Prime News

Prime News Publisher and Editor - Prime News In and Around

కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఆవ ప్రాంతాల ఇళ్ల పట్టాల పరిశీలనకాపవరం, జూలై 23 : బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలసి కలెక...
24/07/2024

కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఆవ ప్రాంతాల ఇళ్ల పట్టాల పరిశీలన

కాపవరం, జూలై 23 : బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలసి కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ పై ప్రజా ప్రతినిధుల సూచనల నేపధ్యంలో భూములను పరిశీలించారు. ముంపు ప్రమాదం నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇరిగేషన్ డి.ఈ. కే. ఆనంద బాబు, కోరుకొండ తహశీల్దార్ సుమలత తదితరులు ఉన్నారు.

కలెక్టర్ ప్రశాంతి అల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీరాజమహేంద్రవరం, 23 జూలై 2024: జిల్లా కలెక్టర్ పి....
23/07/2024

కలెక్టర్ ప్రశాంతి అల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీరాజమహేంద్రవరం, 23 జూలై 2024: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, అల్కాట్ గార్డెన్ - మునిసిపల్ కళ్యాణ మండపం పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేతవారిలంక గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వరద బాధితులకు సరైన వసతులు, శానిటరీ, వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

21/07/2024

గురుపూర్ణిమ సందర్భంగా కలెక్టర్ భద్రతా చర్యలు

కొవ్వూరు, జూలై 21 : ఆదివారం ఉదయం కొవ్వూరు పుష్కర్ ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ పి. ప్రశాంతి, గురుపూర్ణిమ సందర్భంగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు రావడం జరుగుతుందని తెలిపారు. గోదావరిలో వరద ప్రవాహం ఉన్న కారణంగా ఎవ్వరూ నదీ స్నానాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, తగిన భద్రత కట్టుదిట్టం చేయాలని మునిసిపల్ కమిషనర్ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు.అంతకు ముందు, గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించి సబ్ కలెక్టరు కు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, మునిసిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు ఉన్నారు. అక్కడ నుంచి తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు వెళ్లారు.

అగ్రశ్రేణి యూనివర్సిటీలకు చేరేందుకు ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్టీవ్ గార్డ్నర్ సూచనలురాజమహేంద్రవరం, జులై 19: ట్రిప్స...
20/07/2024

అగ్రశ్రేణి యూనివర్సిటీలకు చేరేందుకు ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్టీవ్ గార్డ్నర్ సూచనలు

రాజమహేంద్రవరం, జులై 19: ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చైర్మన్ బాలాత్రిపుర సుందరి ఆధ్వర్యంలో జరిగిన టీన్ ఎంపవర్మెంట్ సదస్సులో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడు స్టీవ్ గార్డ్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.గార్డ్నర్ విద్యార్థులు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలలో చేరేందుకు సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని, సొంత ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. మార్కులు మాత్రమే కాకుండా, సామాజిక సంబంధాలు మరియు లక్ష్యంపై అవగాహన కూడా ముఖ్యమని చెప్పారు.ఇతర ముఖ్యఅతిథి శ్రీహిత్ తిర్నాటి ప్రపంచంలో విలువైన పెట్టుబడుల ప్రాముఖ్యత వివరించారు. స్కూలు చైర్మన్ బాలాత్రిపుర సుందరి, ఈ సదస్సు విద్యార్థులకు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు సహాయపడుతుందని చెప్పారు.స్కూల్ డైరెక్టర్స్ గూడూరు వంశీకృష్ణ, గూడూరు రూపా దేవి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేందుకు అధికారులదే బాధ్యత  - మంత్రి కందుల దుర్గేష్పేరవలి, జూలై 20 :  రాష్ట్ర పర్యాటక సాంస్కృత...
20/07/2024

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేందుకు అధికారులదే బాధ్యత - మంత్రి కందుల దుర్గేష్

పేరవలి, జూలై 20 : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సమన్వయంతో అందించాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను చేపట్టాలని సూచించారు. ఎర్ర కాలువ ముంపు నివారణ కోసం ఆధునీకరణ పనులు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిడదవోలు మండలంలో వరద వల్ల 12,000 ఎకరాల వరి పంట నష్టానికి గురయ్యింది.సమీక్షలో శాసనమండలి సభ్యులు, జడ్పిటిసి సభ్యులు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటననల్లజర్ల, జూలై 20 : :జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యట...
20/07/2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

