తెలుగు వాళ్ళం - We All Telugu

తెలుగు వాళ్ళం - We All Telugu దేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న తెలుగు వారారందరు ఈ పేజీ ద్వారా ఏకం కావాలి, అందరూ లైక్ ఫాలో చేయండి

విదేశాల్లో ఇతర ప్రదేశాల్లో వున్న మన తెలుగు వారందరు ఇ పేజి ద్వార ఏకం కావాలని కోరుకుంటూ చేస్తున్న చిన్న ప్రయోగం దయచేసి లైక్ చేసి ఫాలో అవ్వండి

నిన్నటి నుంచి  తుపాను 🌧🌧🌧🌫🌫మీద ఒకటే  Reels, memes.  ఇంకెప్పుడూ వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది  Waiting అని comedy reels.  ...
29/10/2025

నిన్నటి నుంచి తుపాను 🌧🌧🌧🌫🌫మీద ఒకటే Reels, memes. ఇంకెప్పుడూ వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది Waiting అని comedy reels. 🤫🤫🤫🤫

దేని మీద అయినా comedy Reels memes వేయండి కాని ప్రకృతి🌏🌏🌏🌏 మీద & అమ్మ మీద కాదు. ఒక్క సారి ప్రకృతి కన్ను ఎర్ర చేస్తే 😡😡😡😡 ఇంకా ఏమీ ఉండదు చూడడానికి కూడా. Hud Hud తుపాను దగ్గర నుంచి చూశా నాకు బాగా experience. 11 సంవత్సరాలు అయినా ఆ గాలి🌫🌫🌫 Sound నా చెవులలో ఇంకా ప్రతి
ధ్వనిస్తుoది అంటే నమ్మoడి.

తుపాను వస్తే ఏమవుతoధో వరి అరటి🌾🌾🌾🌴🌴🌴 ఇంకా చాలా రకాల పంట వేసి వారం రోజులు లో కోత కి వచ్చిన రైతు ని అడిగితే తెలుస్తుంది..
విజయ దశమి కి బ్రీడింగ్ start చేసి కోడి పిల్లలు 🐤🐤🐤🐤🐤 చేయించిన వారి ని అడిగితే తెలుస్తుంది.
రొయ్య పిల్ల 🦐🦐🦐🦐🦐🦐వేసి 30 రోజులు దాటిన రైతులు ని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది ఎంత నష్టం వస్తుందో అని. 🥲🥲🥲🥲🥲

ప్రకృతి విలయతాండవం చూడాలని అనుకోవద్దు.🙏🙏🙏

Be Careful with Nature.🙏🙏🙏🙏🙏🙏🙏

పొదలకూరు మండలం మర్రిపల్లి వద్ద బెంగుళూరుకు పోయే బస్సులో పొగలు రావడంతో బస్సు ఆపేశారు .  బస్సులో ప్రయాణికులను గమ్యానికి చే...
26/10/2025

పొదలకూరు మండలం మర్రిపల్లి వద్ద బెంగుళూరుకు పోయే బస్సులో పొగలు రావడంతో బస్సు ఆపేశారు .
బస్సులో ప్రయాణికులను గమ్యానికి చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒకరోజు నేను హైదరాబాద్ కి వెళ్లాల్సి వచ్చి 🚌 స్లీపర్ ఏసీ బస్ బుక్ చేశాను. రాయచోటి లో బస్సు ఎక్కాను. రాయచోటి - కడప మధ్యలో ...
26/10/2025

ఒకరోజు నేను హైదరాబాద్ కి వెళ్లాల్సి వచ్చి 🚌 స్లీపర్ ఏసీ బస్ బుక్ చేశాను. రాయచోటి లో బస్సు ఎక్కాను. రాయచోటి - కడప మధ్యలో 🏞️ గువ్వల చెరువు ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ లో నేను ఎక్కిన బస్ మా ఎదురుగా వెళ్తున్న 🚗 ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కార్ ని గుద్దింది. కార్ వెనుక అద్దం పగిలిపోయింది 🪞💥. వెనుక భాగం లోపలికి నొక్కుకుపోయింది. లోపల ఒక 👩‍❤️‍👨 ఎంగ్ కపుల్, వారి 👶 పాప (నెలల వయసు) & ఒక 👵 పెద్దావిడ ఉన్నారు. అదృష్టం బావుండి 🙏 అందరూ సేఫ్‌గా ఉన్నారు.

