Praja mantalu

  • Home
  • Praja mantalu

Praja mantalu Praja Mantalu Telangana National Daily published in Telugu From Jagtial, Telangana State. Peoples friendly News paper.

it is a daily newspaper to promote healthy Journalism, No biased views.

title https://www.prajamantalu.com/article/7410/kharif-monsoon-season-grain-purchase-plans-should-be-prepared-district జ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7410/kharif-monsoon-season-grain-purchase-plans-should-be-prepared-district

జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయములో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత వానాకాలం & యాసంగి 2024-2025 CMR చెల్లింపుల పై మరియు ప్రస్తుతం వానాకాలం 2025-26 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

వానాకాలం 2025-26 సీజన్ నందు 666500 MTs ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్దం చేయడం జరిగిందని తెలిపారు.

ఈ వానాకాలం సీజన్ లో వరి ధరలు గ్రేడ్ A- 2389/-, కామన్ ధరలు – 2369/- కలవు. ఈ సీజన్ కు గాను IKP – 137, PACS- 285 MEPMA -1 మొత్తం – 423 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.

ఈ వానాకాలం లో (92) బాయిల్డ్ మిల్లులు పాల్గొంటున్నందున ప్రతి ఒక్క రైస్ మిల్లు వారు తప్పనిసరిగా 100% బ్యాంకు గ్యారెంటి DMCSC కార్యాలయములో సమర్పించాలి మరియు రైస్ మిల్లులో 50-60 హమలిలను సమకుర్చుకోవలన్నారు.

ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారిని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలతో లేకపోతే సంబంధిత పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారము ఇవ్వవలసినదిగా తెలిపారు.

ఈ సమావేశములో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ పౌరసరఫరా సంస్థ జితేంద్ర ప్రసాద్, జిల్లా రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్ అసోసియేషన్, ఇతర రైస్ మిల్లర్లు మరియు పౌరసరఫరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7409/state-chief-electoral-officer-sudarshan-reddy-said-pending-voter-applica...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7409/state-chief-electoral-officer-sudarshan-reddy-said-pending-voter-applications

జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)
బి.ఎల్.ఓ. లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి

ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వెంటనే పూర్తి చేయాలి

ఓటరు జాబితా సంబంధించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.

జిల్లా కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఓటర్ జాబితా సంబంధించి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జగిత్యాల మెట్ పెల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ కన్నం హరిణి లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

బూత్ స్థాయి అధికారుల నియామకం, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై కలెక్టర్ లకు సీఈఓ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ

ఓటర్ జాబితా సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కడైనా ఉంటే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పెండింగ్ ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి, నోటీస్ పీరియడ్ జారీ చేసిన 7 రోజుల లోగా పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ కు బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ.) నియామకం పూర్తి కావాలని, బిఎల్ఓ లకు ఐడి కార్డులు జారీ చేయాలని అన్నారు.

నూతన ఓటర్లకు ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.

వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ

స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ 2002 లో పేరు నమోదు కాకుండా మిస్ అయిన ఓటర్లు జిల్లాలో ఎంతమంది ఉంటారో పరిశీలించి నివేదిక తయారు చేయాలని అన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ క్యాటగిరి బి, సి, డి ఫీల్డ్ లెవల్ పరిశీలించి రికన్సైల్ చేసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జగిత్యాల, మెట్ పెల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు మధుసూదన్, శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి తదితరులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7408/former-councilor-bharat-suraksha-samiti-state-vice-president-acs-raju "జ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7408/former-councilor-bharat-suraksha-samiti-state-vice-president-acs-raju

"
జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)
నల్గొండ జిల్లా వాస్తవ్యులు, హర్యానా క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న పూరణ్ కుమార్ అక్టోబర్ 7౼2025న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇందుకు పై అధికారుల మానసిక వేధింపులు, కుల వివక్షనే కారణమని ఆయన ఒక సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు, తెలంగాణకు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించినట్లు భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ కొత్తకొండ బాలన్న వేముల దేవ రాజం బొందుకూరి శ్రీనివాస్ బండారి మల్లికార్జున్ నరేందుల శ్రీనివాస్ బాసెట్టి ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ వీరన్న దొనఖండ్ల రాజేశ్వరరావు ఎడ్మల వెంకటరెడ్డి, గట్ల గణేష్ వడ్డేపల్లి మురళి నక్క శేఖర్ భోగ దేవన్న తునికి అంజన్న మహేష్, సంపత్ రావు ,సిరిపురపు గంగారం తదితరులు పాల్గొన్నారు

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7407/the-aim-is-to-strengthen-the-organizational-structure-of-the మంచిర్యాల అ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7407/the-aim-is-to-strengthen-the-organizational-structure-of-the

మంచిర్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు.

ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని బలపరిచేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకత్వ మార్పుతో పాటు ప్రతి కార్యకర్తకు బాధ్యతాభారాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.

