Suneel journalist

Suneel journalist Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suneel journalist, Nellore.

*N3news.in*రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి*Subscribe For More Videos*
23/12/2022

*N3news.in*

రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే
-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి

*Subscribe For More Videos*

రోజ్‌మాండ్ లెక్క‌లు తెల్చ‌డమే-రేప‌టి నుంచి 2వ‌ర‌కు రోజ్‌మాండ్ పోలీసు క‌స్ట‌డి

*N3news.in*తల్లి కళ్లెదుటే కూతురు సజీవ దహనం -ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుం...
26/11/2022

*N3news.in*

తల్లి కళ్లెదుటే కూతురు సజీవ దహనం
-ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం
-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుందో..
-కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌ట‌న‌

*Subscribe For More Videos*

మ‌హిళ స‌జీవ ద‌హ‌నం-ఓ ఇంట్లో అగ్నిప్ర‌మాదం-గ్యాస్‌సిలిండ‌ర్ పేలిందో.. పెట్రోలుకు నిప్పు అంటుకుందో.. -కోవూరు నియో....

ప్రపంచ విపత్తు
25/10/2022

ప్రపంచ విపత్తు

*N3news.in*మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత...
08/08/2022

*N3news.in*

మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు
తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత్స్యకారులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

*For More Videos Subscribe*

https://youtu.be/282XYSiRczQ

మంగుళూరు వద్ద సముద్రంలో మునిగిన పడవ కావలి, అల్లూరు మత్స్యకారులు తృటిలో తప్పించుకున్న కావలి, అల్లూరు మండలాల మత్...

*N3 న్యూస్*నెల్లూరులోనూ  "గోరంట్ల మాధవ్"..!! ఆ నేత  ఎవరు..?*వీడియో కోసం క్రింద లింక్ క్లిక్ చెయ్యండి 👇🏻*https://youtu.be...
05/08/2022

*N3 న్యూస్*

నెల్లూరులోనూ "గోరంట్ల మాధవ్"..!!

ఆ నేత ఎవరు..?

*వీడియో కోసం క్రింద లింక్ క్లిక్ చెయ్యండి 👇🏻*

https://youtu.be/QeRFyDEakik

నెల్లూరు నూ గోరంట్ల మాధవ్ కన్నా ఇంకా గొప్ప కళాకారుడు ఉన్నాడని... త్వరలోనే ఆ కళాకారుడేవరో బయట పెడతామని తెలుగుదేశ....

*N3News.in*నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు మృత్యువాత‌..విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని అనుమానం..*Subscribe For More Videos*https:...
05/08/2022

*N3News.in*

నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు మృత్యువాత‌..విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని అనుమానం..

*Subscribe For More Videos*

https://youtu.be/5VqUWTDN5w0

తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండ‌లంలో వేల బాతులు ఒక్క‌సారిగా మృత్యువాత ప‌డ్డాయి.. పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రా...

బ్రేకింగ్ న్యూస్--కృష్ణపట్నం పోర్ట్ దగ్గరలోని ఇమామీ ఆగ్రో టెక్ ఆయిల్ కంపెనీలో వెలువడ్డ విషవాయువులు. 8 మందికి తీవ్ర అస్వస...
30/06/2022

బ్రేకింగ్ న్యూస్
--
కృష్ణపట్నం పోర్ట్ దగ్గరలోని ఇమామీ ఆగ్రో టెక్ ఆయిల్ కంపెనీలో వెలువడ్డ విషవాయువులు.
8 మందికి తీవ్ర అస్వస్థత
--
Pls like and share
https://www.facebook.com/104974455560714/posts/125218386869654/

Big Breaking
ఇమామీ ఆగ్రో టెక్ లో వెలువడ్డ విషవాయువులు!!
- 8మంది కి తీవ్ర అస్వస్థ
-నెల్లూరు GGH కి తరలింపు
--
N3- న్యూస్
--
నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఉన్న ఇమామీ ఆగ్రో టెక్ కంపెనీలో గురువారం సాయంత్రం విష‌వాయువులు వెలువ‌డ్డాయి. విషవాయువులు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఒక్క‌సారిగా ఈ విష‌వాయువులు వ్యాపించ‌డంతో స్థానిక‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌వాయువుల‌ ప్ర‌భావంతో 8 మంది తీవ్ర అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. వారిని వెంట‌నే చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది ? ఏ విష‌వాయువులు వ్యాపించాయి ? ఎంతమంది ఈ ప్రభావానికి గురయ్యారు ? వారెక్కడివారు ? అనేది తెలియాల్సివుంది. అయితే ఈ విషయాన్ని ఆ కంపెనీ నిర్వాహకులు, స్థానిక పోలీసులు, కొందరు రాజకీయ నేతలు బయటకు రానీయకుండా జాగ్రత్త పెడుతూండటం విశేషం.
--
-సునీల్. ఆర్

https://www.facebook.com/104974455560714/posts/123554113702748/
26/06/2022

https://www.facebook.com/104974455560714/posts/123554113702748/

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అప్డేట్...............................................
నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు :
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 21043
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 3658
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :683
నోటా : 699

