Ritam తెలుగు

Ritam తెలుగు RitamTelugu offers many topics such as breaking, top news, Legacies, Legends, devotional, and more. Ritam - Multilingual news aggregator App.
(1)

Download us @ http://bit.ly/2Tj8zps
Ritam - ऋतम्, An App designed to bring to you All that you need to Know, Read and Share.

08/07/2025

ఇది గాజా కాదు.. టెహ్రాన్ అసలే కాదు..

ఇది మమత పాలనలోని బెంగాల్ రాష్ట్రం

ఇక్కడ పాలస్తీనా జెండాలు ఎగురుతాయి.. ఆ దేశానికి జైజైలు పలుకుతారు..

కానీ జై శ్రీరామ్ అంటే మాత్రం జైల్లో వేస్తారు..!!

08/07/2025

యోగీ బుల్డోజర్లకు బ్రేకుల్లేవ్..!

లవ్ జిహాద్ కుట్రతో ఏకంగా రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ చేసిన జలాలుద్దీన్ ఇంటిని కూల్చుతున్న దృశ్యం..

జలాలుద్దీన్ వివరాలతో కూడిన ఫేస్ బుక్ లింక్.. కామెంట్ బాక్స్ లో..

08/07/2025

మమత ఏలుబడిలో బెంగాల్ లో విద్యావ్యవస్థను ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో చూడండి..

ఇప్పటికే మెడికల్ కాలేజీ, లా కాలేజీల్లో సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డ ఘటనలను మరవకముందే..

బెంగాల్ నుంచి మరో షాకింగ్ వీడియో

సోనార్‌పూర్ కాలేజీలోకి కొత్తగా జాయిన్ అయిన విద్యార్థిని చేత మసాజ్ చేయించుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థీ నాయకుడు

కెమెరాకు చిక్కిన 44 ఏళ్ల ప్రతీక్ కుమార్ డే

TMCP కోఆర్డినేటర్, రాజ్‌పూర్ యూత్ ప్రెసిడెంట్, సోనార్‌పూర్ సౌత్ యూత్ ప్రెసిడెంట్ గా చెలామణీ అవుతోన్న ప్రతీక్ కుమార్ డే

08/07/2025

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీరాముడు జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీరాముడు జన్మించింది భారత్‌లో కాదు.. నేపాల్‌లో

తమ దేశంలోనే రాముడు పుట్టాడన్న ఓలీ

వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగనే ఈ మాట చెబుతున్నానని వెల్లడి

శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్న నేపాల్ ప్రధాని

గతంలో అయోధ్య కూడా నేపాల్ చిత్వాన్‌లోని థోరిలో ఉందని చెప్పిన కేపీ శర్మ

08/07/2025

తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు

4 గేట్లను ఎత్తి నీటిని నాగార్జునసాగర్ వైపు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో గేట్లు ఎత్తిన సీఎం చంద్రబాబు

08/07/2025

భద్రాచలం రామాల‌య ఈవోపై దాడి

భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి

ఈవో రమాదేవిపై దాడి చేసిన ఆక్రమణదారులు.. స్పృహ త‌ప్పి ప‌డిపోయిన రమాదేవి

గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం

అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బందిపై కబ్జాదారుల దాడి

08/07/2025

నాలాంటి వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది

సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు

తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదు

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

08/07/2025

పోలీసుల అప్రమత్తతో తొలగిన భారీ ముప్పు..!

08/07/2025

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన.. ఎమర్జెన్సీని తలపిస్తోంది

ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలకు అర్థమైంది

సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే కూడా అరెస్టులు చేస్తున్నారు..

- మాజీ మంత్రి కేటీఆర్

08/07/2025

యూపీలోని బులంద్షహర్ లో కొండచిలువను బంధించి 3 కిలోమీటర్లపైగా దానిని తీసుకెళ్లి అడవిలో వదిలేసిన పిల్లలు

శుక్లా ప్రయోగం.. వృద్ధులకు వరం---భారత వ్యోమగామి గ్రూప్‌ ‌కెప్టెన్‌ ‌శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్...
08/07/2025

శుక్లా ప్రయోగం.. వృద్ధులకు వరం
---
భారత వ్యోమగామి గ్రూప్‌ ‌కెప్టెన్‌ ‌శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్న ఏడు కీలక ప్రయోగాలలో ఒకటైన గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాల క్షీణతపై అధ్యయనం, వృద్ధులలో వయసు సంబంధిత కండరాల క్షీణత-సార్కోపీనియా చికిత్సకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో బయోటెక్నాలజీ విభాగం- డీబీటీ సహకారంతో, నాసా సహాయంతో నిర్వహిస్తోంది.

