Chirala Lokal News

Chirala Lokal News చిటికలో చీరాల వార్తలను మీ ముందుకు తెచ్చే ఫేస్ బుక్ పేజ్ ఇది

విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన చీరాల రూరల్ సీఐ  శేషగిరిరావు,ఈపూరుపాలెం ఎస్సై  చంద్రశేఖర్,వేటపాలెం ఎస్సై జనార్దన్ ల...
15/08/2025

విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు,ఈపూరుపాలెం ఎస్సై చంద్రశేఖర్,వేటపాలెం ఎస్సై జనార్దన్ లు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.జిల్లా కలెక్టర్ వెంకట మురళి,ఎస్పీ తుషార్ డూడీ,చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య కూడా పాల్గొన్నారు

చీరాల ఎన్.ఆర్.పి.ఎం బాయ్స్ హై స్కూల్లో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశ...
15/08/2025

చీరాల ఎన్.ఆర్.పి.ఎం బాయ్స్ హై స్కూల్లో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్కూల్ హెడ్మాస్టర్ సాల్మన్,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను చైర్మన్ విద్యార్థులకు వివరించారు.ఘన చరిత్ర కలిగిన ఈ హైస్కూల్ ని ఇంకా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
15/08/2025

చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

14/08/2025

యువతలో దేశభక్తిని నింపేలా చీరాల నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ గురువారం పట్టణంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన 79 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు సాగింది.ఆర్డీవో చంద్రశేఖర నాయుడు,మున్సిపల్ కమిషనర్ రషీద్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు,ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ రావు,ఇతర అధికార, అనధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన సభలో మహేంద్ర నాథ్ జాతీయ జెండా విశిష్టతను వివరించారు.దేశ ప్రజలందరూ జాతీయ జెండాను గుండెలకు హత్తుకోవాలని పిలుపునిచ్చారు.ఆ జెండానే మనకందరికీ అండని మహేంద్ర నాధ్ చెప్పారు.ఇటీవలి కాలంలో చీరాలలో యువతను ఉత్తేజపరిచే క్రీడా కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తున్న మహేంద్ర నాధ్ తిరంగా ర్యాలీని కూడా తనదైన శైలిలో నిర్వహించి అందరి ప్రశంసలు చూరగొన్నారు.తద్వారా తన తండ్రి ఎమ్మెల్యే కొండయ్య ఇమేజ్ ని మహేంద్ర నాథ్ పెంచుతున్నారనడంలో సందేహం లేదు.

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు గ్రెగోరి ఆధ్వర్యంలో  చీరాలకు చెందిన పలువురు  సీనియర్  నేతలు గ...
14/08/2025

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు గ్రెగోరి ఆధ్వర్యంలో చీరాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు గురువారం విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని ఆమె వారికి సూచించారు.టిడిపి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల ఉద్బోధించారు.కాంగ్రెస్ కు మంచి రోజులు ఉన్నాయన్నారు

13/08/2025

మార్కాపురం టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన లారీ యజమానులు బుధవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎమ్మెల్యే టన్ను ఇసుకను 950 రూపాయలకు కొనుగోలు చేసి 1500 రూపాయలకు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు.ఈ క్రమంలో లారీ యజమానులను కూడా ఎమ్మెల్యే వేధిస్తున్నారని చెప్పారు.తమకు కలెక్టర్ న్యాయం చేయాలన్నారు

తనకు తన,మన అన్న భేదం లేదని,మత్స్యకారులు,రైతులు తనకు సమానమేనని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.సీ మౌత్ వివాదంపై బుధవారం ...
13/08/2025

తనకు తన,మన అన్న భేదం లేదని,మత్స్యకారులు,రైతులు తనకు సమానమేనని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.సీ మౌత్ వివాదంపై బుధవారం కలెక్టర్ రైతులు,మత్స్యకార ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఇరు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.ఎవరూ నష్టపోకూడదన్నదే తన అభిమతమన్నారు.ఈ విషయంలో తన తోడ్పాటు ఇరు వర్గాలకు ఉంటుందని ఎమ్మెల్యే కొండయ్య స్పష్టం చేశారు.

