితే వెంటనే “హిందుత్వ హింస” అంటారు. అలానే‌ యూదులని, యజిడీలను. అల్లర్లలో హిందువులు, యూదులు పాల్గొన్నా, అది రక్షణకై అయినా “హిందూ తీవ్రవాదం” అని అరుస్తారు, గగ్గోలు పెడతారు. కానీ హిందువులు, యూదులు చనిపోతే “మేము ఇంకా వివరాలు సేకరిస్తున్నాం” లేదా మతరంగు పులమకండి ఉగ్రవాదానికి మతం లేదు అంటారు. మానవత్వం ముసుగు ధరించి, వాస్తవికత దాచేస్తారు.

మానవ హక్కులు, కమ్యునిష్ట్ సంస్థలు అంటాయి వారు సమానత్వం, గౌరవం, మానవ జీవితం కోసం నిలుస్తామని. కానీ వారి ప్రవర్తన ఇలా చెప్పకనే చెబుతుంది:
ముస్లిం బాధితుడు - ఆగ్రహం పెల్లుబుకుతుంది.
క్రైస్తవ బాధితుడు - ఐక్యత కొట్టొస్తుంది.
కమ్యునిష్ట్ బాధితుడు - చర్య వెంటనే మొదలవుతుంది.
హిందూ, యూదు, యజిడీ బాధితుడు అయితే మాత్రం - మౌనం గా ఉండి వారికి అనుకూలంగా మార్పు చేసి మళ్లీ వీళ్లపై‌నే తప్పుడు ప్రచారం చేస్తారు. వారికి హిందువులు, యూదులు, యజిడీలు “మనుషులుగా” కాదు, “అణచివేసేవారుగా” మాత్రమే కనిపిస్తారు.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా మౌనం:
హిందువులపై, యూదులపై, యజిడీలపై హింస జరిగినప్పుడు అంతర్జాతీయ మీడియా కవరేజ్‌ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఉండవు. UN సంస్థల నుండి లేఖలు ఉండవు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, లేదా యూకేలోని లీసెస్టర్‌లో ఆలయాలపై దాడులు జరిగినప్పటికీ ప్రపంచం నిశ్శబ్దంగా చూస్తూ మాకేంతెలీదు, మేమేం చూడలేదు అసలు మా దృష్టికే రాలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.

దీని అర్థం ఏమిటి ఈ మౌనం కేవలం బాధాకరం కాదు ప్రమాదకరం. ఎందుకంటే ఒక సమాజపు బాధను విస్మరించేప్పుడు, అన్యాయం మళ్లీ మళ్లీ జరుగుతుంది,
తీవ్రవాదులు ధైర్యం పొందుతారు, బాధితులు న్యాయంపై నమ్మకం కోల్పోతారు. హిందువులకు, యజిడీలకు, యూదులకు కూడా సమాన మానవ హక్కులు లేకపోతే ఎలా? మనం అడగాల్సిందే ఇవి నిజంగా మానవ హక్కుల సంస్థలా? లేక రాజకీయ హక్కుల సంస్థలా?

ఈ విషయాలను మీకు చెప్పడానికి నా కలాన్ని కన్నీటితో తడిపాను. 251 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసి 20 మందినే పంపిస్తే 231 మంది ఏమయినట్లు, కనీసం వాళ్ల శవాలను కూడా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళ కామానికి బలై మరణించినట్లే, అలాగే యజిడీలను, కాశ్మీరీ హిందువులను కూడా వీళ్లు ఇలానే చేశారు. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ముఖ్య కారణం 9 ఏళ్ల‌క్రితం బందీ కాబడ్డ యజిడీ చెల్లెలి కోసం నిరీక్షించిన అన్న‌ ఆమెని చూసి కన్నీరు, మున్నీరైన సన్నివేశం చూసి, అలాగే హమాస్ లకు బందీలు కాబడ్డ మహిళా తల్లుతండ్రుల‌ మౌన రోదన చూసి భరించలేక‌ నా మౌనాన్ని వీడుతూ మీ ముందుంచాను.

