12/12/2025
👉 అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
👉 ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు.
👉 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
👉 కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నామని. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత చెప్పారు.
👉 వివిధ పథకాల అమలులో భాగంగా 2025-26 బడ్జెట్ లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం రూ.10,608.61 కోట్లు కేటాయించిందన్నారు.
👉 వాటిలో ఈబీసీలకు రూ. 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.20 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ.4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.46 కోట్లు కేటాయించామన్నారు.
👉 ఈ సమావేశంలో ఆయా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, డూండీ రాకేశ్, బ్రహ్మయ్య చౌదరి, బుచ్చి రాంప్రసాద్, సూర్యనారాయణ రాజు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.