మైయోజెనెసిస్‌ ‌ప్రయోగం

శుక్లా నిర్వహిస్తున్న మైయోజెనెసిస్‌-ఇ‌స్రో ప్రయోగం మానవ అస్థిపంజర కండరాల కణాలు గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఎలా ప్రవర్తిస్తాయో, వాటి పునరుత్పాదన సామర్థ్యం, మైటోకాండ్రియల్‌ ‌జీవక్రియలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుంది. ఈ ప్రయోగంలో కండరాల స్టెమ్‌ ‌కణాలను వృద్ధి చేసి, వాటిని ఐఎస్‌ఎస్‌లో గురుత్వాకర్షణ లేని పరిస్థితులలో పరీక్షిస్తారు. ఈ అధ్యయనం దీర్ఘకాల అంతరిక్ష యాత్రలలో కండరాల క్షీణతను నివారించే మార్గాలను కనుగొనడంలో సహాయపడుతుంది.

గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కండరాలు భూమిపై సాధారణంగా చేసే పనిని చేయనవసరం లేకపోవడంతో, కండరాల క్షీణత-అట్రోఫీ సంభవిస్తుంది. ఈ పరిస్థితి వృద్ధులలో సార్కోపీనియా అనే వయసు సంబంధిత కండరాల క్షీణతను పోలి ఉంటుంది. ఇది 60 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కనిపిస్తుంది. అంతరిక్షంలో కండరాల క్షీణత చాలా వేగంగా, కొన్ని రోజులలోనే సంభ విస్తుంది. ఇది భూమిపై దశాబ్దాలలో జరిగే క్షీణతకు సమానంగా ఉంటుంది.

వృద్ధులకు ఎలా ఉపయోగపడుతుంది?

ఈ ప్రయోగం భూమిపై వృద్ధులలో సార్కో పీనియా చికిత్సకు కొత్త ఆవిష్కరణలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం సార్కోపీనియాకు వ్యాయామం, జీవనశైలి మార్పులు, పోషకాహారం తప్ప ఫుడ్‌ అం‌డ్‌ ‌డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ -ఎఫ్‌డీఏ ఆమోదిత ఔషధాలు లేవు. అయితే ఈ ప్రయోగంలో శుక్లా కండరాల కణాలపై కొన్ని ఔషధాలను పరీక్షిస్తు న్నారు. ఇవి కండరాల క్షీణతను నివారించడంలో లేదా పునరుత్పాదనను మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఈ ఔషధాలు కండరాల కణాలు కొవ్వుగా మారకుండా నిరోధించడంతో పాటు, గురుత్వాకర్షణ లేని వాతావరణంలో వచ్చే కొన్ని ప్రతికూల ప్రభావాలను తగ్గించాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ ప్రయోగం ద్వారా కండరాల పునరుత్పా దనలో మైటోకాండ్రియా (కణాల శక్తి కేంద్రాలు) పాత్రను అర్థం చేసుకోవడంలో కీలక సమాచారం లభిస్తుంది. అంతరిక్షంలో కండరాల క్షీణతకు కారణమయ్యే జన్యు మార్పులు, జీవక్రియ మార్పులను అధ్యయనం చేయడం ద్వారా వృద్ధులలో కండరాల బలం, పనితీరును కాపాడే కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చు. ఈ పరిశోధన ఫలితాలు కండరాల వ్యాధులు లేదా దీర్ఘకాలం మంచానికి పరిమితమై పోయి కండరాల క్షీణతను ఎదుర్కొనే రోగులకు కూడా ఉపయోగపడవచ్చు.

శుక్లా మిషన్‌

‌గ్రూప్‌ ‌కెప్టెన్‌ ‌శుక్లా జూన్‌ 25, 2025‌న నాసాకు చెందిన కెనడీ స్పేస్‌ ‌సెంటర్‌ ‌నుంచి స్పేస్‌ఎక్స్ ‌డ్రాగన్‌ అం‌తరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఆయన అక్సియం మిషన్‌ 4‌లో మిషన్‌ ‌పైలట్‌గా పనిచేస్తు న్నారు. ఇందులో అమెరికా, పోలాండ్‌, ‌హంగరీ నుంచి మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. 14 రోజుల ఈ మిషన్‌లో, ఆయన మొత్తం 60 సైన్స్ ‌ప్రయోగాలు, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొంటారు. వీటికి భారతదేశం సహా 31 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఈ ప్రయోగం దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఆరోగ్య వ్యూహాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో కూడా ఒక కొత్త అధ్యాయానికి పలకవచ్చునని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