మరి ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే మాట్లాడమే, మౌనాన్ని వీడటమే, ప్రతీ ఘటించడమే చరిత్రే సాక్ష్యంగా చేసుకుని ముల్లుని ముల్లుతోనే తీయాలి. స్వాతంత్ర్య వీరుల త్యాగాలు వృదాగా పోరాదు. హిందువుల బాధను పట్టించుకోని మానవ హక్కులు మానవహితమైనవే కావు. అన్యాయాన్ని చూసి మౌనం పాటించడం తటస్థత కాదు అది ద్రోహం.

రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
085005 81928

బిగ్ బ్రేకింగ్ : భారత్ 6 స్థానం లో***********************************""********""భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ యొక్క...
13/10/2025

బిగ్ బ్రేకింగ్ : భారత్ 6 స్థానం లో
***********************************""********""
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. 2025 WDMMA ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం, భారతదేశం చైనాను అధిగమించి 3వ స్థానానికి ఎగబాకింది, ఇప్పుడు యూఎస్ఎ మరియు రష్యా తర్వాత మొత్తం వైమానిక శక్తిలో మూడవ స్థానంలో భారత్ నిలిచింది.

WDMMA (World Directory of Modern Military Aircraft) ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ అనేది WDMMA సంస్థ చేత తయారుచేయబడే ప్రపంచ వైమానిక బలాల యొక్క సమగ్ర సమాచారం. ఇది ఒక దేశం యొక్క వైమానిక బలం యొక్క శక్తి, సామర్థ్యం మరియు సిద్ధత(రెడీనెస్) అనే అంశాల ఆధారంగా లెక్కలు చేస్తుంది:
1. విమానాల ఇన్వెంటరీ: ఫైటర్లు, బాంబర్లు, ట్రాన్స్‌పోర్ట్ ప్లేన్లు, హెలికాప్టర్లు మరియు డ్రోన్లు వంటి విమానాల సంఖ్య మరియు రకాలు అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
2. సాంకేతిక సామర్థ్యం: ఆవియానిక్స్, రాడార్, స్టెల్త్ ఫీచర్లు మరియు ఆయుధ వ్యవస్థలతో సహా విమానాల ఆధునికీకరణ.
3. కార్యాచరణ సిద్ధత: శిక్షణ, నిర్వహణ మరియు లాజిస్టిక్స్‌ను పరిగణనలోకి తీసుకుని వైమానిక కార్యకలాపాలను డెప్లాయ్ చేయడం మరియు నిర్వహించే సామర్థ్యం.
4. ఫోర్స్ మల్టిప్లయర్లు: ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, రిఫ్యూలింగ్ ట్యాంకర్లు మరియు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాల వంటి అధునాతన పరికరాలు కలిగి ఉండటం.
5. వ్యూహాత్మక ప్రభావం: ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతా వ్యవస్థ‌లో ఒక దేశం యొక్క వైమానిక బలం యొక్క మొత్తం ప్రభావం ఎలా ఉంది అనేది పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ ర్యాంకింగ్స్ వైమానిక బల సామర్థ్యాలు, కార్యాచరణ విజయాలలో మార్పులను ప్రతిబింబించేలా క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయబడతాయి. ఈ సందర్భంలో, 2025 WDMMA ర్యాంకింగ్స్‌లో భారతదేశం చైనాను అధిగమించి 3వ స్థానానికి ఎగబాకడం, “ఆపరేషన్ సిందూర్” వంటి విజయవంతమైన కార్యకలాపాలు మరియు ఆధునికీకరణ ప్రయత్నాల ద్వారా దాని వైమానిక సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని తెలియజేస్తోంది.

క్రింది సమాచారం చాలా ముఖ్యం, కాస్త ఓపిగ్గా చదవగలరు:
అసలు, ర్యాంకింగ్స్ ఎలా నిర్ణయిస్తారు?

