18/07/2026
*దేశంలోనే తొలి భారీ క్రెడిట్ ఔట్రీచ్కు నరసరావుపేట వేదిక కావడం గర్వకారణం*
- *నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు*
నరసరావుపేట జులై 17:
నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ ఔట్రీచ్ (రుణ వితరణ) కార్యక్రమం పల్నాడు జిల్లా ఆర్థికాభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ. 3,216 కోట్ల రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కేంద్రంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, లబ్ధిదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రెడిట్ ఔట్రీచ్ కార్యక్రమం ద్వారా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, చేనేత కార్మికులు, స్వయం ఉపాధి రంగంలోని యువత, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని వివరించారు.ఈ కార్యక్రమాన్ని పల్నాడుకు తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని, కార్యక్రమం విజయవంతం కావడంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ విశేష కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.
దాదాపు 20 రోజులపాటు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా యంత్రాంగం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో పాటు ఇతర బ్యాంకుల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాల పంపిణీకి కృషి చేశారని ఆయన అభినందించారు.
పల్నాడు జిల్లాకు తొలిసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విచ్చేసి ప్రజల సంక్షేమం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జిల్లాకు గౌరవకారణమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు, దేశ ప్రజలు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు ఆశతో చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చూపిన ఆదరణ, ఆశీర్వాదాలే ఈ కార్యక్రమం ఘన విజయానికి కారణమని చెప్పిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా అభివృద్ధి, ప్రజల ఆర్థిక పురోగతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.