13/08/2025

ఈపూరుపాలెం స్టెయిట్ కట్ వద్ద సీమౌత్ పునరుద్ధరణ విషయమై జిల్లా కలెక్టర్ వెంకట మురళి రాజీ ఫార్ములా రూపొందించారు.మత్స్యకారులు,భూ యజమానుల ఆమోదంతో మలుపులతో కూడిన సీ మౌత్ పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ఆయన మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.వివాదాస్పమయిన ఈ సమస్యపై ఆయన బుధవారం రైతులు,మత్స్యకార ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఎస్పీ డూడీ, బాపట్ల,చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ కొండయ్య పాల్గొన్నారు.

చదువుపై ఆసక్తి లేక ఇంటి నుండి వెళ్లిపోయిన వేటపాలెం, దేశాయిపేటలకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులను ఎస్సై జనార్ధన్  బుధ...
13/08/2025

చదువుపై ఆసక్తి లేక ఇంటి నుండి వెళ్లిపోయిన వేటపాలెం, దేశాయిపేటలకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులను ఎస్సై జనార్ధన్ బుధవారం సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం సాయంత్రం వారు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆయన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారు గుంటూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.వారిని గుంటూరు నుండి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. తదుపరి తాసిల్దార్ ఎదుట హాజరు పరిచి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసు బృందం కృషి అమోఘం
--------------------------------------------

ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు అదృశ్యం కావడంతో చీరాల డిఎస్పీ మోయిన్ అప్రమత్తమయ్యారు. రూరల్ సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్సై జనార్ధన్, ప్రస్తుత ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులతో బృందం ఏర్పాటు చేశారు.జోరు వాన కారణంగా విద్యుత్తు లేకపోయినప్పటికీ ఈ పోలీసు బృందం సొంత ఏర్పాట్లు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించటం, అదృశ్యమైన విద్యార్థినుల మొబైల్ ఫోన్ నెంబర్లు ట్రాక్ చేయడం వాటి చర్యలు చేపట్టడంతో 24 గంటల్లోనే వారి ఆచూకీ దొరికింది.దీంతో ఈ పోలీసు బృందాన్ని ఎస్పి తుషారు డూడీ,చీరాల డి.ఎస్.పి మోయిన్ అభినందించారు.ఈమధ్యే వేటపాలెం ఎస్సై జనార్ధన్ ఇదే తరహాలో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కనిపెట్టడం తెలిసిందే.ఎస్సై జనార్థన్ పనితీరు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.

12/08/2025

చీరాల పట్టణాన్ని వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కుంభవృష్టి కురిసింది. దీంతో పట్టణం చెరువులా తయారైంది.డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు మున్సిపల్ ఆఫీస్ నుండే పరిస్థితి సమీక్షించారు.వర్షం కొద్దిగా తగ్గాక ఆయన పట్టణంలో పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేశారు.అవసరమైన చోట్ల సహాయక చర్యలు వెంటనే చేపడతామన్నారు.

చినగంజాం మండలం కుంకుడుచెట్లపాలెం గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఇంకొల్లు సీఐ రమణయ్య ఆధ్వర్యంల...
12/08/2025

చినగంజాం మండలం కుంకుడుచెట్లపాలెం గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఇంకొల్లు సీఐ రమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు.ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.1,40,520 లను స్వాధీనపరుచుకున్నారు.డ్రోన్ సాయంతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టామని,ఎక్కడ పేకాట ఆడినా తమకు తెలిసిపోతుందని సీఐ చెప్పారు.ఎస్సై రమేష్ పాల్గొన్నారు.

Address

Kanigiri

Telephone

+919642424275

Website

Alerts

Be the first to know and let us send you an email when Chirala Lokal News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chirala Lokal News:

Share