నాలుగో రౌండ్ (4 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు........................
N3 న్యూస్
--

10/06/2022

కావలి MLA కుమారుని వివాహ రిసెప్షన్ కి వలంటీర్ల తో పిలుపులకు ఓ అధికారిణి ఆదేశాలు.
----
Pls like and share
--
https://fb.watch/dzd-nfmuWZ/

02/06/2022

వాళ్ళు మా అభిమానులు కాదు
- నాగబాబు
Pls like and share
https://fb.watch/doFa4l5agQ/

నెల్లూరు సిటీ ఆనం కేPls like and sharehttps://www.facebook.com/104974455560714/posts/113839258007567/
01/06/2022

నెల్లూరు సిటీ ఆనం కే
Pls like and share
https://www.facebook.com/104974455560714/posts/113839258007567/

*నెల్లూరులో వలసలు ఖాయం..!!*
- *సిటీ టీడీపీ అభ్యర్థిగా ఆనం..??*
- *కోటంరెడ్డి పరిస్థితి ఏంటీ..?
---
N3-న్యూస్
--
జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మరిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఒక గూటి పక్షులు మరో గూటికి మారినట్లు కొందరు తమ స్వార్ధం కోసం, అధికారం కోసం పార్టీలు మరెందుకు సిద్ధమయ్యారు. ఇందులో ముఖ్యంగా ఆనం కుటుంబం. ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో ఇది ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది.

2019లో వైసీపీ టికెట్ పై వెంకటగిరి MLA గా గెలుపొందిన ఆనం మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం పై, మాజీ మంత్రి అనిల్ పై పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారుతున్నారని, అందుకే ఈ ఆరోపణలు అనే సందేహం అందరిలో కలిగింది. దీన్ని బలపరిచేలా ఇటీవల ఒంగోలు లో జరిగిన టీడీపీ మహానాడు లో రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడంతో ఆనం పార్టీ మారడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.
---
*TD జనార్దన్ ని కలసిన ఆనం*
--
ఇంకో ఆసక్తికరమైన, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. టీడీపీ లో కీలకంగా ఉన్న TD జనార్దన్ రావు ను ఆనం రామనారాయణ రెడ్డి మహానాడు కు రెండు రోజులు ముందుగానే విజయవాడలో రహస్యంగా కలిసినట్లు పక్కా సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ లోని పెద్దలే చర్చించుకుంటున్నారు కూడా. అప్పుడే టీడీపీ లో ఆనం కుటుంబం చేరే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి రహస్య భేటీ క్రమంలోనే కైవల్య లోకేష్ ని కలిసిందని ప్రచారం కూడ జరుగుతోంది. దీన్ని ఆనం కొట్టిపారేసినా, నాకు సంబంధం లేదని తేల్చినా... TD జనార్దన్ ని కలిసింది మాత్రం పక్కా. అంతే కాకుండా కైవల్య రెడ్డి లోకేష్ ని కలిసొచ్చాక నెల్లూరు నగరంలోనే ఉంటోంది. తన తండ్రి నివాసం నుంచే జిల్లా టీడీపీ నేతలను కలుస్తోంది. ఇప్పటికే అనేకమంది ఆమెను టీడీపీ లోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని నగర, రూరల్ టీడీపీ నేతలు అంటున్నారు కూడా.. మరి ఇది దేనికి సంకేతం రామనారాయణ రెడ్డి మాత్రం చెప్పగలరు.
---
*సిటీ నుంచి బరిలో ఆనం*
--
ఆనం కుటుంబం కి టీడీపీ సొంత ఇల్లు లాంటిది. వారి రాజకీయ ప్రయోజనాలకోసం పార్టీలు మారినా వచ్చే ఎన్నికలకు మాత్రం వారు సొంత గూటికి చేరుకోవడంతో ఎలాంటి సందేహం లేదంటున్నారు. మొదటి నుంచి వారు టీడీపీ నుంచి మూడు స్థానాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మాత్రం అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. ఆనం మాత్రం తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు టీడీపీ పెద్దలు( ఆనం ను వైసీపీ లోకి తీసుకెళుతున్న నేతలు) హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక కైవల్య వచ్చే ఎన్నికలకు ఆత్మకూరు నుంచి పోటీ చేయాలన్న కోరికను వెలుబుచ్చేసింది. ఇక మరో టికెట్టు పైనే ఎలాంటి హామీ లేదు.
---
*పాపం కోటంరెడ్డి*
నెల్లూరు సిటీ నుంచి MLA గా పోటీ చేయాలని, అసెంబ్లీలో "అధ్యక్ష్యా" అనాలన్నది టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరిక. అందుకోసం ఆయన చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. అటు జగన్, ఇటు అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేస్తున్నా... అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ప్రతీ సారి ఎవరో ఒకరు వచ్చి ఆ అవకాశాన్ని తన్నుకు పోతున్నారు. మొదటి నుంచి కోటంరెడ్డి వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని చంద్రబాబు కు ఆ పార్టీలోని పెద్దలే మోస్తున్నారు. అంతే కాకుండా నగరంలో సొంత క్యాడర్తో, సొంత అజెండాలో ముందుకెళుతున్నారని కూడా ఆ పార్టీ లోనివారే పార్టలోని పెద్దల వద్ద చెపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఈ సారి కూడా ఆనం రూపంలో కోటంరెడ్డికి ఝలక్ ఇచ్చేలా ఉన్నారు. దీంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎంటనేది ప్రశ్నఅర్ధకం. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో నెల్లూరు నగరం రాజకీయాలు కూడా భలే రంజుగా మారనున్నాయి.
--
- సునీల్. ఆర్
N3- న్యూస్
(కల్తీ లేని వార్తలు - కలకలం రేపే కథనాలు)
అతి త్వరలో మీ ముందుకు
--

