Vasu Gurivigari

Vasu Gurivigari I'm a Civil Engineer, Now I'm working as Software Engineer....
But I like to live as a Politicians...

జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి అవకాశం.స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవండి..
17/07/2026

జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి అవకాశం.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవండి..

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన చర్చా వేదిక• క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తలతో ముఖాముఖి• పార్టీని ప్రజల్లోకి మర...
17/07/2026

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన చర్చా వేదిక

• క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తలతో ముఖాముఖి
• పార్టీని ప్రజల్లోకి మరింత పటిష్టంగా తీసుకెళ్తాం
• కైకలూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన
• రైతాంగానికి, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందిస్తాం
• కైకలూరు మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

కూటమిగా కలిసి పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న భేదాభిప్రాయాలు రావడం సహజమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు రాబోయే రోజుల్లో జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం కైకలూరు నియోజక వర్గంలో జనసేన చర్చ వేదిక కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “పార్టీ కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న మా పార్టీ కార్యకర్తల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్న ఆలోచనతో 'జనసేన చర్చా వేదిక' కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింత పటిష్టంగా తీసుకెళ్లే వచ్చు. ఈ వేదిక ద్వారా కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలు, మండల స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తల నుంచి నేరుగా అభిప్రాయాలు, విలువైన సూచనలు సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
• సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం
జనసేన చర్చా వేదికలో భాగంగా కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో కైకలూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చింది. వీటితోపాటు రైతాంగానికి, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందించాలని కార్యకర్తలు కోరారు. కార్యకర్తలు లేవనెత్తిన అన్ని సమస్యలపై అధికారుల నుంచి తక్షణమే నివేదికలు తెప్పించుకుంటాం. ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా క్షేత్రస్థాయిలో పర్యటించి... స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతాం. ముఖ్యంగా మంచినీటి సమస్యను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా ప్రణాళికాబద్ధంగా, ప్రజలు కోరుకునే విధంగా శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
• ప్రతి నియోజకవర్గంలోనూ చర్చా వేదిక
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన 'జనసేన చర్చా వేదిక' కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహిస్తాం. ఈ వేదిక ద్వారా స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను నేరుగా సేకరిస్తాం. ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. కుప్పకూలిన ఆ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడం ఒక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంయుక్త నాయకత్వంలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరి ప్రసాద్, శాసన సభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ చెన్నమల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

17/07/2026
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారుకుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష...
17/07/2026

శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు

కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.

• పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.

గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Governor of Andhra Pradesh Press Information Bureau India I&PR AP PIB in Andhra Pradesh

సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు• 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగ...
17/07/2026

సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు

• 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
• కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
• క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
• ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
• సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి
• జిల్లా, పార్లమెంట్ పరిధిలో సమన్వయ కమిటీలు
• తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని, అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని తెలిపారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తాం. ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావు.
క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతాం.
*కూటమి సమన్వయం కోసం కమిటీలు*
రెండు రోజుల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. కూటమిలో ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు, సమన్వయ లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తాయి. ఇది భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బాధ్యత. అదే విధంగా ప్రతి జిల్లాలో సమన్వయం మరింత సమర్థవంతంగా ఉండేందుకు పార్లమెంట్, జిల్లా పరిధిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయ”న్నారు.

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, విస్తృత మొక్కల పెంపకం, గ్రీన్ సొసైటీల ఏర్పాటుతో పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా పని చేస్...
17/07/2026

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, విస్తృత మొక్కల పెంపకం, గ్రీన్ సొసైటీల ఏర్పాటుతో పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.

Tanq doctor garu
17/07/2026

Tanq doctor garu

17/07/2026

Address

Rs. Road
Rajampet
516150

Alerts

Be the first to know and let us send you an email when Vasu Gurivigari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vasu Gurivigari:

Shortcuts

Share