Mega Minds

Mega Minds Mega Mind is a platform
To educate and create awareness for the greatest history and current affairs of the country. To involve the youth in social activities

To share so many intellectual's views and ideas for creating a strong nation.

22/08/2025

"నమస్తే సదా వత్సలే మాతృభూమి...”
RSS గీతం ఆలపిస్తున్న DK ShivaKumar

ఓ రకంగా కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం DK శివ కుమార్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం సిద్ధరామయ్య కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లే.

మొత్తానికి DK గీతంతో కాంగ్రెస్ ఏకో సిస్టం మొత్తం కోమాలోకి పోయుంటుంది 😂🤣😂

భారత నౌకాదళ నూతన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తమల్ గ్రీస్‌లోని సౌడా బే చేరిక******************************************రష్యాలో కమీష...
21/08/2025

భారత నౌకాదళ నూతన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తమల్ గ్రీస్‌లోని సౌడా బే చేరిక
******************************************
రష్యాలో కమీషనింగ్‌ పూర్తయిన అనంతరం, భారత్‌ వైపు తిరుగు ప్రయాణంలో ఉన్న తాజా స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తమల్ ఆగస్ట్ 19, 2025న గ్రీస్‌లోని సౌడా బే తీరానికి చేరుకుంది.

ఈ పర్యటనలో భాగంగా ఇండో–గ్రీక్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో పలు ప్రొఫెషనల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వీటిలో హెలెనిక్ నేవీ సీనియర్ అధికారులతో చర్చలు, NATO Maritime Interdiction Operational Training Centre (NMIOTC) లో ఆపరేషన్లను, విధానాలను పరిచయం చేసుకోవడం, అలాగే నాటో మరియు హెలెనిక్ నేవీ సౌకర్యాలను సందర్శించడం వంటి కార్యక్రమాలు జరిగాయి.

ఈ పర్యటన & సందర్శన ద్వారా భారత్–గ్రీస్ నౌకాదళ సహకారానికి మరింత బలమైన పునాది వేయబడిందని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టిన జయశంకర్.****************************************రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ మా...
21/08/2025

అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టిన జయశంకర్.
****************************************
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకులు వచ్చాయనే నెపంతో అమెరికా ఎప్పటికప్పుడు భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అమెరికా ద్వంద్వ వైఖరిని సూటిగా, నిర్భయంగా ఎండగట్టిన విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చెప్పిన ఒక్కో మాట అమెరికా ద్వంద్వ నీతిని బహిర్గతం చేస్తూ, భారత్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎంత కట్టుబడి ఉందో చాటిచెప్పాయి.

జయశంకర్ గారు చాలా స్పష్టంగా సుత్తిలేకుండా తనదైన శైలిలో ఈ విదంగా చెప్పారు. రష్యా దగ్గర చమురు ఎక్కువగా కొనేది భారత్ కాదు, చైనానే. రష్యా గ్యాస్‌పై ఆధారపడింది భారత్ కాదు, యూరోపియన్ యూనియన్. 2022 తర్వాత రష్యాతో గరిష్టంగా వ్యాపారం కొనసాగించింది కూడా భారత్ కాదు, పాశ్చాత్య దేశాలే. అయినా భారత్ పై మాత్రమే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? అని ఆయన అమెరికాను నేరుగా నిలదీశారు.

ప్రపంచ మార్కెట్ సమతుల్యంగా ఉండాలని ముందుగా చెప్పింది అమెరికానే అని, అదే మాటను పట్టుకుని భారత్ కూడా తన అవసరాలకు అనుగుణంగా రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోందని ఆయన వివరించారు. అంతేకాదు, అమెరికా నుండి కూడా భారత్ చమురు కొనుగోలు చేస్తుందనీ భవిష్యత్తులో గణనీయంగా పెంచుతోందని జయశంకర్ గారు తేల్చిచెప్పారు. ఒకవైపు దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ, మరోవైపు అమెరికా ద్వంద్వ నీతిని బహిరంగంగా ఎండగట్టిన జయశంకర్ గారి ధైర్యవంతమైన సమాధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

