JRN Journalist Ravi News

  • Home
  • JRN Journalist Ravi News

JRN Journalist Ravi News This is official page Journalist Ravi
(Palakollu News is the first priority)
(1)

13/12/2025

కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన. ఆర్భాటాలు, హంగామా తప్ప ఆచరణలో హామీల అమలు శూన్యం. అయితే.. ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అని ప్రధాని మోదీ అనడం విడ్డూరంగా వుంది. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి. --వైయస్ షర్మిల

13/12/2025

స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి తిరుపతి రూరల్ మండలం దామినేడులో ప్రభుత్వం 28.37 ఎకరాలు కేటాయించింది. ఎకరా రూ.2.5కోట్ల విలువైన భూమిని శాప్ (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)కు ఉచితంగా బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

13/12/2025

వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందించేందుకు రూ.830 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో కేంద్ర వాటా రూ.157.20 కోట్లు కాగా.. రాష్ట్రం రూ.672.84 కోట్లు సమకూర్చుతుంది.

13/12/2025

సీఎం చంద్రబాబు ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. 18న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం అక్కడ పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలుస్తారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి వారితో చర్చిస్తారు. 19న సాయంత్రం 6:40 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

13/12/2025

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు శాఖల వారీ ప్రతిపాదనల్ని రూపొందించి 22వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు సాధారణ పరిపాలన శాఖలో అందజేయాలని అన్ని శాఖలకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

13/12/2025
12/12/2025

ఎల్లో షర్ట్ - వైట్ ప్యాంట్ చూస్తే.. ఆయనే అనుకొని ఈయన వీడియో లకు లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి జేజేలు పలుకుతున్నారు🙄 అంటే.. ఎల్లో షర్ట్ - వైట్ ప్యాంట్ ఎంతగా జనాల్లోకి వెళ్లిందో అర్ధమవుతుంది. 👉పాలకొల్లులో హాట్ టాఫిక్ ఎల్లో షర్ట్ - వైట్ ప్యాంట్

12/12/2025

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ లైనింగ్ పనులను రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల ລరామానాయుడు పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో 18 కి.మీ ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

👉 అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహిం...
12/12/2025

👉 అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

👉 ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు.

👉 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు.

👉 కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నామని. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత చెప్పారు.

👉 వివిధ పథకాల అమలులో భాగంగా 2025-26 బడ్జెట్ లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం రూ.10,608.61 కోట్లు కేటాయించిందన్నారు.

👉 వాటిలో ఈబీసీలకు రూ. 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.20 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ.4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.46 కోట్లు కేటాయించామన్నారు.

👉 ఈ సమావేశంలో ఆయా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, డూండీ రాకేశ్, బ్రహ్మయ్య చౌదరి, బుచ్చి రాంప్రసాద్, సూర్యనారాయణ రాజు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

👉 అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏపీ హోమ్ మంత్రి అనిత పరామర్శించారు.👉 చింతూరు ప్రభుత్వ ఆస...
12/12/2025

👉 అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏపీ హోమ్ మంత్రి అనిత పరామర్శించారు.

👉 చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శీతాకాలంలో ఘాట్ రోడ్డులో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

👉 గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

👉 మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు

Address


Telephone

+918247078819

Website

Alerts

Be the first to know and let us send you an email when JRN Journalist Ravi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JRN Journalist Ravi News:

  • Want your business to be the top-listed Media Company?

Share