TvR (True Value Rating) అనే స్కోర్ ఆధారంగా ర్యాంక్ చేస్తారు. ఇది కేవలం విమానాల సంఖ్య మాత్రమే కాదు:

• విమానాల సంఖ్య మరియు రకాలు (ఫైటర్ జెట్లు, బాంబర్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు మొ.).

• టెక్నాలజీ (ఆధునిక రాడార్, స్టెల్త్, ఆయుధాలు).

• ఆపరేషనల్ సిద్ధత (శిక్షణ, మెయింటెనెన్స్, లాజిస్టిక్స్).

• ఫోర్స్ మల్టిప్లయర్లు (రిఫ్యూలింగ్ ట్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్).

• వారి అధికారిక వెబ్‌సైట్: wdmmw.org. ఇక్కడ 2025 ర్యాంకింగ్స్ అప్‌డేట్ చేశారు.

అయితే, ఈ లెక్కలు వేసేటప్పుడు కొన్ని అంశాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వాటిని అర్థం చేసుకుందాం.

భారత్ కు నిజంగా మూడవ రాంకు వచ్చిందా? వచ్చింది, కానీ ఎలా? ఇది చదవండి:

WDMMA ర్యాంకింగ్స్ వ్యక్తిగత సర్వీసెస్ (branches) ను ర్యాంక్ చేస్తుంది, దేశాలను కాదు. అంటే, ఒక దేశంలో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వంటి వేర్వేరు బ్రాంచ్‌లు ఉంటే, వాటిని విడిగా ర్యాంక్ చేస్తారు.

టాప్ ర్యాంకులు (2025 ప్రకారం):

1. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) - TvR స్కోర్: 242.9
2. యునైటెడ్ స్టేట్స్ నేవీ (US Navy) - TvR: 142.4
3. రష్యన్ ఎయిర్ ఫోర్స్ (Russian Air Force) - TvR: 114.2 (కొన్ని మూలాల్లో ఇది 3వ స్థానం)
4. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ (US Army Aviation)
5. యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ (US Marine Corps)
6. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) - TvR: 69.4
7. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (PLAAF) - TvR: 63.8

ఇక్కడ గమనించండి: అమెరికా (US)కు బలమైన వైమానిక బలాలు నాలుగు బ్రాంచ్‌లలో (ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, మెరైన్స్) ఉన్నాయి. అందుకే వాటిని విడిగా ర్యాంక్ చేస్తే, టాప్ 5లో 4 US బ్రాంచ్‌లు వస్తాయి. దీంతో భారతదేశం 6వ స్థానంలో ఉంది, చైనా 7వ స్థానంలో.

సోషల్ మీడియా మరియు మీడియాలో భారతదేశం 3వ స్థానం అని ఎందుకు చెప్తున్నారు?

ఇక్కడే అసలు కన్‌ఫ్యూజన్! కొందరు WDMMA ర్యాంకింగ్స్‌ను దేశాల వారీగా కంబైన్ చేసి (అంటే, US యొక్క అన్ని బ్రాంచ్‌లను ఒకటిగా చూసి) లెక్కిస్తున్నారు.

కంబైన్డ్ ర్యాంకింగ్ ఎలా ఉంటుంది?

యునైటెడ్ స్టేట్స్ (అన్ని బ్రాంచ్‌లు కలిపి) - అత్యధిక స్కోర్.

రష్యా ( అన్ని బ్రాంచ్ లు కలిపి రెండవ ర్యాంకు)

భారతదేశం (IAF మాత్రమే లెక్కవేసారు, కానీ US వలె మల్టిపుల్ బ్రాంచ్‌లు లెక్కలు వేయలేదు కాబట్టి భారత్ 3వ ర్యాంక్ అని చెప్పొచ్చు).

చైనా ( నాల్గవ రాంకు)

“Rank 1 - US, Rank 2 - Russia, Rank 3 - India, Rank 4 - China” అని చెప్తున్నారు.

