17/08/2025
*పత్రికా ప్రకటన*.
తేదీ : 17-08-2025
హైదరాబాద్..
*ఊరూరా వాడవాడలా బహుజన బతకమ్మ ని ఉద్యమంగా జరుపుకుందాం*.
***************************
*బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి లోని (కమ్యూనిటీ హాల్) యందు బహుజన బతుకమ్మ సమాలోచనల సమావేశం నిర్వహించడం జరిగింది
*ఈ సమావేశానికి అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ లక్ష్మీ, కట్టా భగవంత రెడ్డిలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించడం జరిగింది*
ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.... పకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ - శాంతి స్వావలంబణను చాటుతూ బహుజన బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా పలువురు వక్తులు పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తీసుకున్న ఈ అంశాన్ని హాజరైన మిత్రులందరు ఈ సందర్భంగా అభినందించారు. తమ తమ గ్రామాల్లో బహుజన బతుకమ్మను నిర్వహించాలని నిర్వహణ కమిటీ వాళ్లను కోరడం జరిగింది. బతుకమ్మ ఉత్సవం కాదు ఉద్యమంగా కొనసాగించాలన్నారు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేయడం,ఆదివాసుల హక్కులను కాలరాయడం సరైంది కాదన్నారు. ఊరూరా వాడ వాడనా బహుజన బతుకమ్మ బ్యానర్లు వెలిసేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు** రచయిత :ఎనిశెట్టి శంకర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు:ఏపూరి మల్సూర్, పోతుల రమేష్, రాకేష్, సురేష్, రైతు-కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెల్తురు సదానందం, AIFTU రాష్ట్ర అధ్యక్షులు వై.మల్లేశం, PDSU (విజృంభణ) దిలీప్,POW (స్త్రీ విముక్తి ) నాయకురాలు : లావణ్య, మరియు, జగన్ రెడ్డి, సంతోష్, సాయిరాం, మన్నారపు నాగరాజు, పాలడుగు శ్రీను, మోహన్, జనార్ధన్, రాజు, బుల్లెట్ వెంకన్న, పాల్, రాజేశ్వరి, కల్వకుర్తి రాములు, పోచమల్లు, లలిత, భద్ర, యుగంధర్, నూతన్, పద్మ, శ్రీను, పురుషోత్తం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో...
బహుజన బతుకమ్మ నిర్వాహన కమిటీ.
అరుణోదయ విమలక్క, ప్రో:లక్ష్మి,కట్టా భగవంత రెడ్డి