https://www.facebook.com/104974455560714/posts/110364631688363/
28/05/2022

https://www.facebook.com/104974455560714/posts/110364631688363/

Big Breaking News
లోకేష్ ను కలసిన ఆనం కైవల్య రెడ్డి..!!
- టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం ఐనట్లేనా..?
- ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతోనేనా..?
- లోకేష్ ని కలవడంలో ఆనం వ్యూహం ఏంటి.
- జిల్లా రాజకీయాల్లో మారనున్న రాజకీయం
- మాజీ మంత్రి అనిల్ చెప్పింది నిజమేనా..?
- మంత్రి కాకాణి ఏం సమాధానం చెప్తారు.
- ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశం
----
N3 న్యూస్
--
గత కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు.. వేధింపులు, ఒకరే లక్ష్యం గా వ్యూహాలు.., ప్రత్యర్థులతో లోపాయకారి ఒప్పందాల తో తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు వంటి ఘటనలతో ఈ వేసవిలో రాజకీయాలు సెగలు రగిలిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శనివారం వెంకటగిరి MLA ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఒంగోలు లో కలవడం, ఆయన్ను అభినందించడం, శాలువా, పుష్పగుచ్చం తో సత్కరించటం పలు సందేహాలకు అవకాశం కల్పిస్తుంది. ఆమె తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ శాసన సభ్యులుగా ఉండడం.. ప్రత్యక్ష రాజకీయాల్లో కైవల్య అడుగుపెడుతోంది అనే ప్రచారం జరుగుతుండటంతో పాటు వచ్చే ఎన్నికల్లోపు ఆనం వారు వైసీపీకి గుడ్ బై చెబుతారన్న చర్చ జరుగుతున్న ఈ నేపధ్యంలో ఆమె లోకేష్ ని కలవడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడం పక్కా వ్యూహం తోనే జరిగిందని.. ఇటువంటి సాహసం ఆమె తన తండ్రికి తెలియకుండా చేయదని, ఇది ఆనం ఆదేశాలతోనే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఏది నిజమో ఆనం నోరు విప్పితేనే స్పష్టత వస్తుందని అంటున్నవారూ లేకపోలేదు.
---
అనిల్ చెప్పింది నిజమేనా..?
మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్ళుగా కాస్త మౌనంగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా స్వరం పెంచారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పరోక్ష యుద్దానికే దిగారు. కొన్ని చోట్ల పలు ఆరోపణలు కూడా చేసారు. ఫ్లెక్సీ ల ఏర్పాటు విషయంలో నగరంలో కొన్ని ఆంక్షలున్నా... మంత్రి కాకాణి కోసం ఆనం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను తొలగించడంపై కూడా ఆనం కుటుంబ నేతలు నగర mla పై దోషణలకు కూడా దిగారు. ఈ క్రమంలో నూ అనిల్ స్పందించారు. ఆనం ఏ పార్టీలో ఉంటారు..? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటించాలని బహిరంగంగా.. మీడియా సాక్షిగా సవాల్ కూడా విసిరారు. దానికి ఆనం కుటుంబం నుంచి మౌనం. ఈ నేపథ్యంలో ఆనం కైవల్య ఒంగోలులో నారా లోకేష్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చూపుగా ఆమె ద్వారా మార్గం సుమగం చేసుకుంటున్నారా..? అనే సందేహం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా అనిల్ చెప్పినట్లు ఆనం కుటుంబం పార్టీ మారేందుకే సిద్ధం అయ్యిందా అని చర్చ జరుగుతోంది.
--
మంత్రి కాకాణి ఏం చెబుతారు
గత కొన్నేళ్లుగా ఆనం, కాకాణి కుటుంబాల మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. అయితే గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాక జిల్లాలో ఆనం కుటుంబం ఎంతో ఆనందించింది. ఆయనకు ఘాన స్వాగతం కూడా పలికారు. ఆత్మీయ సదస్సు లో సైతం ఆనం మాజీ మంత్రి పై, ఇరిగేషన్, రైతాంగం, ప్రాజెక్టులపై ఆరోపణలు కూడా చేశారు. ఇది కొంత కాకాణి కి ఇబ్బంది కలిగించినా... ఆనం ను వారించలేకపోయారు. దాంతో పథకం ప్రకారం ఇలా చేస్తున్నారా..? మాజీ మంత్రిని ఒంటరిని చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో, జిల్లా ప్రజల్లో వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అనిల్ ని, కాకాణి ని స్వయంగా CM పిలిపించి మాట్లాడారు కూడా.. అప్పటి నుంచి సమస్య కొంత సద్ధిమణిగినా.. ఆనం కుటుంబం మాత్రం రగిలిపోతుంది. ఆ సామాజికవర్గం అంతా కలసి బీసీ నేత అయిన మాజీ మంత్రిని ఒంటరిని చేయాలన్న కుట్ర జరుగుతున్నట్లు ఆ సామాజికవర్గం, నగర ప్రజల్లో కూడా చర్చ జరిగింది. మంత్రి గోవర్ధన్ రెడ్డి ఆనం ను వెనకేసుకొస్తున్నారని అనుకుంటున్న క్రమంలో.. ఆనం కుమార్తె లోకేష్ ను కలవడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనికి మంత్రి ఏం చెబుతారో అని కూడా అంతా ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనా... ఆనం కైవల్య ద్వారా టీడీపీ లో చేరికకు ఆనం కుటుంబం మార్గం వేస్తోందా అని జిల్లాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
--
లోకేష్ ని కలవడం తన వ్యక్తిగతం: ఆనం

