Praja mantalu

  • Home
  • Praja mantalu

Praja mantalu Praja Mantalu Telangana National Daily published in Telugu From Jagtial, Telangana State. Peoples friendly News paper.

it is a daily newspaper to promote healthy Journalism, No biased views.

title https://www.prajamantalu.com/article/5831/suman-rao-superintendent-of-mutta-child-%C2%A0-%C2%A0   -సీనియర్ సిటీజేన...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5831/suman-rao-superintendent-of-mutta-child-%C2%A0-%C2%A0

-సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు

జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు):

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ, ఆర్.ఎం.పి.,పి.ఎం.పి.శాఖ ల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న మాతా శిశు కేంద్ర,మెడికల్ కాలేజీ,ఐ.ఎం.ఎ.అసోసియేషన్ డాక్టర్లను సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఆర్.ఎం.పి.రాష్ట్ర అధ్యక్షుడు రాజా గోపాల్ చారి లు ఘనంగా సన్మానించారు.

మాతా శిశు సూపరెండేంట్ సుమన్ మోహన్ రావు, ఆర్.ఎం.వో.లు డాక్టర్లు గీతిక,శ్రీపతి,విజయా రెడ్డి,నరేష్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్,ప్రొఫెసర్లు రఘు,ప్రవీణ్,అర్చన,శిల్ప,ప్రదీప్,స్రవంతి,సింధూజ,లను,ఐ.ఎం.ఏ.అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.హేమంత్,ప్రధాన కార్యదర్శి ఎశ్రీనివాస్ రెడ్డి,సంతోష్ రెడ్డి,ట్రెజరర్ సుధీర్,దంత వైద్యుడు డాక్టర్ హరి విక్రమ్ లను పట్టు శాలువాలతో,విశిష్ట సేవా పురస్కారాల్తో సన్మానించారు.

ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని,తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం హర్షణీయమన్నారు.మాతా శిశు కేంద్రం,ప్రభుత్వ ప్రాంతీయ వైద్య శాలల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ,ఐఎం.ఎ.ఆధ్వర్యంలో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు.జగిత్యాల జిల్లా మెడికల్. హబ్ గా మారడంతో జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరపున ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు , 60 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నారని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఆర్.ఎం.పి. అధ్యక్షుడు జి.రాజ్ గోపాల్ చారి,సీనియర్ సిటీజేన్స్ ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ,సంయుక్తకార్యదర్శి దిండిగాల విఠల్, మాతా శిశు కేంద్ర,డాక్టర్లు,మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు,నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5830/mlc-poem-for-the-injured-in-the-sigachi-industry-at పటాన్చెరువు జూలై 01 ...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5830/mlc-poem-for-the-injured-in-the-sigachi-industry-at

పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు):

సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు.

ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని,బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలను కోరారు.

ఫ్యాక్టరీ లో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారో కూడా చెప్పడం లేదని,ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోందని, ప్రభుత్వం దీనిపై నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5829/bjp-state-chief-who-criticized-mp-raghunandan-rao సికింద్రాబాద్  జూలై01...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5829/bjp-state-chief-who-criticized-mp-raghunandan-rao

సికింద్రాబాద్ జూలై01 (ప్రజామంటలు): :

మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మోండా కార్పొరేటర్ కొంతం దీపిక,బీజేపీ నాయకులు ఉన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5828/the-procession-of-the-mahakali-ammans-event సికింద్రాబాద్ జూలై 01 (ప్రజా...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5828/the-procession-of-the-mahakali-ammans-event

సికింద్రాబాద్ జూలై 01 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి మేళా తాళాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఘటము కళాసిగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమ,పసుపులు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. తిరిగి రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఘటము అమ్మవారి ప్రధాన ఆలయానికి చేరుకుంది.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5827/petition-in-nhrc సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) :పాశమైలారం ప్రమాద ఘ...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5827/petition-in-nhrc

సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) :

పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్ పై హత్య గా పరిగణింపబడని (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ) కేసు నమోదు చెయ్యాలంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని మంగళవారం పిటీషన్ దాఖలు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల- చొప్పున పరిహారం చెల్లించే విధంగా సిగాచి యాజమాన్యాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది కోరారు. గాయపడ్డ కార్మికులకు రూ10లక్షల - చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్ర కార్మికులు, ఉపాధి కల్పన, కర్మాగారాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ను ప్రతివాదిగా పేర్కొన్న రామా రావు - తెలంగాణ వ్యాప్తంగా కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వమంటూ కోరారు. తన పిటిషన్ ను విచారణకు స్వీకరించి డి సంఖ్య 15315/IN/2025 గా జాతీయ మానవ హక్కుల కమిషన్ నమోదు చేసిందని - త్వరలో విచారణకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అడ్వకేట్ రామారావు పేర్కొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5826/great-profession-to-save-those-who-are-in-danger సికింద్రాబాద్, జూలై 01 ...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5826/great-profession-to-save-those-who-are-in-danger

సికింద్రాబాద్, జూలై 01 ( ప్రజామంటలు) :

డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీ.సీ రాయ్ ని స్మరిస్తూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి,ఇతర వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు గా ఉండడం అత్యంత అదృష్టం గా భావిస్తున్నట్లు, ఆపదలో ఉన్న వారికి సేవ చేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు.అనంతరం వైద్య వృత్తిని గురించి పలువురు మాట్లాడారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవి శేఖర్, ఆర్ యం ఓ వన్ శేషాద్రి, రజని, సునీల్, మురళీధర్ రావు ,కళ్యాణ్ చక్రవర్తి, యోగి, మీనాక్షీ,సరిత,బ్రహ్మేశ్వర్, నాజిమ్,నవీన్,జాహ్మావి,రాజేశ్వరీ,సునీ, సుధీర్ పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5825/doman-yadav-as-power-grid-executive-director సికింద్రాబాద్, జూలై 01 (ప్ర...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5825/doman-yadav-as-power-grid-executive-director

సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు):
:
పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు. 1993 లో ఇంజనీర్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దోమన్ యాదవ్ 32 ఏండ్ల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉండి, ట్రాన్స్ మిషన్ రంగంలోని అన్ని విభాగాలల్లో పనిచేశారు. గ్రిడ్ ఆటోమిషన్ ఆండ్ కమ్యూనికేషన్ , క్వాలిటీ అశ్యూరెన్స్ ఆండ్ ఇన్పెక్షన్స్, ఈఆర్పీ ఆండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ , పవర్ గ్రిడ్ టెలికాం వ్యాపారంలో గుర్గావ్, న్యూ ఢిల్లీ,కొల్కతా లో పనిచేశారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పవర్ గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయం గుర్గావ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలిందించారు. ఈసందర్బంగా పలువురు పవర్ గ్రిడ్ ఉద్యోగులు ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5824/doctors-day-celebrations-at-uphc సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) :జా...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5824/doctors-day-celebrations-at-uphc

సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) :

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం ఉన్న వృత్తి అని పలువురు వ్యక్తులు కొనియాడారు

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5823/former-jedi-chairperson-dawa-spring జగిత్యాల జులై 1( ప్రజా మంటలు)శ్రీకృష...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5823/former-jedi-chairperson-dawa-spring

జగిత్యాల జులై 1( ప్రజా మంటలు)

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత అన్నారు

జగిత్యాల పట్టణంలో మంగళవారం జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో నాయకులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు జగిత్యాల ప్రజలందరిపై ఉండాలని, అందరికీ విజయం చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అవారి శివ కేసరి బాబు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు చింతల గంగాధర్ నీలి ప్రతాప్ మహిళా నాయకులు అనురాధ కవిత గంగమ్మ జలజ మరియు హరే కృష్ణ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5822/this-year-balkampeta-ellamma-kalyanotsavam-hapicci-vice-president-dr-kot...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5822/this-year-balkampeta-ellamma-kalyanotsavam-hapicci-vice-president-dr-kota

మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు

సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు):

బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారని పేర్కొన్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారని ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

అమ్మవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడం అదృష్టం అన్న కోట నీలిమ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ దేవతను మొక్కుకున్నానని తెలిపారు. గతంతో పోలిస్తే కళ్యాణోత్సవం ఈ సారి మరింత ఘనంగా జరిగిందన్నారు. ప్రొటోకాల్ సమస్యలు లేవని వివరించారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

ఉత్సవాల విజయవంతానికి దాదాపుగా నెల నుంచి ప్రతి రోజు ఆలయాన్ని సందర్శించి ఆయా డిపార్ట్ మెంట్ అధికారులతో, పెద్దలతో, స్థానికులతో, భక్తులతో దాదాపు 100కు పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగా జాతర నిర్వహించామన్నారు. దాని పలితంగానే ఈ రోజు అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత ఘనంగా జరిగిందన్నారు. బోనాల పండగ నేపథ్యంలో ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. కళ్యాణోత్సవ విజయవంతానికి కృషి చేసిన ఆలయ సిబ్బందిని, ట్రస్ట్ బోర్డును, జీహెచ్ఎమ్సీ, పోలీస్ సహా అన్ని శాఖల అధికారులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ పండగను తమ ఇంటి పండగలా భావించి విజయవంతం చేసిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5821/if-parents-give-birth-to-doctors-reborn మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర ...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5821/if-parents-give-birth-to-doctors-reborn

మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు

గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు):

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్ అనిల్,డాక్టర్ సృజన, డాక్టర్ ఉదయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ బెక్కం తిరుపతి,ఆర్.ఎం.పి మండలోజు శ్రీనివాస్ లను సాల్వాల,మెమోటోలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ,అమూల్యమైన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.అనంతరం నూతన లయన్స్ క్లబ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే, చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా రాయికల్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగస్తులను, చార్టెడ్ అకౌంటెంట్లను సాల్వాల,మెమెంటో తో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,ప్రధాన కార్యదర్శి బొడగం అంజిరెడ్డి రెడ్డి,కోశాధికారి బెక్కం తిరుపతి,ఉపాధ్యక్షులు వాసం స్వామి,మాజీ జడ్ సీలు బత్తిని భూమయ్య,మ్యాకల రమేష్, కాటిపెళ్లి రామ్ రెడ్డి,మాజీ అధ్యక్షులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,కొమ్ముల ఆదిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్,కటుకం కళ్యాణ్, జిల్లాల సూర్యం,మోర రామ్మూర్తి,బాలే నిఖిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/5820/spiritual-programs-promote-devotional-peace-coordination-in-the-public ర...
01/07/2025

title https://www.prajamantalu.com/article/5820/spiritual-programs-promote-devotional-peace-coordination-in-the-public

ర్

జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు అడువల లక్ష్మణ్, సుధాకర్,డిష్ జగన్, అవా రీ శివ కేసరి బాబు,దుమాల రాజ్ కుమార్, కుసరి అనిల్,పిట్ట ధర్మరాజు, భోగ చిన్న జి ఆర్,కత్రోజ్ గిరి,రంగు మహేష్,పోతునుక మహేష్, రవి శంకర్,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

Address


Alerts

Be the first to know and let us send you an email when Praja mantalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja mantalu:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Want your business to be the top-listed Media Company?

Share