సారాంశం:
• అధికారికంగా (విడి సర్వీసెస్ ర్యాంకింగ్): భారతదేశం 6వది, చైనా 7వది.

• కంబైన్డ్ (దేశాల వారీ): భారతదేశం 3వది, చైనా 4వది

సింపుల్ గా చెప్పాలి ర్యాంకింగ్స్ అనేవి మల్టిపుల్ బ్రాంచ్‌లలో చేస్తారు కానీ, ఒక దేశంగా చేయరు. మనం చూసే విధానాన్ని బట్టి ర్యాంకింగ్ మారుతుంది.

ఎలా చూసినా: అమేయ భారత్, అతుల్య భారత్, అచింత్య భారత్.

డిఫెన్స్ లో ఆర్డర్స్ పెరిగి భారత్ ఎకనామికల్ గా మాత్రమే కాదు భద్రతా పరంగా లీడర్ అవుతుంది.

Patanjali Vadlamudi , Mega Minds
085005 81928

జై హింద్

13/10/2025

లాహోర్ రక్త సిక్తం...

తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ చెందిన 1000 మందికి నిరసనకారులు కాల్చి వేసిన పాక్ సైన్యం. 2000 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అసిమ్ మునిర్ ని‌ చావే లక్ష్యంగా పనిచేస్తున్న పాక్ ప్రజలు...

సోషల్ మీడియా కంటే ముందు భారత్‌కు తన సొంత బ్రౌజర్ ఎందుకు అవసరం.*********************************************డిజిటల్ స్వావ...
13/10/2025

సోషల్ మీడియా కంటే ముందు భారత్‌కు తన సొంత బ్రౌజర్ ఎందుకు అవసరం.
*********************************************
డిజిటల్ స్వావలంబన గురించి మాట్లాడితే, చాలా మంది ముందు సోషల్ మీడియా యాప్‌ల గురించి ఆలోచిస్తారు. “మనకూ మన సొంత ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎందుకు లేవు?” అని అడుగుతారు.

కానీ నిజం ఏంటంటే సోషల్ మీడియాలో గెలవడానికి ముందు, భారత్ ముందుగా గెలవాల్సినది ఒక బేసిక్‌ స్థాయి పోరాటం అదే వెబ్ బ్రౌజర్.

బ్రౌజర్‌ అంటే కేవలం యాప్ కాదు, అది ఇంటర్నెట్‌కు గేట్వే

ప్రతి సెర్చ్, ప్రతి వెబ్‌సైట్, ప్రతి లాగిన్ ఇవన్నీ మొదలయ్యేది బ్రౌజర్‌ నుంచే. ఒక్కసారి చూడండి ప్రపంచంలో పరిస్థితి:

Google Chrome → Google Search → Google AI → Play Store → Android OS

Apple Safari → Apple Services → Siri & AI → App Store → iOS

Microsoft Edge → Bing → Copilot AI → Windows Store → Windows OS

మోడల్‌ గమనించారా? ఎవరు బ్రౌజర్‌ని కంట్రోల్ చేస్తారో, వారు మొత్తం డిజిటల్ ఎకోసిస్టమ్‌ను కంట్రోల్ చేస్తారు సెర్చ్ నుంచి యాప్‌ల వరకు, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి సోషల్ మీడియా వరకు.

ఇదో పెద్ద డ్రీమ్ ప్రోజెక్ట్: Browser → Search Engine → AI → App Store → OS → Social Media
దేశీయ బ్రౌజర్‌ మొదటి అడుగు మాత్రమే. దాని మీద ఆధారపడి మనం ఇలా ఎదగవచ్చు...

Search Engine : భారతీయ భాషల్లో సెర్చ్‌, పాక్షికత లేకుండా, మన సంస్కృతిలో వేళ్ళూనుకున్న ఫలితాలు.

Artificial Intelligence (AI) : భారతీయ డేటాపై శిక్షణ పొందిన, భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే AI.