అయితే ఇదే విషయంపై ఆనం రామనారాయణ రెడ్డిని మీడియా వివరణ కోరితే... తన కుమార్తె కైవల్య రెడ్డి చిన్న పిల్ల కాదని తనకు ఏది మంచో.. ఏది చేడో తెలుసునని, లోకేష్ ని ఎందుకు కలసిందో అది తన వ్యక్తిగతం అని, తనకు సంబంధం లేదని, ఆ విషయాన్ని ఆమెనే అడగండి అంటూ... సమాధానం దటవేసి వెళ్లిపోవడం విశేషం.
---
సునీల్, ఆర్
Coming soon
N 3 - News
--

12/05/2022

Wanted... Wanted... Wanted
---
"విజేత మీడియా అండ్ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్" ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంగా త్వరలో ప్రారంభం కానున్న మా, మన "N3 న్యూస్ ఛానెల్" లో వివిధ సెగ్మెంట్ లలో ప్రతిభ గల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రిపోర్టర్లు, యాడ్స్ ఎగ్జిక్యూటివ్ లు, యాంకర్లు, న్యూస్ రీడర్లు, వీడియో ఎడిటర్లు, స్క్రిప్ట్ రైటర్లు, వీడియో గ్రాఫర్లు కావలెను. ప్రతిభనుబట్టి వేతనం ఉంటుంది.
సం. 9885184753, +919032638542
మీ.. సునీల్

10/04/2022

N3 NEWS - SRI RAMANAVAMI WISHES 2022

09/04/2022

పబ్ జీ కి బానిసైన ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై..
చికిత్స పొందుతూ కూడా ఎలా తయారయ్యాడో చూడండి. ప్రస్తుతం ఇతడి పరిస్థితి, మానసిక స్థితి ప్రమాదంలో ఉందని అంటున్నారు వైద్యులు. తల్లీదండ్రుల్లారా జాగ్రత్త. మీ పిల్లలు సెల్ ఫోన్లలో ఏం గేమ్ లు ఆడుతున్నారు. వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. లేదంటే ప్రమాదమే.

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Suneel journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share