భారత రక్షణ రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు — లేజర్ టెక్నాలజీ ఆధారంగా డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే ఖచ్చితంగా ధ్వంసం చేసే ...
21/08/2025

భారత రక్షణ రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు — లేజర్ టెక్నాలజీ ఆధారంగా డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే ఖచ్చితంగా ధ్వంసం చేసే లేజర్ ఆపరేటెడ్ వెహికల్ రూపొందుతోంది.
2 కిలోవాట్ల శక్తితో ఉన్నది D4,
10 కిలోవాట్లది ఎంకే-2,
30 కిలోవాట్లది శస్త్ర శక్తి పేర్లతో అభివృద్ధి చెందగా,
100 కిలోవాట్లు మరియు 300 కిలోవాట్ల సామర్థ్యం గల కొత్త లేజర్ సిస్టమ్స్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమైతే భారత రక్షణలో కొత్త యుగం ఆరంభమవుతుంది...

మొదటి టెస్టింగ్ కర్నూల్‌లో విజయవంతంగా జరిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ లేజర్ సిస్టమ్‌ను ఆర్మీకి అందించే అవకాశముంది. లేజర్ టెక్నాలజీని పూర్తిగా వినియోగంలోకి తెచ్చిన తరువాత, ప్రస్తుతం ఉన్న S-400 వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై అయ్యే ఖర్చు దాదాపు 70% వరకు తగ్గించొచ్చు. దీంతో దేశ రక్షణ మరింత బలోపేతం కావడమే కాకుండా, ఆర్థిక పరంగా కూడా భారత్‌కు భారీ లాభం చేకూరనుంది...

భారత గగనతలంపై అర్ధ శతాబ్దానికి పైగా రక్షణ గా ఉన్న మిగ్-21 ఫైటర్ జెట్‌కు భారత ఆర్మీ వీడ్కోలు పలికింది. ఒకప్పుడు "గేమ్ ఛేం...
21/08/2025

భారత గగనతలంపై అర్ధ శతాబ్దానికి పైగా రక్షణ గా ఉన్న మిగ్-21 ఫైటర్ జెట్‌కు భారత ఆర్మీ వీడ్కోలు పలికింది. ఒకప్పుడు "గేమ్ ఛేంజర్"గా నిలిచిన ఈ యుద్ధవిమానం, అనేక యుద్ధాల్లో తన ధైర్యాన్ని చాటింది. ఎనిమిది మంది భారత పైలట్లను సోవియట్ యూనియన్‌కు పంపి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా మిగ్-21 యుగం ఆరంభమైంది. అప్పటి నుండి ఈ విమానం భారత వైమానిక శక్తికి ప్రతీకగా నిలిచింది...

1960 దశకంలోనే ఈ విమానం భారత వైమానిక దళానికి గర్వకారణంగా మారింది. ప్రముఖ పైలట్ బ్రిజేష్ ధర్ జయాల్ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి విజయవంతంగా దాడి జరిపి తిరిగి వచ్చిన తొలి భారతీయ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన వీరత్వం, మిగ్-21 సామర్థ్యం కలిసి భారత శౌర్యానికి మరింత వెలుగులు వచ్చాయి...

భారత నౌకాశ్రయ సంస్థలో భారీ కొనుగోలుషిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), దేశీయంగా తయారు చేసిన 26 నౌకలను కొనుగోలు చేయను...
20/08/2025

భారత నౌకాశ్రయ సంస్థలో భారీ కొనుగోలు

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), దేశీయంగా తయారు చేసిన 26 నౌకలను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు $2.3 బిలియన్ (భారత రూపాయల్లో దాదాపు లక్షల కోట్ల రూపాయలు).








