SSD news

SSD news Please follow for latest update news.

ఓటరు కార్డుకు ఆధార్ ని అనుసంధానం చేయాలి.భీమ్‌గల్ టౌన్, సెప్టెంబర్ 10. SSD news ఆధార్ కార్డు నెంబర్ ని ఓటరు కార్డుకు అనుస...
10/09/2022

ఓటరు కార్డుకు ఆధార్ ని అనుసంధానం చేయాలి.

భీమ్‌గల్ టౌన్, సెప్టెంబర్ 10. SSD news
ఆధార్ కార్డు నెంబర్ ని ఓటరు కార్డుకు అనుసంధానం చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ గౌడ్ అన్నారు. శనివారం భీమ్‌గల్ పట్టణంలోని 8వ వార్డ్ లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఓటర్ కార్డు ని ఆధార్ తో లింకప్ చేయాలన్నారు. అందుకొరకు మెప్మా అధికారులు ఇంటింటికి వెల్లి ప్రక్రియ ను వారం లోపు పూర్తి చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులు, మెప్మా సిబ్బంది సమన్యయం తో పనిచేయాలని సూచించారు. ఫారం 6ఏ లో 18 ఏండ్లు నిండిన కొత్త వారిని ఓటరు నమోదులో చేర్చాలని అన్నారు. ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకు ఫారం 8, ఆధార్ అనుసంధానం చేయడానికి ఫారం 6బి ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమం లో మోప్మా సిబ్బంది వసంత, రాధ, లక్మీ, రోమా, ఫౌజియా తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.భీమ్‌గల్ రూరల్, సెప్టెంబర్ 10, SSD news భీమ్‌గల్ మండల కేంద్రంలోని  చేంగ...
10/09/2022

బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

భీమ్‌గల్ రూరల్, సెప్టెంబర్ 10, SSD news
భీమ్‌గల్ మండల కేంద్రంలోని చేంగల్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి రూ 10000 ఆర్థిక సహాయం అందించారు. బాల్కొండ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త మహేందర్ కు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని పార్టీ మండల అధ్యక్షులు మూలిగే మహిపాల్ అన్నారు. బీజేపీ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం.. భీమ్‌గల్ టౌన్ సెప్టెంబర్ 10 , SSD news  కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్య...
10/09/2022

మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం..

భీమ్‌గల్ టౌన్ సెప్టెంబర్ 10 , SSD news
కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గున్వీర్ రెడ్డి ని శనివారం సన్మానించారు.పట్టణం లోని తెరాస పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ ను పూల మాల, శాలువా తో సత్కరించారు. భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్ తెరాస పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్, కౌన్సిలర్లు సీ హెచ్. గంగాధర్, సతీష్ గౌడ్, బోదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్, పర్శ నవీన్, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్త లింగం కుటుంబానికి అండగా ఉంటా -పిల్లొల్ల గంగ స్వామిభీమ్‌గల్ రూరల్, సెప్టెంబర్ 10, SSD news అక్రమంగా కేసు...
10/09/2022

బీజేపీ కార్యకర్త లింగం కుటుంబానికి అండగా ఉంటా -పిల్లొల్ల గంగ స్వామి

భీమ్‌గల్ రూరల్, సెప్టెంబర్ 10, SSD news

అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయించిన కట్లే లింగం కుటుంబానికి అండగా ఉంటానని పిల్లోళ్ల గంగస్వామి అన్నారు. శనివారం బడా భీమ్‌గల్ లో కట్లే లింగం కుటుంబ సభ్యులను కలిసి లింగం విడుదల అయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి రూ 10000 అందించారు. లింగం ను బయటకు తీసుకురావడానికి ఆర్థిక పరంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ కీ  విద్యార్థుల ఎంపిక.భీంగల్ రూరల్, ఆగస్ట్ 22 SSD news బాసర ట్రిపుల్ ఐటీ కీ ముచ్ కూర్, మెండోరా ప్రభుత్...
22/08/2022

బాసర ట్రిపుల్ ఐటీ కీ విద్యార్థుల ఎంపిక.