ఇది పూర్తిగా బస్ డ్రైవర్ తప్పు అని తెలిసి, వెంటనే నేను నా సీట్ వద్ద నుంచి వచ్చి డ్రైవర్‌ని అరిస్తూ 😡 బస్ ఆపాను. కార్ వారి తరపున మాట్లాడి డ్రైవర్‌ని చెడా మడా తిట్టి, బస్ ఆఫీస్ కి ☎️ ఫోన్ చేశాను. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇది మామూలు విషయమే అన్నట్టు వ్యవహారించారు. డ్రైవర్ ఒకవైపు “నాదేం తప్పు లేదు, బ్రేక్స్ సరిగ్గా పడట్లేదు” అన్నాడు.
“బ్రేక్స్ సరిగ్గా పడని బస్సుని ఎందుకు తెచ్చావు రా లుచ్చా!” 😤 అని తిట్టాను. అలా తిట్టినందుకు నా పై చెడా మడా అరిచాడు.
ఒక్క పాసెంజర్ కూడా 😶 నోరెత్తి డ్రైవర్ నిర్లక్ష్యం పై మాట్లాడలేదు.

“మీ సంగతి చెప్తా ఉండండి” అని ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకంతో దగ్గరలో ఉన్న 👮‍♂️ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. బస్సును నేరుగా స్టేషన్ కి తీసుకువెళ్ళాను.
అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నారు. 📞 పై అధికారులతో మాట్లాడి “ఆ కార్ ఓనర్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి” అని చెప్పాడు.
కనీసం ఆ బస్ డ్రైవర్ స్టేట్మెంట్ గానీ, పాసెంజర్ స్టేట్మెంట్ గానీ రికార్డ్ చేయలేదు.
CI తో మాట్లాడాను. “మా వాళ్ళు చూసుకుంటారు సర్” 🙄 అని భరోసాగా మాట్లాడాడు.

ఒకవైపు నాకు ఆ డ్రైవర్ డ్రైవింగ్ & బస్ కండిషన్ పై 😟 నమ్మకం లేదు.
స్టేషన్ వాళ్ళు దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు అనిపించలేదు.

దీన్ని ఒక ఇష్యూ చేయాలనీ వెంటనే SP కి కాల్ చేయబోయా. కానీ బస్ లో ఉన్న పాసెంజర్స్ చాలా మంది
“ఇప్పుడు ఏమయ్యింది? ఎందుకు ఇక్కడ అనవసరంగా హడావిడి చేస్తున్నారు? మాకు లేట్ అవుతోంది, పదండీ” 🙄 అన్నారు.
ఆ కార్ లో ఉన్న వ్యక్తుల తరపున గానీ నాకు గానీ ఏ పాసెంజర్ సపోర్ట్ గా మాట్లాడకపోగా 😔 బస్ వాడిని వెనకేసుకు వచ్చారు.

అంతలో కానిస్టేబుల్ వచ్చి “బస్ ఓనర్ తో మాట్లాడి కార్ రిపేర్ ఖర్చులు భరిస్తారని చెప్పారు” అని అన్నాడు.
ఇక చేసేదేమీ లేక ఆ కార్ యజమానికి పోలీసులు, కోర్టులు అన్న భయం 😞 ఉండడంతో రాజీకి వచ్చి వెళ్ళిపోయాడు.
(తర్వాత వారం రోజులకు ఆ కార్ వ్యక్తి ఫోన్ చేసి 📱 “ఆ బస్ ఓనర్ నాకు రిపేర్ ఖర్చులు కూడా ఇవ్వలేదు సర్” అని బాధ పడ్డాడు 😢.)

నేను బస్ ఆఫీస్ కి ఫోన్ చేసి, “డ్రైవర్ ని మార్చండి లేదా నన్ను వేసే బస్ ఎక్కించండి” అని అడిగాను.
వాళ్ళు ఒప్పుకోలేదు.
ఆ బస్సులో ఉన్న పాసెంజర్స్ ని జాలిగా చూసి 😔, నేను వెంటనే నా హైదరాబాద్ ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని 🛑
అర్ధరాత్రి RTC బస్ పట్టుకొని ఇంటికి వెళ్లిపోయా 🏠.

