AP Regional News

  • Home
  • AP Regional News

AP Regional News 24Hours Breaking News

𝙶𝚘𝚜𝚊𝚕𝚊
11/12/2022

𝙶𝚘𝚜𝚊𝚕𝚊

NEXT ENTI ? నెక్స్ట్ ఏంటి ? | LIFE OF JYO |

11/12/2022

ఎరుమేలి లో కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న అఖిలభారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ అన్నదాన కేంద్రం. నేటి నుండి జనవరి 15 రాత్రి వరకు ఉదయం 7గంటలనుండి టిఫిన్,11గంటల నుండి భిక్ష (భోజనం )రాత్రి 6గంటల నుండి అల్పాహారం మరియు కావలసిన వారికి భోజనం రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంది. కావున ఈ అవకాశాన్ని శబరిమల యాత్ర చేయు భక్తులు అందరికీ వాట్సాప్ ద్వారా తెలియపరచగలరు. మీ పర్సనల్ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయగలరు. ఏ ఒక్కరికి ఉపయోగ పడ్డా ఆకలితో ఉన్నావారి కడుపునింపిన పుణ్యం మీకు దక్కుద్ది. స్వామియే శరణం అయ్యప్ప 🙏

11/12/2022

*శ్రీకాకుళం,*
*ఇచ్చాపురం*

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం స్వర్ణభారతి విద్యాసంస్థల ఆవరణలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జెడి ఫౌండేషన్ అర్హతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకోసం 6511 ఉద్యోగాలకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతిభావంతులైన యువకులకు మరింత ప్రోత్సాన్ని ఇచ్చేందుకు యువకులకు పరీక్షను పెట్టి ఉచిత శిక్షణకు జెడి ఫౌండేషన్ ఎంపిక చేస్తున్నది. ఈ పరీక్ష ద్వారా వెయ్యిమందిని ఎంపిక చేసి, హైదరాబాద్ ఐఏసిఈ శిక్షణ సంస్థతో కలసి జెడి ఫౌండేషన్ వారికి ఉచిత శిక్షణ ఇస్తుంది. ఎంపిక చేసిన వెయ్యి మందికి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ అందిస్తారు. మొత్తంగా ఉత్తరాంధ్రలో 21పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఇచ్చాపురం స్వర్ణ భారతి విద్యాసంస్థలను ఒక కేంద్రంగా నిర్ణయించారు. ఆదివారం ఉదయం 9:30నుంచి స్వర్ణ భారతి విద్యాసంస్థ ఆవరణలో జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అంటే జేడీ ఫౌండేషన్ హైదరాబాద్ ఐఏసిఈ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నందున ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువకులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

https://youtu.be/t4Dj5IvVO2c
10/12/2022

https://youtu.be/t4Dj5IvVO2c

ENGLISH లో స్పీచ్ అదరగొట్టిన PAVAN KALYAN | AP REPUBLIC NEWS |

10/12/2022

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్క్రోలింగ్ :

ఐఎండి సూచనల ప్రకారం

తీరం దాటిన మాండూస్ తుఫాన్

రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్

సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం

దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

తుఫాను తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.

10/12/2022

*BREAKING*

*రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష*

*లోటస్ పాండ్ వద్ద కొనసాగుతున్న పోలీసుల నిర్భంధ ఖాండ*

*లోటస్ పాండ్ చుట్టూ అష్ట దిగ్బంధనం*

*పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్న పోలీస్ లు*

*కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం*

*నిన్నటి బొల్లారం పోలీస్ స్టేషన్ లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు*

*బంజారాహిల్స్ పి ఎస్ లో 7 గురు పార్టీ నేతలు*

*ఆన్న పానీయాలు సైతం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో కి రానివ్వాని వైనం*

*లోటస్ పాండ్ చుట్టూ ఖర్ఫ్యు వాతావరణం*

*పాదయాత్ర కి అనుమతి ఇవ్వడం,అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపేది లేదంటున్న వైఎస్ షర్మిల గారు*

https://youtu.be/oolOLkVl3Bs
09/12/2022

https://youtu.be/oolOLkVl3Bs

AP REPUBLIC NEWS వార్తల సమాహారం... తెలుగు రాష్ట్రాలలో వార్తలను ఎప్పటికప్పుడు మీకందిస్తు....మీ ముందుంచడమే మాAP REPUBLIC NEWS లక్ష్యం.... ...

09/12/2022

*ఫైల్ నేమ్:-మాండాస్ తుఫాన్ వస్తుంది జాగ్రత్త..*

*రిపోర్టర్:-వి.రమేష్..కడపజిల్లా..రాయచోటి..తేది:-9.12.2022*

అన్నమయ్యజిల్లా..రాయచోటి
జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ...బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ ప్రభావంతో అన్నమయ్యజిల్లాలో రేపు ఎల్లుండి,ఆ మరసటి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మూడు రోజులు నదులు, వాగులు,వంకలు పరిసర ప్రాంతాలకు వెళ్ళద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఉదృతంగా ప్రవహించే నదులు,వాగులు, వంకల్లోకి దాటేందుకు సాహసం చేయొద్దన్నారు.గత సంవత్సరం నవంబర్ చివరన భారీ వర్షాలు జిల్లాలో కురిశాయిన్నారు.ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి,ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ శాఖ చెప్పడం జరిగిందన్నారు. మండూస్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎటువంటి ఇబ్బంది ఉన్న జిల్లా కమాండ్ కంట్రోల్ రూం 08561293006 నంబర్ కు సమాచారం అందివ్వాలన్నారు.

బైట్స్:-

1) గిరీషా పీఎస్ (అన్నమయ్య జిల్లా..కలెక్టర్)..

09/12/2022

స్లగ్:
చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం..
నాదెండ్ల మనోహర్

సెంటర్:విశాఖ
హరి
రీజనల్ కో ఆర్డినేటర్.
తేది:9.12.22

యాంకర్:
జనసేన పి.ఏ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ నోవాటేల్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో యువశక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోందన్నారు.అధినేత పవన్ కళ్యాణ్ పాలుగోనే అని ఈ కార్యక్రమంను ఒక యువజనోత్సవ వేడుక నిర్వహిస్తామన్నారు.ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. యువతకు భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
వారాహి విషయంలో ముందే కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారని హెద్దేవా చేశారు.మేము నిబ్బందనలు మేరకే నడుచుకుంటున్నామని,దానికి అంత రాద్దాంతం చేయాల్సిన పనిలేదన్నారు.జగన్నన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని,వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధి లేని ప్రభుత్వమని అన్నారు.వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు కట్టబెట్టేసి ఇప్పుడు రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందని ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టుతున్నారని ఆరోపించారు.
ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని
రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందన్నారు.విజయవాడలో జరిగిన బిసి గర్జనకు
ఆర్టీసీ బస్ లు తరలించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసారని, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ని వై.ఎస్.ఆర్టీసీ గా మార్చేశారని ఆరోపించారు.

09/12/2022

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట

పెనుగంచిప్రోలుశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను.

దేవాలయంలో చేపట్టిన కేశఖండనశాల, కళ్యాణ మండపాలు, గదులు, ప్రత్యేక షెడ్లు నిర్మాణం చేసేందుకు 13 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు మంత్రి సత్యనారాయణ. అంతకుముందు మంత్రి సత్యనారాయణ, ప్రభుత్వ విప్పుసామినేని ఉదయభాను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

Address


Telephone

+918247334137

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Regional News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP Regional News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share