సామాజిక ప్రభావం

ఈ పరిశోధన ఫలితాలు వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించ గలవు. సార్కోపీనియా వల్ల కింద పడే వృద్ధులకు అయ్యే గాయాలు ఆసుపత్రి ఖర్చులను పెంచుతాయి. కొత్త చికిత్సల ద్వారా కండరాల బలాన్ని కాపాడ గలిగితే వృద్ధులు స్వతంత్రంగా జీవించగలుగు తారు. ఆరోగ్య సంరక్షణ వ్యయాలు తగ్గుతాయి.

అంతేకాకుండా ఈ ప్రయోగం భారతదేశ యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు అంతరిక్ష జీవ విజ్ఞాన పరిశోధనలో పాల్గొనేందుకు ప్రేరణనిస్తుంది. శుక్లా ఈ మిషన్‌ ‌ద్వారా భారతదేశ యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. శాస్త్రీయ ఆవిష్కరణలు మానవ జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తాయో చూపిస్తారు. ఐఎస్‌ఎస్‌ ‌నుంచి భూమికి చేరుకునే మైయోజెనెసిస్‌ ‌ప్రయోగం ఫలితాల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. కండరాల క్షీణతను నివారించే ఔషధాలు, చికిత్సలను అభివృద్ధి చేయడానికి పనిచేస్తారు. 2025 చివర్లో మరిన్ని కండరాల చిప్‌లను ఐఎస్‌ఎస్‌కి పంపడం ద్వారా ఈ పరిశోధనను విస్తరించే ప్రణాళిక ఉంది. ఈ రెండవ దశ ప్రయోగంలో కండరాల పునరుత్పా దనను మెరుగుపరిచే కొత్త ఔషధ సమ్మేళనాలను పరీక్షించే అవకాశం ఉంది.

ఈ మిషన్‌ ‌ద్వారా భారతదేశం అంతరిక్ష పరిశోధనలో, శాస్త్రీయ ఆవిష్కరణలలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.

– డాక్టర్‌ ‌కాకాని పృధ్వీరాజు, సంఘటనా కార్యదర్శి,
ఆరోగ్యభారతి, ఆంధప్రదేశ్

దాచినా దాగని ఎమర్జెన్సీ వాస్తవాలు---ఇం‌దిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి యాభయ్యేళ్లు నిండాయి. అయిదు దశాబ్దాల అనంతరం కూడా ...
08/07/2025

దాచినా దాగని ఎమర్జెన్సీ వాస్తవాలు
---
ఇం‌దిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి యాభయ్యేళ్లు నిండాయి. అయిదు దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనసుల్లో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ అగ్నిని రాజేస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీకి సంబంధించి అనేక కొత్త విషయాలు, దాచినా దాగని వాస్తవాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీతో ముడిపడిన అకృత్యాలు, అమానుషాలు, దారుణాలను పాత జ్ఞాపకాల కింద పక్కన పెట్టేసే అవకాశం లేదు.

ఎందుకంటే ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు. ఇది ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక సంస్కృతిని తీవ్రంగా దెబ్బతీసిన పరిణామం. దీన్ని భారతదేశ చరిత్ర ఏనాటికీ మరచిపోయే అవకాశం లేదు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత గానీ, ప్రజల భావోద్వేగాలు బయటపడలేదు. ఎవరు హీరోలు, ఎవరు విలనన్నది అవగతం కాలేదు. ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా కటకటాల పాలయినప్పటికీ, ఇందిరాగాంధీకి, ఎమర్జెన్సీకి సంబంధించిన వివరాలను, వికృతాలను ప్రపంచ ప్రజలకు కరపత్రాల పంపిణీ ద్వారా తెలియజేసి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ మరచిపోలేనివి. ఈ కరపత్రాల గురించి దేశ ప్రజలకు పూర్తి వివరాలు తెలియకపోవడంతో వీటి వెనుక ఉన్న పోరాట యోధుల గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎమర్జెన్సీ కాలంలో కరపత్రాలు పోషించిన పాత్ర అమోఘమైనది. వీటి ద్వారానే ఇందిరా గాంధీ నిరంకుశ విధానాలు, నెహ్రూ-గాంధీ కుటుంబ స్వార్థపూరిత ఆశలు, ఆకాంక్షలు దేశ ప్రజలకే కాక, ప్రపంచ ప్రజలకు కూడా తెలియడం జరిగింది. ఈ కరపత్రాల్లో కొన్ని సంతకాలతో ముద్రితం కాగా, మరికొన్ని అనామకంగా విడుదలయ్యాయి. అయితే, అవన్నీ సమకాలీన భారతదేశ చరిత్రకు అద్దం పట్టాయనడంలో సందేహం లేదు.