పార్టీ ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు, మహిళలకు మరింత అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చగల ఏకైక శక్తిగా ఉన్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో PCC అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్,PCC అబ్జర్వర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్,GCC చైర్మన్ కోట్నాక తిరుపతి, పిసిసి మెంబర్ నూకల రమేష్,PCC మెంబర్ కొండ శేఖర్, జిల్లా యూత్ అధ్యక్షులు అనిల్, జిల్లా మహిళా అధ్యక్షులు పెంట రజిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి బియాల తిరుపతి, సిరిపురం రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, లక్షట్ పేట్ టౌన్ సెక్రెటరీ ఎండి ఆరిఫ్, పట్టణ బ్లాక్ అద్యక్షులు నతిమేల రాజు, మండల అధ్యక్షులు వంగిలి రమేష్, తోట రవి, వెంకటేశ్వర్లు, RTA మెంబర్ ఆపతి శ్రీనివాస్,AMC మంచిర్యాల్ పత్యాల పద్మ ముని,AMC లక్షట్ పేట్ దాసరి ప్రేమ్ చందు ఆత్మ చైర్మన్ సంఘవి మురళి నాయకులు. తదితరులు, పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7406/district-level-govijnana-exams-at-valmiki-awasa జగిత్యాల అక్టోబర్ 16 (ప్...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7406/district-level-govijnana-exams-at-valmiki-awasa


జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)

గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు.

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గో సేవా ప్రముఖ బీరెల్లి సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి భారతీయ ఆర్థిక వ్యవస్థకు గోవు మూల కారణమన్నారు. గోవు ఒక జంతువు కాదని పురాతన కాలం నుండి గోమాతగా అభివర్ణిస్తూ పూజిస్తామన్నారు. గోవులోని విశిష్ట గుణాలను బాల్యం నుండే విద్యార్థులకు స్థిరపడడము కోసం పాఠశాల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో గో విజ్ఞాన పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7405/relentless-fight-for-payment-of-pensioners-dues-state-secretary-of-t  జగ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7405/relentless-fight-for-payment-of-pensioners-dues-state-secretary-of-t

జగిత్యాల అక్టోబర్ 16( ప్రజా మంటలు):

పెన్షనర్ల బకాయిలు చెల్లింపులకు రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో టి. పి. సి. ఏ. జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హరి అశోక్ కుమార్ పాల్గొని పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు, అధికారులకు సభ్యత్వం ఇస్తూ వారిని సన్మానించారు. పెన్షనర్స్ వాయిస్ పత్రికలను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల, అధికారుల పెన్షనరీ ప్రయోజనాల బకాయిలు అందక పెన్షనర్లు పలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, కోశాధికారి గౌరీశెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు వెల ముల ప్రకాష్ రావు, ఎం. డీ. యా కూబ్, సంయుక్త కార్యదర్శులు కట్ట గంగాధర్, విఠల్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, ధర్మపురి అధ్యక్షులు కే. గంగాధర్, మల్యాల అధ్యక్షులు ఎం. డీ. యా కూబ్,మెట్ పల్లి అధ్యక్షులు మురళి, రాయికల్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు, మధు సూదన్ రావు, వీరారెడ్డి, కరుణ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7404/indolence-of-officials-brings-bad-name-to-the-government జగిత్యాల అక్టోబ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7404/indolence-of-officials-brings-bad-name-to-the-government

జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు):

నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించి,అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ అల‌స‌త్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి, అధికారుల తీరుపై మండి ప‌డ్డారు.

జగిత్యాల పట్టణంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి, కొందరికి మాత్రమే ఇండ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జీవన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు

ఈ సంద‌ర్భంగా జీవ‌న్‌రెడ్డి మాట్లాడుతూ,నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభలను ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.ఎంపిక చేసిన అర్హులతో పాటు అన్హరులుగా గుర్తించబడిన వారి వివరాలతో లిస్టు ఎందుకు విడుదల చేయలేదని నిల‌దీశారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ సమయంలో స్థలాలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల నుంచి నివేదిక తెప్పించుకొని అర్హులను గుర్తించాలని, పట్టణంలోని అన్ని వార్డుల్లో మళ్లీ వార్డు సభలను నిర్వహించి, అర్హుల‌కు న్యాయం జ‌రిగేలా చూడాలన్నారు.

అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందించారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7403/dr-kota-neelima-filed-nomination-for-the-post-of-secunderabad సికింద్రాబ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7403/dr-kota-neelima-filed-nomination-for-the-post-of-secunderabad

సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ స్ఫూర్తితో ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నారని చెప్పారు.మరోవైపు పార్టీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో భాగంగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్ గా సీపీ జోషి, పీసీసీ అబ్జర్వర్లుగా నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, శ్రీను బాబు, పవన్ మల్లాదిని అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా బుధవారం సనత్ నగర్ నియోజకవర్గంలోని B -బ్లాక్ పరిధిలోని అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ సీపీ జోషి మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యకర్తల నుంచే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలోని 600 పైచిలుకు జిల్లాల్లో కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. వారి అభీష్టం మేరకు డీసీసీ అధ్యక్షుల పేర్లను సేకరించి కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7402/world-anesthesia-day-in-gandhi సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు):స...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7402/world-anesthesia-day-in-gandhi

సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు):

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ అనస్టీషియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యులు మాట్లాడుతూ, 1846 అక్టోబర్‌ 16న డెంటల్‌ ప్రొసీజర్‌ కోసం మొదటిసారిగా డాక్టర్‌ డబ్ల్యూ.టి.జీ. మార్టన్‌ అనస్థీషియా ఇవ్వగా, ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. మేజర్‌ ఎం.వి. భీమేశ్వర్‌ గోల్డ్‌ మెడల్‌ను రాష్ట్రంలో ప్రథమ ర్యాంక్‌ సాధించిన డా. ఎస్‌. కావ్యకు డా. భీమేశ్వర్‌ స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా. కే.ఇందిరా, సూపరింటెండెంట్‌ డా. వాణి, అనస్థీషియా విభాగాధిపతి డా.మురళీధర్, డా.అబ్బయ్య, టీజీజీడీఏ గాంధీ అధ్యక్షులు డా.భూపేందర్ రాథోడ్, కార్యదర్శులు, ఇతర విభాగాల హెడ్‌లు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.అనస్థీషియా పీజీలు, టెక్నీషియన్లు కూడా కార్యక్రమంలో పాల్గొని దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7401/abhishek-sharma-smriti-mandhana-who-won-icc-awards ముంబాయి అక్టోబర్ 16:అ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7401/abhishek-sharma-smriti-mandhana-who-won-icc-awards

ముంబాయి అక్టోబర్ 16:

అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు.

అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు.

ఐసిసి ప్రతి నెలా ఉత్తమ ఆటగాడు మరియు ఆటగాళ్లకు అవార్డులు ఇస్తుంది. ఆ విషయంలో, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.

ఆసియా కప్ క్రికెట్ సిరీస్లో అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ 7 మ్యాచ్ 314 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతని సగటు 44.85 మరియు అతని స్ట్రైక్ రేట్ 200. సిరీస్ అంతటా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఐసిసి టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ అత్యధిక రేటింగ్ పాయింట్లను కూడా సాధించాడు.

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7400/ganta-rammohan-sentenced-to-6-months-in-jail-in-check మెట్టుపల్లి అక్టోబ...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7400/ganta-rammohan-sentenced-to-6-months-in-jail-in-check

మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్):

చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం.

ఫిర్యాదుదారు తరపు న్యాయవాది పసునూరి శ్రీనివాస్ కథనం ప్రకారం, మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ తన స్నేహితుడు అయిన గుంటుక ప్రసాద్ దగ్గర 2019 లో నాలుగు లక్షల ఎనబై ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. సొమ్ముకు సంబంధించి ఫిర్యాదుదారు ప్రసాద్ కు గ్యారంటీగా ఎస్బిఐ చెక్కు నెంబర్ 295755 జారీ చేశారు.

కాగా అట్టి చెక్కు తేది 03-04-2019 రోజున బ్యాంకులో డబ్బులు లేక బౌన్స్ కావడంతో బాధితుడు మెట్ పల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గుంటుక ప్రసాద్ రామ్మోహన్ పై ప్రయివేట్ ఫిర్యాదును దాఖలు చేయాగ, మెట్ పల్లి కోర్టు గంటా రామ్మోహన్ కు సమన్లు జారీ చేసింది.

అనేక విచారణల అనంతరం గంటా రామ్మోహన్ పై నేరం రుజువు కావడంతో బాధితుడికి నెల రోజుల లోపు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని, లేనిచో 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని బుధవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు .

RSS Feed of Praja Mantalu

title https://www.prajamantalu.com/article/7399/come-forward-to-make-the-bc-bandh-a-success పద్మశాలి మండల కార్యదర్శి అంక...
16/10/2025

title https://www.prajamantalu.com/article/7399/come-forward-to-make-the-bc-bandh-a-success

పద్మశాలి మండల కార్యదర్శి అంకం భూమయ్య



గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని గొల్లపల్లి మండల పద్మశాలి కార్యదర్శి అంకం భూమయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు మద్దతుగా మండలంలోని బీసీ కుల బంధువులు వివిధ పార్టీలు బీసీ జనాభాకు అనుగుణంగా 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు మండలంలోని బీసీ కుల బంధువులు రాజకీయ పార్టీలకు అతీతంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొందరు రిజర్వేషన్ల వ్యతిరేకులు హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసులు వేసి బీసీలకు జనాభా ప్రతిపదికను రావలసిన రిజర్వేషన్ల హక్కులను అడ్డుకుంటున్నారు అలాగే బీసీలకు జనాభా ప్రకారంగా 65 శాతం ఉన్నవారికి 65% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీల తరఫున డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. మండల కేంద్రం తో పాటు మండలంలోని వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, వివిధ రంగాలవారు బందుకు మద్దతుగా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేయాలని కోరారు

RSS Feed of Praja Mantalu

Address


Alerts

Be the first to know and let us send you an email when Praja mantalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja mantalu:

  • Want your business to be the top-listed Media Company?

Share