17/09/2025
*ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు*
*జిల్లా కార్యవర్గ సమావేశంలో*
*టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్*
*మెదక్:* ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీవోభవన్లో ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పెండింగ్ బిల్లులు, కరువు బత్యం, నూతన పిఆర్సి మరియు ఆరోగ్య కార్డుల అమలుపట్ల ప్రభుత్వం గత 18 నెలలుగా తాత్సారం చేస్తుందని, ప్రభుత్వం వద్ద దాచుకున్న తమ సొంత డబ్బులు రాక ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులు అంకుంటిత దీక్షతో తమ విధులు నిర్వహిస్తున్నారని, ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులపై చిత్తశుద్ధితో వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. చార్మినార్ జోన్ సాధనకు త్వరలో అన్ని వర్గాల ఉద్యోగులతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘపరంగా వృత్తిపరంగా పదోన్నతులు పొందిన సభ్యులను శాలువాతో సన్మానించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మీనికి రాజ్ కుమార్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాయితి సంతోష్ ను నియామకం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షులు ఎండి ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు శివాజీ, కిరణ్ కుమార్, రాధా, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షులు శేషాచారి, ఏడుపాయల వనదుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు జంగం నగేష్, ఇరిగేషన్ ఫోరం కార్యదర్శి శ్రీ హర్ష, హెచ్ డబ్ల్యు ఓ ఫోరం కార్యదర్శి శేఖర్, ఏఈఓ ఫోరమ్ కార్యదర్శి రాజశేఖర్, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల తదితరు ఉద్యోగులు పాల్గొన్నారు.