App Marketplace : గూగుల్ లేదా ఆపిల్ ఆధీనంలో కాకుండా, స్టార్టప్‌లకు అనుకూలమైన స్వదేశీ యాప్ స్టోర్‌.

Operating System (OS) : మొబైల్స్‌, పీసీలు, IoT పరికరాల కోసం "భారత్ OS".

Social Media : పునాదులు బలంగా ఉన్న తర్వాత, సోషల్ మీడియా యాప్‌లు దానిపై వికసించవచ్చు. ఇలానే అమెరికా, చైనా దేశాలు డిజిటల్ ఆధిపత్యం సాధించాయి. భారత్‌ కూడా అదే మార్గం పట్టాలి.

భారత్‌ ఎందుకు వెనుకబడి ఉంది? టాలెంట్‌ లేకా? డబ్బు లేకా? (ఇటువంటి వ్యాసాల కోసం MegaMindsIndia వెబ్‌సైట్ ని సందర్శించండి.)

మన దగ్గర ప్రతిభ ఉంది, ఫండింగ్‌ ఉంది. మూల సమస్యలు ఇవి....
Demand vs. Supply : ప్రజలు ఎక్కువగా ఇతరులు ఉన్న ప్లాట్‌ఫామ్‌నే వాడతారు. కొత్త యాప్‌లు యూజర్‌ బేస్‌ సాధించడంలో ఇబ్బంది పడతాయి.

Economies of Scale : పెద్ద టెక్ కంపెనీలు బిలియన్ల యూజర్లకు సేవలు అందిస్తున్నందున, తక్కువ ఖర్చుతో మెరుగైన పనితీరును ఇస్తాయి.

Retention : కొత్త బ్రౌజర్ లేదా OS ట్రై చేసినా, చాలా మంది తిరిగి Google లేదా Apple వద్దకే వెళ్తారు. ఎందుకంటే వారి డేటా, యాప్‌లు, స్నేహితులు అక్కడే ఉంటారు. అందుకే సవాలు "నిర్మించడం" కాదు — యూజర్లను నిలుపుకోవడం ముఖ్యం.

భారతీయ ఉదాహరణలు: Zoho & Jio భారత్‌లో ఇప్పటికే రెండు దిగ్గజాలు ఈ దిశగా ముందుకు సాగుతున్నాయి.

Zoho’s Ulaa Browser:
బిజినెస్‌ యాప్‌లలో (Microsoft + Google + SAP మిశ్రమం లాగా) పేరొందిన Zoho, Ulaa అనే ప్రైవసీ-ఫోకస్‌డ్ బ్రౌజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ కూడా ఉంది. AI ఆధారిత భద్రత, పాలసీ కంట్రోల్‌లు, కంపెనీల కోసం రూపొందించబడింది. Zoho ఇప్పటికే CRM, HR, ఫైనాన్స్‌, కోలాబరేషన్‌ టూల్స్‌తో కోట్లాది యూజర్లను కలిగి ఉంది. క్రమంగా తన ఎకోసిస్టమ్‌ను Ulaa చుట్టూ నిర్మించగలదు.

Reliance Jio’s Digital Ecosystem:
Jio ఇప్పటికే కోట్లాది యూజర్లను కలిగి ఉంది. దాని యాప్ స్టాక్‌లో MyJio, JioMart, JioCinema, JioTV, JioCloud, మరియు ఎంటర్‌ప్రైజ్‌ యాప్‌లు ఉన్నాయి. Jio తన సొంత బ్రౌజర్ లేదా OS లకు దారితీసే పూర్తి డిజిటల్ ఎకోసిస్టమ్‌ను నిర్మించగలదు. Zoho (సాఫ్ట్‌వేర్‌ + ఎంటర్‌ప్రైజ్‌) మరియు Jio (కనెక్టివిటీ + కన్స్యూమర్ యాప్‌లు) ఈ రెండూ కలిసి భారత్‌ డిజిటల్ స్వావలంబనకు రెండు స్తంభాలుగా నిలవవచ్చు.