భారత సైన్యంలో కొత్త బాధ్యతలులెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్. కుష్వాహ్, AVSM, SM గారు, లెఫ్టినెంట్ జనరల్ పవన్ చద్ధా, SM, VSM స్థ...
20/08/2025

భారత సైన్యంలో కొత్త బాధ్యతలు

లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్. కుష్వాహ్, AVSM, SM గారు, లెఫ్టినెంట్ జనరల్ పవన్ చద్ధా, SM, VSM స్థానంలో HQ MG & G Area కమాండ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన, అన్ని ర్యాంకుల సిబ్బంది భారత సైన్యపు గొప్ప సంప్రదాయాలను కాపాడుతూ, ఎల్లప్పుడూ ఆపరేషనల్ రెడీనెస్‌లో నిలవాలని పిలుపునిచ్చారు.

అలాగే, మరియు Year of Reforms దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు మిషన్-ఓరియెంటెడ్ ట్రైనింగ్‌ను క్రమబద్ధంగా కొనసాగించాలని ఆయన సూచించారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె....పశ్చిమబెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం 2,216 కి.మీలో ఇప్పటివరకు 1,647 కి....
20/08/2025

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె....

పశ్చిమబెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం 2,216 కి.మీలో ఇప్పటివరకు 1,647 కి.మీ మేర కంచె వేసింది. ఈ సరిహద్దు భద్రత కోసం చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

అయితే, మిగతా భాగంలో కంచె పనులు సాగడంలో ప్రధాన అడ్డంకి భూసేకరణ సమస్య. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమీకరణలో జాప్యం చేయడం వల్ల పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగలేకపోతున్నాయి.








అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కి మ్యాప్ చూపిస్తూ – “ఈ యుద్ధంలో మీరు చివరికి కొంత భ...
20/08/2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కి మ్యాప్ చూపిస్తూ – “ఈ యుద్ధంలో మీరు చివరికి కొంత భూభాగం వదులుకోవాల్సిందే” అని సూచించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఎలాంటి లాభం కలగలేదని స్పష్టమవుతుంది.

ఎన్నో ప్రాణాలు కోల్పోయి, దేశం ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ దేశాల ఆధీనంలో ఉంటే ఎవరికైనా ఇలాగే దుర్గతి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.








బ్రేకింగ్ న్యూస్భారత్ విజయవంతంగా 'అగ్ని-5' ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిను ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ నుండి ప...
20/08/2025

బ్రేకింగ్ న్యూస్

భారత్ విజయవంతంగా 'అగ్ని-5' ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిను ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ నుండి ప్రయోగించింది. ఈ క్షిపణి సుమారు 5000 కి.మీ దూరం వరకు ఖచ్చితంగా లక్ష్యాలను చేధించగలదు.

భారత రక్షణ శక్తి మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది.










లోక్‌సభ ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025ను ఆమోదించింది. ఈ బిల్లులో భాగంగా, ఎవరైనా ఆన్‌లైన్ గేమింగ్‌క...
20/08/2025

లోక్‌సభ ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025ను ఆమోదించింది. ఈ బిల్లులో భాగంగా, ఎవరైనా ఆన్‌లైన్ గేమింగ్‌కు సౌకర్యం కల్పిస్తే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా విధించబడుతుంది.

అలాగే, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన ప్రచారం లేదా ప్రమోషన్ చేస్తే గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లుతో దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలులోకి రానున్నాయి.








భారత నావికాదళం కోసం ISRO మరో కీలక అడుగు వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ శాటిలైట్ (TDS) మరియు G...
19/08/2025

భారత నావికాదళం కోసం ISRO మరో కీలక అడుగు వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ శాటిలైట్ (TDS) మరియు GSAT-7R శాటిలైట్ ను ప్రయోగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న GSAT-7 (రుక్మిణి) కి బదులుగా GSAT-7R పనిచేయనుంది. ఈ ఉపగ్రహం సముద్ర రక్షణ, నావికాదళ కమ్యూనికేషన్ వ్యవస్థలకు అత్యాధునిక సాంకేతిక మద్దతును అందించనుంది. దీని ద్వారా భారత నేవీ శక్తి మరింత బలపడనుంది.










Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mega Minds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mega Minds:

Share

Category