01/09/2026
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మన కూటమి ప్రభుత్వ ఆలోచనతో ఏకీభవిస్తూ పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే : ఎమ్మెల్యే గారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోంది... మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఇది ఒక ప్రయత్నం : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎర్రవారిపాలెం , చిన్నగొట్టిగల్లు మండలాలలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నాం : ఎమ్మెల్యే గారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాల ద్వారా నడిచే మునగ ప్రాసెసింగ్ యూనిట్ ను ఎర్రవారిపాలెంలో ప్రారంభిస్తున్నాం.
ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్విచ్ నొక్కి ప్రారంభించారు
పురుషులతో సమానంగా మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి, నారా లోకేష్ గార్ల ఆలోచన విధానాలతోనే ఇలాంటివి సాధ్యం : ఎమ్మెల్యే గారు.
సుమారు 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ ను మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది.
మండలంలోని 80 మంది రైతులకు సుమారు 80 కిలోల మునగ విత్తనాలు పంపిణీ చేసి దీనిని 157 ఎకరాలలో మునగ సాగు చేయిస్తున్నాం.
ఇక్కడ పండిన మునగ పంటను మహిళా రైతులే ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా పొడిగా తయారుచేసి దీనిని రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పిస్తుంది.
యర్రావారిపాళ్యం : రైతే రాజు.. రైతుల ఆర్థిక ఎదుగుదలే రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలకు మూల కారణమని మరోసారి కూటమి ప్రభుత్వం తెలిపింది. యర్రావారిపాళ్యం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన మునగ ప్రాసెసింగ్ యూనిట్, కస్టమర్ హైరింగ్ సెంటర్ను జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ప్రారంభించారు. పురుషులతో పాటు మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో మరింత ప్రోత్సాహ ప్రోత్సాహకాలను కూటం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
మునగ సాగు చేసే రైతులకు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు.
కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా రైతులకు అవసరమైన సుమారు 80 లక్షల రూపాయల ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు కూటమి ప్రభుత్వం అందించింది. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా రైతుల పంట ఉత్పత్తి, ఆదాయం పెంపునకు ఈ కేంద్రాలు దోహద పడనున్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ‘నోబుల్ పంట’గా గుర్తింపు పొందిన మునగ సాగుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది.
ఇప్పటికే ఎంపిక చేసిన జిల్లాల్లో 2,177 మంది రైతులు 1,814 ఎకరాల్లో మునగ సాగుకు ముందుకొచ్చారు. డ్వాక్రా మహిళా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని మునగ సాగును ప్రోత్సహిస్తున్నారు.
రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే కొంతమందిని పెరియకులం ప్రాంతానికి తీసుకెళ్లి సాగు విధానాన్ని వివరించారు.
సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మునగ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సెర్ప్ ద్వారా రుణాలు అందించనున్నారు.
యూనిట్ వ్యయాన్ని బట్టి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణ సదుపాయం కల్పించనున్నారు.
పంట చేతికొచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ సమస్య లేకుండా ప్రభుత్వ అధికారులు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
పెద్ద మొత్తంలో మునగ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లలోనూ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చు.
సాగు, కోత, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ వంటి దశల్లో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.