ADN News

ADN News HD Digital Network :: ADN News

25/09/2025

ఇద్దరు బాలికలకు సువాసినీ పూజ.. అమ్మవారి రూపాలను తాకేందుకు భక్తుల ఆత్రం.

25/09/2025

శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోతున్నాయి.సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరిస్తున్నాయి. .

25/09/2025

శరన్నవరాత్రుల సందర్భంగా నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం భక్తులతో క్రిక్కిరిసిపోతుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని , మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు దర్శనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని మహిళలు అనందం వ్యక్తం చేసారు. అమ్మవారి దర్శనాలు, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని భక్తులు అనందం వ్యక్తం చేసారు.

25/09/2025

నవరాత్రి వేడుకలలో కుమారి పూజకు
12 ఏళ్ల లోపు వయసు రజస్వల కాని బాలికలను ఎంపిక చేస్తారు.
==========================///
నవరాత్రి వేడుకలలో కుమారి పూజకు అత్యంత ప్రాధాన్యం, మరియు పవిత్రత ఉంది. పది నుంచి 12 ఏళ్ల లోపు వయసు ఉన్న రజస్వల కాని బాలికలను ఈ పూజకు ఎంపిక చేస్తారు. అమ్మవారి శక్తి , అమ్మవారి రూపం రెండూ స్త్రీ శక్తి లో ఉంటాయని నమ్ముతారు. అలాంటి స్త్రీ శక్తి, అమాయకత్వానికి ,పవిత్రతకు ప్రతిరూపాలైన బాలికల్లో ఉంటుందని, అందుకనే బాలికలను దుర్గామాత అవతారంగా భావించి పూజించాలి అన్నది ఈ కుమారి పూజ ప్రధాన ఉద్దేశం. కుమారి పూజను 1901 సంవత్సరంలో స్వామి వివేకానంద ప్రారంభించారు. మహిళలను ఆదిపరాశక్తిగా పూజించడమే ఆయన ప్రవేశపెట్టిన ఈ పూజ విధానం. ఉద్దేశం . అయితే అందులో మానసికంగానూ, శారీరకంగానూ ,పవిత్రంగా ఉన్న బాలికలే అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి, ఆడ పిల్లలను ఎంపిక చేసే ప్రక్రియలోని ఈ పూజకు ప్రాధాన్యం ఉంది. అదే ఆ తర్వాత తరాలకు సాంప్రదాయమైంది. ప్రతి మహిళ అమ్మవారికి ప్రతిరూపం అనేది ఈ పూజ ప్రధాన ఉద్దేశం. ఈ పూజకు ముందుగా రజస్వల కాని బాలికను ఎంపిక చేసి అమ్మవారి పాదాలు కడుగుతున్నాం అన్న భావనతో ఆ బాలిక పాదాలను కడగాలి. ఆ తర్వాత ఆ బాలికను పరిశుభ్రంగా ఉండే ఒక ఆసనం మీద కూర్చుని పెట్టాలి. ఆ తర్వాత ఆ బాలికను అక్షింతలు సుగంద, పరిమళ ద్రవ్యాలు ఇతర పూజ సామాగ్రితో అమ్మవారి స్తోత్రాలు మధ్య పూజ చేయాలి. బాలికకు కొత్త బట్టలు ఇవ్వాలి. కుమారి పూజా విధానం శాస్త్ర ప్రకారం నవరాత్రి రోజుల్లో అష్టమి రోజున చేస్తారు. అయితే ఇప్పుడు నవరాత్రి దినాల్లో ప్రతిరోజు ఈ పూజలు చేస్తున్నారు. ఈ పూజకు ఎంపిక చేసే బాలిక దుర్గ అవతారం. ఈ పూజ ప్రధానోద్దేశం కూడా మహిళలు శక్తి స్వరూపాలని ,అత్యంత బలవంతులని, వరాలిచ్చే తల్లులని,దుర్గామాతకు ప్రతిరూపాలని అందువల్ల మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మగవారిపై ఉందన్నది ఈ పూజ ప్రధానోద్దేశం...

23/09/2025

కోలాటాన్నీ సాంప్రదాయ పద్దతిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.. శరన్నవరాత్రుల శోభలో ఎంత బాగుందో చూడండి.

