Kondamadugula Sudhakar Reddy

Kondamadugula  Sudhakar Reddy Entrepreneur

09/07/2025

మాజీ సీఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, కార్యకర్తలు.

08/07/2025
03/07/2025

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనే...
03/07/2025

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు.

వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 140 రోజులుపాటు అక్రమ నిర్బంధంలో వంశీ.

కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్‌.జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన సత్తెనపల్లికి చ...
02/07/2025

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్ధన్‌ రెడ్డి తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్‌ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, కుటుంబ సభ్యులు

ఇటీవల శ్రీ వైయస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా సత్తెనపల్లిలో గుండెపోటుకు గురై ప్రాణాలు కొల్పోయిన జయవర్ధన్‌ రెడ్డి

జయవర్ధన్‌ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేత

జయవర్ధన్‌ కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన  చీలి సింగయ్య భ...
02/07/2025

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు

ఇటీవల శ్రీ వైయస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన చీలి సింగయ్య

సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేత

సింగయ్య కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా....

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత...
25/06/2025

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం.

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు హాజరు.

‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ..
‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో వైయస్సార్‌సీపీ 5 వారాల బృహత్తర కార్యక్రమం.
దీనికి సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభం.

*కార్యక్రమంలో శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం. ముఖ్యాంశాలు:*

ప్రభుత్వంపై వ్యతిరేకత. తప్పుదోవ కుట్ర:
– రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోంది.
– చంద్రబాబునాయుడుగారు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్‌ పాలన చూస్తున్నాం.
– గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం.
– అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.

అన్ని వ్యవస్థలు విధ్వంసం:
– మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం.
– కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.

అదే ఈ కార్యక్రమం. లక్ష్యం. ఉద్దేశం:
– ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి.
– చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్‌ కూడా కట్‌ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు.
– ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం.
– దీని పేరు.. ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’

చంద్రబాబు హామీలు. బాండ్లు:
– ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్‌ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్‌ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్‌ వస్తుంది.
దానిపై ఏమని ఉంటుంది అంటే..
– చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ సంతకం చేశారు.
– ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు.
– తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్‌ నుంచే ఆ మొత్తం అందుతుంది.

ప్రలోభాలు. పచ్చి మోసం:
– అలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు.
అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం.
– అందుకే ప్రజలంతా డిమాండ్‌ చేయాలి. మాకు జూన్‌ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.

ఇవన్నీ ఎగ్గొట్టారు:
– ఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఆరు త్రైమాసికాలు పెండింగ్‌. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు.
– మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్‌.
– ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు.
– చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేనే లేదు.

5 వారాల కార్యక్రమం:
– వీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం.
– తొలుత పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్‌ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది.
– రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్‌.
నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలి.
– ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.

– చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
– క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే.. ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి.
– గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది.
– అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్‌ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు.
– ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు.

– అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.
– ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
– తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.

ప్రజలతో మమేకం కావాలి:
– ఏడాది గడిచింది. హానీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి.
– ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.

ఇది రాక్షస రాజ్యం. అందుకే..:
– ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు.
– కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.

చివరగా..
– ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు.
– మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు.

Yoga not only heals body but also mind -  YS Jagan
21/06/2025

Yoga not only heals body but also mind - YS Jagan

19/06/2025

Ex CM, YSRCP Chief Sri YS Jagan Mohan Reddy Sensational Press Meet

రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజంఎన్నికల ఫలితాల నాటి నుంచే రెడ్‌బుక్‌ రాజ్యాంగం దాని ఫలిత...
18/06/2025

రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం
:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

ఎన్నికల ఫలితాల నాటి నుంచే రెడ్‌బుక్‌ రాజ్యాంగం
దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య
ఏడాది కాలంగా శోక సముద్రంలో కుటుంబం
దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
:సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత, దారుణ వేధింపునకు గురై ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌.
అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌.

మా పార్టీలో మీ వర్గానికి చెందిన వారుండకూడదా?
వైయస్సార్‌సీపీలో కమ్మ కులస్తులు ఉండడం తప్పా?
ఏం పాపం చేశారని వారందరినీ వరసగా వేధిస్తున్నారు
వేధింపులకు గురవుతున్న వారందరి పేర్ల ప్రస్తావన
కమ్మ వాళ్లు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా?
:గట్టిగా నిలదీసిన శ్రీ వైయస్‌ జగన్‌

అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేనే లేదు
అందరినీ మోసం చేసి, వెన్నుపోటు పొడిచారు
ప్రజలు, దేవుడు తప్పక మొట్టికాయలు వేస్తారు
:శ్రీ వైయస్‌ జగన్‌ చురక

ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదు. ఇది వాస్తవం
ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులకు చెబుతున్నా
ముఖ్యంగా కొందరు పోలీసు అధికారుల తీరు హేయం
మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది. వారికి సినిమా చూపిస్తాం
తప్పు చేస్తున్న వారందరినీ బోనులో నిలబెడతాం
:రెంటపాళ్లలో మీడియా మీట్‌లో శ్రీ వైయస్‌ జగన్‌

రెంటపాళ్ల. పల్నాడు జిల్లా:
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, దాని ఫలితమే రెంటపాళ్లలో ఉప సర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలోని కమ్మ వర్గానికి చెందిన నాయకులను దారుణంగా వేధిస్తున్నారన్న శ్రీ వైయస్‌ జగన్, వారందరినీ ప్రస్తావించారు. అసలు ఏం పాపం చేశారని వారిని వేధిస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

అందుకు నిదర్శనం ఇవే:
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న నిదర్శనం ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు (కొర్లకుంట వెంకటేశ్వరరావు) అన్న. ఈ అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్‌. ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు? ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనడానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం.
సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వెంకటేశ్వర్లు అన్న మా పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్‌. పోలింగ్‌ రోజు నుంచే ఇక్కడ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నదానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది.
పోలింగ్‌కు ముందు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు.