నల్లజర్ల, జూలై 20 : :జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను సూచించారు.ఎర్ర కాలువ వరద ఉధృతి వల్ల పంట నష్టాలపై సమీక్ష నిర్వహించి, ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డ్వామా పీడీ ఏ. ముఖలింగం, డి ఎమ్ అండ్ హెచ్ వో డా. కే. వేంకటేశ్వర రావు, తహసీల్దార్ పి. కృష్ణా రావు తదితరులు పర్యటనలో పాల్గొన్నారు.

కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో ముంపు బాధితులకు భోజన సదుపాయంనిడదవోలు, జూలై 20 :  కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో ముంపు బాధ...
20/07/2024

కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో ముంపు బాధితులకు భోజన సదుపాయం

నిడదవోలు, జూలై 20 : కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో ముంపు బాధితులకు భోజన సదుపాయం అందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణా నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారము మధ్యాహ్నం కంసాలిపాలెం ఎంపిపి స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, మెడికల్ క్యాంపును పరిశీలించారు. వరద ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు స్వచ్ఛమైన, వేడిగా భోజనం అందిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ కేంద్రం కొనసాగుతుంది.గ్రామంలో పాములు కనిపించడంతో, జిల్లా అటవీ శాఖ అధికారుల సహకారంతో రాజమండ్రి నుంచి స్నేక్ క్యాచర్ల్స్ రప్పించి, పాములను పట్టించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ఏ. దుర్గెష్, తహసీల్దార్ వి. నాగభూషణం, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను,  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,...
07/06/2024

ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,,మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ను ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు కార్యకర్తల సంక్షేమ విభాగ కో-ఆర్డినేటర్ శిష్ట్లాలోహిత్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజమహేంద్రవరం, జూన్ 7 : ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే గా ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కా...
07/06/2024

రాజమహేంద్రవరం, జూన్ 7 : ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే గా ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మధ్యవర్తిత్వ శిక్షణ విజయవంతంరాజమహేంద్రవరం, జూన్ 7:  తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 4...
07/06/2024

మధ్యవర్తిత్వ శిక్షణ విజయవంతం

రాజమహేంద్రవరం, జూన్ 7: తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 గంటల మధ్యవర్తిత్వ తర్పీదు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 03.06.2024 నుండి 07.06.2024 వరకు జరిగిన ఈ శిక్షణలో సీనియర్ శిక్షకులు శ్రీ వినయ్ కుమార్ గుప్తా మరియు శ్రీ సునీల్ కుమార్ అగర్వాల్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి 30 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, ఈ శిక్షణ న్యాయాధికారులకు మధ్యవర్తిత్వంలో మంచి నైపుణ్యాన్ని అందించిందని అన్నారు. ముగింపు కార్యక్రమంలో శిక్షకులను సన్మానించారు.

06/06/2024

2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
- కలెక్టర్ డా. కే. మాధవీలత.

రాజమహేంద్రవరం, 6.6.2024: తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 విజయవంతంగా పూర్తయ్యాయి. కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ, పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు ప్రశాంతంగా సాగిన ఎన్నికల కోసం పోలీసులు, రెవెన్యూ, మరియు ఇతర శాఖల అధికారుల సహకారం అభినందనీయమని తెలిపారు.

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ముఖ్యపాత్ర పోషించిందని ప్రశంసించారు. నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ సజావుగా నిర్వహించిన రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు, కేంద్ర బలగాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కమీషనర్ కే. దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్తూర్పు గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్...
06/06/2024

ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత ధన్యవాదాలు తెలిపారు. అధికవి నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన లెక్కింపులో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది, హమాలీలు తదితరులు నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో విలువైన సూచనలు ఇచ్చిన ఎన్నికల అబ్జర్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా ఎస్పీ పి. జగదీష్ మరియు ఇతర పోలీసు అధికారులు, కేంద్ర బలగాలు సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో తొలినాళ్ల ఫలితం వెలువడిన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ మరియు వారి టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Prime News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prime News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share