Aadya Tv Media

Aadya Tv Media Aadya TV Media is an official YouTube Channel which will constantly keep you updated with the latest

పీ సీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి  చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు  తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావ...
02/09/2025

పీ సీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాలేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాలేశ్వరం కమిషన్ వేదికపై హరీష్ రావు, కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 2న హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కెసిఆర్, హరీష్ రావు తరపున న్యాయవాదులు సుందరం ,శేషాద్రి నాయుడు వాళ్ళని వినిపించారు.

ప్రభుత్వం తరఫున వాదన నిర్మించిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి అసెంబ్లీలో కాలేశ్వరం నివేదికపై చర్చించామని చెప్పారు. కాలేశ్వరం విచారణలను సిబిఐ కి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైకోర్టుకు తెలిపారు. కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుందని ఇంకా ఎలాంటి చర్యలు జరగలేదని చెప్పారు. సిబిఐ దర్యాప్తుకు కాలేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధం లేదని తెలిపారు. సిబిఐ దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయని... సిబిఐ దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని కోర్టుకు తెలిపారు ఏజీ. అనంతరం కోర్టు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7 కు వాయిదా వేసింది.

12 శాతం... 28 శాతం జీఎస్టీ స్లాబ్ రద్దు...! మంత్రుల గ్రూపు అంగీకారం...కేంద్ర మంత్రుల బృందం తాజాగా జీఎస్టి సంస్కరణలో భాగం...
21/08/2025

12 శాతం... 28 శాతం జీఎస్టీ స్లాబ్ రద్దు...!
మంత్రుల గ్రూపు అంగీకారం...

కేంద్ర మంత్రుల బృందం తాజాగా జీఎస్టి సంస్కరణలో భాగంగా 12 %, 28% స్లాబ్ పన్ను రేట్లను తొలగించడానికి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను స్లాబ్స్ రానున్న కాలంలో రెండుకు తగ్గునున్నాయి. ఇప్పటివరకు 5%, 12%, 18%, 28% స్లాబ్స్ కింద వివిధ వస్తువులపై జీఎస్టి వసూలు జరుగుతుండగా తొలగింపు తర్వాత 5%, 18% స్లాబ్స్ మాత్రమే భవిష్యత్తులో అవకాశం ఉందని వెల్లడయింది. ఈ మార్పులుగా ఆరుగురు మంత్రులతో పాటు చేసిన బృందం తాజాగా అంగీకారాన్ని తెలిపింది.

21/08/2025

మాదాపూర్‌లో ఆక్రమణల తొల‌గింపు..
రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
* రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కుల‌తో పాటు ర‌హ‌దారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.

ఢిల్లీ:ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నామినేషన్
21/08/2025

ఢిల్లీ:ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నామినేషన్

20/08/2025
13/08/2025

తెలుగు రాష్ట్రాల్లో కూలీ మూవీకి వార్-2 కన్నా ఎక్కువ బుకింగ్స్ వుండటానికి
మీరు చెపే రీజన్ ఏమిటి?

12/08/2025

*బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం*
* కోస్తాంధ్రలో రెండు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
* వర్ష ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ సంస్థ
* గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
* శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచన
* లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ

*పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోయిన అవినాష్‌రెడ్డి** కడప: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వైకాపా ఎంపీ అవి...
12/08/2025

*పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోయిన అవినాష్‌రెడ్డి*

* కడప: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి కడపకు బయలుదేరారు. ఈక్రమంలో వైకాపా కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద వీరి వాహనాన్ని అడ్డుకున్నారు. అవినాష్‌రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఎర్రగుంట్ల నుంచి అవినాష్‌రెడ్డి వాహనంలో వెళ్లిపోయారు. సింహాద్రిపురం వైపు వెళ్తున్నారన్న సమాచారంలో పోలీసులు ఆయన్ను వెంబడించారు. పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అవినాష్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

12/08/2025

తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష
వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం రేవంత్
లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి
ముంపు ప్రాంత ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలి
క్లౌడ్ బరస్ట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి-సీఎం
వచ్చే 3 రోజులు అధికారులకు సెలవులు రద్దు
ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసులు
హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి
ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోమ్‌ చేయాలి-సీఎం రేవంత్
టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలి-సీఎం రేవంత్

12/08/2025

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలపై జగన్ ట్వీట్
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు
తీవ్రవాదులుగా మారి ఎన్నికలను హైజాక్‌ చేశారు
ఈరోజు బ్లాక్‌ డే-వైఎస్‌ జగన్‌
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలు రద్దుచేయాలి
కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి-జగన్

Address

Ameerpet
Hyderabad
500038

Telephone

+919397113355

Website

Alerts

Be the first to know and let us send you an email when Aadya Tv Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aadya Tv Media:

Share