చరిత్ర సృష్టించిన కరపత్రం

ఇందులో ఎమర్జెన్సీకి సంబంధించి మొట్ట మొదటగా విడుదలయి, ఆ తర్వాతి కరపత్రాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిన కరపత్రం ఆ సమయంలో అంతర్జాతీయంగానూ, ఎమర్జెన్సీ తర్వాత జాతీయంగానూ తీవ్రస్థాయి సంచలనం సృష్టించింది. అనేక కష్టనష్టాలను, ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు లండన్‌ ‌చేరిన ఈ కరపత్రం కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా వ్యాపించిపోయింది. చివరికి అమెరికాలోని ఇండియన్స్ ‌ఫర్‌ ‌డెమోక్రసీ అనే సంస్థకు ఈ కరపత్రం చిక్కి, పునర్ముద్రితమై మారుమూల దేశాలకు సైతం చేరింది.

కరపత్రమంతా ఇందిరా గాంధీపై విమర్శలు, ఆరోపణలతో నిండిపోయింది. ఇందిరా గాంధీ మీద రెచ్చగొట్టే విధంగా, ఇందిర వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ కరపత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వెళ్లగక్కింది. ఈ కరపత్రాన్ని రాసిన తీరును బట్టి దీన్ని తయారు చేసినవారి సిద్ధాంతా లేమిటో తేలికగా అర్థమై పోతుంది. ఇందులో ఇందిరా గాంధీని అంతర్జాతీయ స్థాయి నియంతలతో పోల్చారు. హిట్లర్‌, ‌ముస్సోలిని, స్టాలిన్‌ ‌వంటి నియంతల ముందు ఇందిరా గాంధీ బలాదూర్‌ అని కూడా ఇందులో దృష్టాంతాలతో సహా పేర్కొనడం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో ప్రస్తుతం నాజీ జర్మనీ నాటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఈ కరపత్రంలో ఉదాహరణలతో సహా వెల్లడించిన ప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అజ్ఞాతంలోనే ఉంటూ ఒక పోరాటాన్ని ఎలా జరపవచ్చన్నది ఇది తేటతెల్లం చేసింది.

కరపత్రంలోని ప్రతి పేరాలోనూ ఇందిరా గాంధీని ఒక నియంతగా, ఒక ఫాసిస్టుగా అభివర్ణించారు. సుమారు అయిదు వేల పదాలతో సాగిన ఈ కరపత్రంలో ఇందిరా గాంధీని ‘ఇందిరా నెహ్రూ గాంధీ’ అనే సంబోధించడం గమనించాల్సిన విశేషం. నియంతృత్వం, అధికార దాహం అనేవి ఆమె రక్తంలోనే ఉన్నట్టు ఈ కరపత్రం చెప్పకనే చెప్పింది. మొఘలుల కాలంలోనే కాదు, బ్రిటిష్‌ ‌వారి కాలంలో కూడా ఇంతటి దమనకాండ, అణచివేతలు, ఊచకోతలు, నిరంకుశ ధోరణులు జరిగిన దాఖలాలు లేవని అది స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ అమలుచేసిన అహింసా విధానం కాలంలో బ్రిటిష్‌ ‌సామ్రాజ్య విస్తరణవాదులు కూడా ఇంతగా అణచివేత చర్యలకు పాల్పడలేదని, ప్రజలు మౌనంగా ఉండి పోవడంతో ఇందిరా గాంధీ మరింతగా చెలరేగి పోతున్నారని ఆ కరపత్రం ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘బ్రిటిష్‌ ‌పాలకులకైనా అంతరాత్మ ఉందేమో కానీ కాంగ్రెస్‌ ‌పార్టీకి, దాని పాలకులకు ఎక్కడా అంతరాత్మ, దయాదాక్షిణ్యాలు ఉన్న దాఖలాలు కనిపించలేదు. చరిత్ర పుటల్లో ఇందిరా గాంధీ ఒక నియంతగా నిలిచిపోవడం ఖాయం’’ అని ఆ కరపత్రం పేర్కొంది.