ఇంటికి వెళుతూ ఒక 10 నిమిషాల్లోనే కన్స్యూమర్ ఫోరమ్ హెల్ప్ లైన్ 📲 లో ఒక కంప్లైంట్ రైస్ చేశాను.
తర్వాత 2 రోజులకు నా టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. 💰

ఇదే కాదు, సీట్ బాగాలేకపోయినా, బస్ లేట్ గా వచ్చినా, ఇస్తాము అని చెప్పిన సౌకర్యాలు ఇవ్వకపోయినా, Window డోర్ రాకపోయినా, సీటు మార్చుకొని, 30 - 100% రిఫండ్స్ పొందిన సందర్భాలు బోలెడు ఉన్నాయి.

---

నేనెప్పుడైనా ఒక వస్తువు కొని దాని సర్వీసు బాగాలేకపోతే వెంటనే కన్స్యూమర్ ఫోరమ్ కి హెల్ప్ లైన్ ద్వారా కంప్లైంట్ చేస్తాను.
అలా కంప్లైంట్ చేయడం ద్వారా Flipkart, Amazon, Private Travels, Swiggy, TV, షూస్, సబ్బు, జెండూ బామ్... ఇలా చెప్పుకుంటూ పోతే
నేను వాడిన 10 రూపాయల పెరుగు ప్యాకెట్ 🥛 బాగాలేకపోతే కూడా రిఫండ్ పొందిన సందర్భాలు ఉన్నాయి 😅.

కన్స్యూమర్ ఫోరమ్ ద్వారా మనం ఎలా రిలీఫ్ పొందవచ్చో 📚 “నువ్వు నేను రాజ్యాంగం” పుస్తకంలో ఒక చాప్టర్ గా రాసాను.

---

నేను చెప్పొచ్చేది ఏంటంటే 👉
మనము సెల్ ఫోన్ లో 📱 సొల్లు రీల్స్ చూసే 5 నిమిషాల్లో మనం కొని ఉపయోగించుకునే సర్వీస్ నాసిరకం అయితే
సులభంగా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
కోర్టుకు వెళ్లి పోరాటం చేయకుండానే “ఆయా కంపెనీల గుడ్ విల్ దెబ్బ తినకుండా” మనకు తగిన రిఫండ్స్ ఇస్తారు. 💸

కేవలం ప్రయివేటు మీద మాత్రమే కాదు ⚖️ ప్రభుత్వ సంస్థల మీద కూడా కన్స్యూమర్ ఫోరమ్ కి వెళ్ళవచ్చు.

---

ఇదంతా చదివి, చేతిలో 📱 ఫోన్, 🧠 గూగుల్ & 🤖 చాట్ GPT లాంటి AI లు వాడుతూ....
“కన్స్యూమర్ ఫోరమ్ కి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి?” అని అడుగుతారు చూడూ — వాళ్లే అసలైన బద్ధకస్తులు 😴.
ప్రశ్నించడం, తెలుసుకోవడం చేతకాని మూర్ఖులు 🤦‍♂️.

---

మనం మనకు ప్రభుత్వం గానీ, ప్రయివేటు గానీ ఇచ్చే సర్వీసుల మీద ప్రశ్నించాలి ❓
నాసిరకం అని తెలిస్తే కోర్టుల దాకా వెళ్ళగలగాలి 💪
“మా వరకూ రాలేదు లే” అని గోడమీద పిల్లిలా 🐈 ఉంటే
గుంపులో తెడో ఒకరోజు మనం కూడా అందరితో పాటు బలి అవ్వాల్సిందే ⚰️.

ఎవరైనా ప్రభుత్వాలపై ప్రశ్నించినపుడు పార్టీల వారీగా విడిపోయి అమ్మనా బూతులు తిట్టే 😡 లుచ్చా సమాజం లో మనం ఉన్నాము.