భీంగల్ రూరల్, ఆగస్ట్ 22 SSD news
బాసర ట్రిపుల్ ఐటీ కీ ముచ్ కూర్, మెండోరా ప్రభుత్వ పాఠశాలల నుండి ఏడుగురు స్టూడెంట్స్ ఎంపిక అయినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ముచ్కూర్ పాఠశాల కు చెందిన పొన్నాల సిద్దార్థ, కనికరం సిరి వెన్నెల, మానస, దువ్వాల మైథిలి, రజిత, మంద రిషిక మెండోరా ప్రభుత్వ పాఠశాల నుండి సైమ బేగం ఎంపికయ్యారు. ఎంపికైన స్టూడెంట్స్ ని ప్రధానోపాధ్యాయులు హఫీజుద్దీన్ ఉపాధ్యాయులు శ్రీధర్, శ్రీనివాస్, దేవరాజ్, ఇమాన్యూయల్, సుజాత, రమణ మెండోరా ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఉపాధ్యాయులు అభినందించారు.

భావి భారత పౌరులుగా ఎదగాలిభీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వజ్రొత్సవ ము...
22/08/2022

భావి భారత పౌరులుగా ఎదగాలి

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వజ్రొత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరే రమేష్,తెలుగు ఉపాద్యాయుడు గట్టు ఈశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తు చేశారు.ఉత్తమ భావి భారత పౌరులుగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రోళ్ల సంజీవ్, విడిసి అధ్యక్షుడు కిషన్,ప్రాథమిక,ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడాకారులు గెలుపొందడం అభినందనీయం.భీంగల్ టౌన్, ఆగస్ట్ 22, SSD news. భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్...
22/08/2022

క్రీడాకారులు గెలుపొందడం అభినందనీయం.

భీంగల్ టౌన్, ఆగస్ట్ 22, SSD news.
భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రథమ స్థానం సాధించడం అభినందనీయం అని ఎంఈవో
డీ. స్వామి అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలా సందర్బంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో విద్యార్థులు ప్రథమ స్థానం సంపాదించారు. ఈ సందర్బంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో క్రీడాకారులను అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి మండలానికి మంచి పేరు సాదించారని, భవిష్యత్తు లో మరిన్ని గెలుపొందాలని కోరారు. ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేసిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు రఘు వాసు, పీడీ గోపిరెడ్డి, వినోద్ కుమార్, వాసుదేవ్, నీరజ, రాములు, ఎడ్ల శేఖర్, లింబాద్రి, శేవ్వ దాసు తదితరులు పాల్గొన్నారు.

*బంజార ఉద్యోగుల నూతన కార్య వర్గం ఎన్నిక.భీంగల్ టౌన్, ఆగస్ట్ 21 SSD news భీమ్‌గల్‌ మండలం లోని వివిధ ప్రభుత్వ శాఖ లలో నిధు...
22/08/2022

*బంజార ఉద్యోగుల నూతన కార్య వర్గం ఎన్నిక.

భీంగల్ టౌన్, ఆగస్ట్ 21 SSD news
భీమ్‌గల్‌ మండలం లోని వివిధ ప్రభుత్వ శాఖ లలో నిధులు నిర్వహిస్తున్న టువంటి బంజారా ఉద్యోగులు ఆదివారం నాడు బంజారా భవన్లో సమావేశము ఏర్పాటు చేసుకొని నూతన కార్యవర్గం ను ఏక గ్రీవముగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులు భూక్య గంగరాం నాయక్ , ప్రధాన కార్య దర్శిగా మాలవత్ రాజు నాయక్ , ఉపాధ్యక్షులు గా బణోత్ దేవా దాస్ నాయక్ , కోశాధికారులుగా మాలవత్ రాములు నాయక్ , జగన్ నాయక్ , కార్య నిర్వహణ అధికారులు గా లాకావత్ పీర్యా నాయక్ , బి తిరుపతి నాయక్ , ఇసి మేంబర్లుగా ఎం పరుశురాం నాయక్ , ఎం హరి నాయక్, ముఖ్య సలహా దారులుగా బి లక్ష్మణ్ నాయక్, బి ప్రకాష్ నాయక్ , ఎం అరుణ్ నాయక్, ఎం గణేష్ నాయక్ , ఎం భీక్యా నాయక్ ,జి గణపతి నాయక్, ఎం గణేష్ నాయకులు ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులు గంగరాం నాయక్ మాట్లాడుతూ... బంజార ఉద్యోగుల సమస్య లపై మరియు బంజారా సంప్రదాయాలపై బంజారులను ఎకం చేయడానికి కృషి చేస్తనని వారు తెలిపారు... ఈ కార్యక్రమం లో బంజార ఉద్యోగులు పాల్గొన్నారు.

