JRN Journalist Ravi News

  • Home
  • JRN Journalist Ravi News

JRN Journalist Ravi News This is official page Journalist Ravi
(Palakollu News is the first priority)

09/06/2025

👇వర్షం కురవనందుకు పది రూపాయలు కోత 👇

విజయవాడ ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కార్యాలయం బోర్డును తొలగించారు. ఈ క్రమంలో సాక్...
09/06/2025

విజయవాడ ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కార్యాలయం బోర్డును తొలగించారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు, మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళలు ఇందులో పాల్గొన్నారు. సాక్షి కార్యాలయం బోర్డును కూల్చి నిరసన తెలిపారు.

09/06/2025

మంత్రి నిమ్మల రామానాయుడు
(పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం )

సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచి...
09/06/2025

సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

సాక్షి టీవీ ఛానెల్ లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.

09/06/2025

ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు వెళ్తుండగా లోకల్ రైలు నుంచి ప్రయాణికులు జారిపడటంతో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

09/06/2025

పాలకొల్లు మండలంలో KSS (కుటుంబ సాధికార సారధుల) సమావేశలు జరిగాయి.

09/06/2025

కొన్ని స్నేహలకు.. కొంతమంది వ్యక్తులకు.. మనం మాత్రమే కోరుకునే వన్ సైడ్ బంధాలకు, బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత దొరుకుతుంది.

09/06/2025
విజయవాడలోని దుర్గమ్మ సేవ కోసం భక్తులు, సేవా బృందాలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా రాజగోపుర ప్రాంగణంలో కార్యాలయాన్...
09/06/2025

విజయవాడలోని దుర్గమ్మ సేవ కోసం భక్తులు, సేవా బృందాలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా రాజగోపుర ప్రాంగణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. త్వరలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తామని పేర్కొన్నారు. ఆలయంలో అన్నప్రసాదం, క్యూలైన్లు, సామాన్లు భద్రపరిచే గదులు, ఆర్జిత సేవలు, ఉచిత బస్సు, పార్కింగ్ క్రమబద్ధీకరణ, అభిప్రాయాల సేకరణ, ఉచిత ప్రసాదం పంపిణీ, ఉపాలయాలు, సమాచార కేంద్రం, ప్రసాదాల కౌంటర్ల వద్ద సేవ చేసేందుకు సేవకులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో పాల్గొన్న భక్తులకు దర్శనం, వసతి, భోజన సదుపాయాల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని, మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 1800 425 9099లో సంప్రదించాలని పేర్కొన్నారు.

👇25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు👇ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మ...
09/06/2025

👇25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు👇

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి కృషిచేస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఏసీఏ 72వ వార్షిక సర్వసభ్య సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రానున్న రెండేళ్లలో ఏసీఏకి సొంత మైదానాలు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మంచి క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎల్ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మ్యాచ్లు జరిగేలా, మరిన్ని ఫ్రాంఛైజీలు వచ్చేలా కృషిచేస్తామని తెలిపారు. ఏసీఏ అనుబంధ క్రికెట్ క్లబ్లు కూడా పోటీలు నిర్వహించాలని కోరగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు.

అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు ఏడాదిలో 200 రోజులు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే క్రీడా నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంటుందని చెప్పారు. ఈ విషయమై ఏసీఏ కార్యదర్శి సానా సతీష్, మంత్రి లోకేశ్ సహాయంతో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలిపారు.

అక్కినేని  అఖిల్-జైనబ్ వివాహ రిసెప్షన్
09/06/2025

అక్కినేని అఖిల్-జైనబ్ వివాహ రిసెప్షన్

స్మార్ట్ మీటర్ల పనితీరుపై సమగ్ర నివేదిక అందించాలని డిస్కంల అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. పరిశ్రమలు,...
09/06/2025

స్మార్ట్ మీటర్ల పనితీరుపై సమగ్ర నివేదిక అందించాలని డిస్కంల అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసినా.. బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయని, దీనికి కారణాలు తెలుసుకోవాలని ఓ ప్రకటనలో అధికారులకు చెప్పారు. వినియోగదారులపై అనవసరంగా ఒక్క రూపాయి కూడా భారం వేయకూడదని స్పష్టం చేశారు.

Address


Telephone

+918247078819

Website

Alerts

Be the first to know and let us send you an email when JRN Journalist Ravi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JRN Journalist Ravi News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share