అప్పుడు ఏం జరిగింది?:
ఆవాళ్టి నుంచి పరిస్థితి గమనిస్తే, 2024 జూన్‌ 4న, అంటే కౌంటింగ్‌ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో, నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుని పోయారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే ఆయనను సెల్‌లో వేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలు కాగానే, ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు.
అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో నాగమల్లేశ్వరరావును బెదిరించిన సీఐ రాజేష్, ఆయన ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచిపెట్టాలని, లేకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్‌ 4న కౌంటింగ్‌ పూరై్తనా, మర్నాడు 5వ తేదీ రాత్రి వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్‌లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. ఇంకా ఆయన మీద చెయ్యకూడని నేరాలన్నీ కూడా చేశారు.

నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య:
జూన్‌ 5వ తేదీ రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత గ్రామానికి వెళ్లని నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి చేరాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి, స్టేషన్‌లో పోలీసుల బెదిరింపు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్‌ 9న నాగమల్లేశ్వరరావు చనిపోయాడు.

దీనికి బాధ్యులెవరు?:
నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉంది. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న అన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు?

ఎవరెవరిపై చర్య తీసుకున్నారు?:
వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారి మీద ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు అని అడుగుతున్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్‌ తీసుకున్నారని చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తూ.. నిలదీస్తున్నా.
ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న ప్రైవేటు కంప్లయింట్‌ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో ఎక్కడా లేదు.

చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ:
ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే ఆయన హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిల్చిన సీఐ, ఎస్‌ఐ ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచిపెట్టారు.
మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు మళ్లీ లక్మీనారాయణను స్టేషన్‌కు పిల్చి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కల ఉన్మాది. నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా.
‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’.
గుత్తా లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిల్చిన డీఎస్పీ హనుమంతరావు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైయస్సార్‌సీపీలో ఎలా ఉన్నావ్‌? ఎందుకు ఉన్నావ్‌?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. అంతే కాదు, తప్పుడు సాక్ష్యాలతో జైలుకు కూడా పంపుతానని బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గుత్తా లక్ష్మీనారాయణ, పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీసు శాఖలో కొందరు పని చేస్తున్నారు? వారిని చంద్రబాబు, లోకేష్‌ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారు? అని సూసైడ్‌ అటెమ్ట్‌ వీడియోలో చెప్పిన లక్ష్మీనారాయణ, ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.

కమ్మ వారు మా పార్టీలో ఉండకూడదా?:
వెంకటేశ్వర్లు, ఆయన కొడుకు నాగమల్లేశ్వరరావు విషయమైతేనేమి. లేదా లక్ష్మీనారాయణ విషయం అయితే ఏమి.. నేను చంద్రబాబుగారిని సూటిగా ఒక విషయం అడుగుతున్నాను. ‘ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా?. కమ్మ వారు పుట్టింది కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికేనా?’.
అసలు కమ్మ వారు కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికే పుట్టారంట!. చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇది కేవలం చంద్రబాబుగారికి మాత్రమే చెల్లు.
ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని తనను పొట్టన పెట్టుకున్నారని చంద్రబాబును అడుగుతున్నా. ఏం పాపం చేశాడని ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు?

అసలు వారంతా ఏం పాపం చేశారు?:
ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజులపాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్‌ వస్తే.. బెయిల్‌ వచ్చే వరకు గమ్మున ఉంటారు. బెయిల్‌ రాగానే, వెంటనే ఇంకో కేసు పెడతారు. అలా మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది.. వంశీ ఇంకా చంద్రబాబుగారి శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఆయన ఏం పాపం చేశాడని అడుగుతున్నాను. ఒకదాని తర్వాత మరొకటి వరసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.
ఏం పాపం చేశారని కొడాలి నానిని. మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కూడా. ఏం పాపం చేశాడని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు?. ఇంకా ఏం పాపం చేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే 9 కేసులు పెట్టారు. అలా ఆయన్ను ఎందుకు హింసిస్తున్నారు?.
ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒకే ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్‌ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.
ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
ఏం పాపం చేశాడని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా, వెళ్లగొట్టే కార్యక్రమం చేశారు. తనను కూడా బెదిరించి, తప్పడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు?. ఇంకా ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు?.
ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మీద అక్రమ కేసులు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్‌ పోసాని కృష్ణమురళిని నెల రోజుల పాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు.
మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్‌కి అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెలరోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి చొక్కా విప్పించి లోకేష్‌ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని మరో సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు.

మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?:
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. ‘ఏమయ్యా చంద్రబాబూ, కమ్మ వారంతా నీకు ఊడిగం చేయడానికే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం’.
మీరంతా గజదొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని నీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అని అనిపిస్తోంది.
చంద్రబాబుని ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తూ ఆయన్ని వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్‌ మీడియా మొత్తం కలిసి చంద్రబాబుని వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా? అని ప్రశ్నిస్తున్నా.

ఆ అ«ధికారులకు ఇదే నా మాట:
ఈరోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్‌ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం.
ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్‌ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ప్రతి అధికారికీ ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు, మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా.

ఆరోజు తొందర్లోనే వస్తుంది:
సీఐ రాజేష్‌ మీద నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నా.
చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్‌ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది అని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Kondamadugula Sudhakar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kondamadugula Sudhakar Reddy:

Share