16/10/2025
శ్రీ వారి జన్మ నక్షత్రం "స్వాతి నక్షత్రం" సందర్భంగా "స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ" ఈ నెల 22.10.25 ( బుధవారం ).🛕🚩
ప్రతినెలా శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమరాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా చెంచు లక్ష్మీ సమేతంగా వెలసిన స్తోత్రాద్రికి ( కదిరి కొండ ) "గిరి ప్రదక్షిణ" నిర్వహించడం జరుగుతోంది.కావున శ్రీ వారు భక్తులు 22.10.25 ( బుధవారం ) ఉదయం 6.00 గంటల లోపు "శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తూర్పు రాజ గోపురం" వద్దకు చేరుకొని పాదయాత్రగా బయలుదేరి కుమ్మరవాండ్ల పల్లిలో చెంచు లక్ష్మీ సమేతంగా వెలసిన స్తోత్రాద్రికి ( కదిరి కొండ ) అర్చకులు హారతి ఇచ్చిన అనంతరం గోవింద నామ స్మరణతో,హరినామ కీర్తనలతో శ్రీ వారి స్తోత్రాద్రి ( కదిరి కొండ ) గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున పాల్గొని ఆ శ్రీ వారి కృపకు పాత్రులు అవుదాం.
గమనిక : ఈ నెల 22.10.25 ( బుధవారం ) తేదీన శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు నాగార్జున రెడ్డి , మధుసూదన్ రెడ్డి , అమర్నాథ్ రెడ్డి,గోపీనాథ్ రెడ్డి , మణికంఠ నాయక్, వాసుదేవ రెడ్డి కదిరి కొండ ఆలయ ప్రాంగణం వద్ద ప్రసాద వితరణ (అల్పాహారం) ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.
ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!🙏🚩
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏🚩
ఇట్లు,
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి - కదిరి.