చైనా నుండి మనం నేర్చుకోవాల్సింది: చైనా ఈ దారిని చాలా సిస్టమేటిక్‌గా అమలు చేసింది.

Browsers – UC Browser, QQ Browser, Baidu Browser వంటి స్థానిక బ్రౌజర్లు ప్రజాదరణ పొందాయి.

Search Engines – Baidu “చైనీస్ గూగుల్”గా మారి స్థానిక భాషల్లో సెర్చ్‌ ఆధిపత్యం సాధించింది.

App Stores & OS – Xiaomi, Huawei, Tencent లాంటి కంపెనీలు తమ స్వంత యాప్ స్టోర్‌లను నిర్మించాయి.

AI – స్థానిక డేటాపై భారీగా AI అభివృద్ధి చేశారు.

Social Media – WeChat, TikTok (Douyin), Weibo లాంటి ప్రపంచ స్థాయి సోషల్ మీడియా దిగ్గజాలను సృష్టించారు.

అన్నీ ఒక క్రమంలో జరిగాయి: బ్రౌజర్ → సెర్చ్ → యాప్ స్టోర్ → AI → సోషల్ మీడియా. చైనా మొదట “మన ఫేస్‌బుక్ ఎక్కడ?” అని అడగలేదు. ముందుగా బ్రౌజర్‌, సెర్చ్‌ స్థాయి పునాదిని వేసింది.

ఇది భారత్‌ కు ఎందుకు ముఖ్యం: UPI భారత్‌ను చెల్లింపుల్లో స్వావలంబిగా చేసింది. Bharat Browser భారత్‌ను డిజిటల్ ప్రపంచంలో స్వావలంబిగా చేయగలదు.
ఎవరు “గేట్వే”ని నియంత్రిస్తారో, వారు డేటా, యూజర్లు, ఇన్నోవేషన్ దిశను నిర్ణయిస్తారు. అప్పుడు మాత్రమే మనకు భారతీయ సెర్చ్ ఇంజిన్‌లు, AI, యాప్ స్టోర్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వగలవు.
ఆత్మనిర్భర్ భారత్ అనేది యాప్‌ల గురించి కాదు ఎకోసిస్టమ్‌ల గురించి.

Browser → Search → AI → App Store → OS → Social Media భారత్‌ దగ్గర Zoho, Jio లాంటి శక్తివంతమైన కాంపిటీటర్లు ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు అవసరమైంది. ఫోకస్‌, పాలసీ సపోర్ట్‌, యూజర్ ఆడాప్షన్. ఎందుకంటే డిజిటల్ స్వాతంత్ర్య యుద్ధం వాట్సాప్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లలఒ కాదు అది బ్రౌజర్‌ స్థాయిలోనే గెలవబడుతుంది. బ్రౌజర్ నిజమైన ఇంటర్నెట్ గేట్వే...

రాజశేఖర్ నన్నపనేని, Mega Minds
085005 81928

12/10/2025

సిందూర్ హీరోకి వాయుసేన మెడల్...

ఆపరేషన్ సిందూర్ లో మిసైల్ అటాక్ లో తన కుడి చేయిని కోల్పోయిన కార్పొరల్ "వరుణ్ కుమార్" గారికి
వాయుసేన మెడల్ ఇచ్చి గౌరవించిన భారత్ వాయుసేన.

మిసైల్ అటాక్ లో కుడి చేయిని కోల్పోయిన
వరుణ్ కుమార్ గారికి, పుణెలోని ఆర్టిఫీషియల్
లింబ్ సెంటర్ లో కృత్రిమ చేతిన అమర్చడం జరిగింది. ఆయన మళ్లీ తన డ్యూటీకి తిరిగి చేరే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ఒక చేయి కోల్పోయాడు… కానీ దేశం కోసం పోరాడే గుండె మాత్రం ఇంకా గర్జిస్తోంది.

జై హింద్ - జై భారత్

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mega Minds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mega Minds:

Share

Category