01/06/2022
నెల్లూరు సిటీ ఆనం కే
Pls like and share
https://www.facebook.com/104974455560714/posts/113839258007567/
*నెల్లూరులో వలసలు ఖాయం..!!*
- *సిటీ టీడీపీ అభ్యర్థిగా ఆనం..??*
- *కోటంరెడ్డి పరిస్థితి ఏంటీ..?
---
N3-న్యూస్
--
జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మరిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఒక గూటి పక్షులు మరో గూటికి మారినట్లు కొందరు తమ స్వార్ధం కోసం, అధికారం కోసం పార్టీలు మరెందుకు సిద్ధమయ్యారు. ఇందులో ముఖ్యంగా ఆనం కుటుంబం. ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో ఇది ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది.
2019లో వైసీపీ టికెట్ పై వెంకటగిరి MLA గా గెలుపొందిన ఆనం మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం పై, మాజీ మంత్రి అనిల్ పై పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారుతున్నారని, అందుకే ఈ ఆరోపణలు అనే సందేహం అందరిలో కలిగింది. దీన్ని బలపరిచేలా ఇటీవల ఒంగోలు లో జరిగిన టీడీపీ మహానాడు లో రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడంతో ఆనం పార్టీ మారడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.
---
*TD జనార్దన్ ని కలసిన ఆనం*
--
ఇంకో ఆసక్తికరమైన, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. టీడీపీ లో కీలకంగా ఉన్న TD జనార్దన్ రావు ను ఆనం రామనారాయణ రెడ్డి మహానాడు కు రెండు రోజులు ముందుగానే విజయవాడలో రహస్యంగా కలిసినట్లు పక్కా సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ లోని పెద్దలే చర్చించుకుంటున్నారు కూడా. అప్పుడే టీడీపీ లో ఆనం కుటుంబం చేరే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి రహస్య భేటీ క్రమంలోనే కైవల్య లోకేష్ ని కలిసిందని ప్రచారం కూడ జరుగుతోంది. దీన్ని ఆనం కొట్టిపారేసినా, నాకు సంబంధం లేదని తేల్చినా... TD జనార్దన్ ని కలిసింది మాత్రం పక్కా. అంతే కాకుండా కైవల్య రెడ్డి లోకేష్ ని కలిసొచ్చాక నెల్లూరు నగరంలోనే ఉంటోంది. తన తండ్రి నివాసం నుంచే జిల్లా టీడీపీ నేతలను కలుస్తోంది. ఇప్పటికే అనేకమంది ఆమెను టీడీపీ లోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని నగర, రూరల్ టీడీపీ నేతలు అంటున్నారు కూడా.. మరి ఇది దేనికి సంకేతం రామనారాయణ రెడ్డి మాత్రం చెప్పగలరు.
---
*సిటీ నుంచి బరిలో ఆనం*
--
ఆనం కుటుంబం కి టీడీపీ సొంత ఇల్లు లాంటిది. వారి రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు మారినా వచ్చే ఎన్నికలకు మాత్రం వారు సొంత గూటికి చేరుకోవడంతో ఎలాంటి సందేహం లేదంటున్నారు. మొదటి నుంచి వారు టీడీపీ నుంచి మూడు స్థానాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మాత్రం అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. ఆనం మాత్రం తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు టీడీపీ పెద్దలు( ఆనం ను వైసీపీ లోకి తీసుకెళుతున్న నేతలు) హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక కైవల్య వచ్చే ఎన్నికలకు ఆత్మకూరు నుంచి పోటీ చేయాలన్న కోరికను వెలుబుచ్చేసింది. ఇక మరో టికెట్టు పైనే ఎలాంటి హామీ లేదు.
---
*పాపం కోటంరెడ్డి*
నెల్లూరు సిటీ నుంచి MLA గా పోటీ చేయాలని, అసెంబ్లీలో "అధ్యక్ష్యా" అనాలన్నది టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరిక. అందుకోసం ఆయన చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. అటు జగన్, ఇటు అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేస్తున్నా... అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ప్రతీ సారి ఎవరో ఒకరు వచ్చి ఆ అవకాశాన్ని తన్నుకు పోతున్నారు. మొదటి నుంచి కోటంరెడ్డి వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని చంద్రబాబు కు ఆ పార్టీలోని పెద్దలే మోస్తున్నారు. అంతే కాకుండా నగరంలో సొంత క్యాడర్తో, సొంత అజెండాలో ముందుకెళుతున్నారని కూడా ఆ పార్టీ లోనివారే పార్టలోని పెద్దల వద్ద చెపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఈ సారి కూడా ఆనం రూపంలో కోటంరెడ్డికి ఝలక్ ఇచ్చేలా ఉన్నారు. దీంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎంటనేది ప్రశ్నఅర్ధకం. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో నెల్లూరు నగరం రాజకీయాలు కూడా భలే రంజుగా మారనున్నాయి.
--
- సునీల్. ఆర్
N3- న్యూస్
(కల్తీ లేని వార్తలు - కలకలం రేపే కథనాలు)
అతి త్వరలో మీ ముందుకు
--