15/08/2022

75th Happy independence day

స్టాక్ మార్కెట్లొ 20 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి.సంగారెడ్డి - అమీన్ పూర్, ఆగస్టు 12, శుక్రవారం, SSD news..స...
12/08/2022

స్టాక్ మార్కెట్లొ 20 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

సంగారెడ్డి - అమీన్ పూర్, ఆగస్టు 12, శుక్రవారం, SSD news..
సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్, పీజేఆర్ కాలనీలో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాక్ మార్కెట్లో లక్షలు పోగొట్టుకున్న లక్ష్మీనారాయణ. 20 లక్షలు పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ 37 ఏళ్ల వయసుగల లక్ష్మీనారాయణ.
ఈ మధ్య చాలామంది ప్రమోటర్లు, బ్రోకర్ల మాటలు నమ్మి స్టాక్ మార్కెట్ పై ఎలాంటి అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ చాలామంది నష్టాలను చవిచూస్తున్నారు.
స్టాక్ మార్కెట్ పై పూర్తిగా అవగాహన వచ్చాకే, ఎప్పటికప్పుడు మార్కెట్లను గమనిస్తూ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అయినా కూడా ఎవరి మాటలు లెక్కచేయకుండా, కొద్ది రోజుల్లోనే జాక్పాట్ కొట్టి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవాలని అత్యుత్సాహంతో చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు.

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా రాకీ పండుగభీంగల్, ఆగస్టు 11, గురువారం, SSD news...శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉ...
12/08/2022

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా రాకీ పండుగ
భీంగల్, ఆగస్టు 11, గురువారం, SSD news...
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో గురువారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాలకు చెందిన బాలికలు బాలురకు రాఖీ కడుతూ నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం ఈ దేశానికి ఈ సమాజానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టినారు. పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు కూడా ఆచార్యులకు రాఖీలు కట్టడం జరిగింది అలాగే పాఠశాలకు చెందిన బాలికలు ఆచార్యుల ఆధ్వర్యంలో భీంగల్ పట్టణంలోకి వెళ్లి వ్యాపారస్తులకు, ప్రభుత్వ అధికారులకు రాఖీలు కట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

"కంటి ఆపరేషన్" కొరకు చేయూత..భీంగల్, ఆగస్టు 9, మంగళవారం, SSD news... మండలం బాచన్ పల్లి గ్రామానికి చెందిన దర్శనపు పోసాని భ...
10/08/2022

"కంటి ఆపరేషన్" కొరకు చేయూత..

భీంగల్, ఆగస్టు 9, మంగళవారం, SSD news... మండలం బాచన్ పల్లి గ్రామానికి చెందిన దర్శనపు పోసాని భర్త దర్శనపు గంగారాం గారిది నిరుపేద కుటుంబం ఇటీవల చూపు సరిగ్గా కనవబడడం లేదని ఆసుపత్రిలో చూయించుకుంటే ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో బాచన్‌పల్లి గ్రామానికి చెందిన సునీల్ యువసేన కార్యకర్త క్రాంతి ముత్యాల సునీల్ కుమార్ గారికి సమాచారం అందించారు .వెంటనే "కంటి ఆపరేషన్" కొరకు అడగ్గానే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ గారు పదివేయిల అర్థిక సహాయం సహాయం పంపించారు. ఈరోజు ఆ డబ్బును సునీల్ యువసేన కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.

Address

Nizamabad
503307

Telephone

+18332079113

Website

Alerts

Be the first to know and let us send you an email when SSD news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SSD news:

Share