---

పాలించేది యే పార్టీ అయితే ఏంటి? 🗳️
ప్రశ్నించే పాయింట్ లో నిజం ఎంత అనే చర్చ జరగాలి.
ప్రశ్నలో ఉన్న సమస్య పై చర్చ జరగాలి. 🔍

అంతేగానీ ❌
“అసలు ప్రశ్నించడానికి నువ్వు ఎవడ్రా??”
“నీకు ఏ అర్హత ఉంది??”
“నువ్వు ఫలానా ఉద్యోగివి — మూసుకొని ఉండు!”
“నువ్వు ఫలానా పార్టీ వాడివి — ముందు నీ నాయకుణ్ణి ప్రశ్నించు!”
అనే సమాధానాలు, తిట్లు, బండ బూతులు 🤬 వాడే మనుషులు ఎక్కువ అయ్యారు.

---

⚔️ ప్రశ్నించండి. ప్రశ్నే ఆయుధం. ప్రశ్నించడమే ఆధునికత!! 🚩

(❌ పార్టీల పరంగా, కులమతాల పరంగా విడిపోయి ఒకళ్ళనొకల్లు తిట్టుకునే ఈ జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదు 🤦‍♀️.)

ఏపిఎస్ ఆర్టీసీ బస్ లో ప్రయాణం ఆలస్యం కావొచ్చు.. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటే సురక్షితం...
25/10/2025

ఏపిఎస్ ఆర్టీసీ బస్ లో
ప్రయాణం ఆలస్యం కావొచ్చు.. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటే సురక్షితం...

నెల్లూరు కావేరి బస్సు ప్రమాదం గురించి వివరంగా తెలుసుకుందాం:హాయ్ అందరికీ,ఈ సంఘటన గురించి స్పష్టంగా అర్థం చేసుకుందాం:ఈ ప్ర...
25/10/2025

నెల్లూరు కావేరి బస్సు ప్రమాదం గురించి వివరంగా తెలుసుకుందాం:

హాయ్ అందరికీ,
ఈ సంఘటన గురించి స్పష్టంగా అర్థం చేసుకుందాం:

ఈ ప్రమాదంలో పాలుపంచుకున్న బస్సు Scania మోడల్‌ది — Volvo కాదు. ఈ రెండు వేర్వేరు మోడల్స్.
ఈ వాహనం BS3 ప్రమాణాలకు అనుగుణంగా ఉంది, అంటే ఇందులో sensor-based engine system ఉండదు.

బస్సు రిజిస్ట్రేషన్ **ఒడిశా (DD)**లో జరిగింది, కానీ ఇది కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నడుస్తోంది.
దాని fitness certificate గురించి స్పష్టత లేదు, ఎందుకంటే Scania కంపెనీ 2018లో భారత్‌లో కార్యకలాపాలు ఆపేసింది.

మొదట ఇది seater busగా తయారు చేయబడింది, కానీ ట్రావెల్స్ నిర్వాహకుడు అనధికారంగా AC sleeper coachగా మార్చేశాడు.

ఆ మార్పులు చేసేటప్పుడు: • వెనుక ఉన్న emergency exit పూర్తిగా మూసేశారు
• Scania భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇతర నిర్మాణ మార్పులు చేశారు
• Speed limiter పెట్టలేదు
• Engine లేదా passenger cabin దగ్గర fire extinguisher లేదా fire suppression system కూడా లేదు

ఈ అనధికార మార్పుల వల్ల బస్సు యొక్క భద్రతా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, దాని ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

కర్నూలు వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలికొండకు చెందిన కుటుంబం ఆహుతి అయింది.  చాకలి...
25/10/2025

కర్నూలు వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలికొండకు చెందిన కుటుంబం ఆహుతి అయింది. చాకలికొండ గ్రామపంచాయతీ గొల్లవారి పల్లి గ్రామంకి చెందిన ఒకే కుటుంబం గోళ్ళ రమేష్ 35, గోళ్ళ అనూష 30, గోళ్ళ మన్విత 10, గోళ్ళ మనీష్ 12 మరణించారు..

ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో ,,,అజాత శత్రువులుగా ర...
25/10/2025

ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో ,,,

అజాత శత్రువులుగా రెండు దశాబ్ధలకు పైగా మస్కట్ లో మా అందరిమధ్య ఉండి ,, భర్త ఆనంద్ సాఫ్టువేర్ కంపెనీ లో ఉద్యోగము చేసుకుంటూ కొడుకు కూతురులును మంచిగా చదివించి ,, ఇండియా లో ఇంజనీరింగ్ అయ్యాక పాప చందన ను బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగము కు పెట్టి ,, ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లి కూతురును బెంగుళూర్ నుంచి తెచ్చి సెలవులు అయ్యాక కూతురు చందన ను తిరిగి బెంగుళూర్ వదిలేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన సంధ్య ...

తెల్లవారి అనుకోని దుర్ఘటన లో కూతురు చందన తో మంటల్లో కాలి పోవడము ...ఆనంద్ కు తీరని శోకము ,, క్షణకాలములో ఆశలు , ఊహలు బస్సు మంటల్లో కాలిపోవడము ,, ఏమని చెప్పాలి ??
తెలుగు కార్యక్రమాల్లో ఎంతో హుషారు గా పాల్గొని , అందరిని మంచిగా పలకరించే సోదరి సంధ్య మరి లేదన్న వార్త ,, మస్కట్ తెలుగు సమాజానికి తీవ్ర దిగ్బ్రాంతి మరియు శోకతప్తము అని చెప్పక తప్పదు ,,

తల్లీ కూతుర్ల ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపూర్తిగా ప్రార్ధిస్తూ ,, ఈ సమయములో మిత్రుడు ఆనంద్ కు కుమారుడు వల్లబ్ కు ప్రగాఢ సానుభూతి తెల్పుతూ ...మీ ఈ కష్ట సమయములో భగవంతుడు ఆత్మ స్టయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ,
మీ *మస్కట్ కుటుంబ* సభ్యులు

కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం 25 మందికిపైగా మృతిపూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుబస్సులో చిక్కుకున్న 25 మం...
24/10/2025

కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం 25 మందికిపైగా మృతి
పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బస్సులో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం..

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(DD 01 AN 9190)

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం

ఈ నిర్లక్ష్యం ఖరీదు 30 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి..ఇలాంటి ప్రమాద కారకులను ఎన్‌కౌంటర్ చేయాలని ఎందుకు డిమాండ్ చేయరు?...
24/10/2025

ఈ నిర్లక్ష్యం ఖరీదు 30 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి..

ఇలాంటి ప్రమాద కారకులను ఎన్‌కౌంటర్ చేయాలని ఎందుకు డిమాండ్ చేయరు???

హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న 'వేమూరి కావేరి ట్రావెల్స్' వోల్వో బస్సు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో బైకును ఢీకొట్టి అగ్నికి ఆహుతైంది.ఈ ప్రమాదంలో ఇరవై మంది సజీవదహనం అయ్యారు.

* బస్ డయ్యు డామన్ లో రిజిస్ట్రేషన్ జరిగింది
* ఫిట్నెస్ లేదు
* ఇన్సూరెన్స్ లేదు
* టాక్స్ వాలిడిటీ లేదు
* ఆల్ ఇండియా పర్మిట్ లేదు
* కేవలం సైబరాబాద్ పరిధిలోనే 16 ట్రాఫిక్ వయలేషన్ చలాన్లు పెండింగులో ఉన్నాయి (యాజమాన్యం ఒత్తిడి, సిబ్బంది నిర్లక్ష్యం)
* తెలంగాణ,ఏపీ,కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ప్రతిరోజూ తిరుగుతోంది

అయినా పట్టుకున్నోడు లేడు, అడిగినోడు లేడు.
యాజమాన్యం కక్కుర్తి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు దాదాపు ఇరవై కుటుంబాలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఈ నష్టాన్ని ఎవడు పూడ్చుతాడు?
ప్రమాదానికి బాధ్యులైన వాళ్లను ఎవడు శిక్షిస్తాడు?

అన్నీ సక్రమంగా ఉండి నష్టం జరిగితే ప్రమాదం అనుకోవచ్చు కానీ నిర్లక్ష్యం కారణంగా జరిగితే మాత్రం నేరముగానే భావించాలి..
నేరస్తులను కఠినంగా శిక్షించాలి.

16/10/2025

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగు వాళ్ళం - We All Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share