JRN Journalist Ravi News

  • Home
  • JRN Journalist Ravi News

JRN Journalist Ravi News This is official page Journalist Ravi
(Palakollu News is the first priority)
(2)

కూల్ డ్రింక్స్ తో జుట్టు ఊడిపోతుందా ❓నిండా ముప్ఫైఏళ్లు కూడా రాకుండానే అబ్బాయిల్లో చాలామందికి జుట్టు రాలిపోయి... ఒత్తుగా ...
14/09/2025

కూల్ డ్రింక్స్ తో జుట్టు ఊడిపోతుందా ❓
నిండా ముప్ఫైఏళ్లు కూడా రాకుండానే అబ్బాయిల్లో చాలామందికి జుట్టు రాలిపోయి... ఒత్తుగా ఉండాల్సింది కాస్తా పలుచగా తయారవు తోంది. అలాంటప్పుడు షాంపూలు మార్చడం, నూనెలు వాడటం చేస్తుంటారు కానీ, అంతకన్నాముందు చక్కెరలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండమంటున్నారు పోర్చుగల్ కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్టో శాస్త్రవేత్తలు. తినే ఆహారంతో జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం తినే ఆహారంలో ఏదైనా జుట్టు రాలడానికి కూడా కారణమవుతోందా అనే దిశగా పోర్చుగల్ శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ఈ వరుసలో ముందున్నాయట. వారంలో 11 కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేదా 3500 మిల్లీమీటర్లకు మించి శీతలపానీయాలని తాగేవారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సాధారణంగా కూల్డ్రింక్స్ తాగేవారిలో ఊబకాయం, దంతాలు పాడవడం వంటి సమస్యలొస్తాయని తెలుసుకానీ జుట్టు రాలడానికి గల కారణాలని శోధించే క్రమంలో... ఈ పానీయాలు మాడులో సెబమ్ ని ఎక్కువగా విడుదల చేస్తాయని గుర్తించారు. నిజానికి ఈ సెబమ్ జుట్టుకీ, చర్మానికీ మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే ఇరిటేషన్ రావడం, దురద, వాపులవల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే, జుట్టుని బలంగా ఉంచే క్యాల్షియంనూ, ఐరన్ ని జుట్టుకు అందకుండా కూల్ డ్రింక్స్ ని పాస్ఫారిక్ యాసిడ్ అడ్డుకుంటుందట. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు.

తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని అధికారుల సమగ్ర అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్త...
14/09/2025

తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని అధికారుల సమగ్ర అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయిస్తున్నారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెల్లడైనట్లు తెలిసింది. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడం, వాటిలోనే ఈ పరిసర ప్రాంతవాసులు పనిచేస్తుండటం.. ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఇక్కడి నీటిలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.

యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు, ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

14/09/2025

జిల్లాల ఎస్పీ లూ.. రాజకీయం ముసుగులో అలజడులు సృష్టించే వారిని, నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించొద్దు. ప్రతిపక్షాల పర్యటనలు, కార్యక్రమాలకు నేను వ్యతిరేకం కాదు. కానీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తామంటే అంగీకరించం. --సీఎం చంద్రబాబు

14/09/2025

నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా

కూటమి ప్రభుత్వం టీడీపీ కోటాలో తనకు కేటాయించిన ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ని తీసుకోవడం...
14/09/2025

కూటమి ప్రభుత్వం టీడీపీ కోటాలో తనకు కేటాయించిన ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ని తీసుకోవడం లేదని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు చెప్పారు. అయితే.. టీడీపీ బలోపేతం కోసం పాలకొల్లు శాసన సభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు సలహాలు, సూచనలు పాటిస్తూ.. అయన అడుగు జాడల్లో అహర్నిశలు కృషి చేస్తానని గోపాలరావు చెప్పారు.

14/09/2025

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు 33 మంది డైరెక్టర్లను నియమించింది. ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు 16 మంది, ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ కు 2, విశ్వబ్రాహ్మణ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ కు 15 మందిని నియమించినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. టీడీపీ కి 27, జనసేనకు 5, బీజేపీ కి ఒకటి చొప్పున దక్కాయి.

మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం (15న) విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్ప...
14/09/2025

మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం (15న) విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ప్రకటనపైనే చేశారు. అనంతరం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల కాగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి, అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనుంది. ఈ నెల 19న ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారు.

మ్యూజిక్ మాస్ట్రో, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత కచేరి నవంబరు 8న విజయవాడలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇళయారాజా...
14/09/2025

మ్యూజిక్ మాస్ట్రో, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత కచేరి నవంబరు 8న విజయవాడలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇళయారాజా మొట్టమొదటి సంగీత ప్రదర్శన ఇదేనని, దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కచేరి నిర్వాహకుడు ట్రెండ్ సెట్టర్స్ సుధాకర్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 40 మంది సభ్యుల బృందంతో ఇళయరాజా ఈ ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పారు.

చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం తెల్లవారుజామున ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉదయం 9 గంటల వరకు పట్టణంలో తిరుగుతూ ప్...
14/09/2025

చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం తెల్లవారుజామున ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉదయం 9 గంటల వరకు పట్టణంలో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ ఏనుగు మొదట గంగవరం బైపాస్ సమీపంలోని కీలపట్ల రోడ్డుకు చేరుకుంది. అక్కడి నుంచి జనాలను చూసి పరుగులు పెట్టింది. అటవీశాఖ సిబ్బంది అడవిలోకి మళ్లించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్షన్ అధికారి సుకుమార్ ఏనుగు దగ్గరికి వెళ్లడంతో ఆయనపై దూకింది. కింద పడేసి తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాలు, చేయి ఎముకలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. చివరికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉదయం 10 గంటలకు ఏనుగును అడవిలోకి తరమగలిగారు. ఈలోగా గంటావూరు వద్ద ఒక దూడను ఏనుగు తొక్కి చంపేసింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సుకుమార్ కు మెరుగైన చికిత్స అందించాలని పీసీసీఎఫ్ చలపతిరావును ఆదేశించారు. ఏనుగుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని సూచించారు.

👇2.42 కోట్లకుపైగా కేసులు పరిష్కారం 👇👉 న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) శనివారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 29 రాష్ట్రాలు, 8 ...
14/09/2025

👇2.42 కోట్లకుపైగా కేసులు పరిష్కారం 👇

👉 న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) శనివారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ అదాలత్ నిర్వహించింది. ఇలా జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహించడం ఈ సంవత్సరం ఇది మూడోసారి. శనివారం సాయంత్రం 6.30 వరకూ అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 2.42 కోట్లకుపైగా కేసులు ఈ సందర్భంగా పరిష్కారమయ్యాయి. ఇందులో 2.10 కోట్లకు పైగా కేసులు ప్రీలిటిగేషన్ స్థాయిలో ఉండగా పెండిగ్ కేసులు 32.10 లక్షలకు పైగా ఉన్నాయని అధికార ప్రకటన తెలిపింది. రూ.7,817.82 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు తదితరాల వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించింది.

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ లకు భారీ స్పందన లభించింది. శనివారం ఒక్క రోజే 60,9...
14/09/2025

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ లకు భారీ స్పందన లభించింది. శనివారం ఒక్క రోజే 60,953కు పైగా కేసులు పరిష్కారం అయ్యాయి. రూ.109.99 కోట్ల పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీచేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ ఆర్.రఘునందన్ రావు మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 381 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. రాజీకి అవకాశమున్న పలుకేసులను ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు.

హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ బెంచ్ కు డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. న్యాయవాది కనగల రాధిక సభ్యులుగా వ్యవహరించారు. 108 కేసులను పరిష్కరించారు. రూ.2.05 కోట్ల పరిహారం అందజేసేందుకు అవార్డులు జారీచేశారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించినవారికి న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాప్రతినిధులతో సామరస్యంగా, సమన్వయంతో పనిచేయండి. తప్పు చేస్తే ఏ పార్టీ వారినయినా సరే శిక్షించండి. మా ఎమ్మెల్యేలు, మంత్...
14/09/2025

ప్రజాప్రతినిధులతో సామరస్యంగా, సమన్వయంతో పనిచేయండి. తప్పు చేస్తే ఏ పార్టీ వారినయినా సరే శిక్షించండి. మా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పే దాంట్లో మంచి ఉంటే పాటించండి. తప్పుంటే పాటించాలని నేనూ చెప్పను, మా వాళ్లూ చెప్పరు. ఇది మా కూటమి విధానం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన నేపథ్యంలో వారితో పాటు మిగతా జిల్లాల ఎస్పీలతోనూ శనివారం ఆయన సమావేశమయ్యారు. కొందరు ఎస్పీలు సమావేశానికి హాజరుకాగా, మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వారికి సీఎం దిశానిర్దేశం చేశారు.

👉 డీజీపీ నుంచి SHO వరకూ అందరూ రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ (4ఆర్) విధానంలో పనిచేయాలి. అప్పుడే మనది అత్యుత్తమ పోలీసింగ్ అవుతుంది.

👉 రియాక్ట్: తీవ్రమైన ఘటన జరిగినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందిపై వదిలేయకుండా స్పందించండి

👉 రీచ్: వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తునకు చర్యలు తీసుకోండి.

👉 రెస్పాండ్: మీడియా, సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోండి. వ్యక్తిగత సమస్యలతో సాయం కోరి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించండి.

👉 రిజల్ట్: ప్రతి కేసులోనూ త్వరితగతిన ఫలితాలొచ్చేలా దర్యాప్తు పూర్తి చేయండి.

Address


Telephone

+918247078819

Website

Alerts

Be the first to know and let us send you an email when JRN Journalist Ravi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JRN Journalist Ravi News:

  • Want your business to be the top-listed Media Company?

Share