పాంప్లెట్‌ ‌యోధుడు

ఇంతకూ ఆ కరపత్రాన్ని రూపొందించింది మరెవరో కాదు. సోషలిస్ట్ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియాకు నాయకుడు జార్జ్ ‌ఫెర్నాండెజ్‌. ‌గోపాల్పురా నుంచి ఆయన 1975 జూన్‌ 26‌న ఆ చారిత్రాత్మక కరపత్రాన్ని, విదేశాలకు పంపించారు. గోపాల్పురాలో ఆయన తన భార్య లీలా కబీర్‌ ‌కుటుంబ సభ్యులకు చెందిన ఒక బంగళాలో తలదాచుకున్నారు. దేశంలోని రాజకీయ నాయకులందరినీ ఇందిరా గాంధీ అరెస్టు చేయిస్తున్న సమయంలో ఆయన తప్పించుకుని గోపాల్పురా వెళ్లిపోయి, అజ్ఞాతంలో ఉండిపోయారు. అమెరికాలోని ఇండియన్స్ ‌ఫర్‌ ‌డెము క్రసీ అనే సంస్థ ఆ కరపత్రాన్ని 1975 జూలై 1 తిరిగి ముద్రించారు. అంటే, అది భారత దేశం నుంచి బయటపడి, లండన్‌ ‌చేరుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లడానికి వారం రోజులకు పైగా పట్టింది. ఈ కరపత్రానికి ఒక ఉపోద్ఘాతం కూడా ఉంది.

ప్రజాస్వామ్యం గురించి, నిరంకుశత్వం గురించి మహాత్మా గాంధీ, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, ‌రాం మనోహర్‌ ‌లోహియా వంటి వారు చెప్పిన అక్షర సత్యాలను ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఇటువంటి నిరంకుశ ధోరణులను ప్రదర్శించడంలో వింతేమీ లేదని, ఆమె 1966 నుంచి ఈ విధమైన ధోరణులను ప్రదర్శిస్తూనే ఉన్నారని అంటూ, ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత నుంచి పార్టీని అవకాశవాదులు, ఫిరాయింపు దార్లు, కాలక్షేపరాయుళ్లు, భజనపరులు, సంఘ వ్యతిరేక శక్తులతో నింపేయడం ప్రారంభించారని ఆ కరపత్రం వివరంగా పేర్కొంది. ఎమర్జెన్సీని ఒక చీకటి యుగంగా, ఇందిరాగాంధీని ఒక దుష్ట శక్తిగా కూడా ఫెర్నాండెజ్‌ ఈ ‌కరపత్రంలో అభివర్ణించారు. అసత్యాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో ఆమె గ్లోబెల్‌ను మించి పోయారని, ఆమె సాగించిన దమనకాండ, ఊచకోతలను చూస్తే ఉగాండా నాయకుడు ఇడీ అమీన్‌ ‌కూడా నిర్ఘాంతపోతాడని ఆయన పేర్కొన్నాడు.

ఇక 1971 నాటి ఎన్నికల సమయంలోనే ఆమెలోని నిరంకుశ ధోరణులు బయటపడ్డాయని, ఆమె ఒక మీసాలు లేని హిట్లర్‌గా వ్యవహరించారని, అనేక రాష్ట్రాల్లోకమ్యూనిస్టు, సోషలిస్టు నాయకులను అరెస్టు చేయించారని, కార్మిక సంఘాలను మూసే యించారని ఆయన పేర్కొన్నారు. అప్పటి రైల్వే మంత్రి ఎల్‌.ఎన్‌. ‌మిశ్రాను హత్య చేయించడం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కారు మీద బాంబులు విసరడం వంటి సంఘటనలను ఆయన ఉదహరిస్తూ, ప్రతిపక్షాలు గనుక అధికారంలోకి వచ్చే పక్షంలో తన బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఊచకోతలు, అవినీతి వ్యవహా రాలన్నీ వెలుగులోకి వస్తాయని, తనను జైలుపాలు చేయడం ఖాయమని భయపడి ఆమె దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించారని ఫెర్నాండెజ్‌ ‌పేర్కొన్నారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్న ప్రజలు ఆమెకు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని, ప్రస్తుతం గుసగుసలుగా సాగుతున్న ఇందిర వ్యతిరేక ప్రచారం త్వరలో ప్రభంజనంగా మారడం ఖాయమని ఫెర్నాండెజ్‌ ‌చివరిలో హెచ్చరించారు.

- జి.రాజశుక, సీనియర్‌ ‌జర్నలిస్ట్
- జాగృతి సౌజన్యంతో ..

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Ritam తెలుగు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ritam తెలుగు:

Share