23/09/2025

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

23/09/2025

బంగాళాఖాతంలో అల్పపీడనం..
వాయుగుండంగా మారే అవకాశం..!
=========================
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో పాటుగా ఈ నెల 25న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని.. ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కోస్తాంధ్రలో 25, 26వ తేదీల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

22/09/2025

అమ్మవారి విగ్రహ రూప కల్పన ఒక మహాపవిత్రమైనది. అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మవారి స్వరూపాన్ని, అమ్మవారి శక్తులను, అమ్మవారి అవతారాలు పూర్తిగా తెలిసిన కళాకారులే అమ్మవారి నవరూపాలను కలబోసి, ప్రశాంత వదనంతో ఉండే అమ్మ రూపాన్ని తీర్చిదిద్దగలరు. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామంలో అమ్మవారి విగ్రహాలను తయారుచేస్తారు. ఇప్పుడిప్పుడే అమ్మవారి విగ్రహాలను కూడా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారని , వేడుకలు చేస్తున్నారని చెప్పారు .ఆయన చేతుల్లో ప్రాణం పోసుకున్న అమ్మవారి విగ్రహాలను, అద్భుతమైన అమ్మవారి సౌందర్యాన్ని చూసి చేతులెత్తి దండం పెట్టగలిగే అమ్మవారి రూపాన్ని, సర్వశక్తులకే ప్రతిరూపంగా అమ్మవారు విగ్రహం ఎలా తయారయ్యిందో చూడండి..

22/09/2025

ప్రకృతి పచ్చదనంలో ఏమిటా జీవిత రహస్యం..? ఋషుల కాలం నుంచి నేటి డాక్టర్ల వరకు ఒకే మాట.. పచ్చదనం మధ్యనే ఆరోగ్య మర్మం దాగి ఉందని.. అది ఇలా...

21/09/2025

ఆదివారం,అమావాస్య, మహాలయ పక్షంలో సముద్రతీరంలో తర్పణాలు ఎందుకు వదలాలి..?

19/09/2025

ఈ కాలంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం సాధారణంగా జరిగేదే. వీటివల్లనే హెలికాఫ్టర్లు ప్రయాణం చేయలేవు. కొన్ని దఫాలు విమానాలు కూడా ఆ మేఘాలు ఉన్న దాపులకు కూడా పోవు. కుములోనింబస్ మేఘాలు 600 టన్నుల బరువుండే ఫైటర్ జెట్లను కూడా ఆటంకపరిచి ప్రమాదానికి గురిచేస్తాయి. అందుకే విమాన, మరియు హెలికాఫ్టర్లలో పోయేవారు ఈ మేఘాలు చూసి టేకాఫ్ కూడా ఆపేస్తారు. ఒక్కో క్యుములోనింబస్ మేఘంలో సగటున 500 టన్నుల బరువున్న నీరు ఉంటుంది. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి. క్యుములోనింబస్ మేఘం వర్షిస్తే , ఆ ప్రాంతంలో కుంభవృష్టి ఉంటుంది. ఒక్కోదఫా క్లౌడ్ బరస్ట్ ఇలానే అవుతుంది.దీనివల్లనే కొండప్రాంతాల్లో చరియలు విరిగిపడి వినాశనానికి కారణం అవుతాయి. క్యుములోనింబస్ మేఘాలు సాధారణంగా నిలువుగా ఏర్పడతాయి. ఒక కిలోమీటర్ ఎత్తు , ఒక కిలోమీటర్ వెడల్పు తో ఏర్పడతాయి. పెద్దదయిన క్యుములోనింబస్ మేఘాలు ఒక్కోటి 5 లక్షల కిలోలు బరువు ఉంటాయి. వీటిని ఢీకొన్న విమానాలు , హెలికాఫ్టర్లు అక్కడికక్కడే నియంత్రణ తప్పి పడిపోతాయి. ఒక్కో క్యుములోనింబస్ మేఘం 100 ఏనుగుల బరువు అంత ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాలులో విద్యుత్ శక్తికూడా అధికంగానే ఉంటుంది. ఐస్ గడ్డలమధ్య వాయువుల రసాయనిక చర్యతో ఉరుములతో కూడిన మెరుపులు వస్తాయి.. మేఘాలలో నుంచి బలమైన గాలులు కిందకు వీస్తాయి. దీనివల్ల ఒక్కోదఫా తుఫానులాంటి వాతావరణం నెలకొంటుంది..క్యుములోనింబస్ మేఘాలులో కూడా గాలుల అల్లకల్లోలం ఎంతస్థాయిలో ఉంటుందో తెలుసా..? విమానాన్ని ముక్కలుచేసేంత బలంగా ఉంటుంది. అందుకే విమాన ప్రయాణాలలో క్యుములోనింబస్ మేఘాలు భద్రతాపరంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాంకేతిక విజ్ఞానం ఎంత పెరిగినా , ప్రకృతి శక్తి ముందు తలవంచక తప్పదు.. అదే సృష్టి రహస్యం..

18/09/2025

ఈ లయన్ ,టైగర్ సఫారీ ఎంత మోసమో చూడండి.. రోడ్డు, చెట్లు , కాసేపు వ్యాన్ ప్రయాణం.. ఒక సింహం, ఒక పులి, ఒక బైసన్, నాలుగు జింకలు.. సఫారీ అయిపొయింది..

Address

Thota Vijaya Bhaskar
Nellore
523004

Telephone

+919440207109

Alerts

Be the first to know and let us send you an email when ADN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Akshara Digital Network

Our Website : www.adnnews.in