Ap Top News Channel

  • Home
  • Ap Top News Channel

Ap Top News Channel AP TOP NEWS CHANNEL
Subscribe | Like | Comment | Share

కుమారదేవం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర గానే మిగిలిపోయిందితెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మ...
06/08/2024

కుమారదేవం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర గానే మిగిలిపోయింది

తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు... ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారిక్కడి జనాలు. అలా అనడానికి కారణం దీనికింద పాడిపంటలు ,దేవత ,వంశవృక్షం,బొబ్బిలిరాజా,హిమ్మత్ వాలా,సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది .కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఈ చెట్టుది. ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సిన్మా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది . దర్శకుడు వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. రాఘవేంద్రరావు గారు, దాసరి గారు , జంధ్యాల గారు, ఇవివి గారు ...ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే.

145 ఏళ్లనాటి సినిమా చెట్టు
ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ
వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్‌

1974 లో వచ్చిన పాడిపంటలు
చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి. పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం ...సీతా రామయ్య గారి మనవరాలు లో సమయానికి...,గోదావరి లో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు ...ఇలా ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే వందలాది పాటలు... జనాల
గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి...

ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం ...😢😢😢

కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు పోలీస్ అధికారి..!!!https://youtu.be/Y-8VhJGeGeIAP TOP NEWS CHANNE...
02/07/2024

కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు పోలీస్ అధికారి..!!!

https://youtu.be/Y-8VhJGeGeI

AP TOP NEWS CHANNEL

కేసు పక్కన పెట్టి మందు బాబులతోకలిసి చిందులేసిన ఒంగోలు పోలీస్ అధికారిముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీ...

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేస...
23/06/2024

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్

ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్య వరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.

చార్మినార్ నిర్మాత-ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1565 –1612Muhammad Kuli Qutub Shah 1565 –1612ముహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ...
10/06/2024

చార్మినార్ నిర్మాత-ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1565 –1612
Muhammad Kuli Qutub Shah 1565 –1612

ముహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్ షాహి వంశానికి చెందిన ఐదవ సుల్తాన్. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర స్థాపకుడు మరియు చార్మినార్ వాస్తుశిల్పానికి కేంద్ర బిందువు. కులీ కుతుబ్ షా గొప్ప పరిపాలకుడు మరియు అతని పాలన కుతుబ్ షాహి వంశం యొక్క అత్యంత అద్భుతమైన కాలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ మరియు హిందూ తల్లి భాగీరథి యొక్క మూడవ కుమారుడు. ముహమ్మద్ కులీ కుతుబ్ షా కవి మరియు పర్షియన్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో కవిత్వం రాశాడు. ఉర్దూ భాష యొక్క మొదటి రచయితగా, ముహమ్మద్ కులీ కుతుబ్ షా తన పద్యాలను పర్షియన్ దివాన్ శైలిలో రచించినాడు.. ముహమ్మద్ కులీ కుతుబ్ షా పర్షియన్ దివాన్ శైలిలో “గజల్-ఎ-ముసల్సల్ Ghazal-e-Musalsal " రచి౦చినాడు. ముహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క "కులియాత్" 1800 పేజీల రచనలను కలిగి ఉంది, వాటిలో సగానికి పైగా గజల్‌లు ఉన్నాయి, అవి వంద పేజీలలో నిలిచిపోయాయి, మిగిలినవి 300 పేజీలకు పైగా మస్నవి Masnvi మరియు మర్సియే Marsiye.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా పాలన కుతుబ్ షాహి వంశానికి గొప్ప శ్రేయస్సు మరియు సాంస్కృతిక అభివృద్ధి కాలం. ముహమ్మద్ కులీ కుతుబ్ షా సుపరిపాలకుడు మరియు సైనిక నాయకుడు. ముహమ్మద్ కులీ కుతుబ్ షా తన సామ్రాజ్య ప్రాంతాన్ని విస్తరించాడు మరియు దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాడు. కుతుబ్ షాహి పాలకులు కళలు మరియు విజ్ఞాన శాస్త్రానికి కూడా పోషకులుగా ఉన్నారు మరియు అనేక మసీదులు, రాజభవనాలు మరియు ఇతర ప్రజా ఉపయోగ కట్టడాలను నిర్మించారు

1591లో ముహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. హైదరాబాద్ నగరం త్వరలో వర్తక మరియు వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది మరియు స్వతంత్ర భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రమునకు కు రాజధానిగా ఉంది.

హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో చార్మినార్ ఒకటి. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ ను నిర్మించారు. చార్మినార్ 184 అడుగుల ఎత్తులో ఉన్న నాలుగు మినార్ల స్మారక చిహ్నం. చార్మినార్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు హైదరాబాద్ యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి ప్రతీక.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1612లో 47 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ముహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత, అతని కుమారుడు సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా సింహాసనమును అధిరోహించినాడు.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ వంశానికి చెందిన అత్యంత ప్రముఖ మరియు ఉదారవాద పాలకులలో ఒకరిగా గుర్తుండిపోతాడు. గోల్కుండ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన శక్తిగా మార్చిన ఘనత కుతుబ్ షాహీ వంశస్తులకు దక్కుతుంది. ముహమ్మద్ కులీ కుతుబ్ షా కళ పోషకుడిగా మరియు హైదరాబాద్ నగర స్థాపకుడిగా గుర్తింపబడినాడు..

అమలాపురం: సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పోలింగ్ ను నిర్వహించే...
09/05/2024

అమలాపురం: సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పోలింగ్ ను నిర్వహించేందుకై, సంఘ వ్యతి రేక వ్యక్తుల జోక్యాన్ని అరికట్ట డానికి ఈనెల 11 వ తేదీ నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందనే నోటిఫికేషన్ ఉత్తర్వులను ఎన్నికల సంఘం జారీ చేసిందని, జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిషేధాజ్ఞలను అమలు చేస్తోంద న్నారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144(2) Cr.P.C కింద ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపుగా ఏర్పడకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశార న్నారు, కాల్పుల ఆయుధాలు ఏదైనా ఇతర ఆయుధాలు, మొద లైన వాటిని తీసుకెళ్లడాన్ని నిషేధిం చారన్నారు..కేంద్ర పోలీస్ బలగాలు, స్థానిక పోలీసులు, ఉన్నతాధికారు లు ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన గ్రామాలను సందర్శించి పోలీస్ కవాతు ,ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించారన్నారు.. పోలింగ్ అనంతరం సంబంధిత పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను, ఎన్నికల మెటీరియల్ ను సురక్షితం గా చేర్చాలన్నారు. స్ట్రాంగ్ రూము లకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరా యాలు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు పోలింగ్ కేంద్రాలకు నిర్దేశిత దూరంలో మాత్రమే పార్టీ కార్య కర్తలు ఉండేలా, ఎటువంటి పార్టీ జెండాలు, గుర్తులు ఉండ కుండా చర్యలు చేపట్టాలన్నారు . ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటిం చేలా చూడాలన్నారు. కోనసీమ జిల్లా పరిధి లోని పార్లమెంట్ సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సాధారణ ఎన్నికల కోసం నియమించబడిన అన్ని పోలింగ్ కేంద్రాలలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసే ముందు 48 గంటలలోపు బహిరంగ సభలు, ఊరేగింపులు అన్ని రకాల ప్రచా రాలు నిషేధించబడ్డాయన్నారు. ఈ యొక్క ఆదేశాలు ఈనెల 11వ తేదీ నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని ఆయన ప్రకటనలో స్పష్టం చేశారు.

బ్రిటీష్ వాళ్ళను గడగడలాడించిన దీ గ్రేట్ వారియర్  #టిప్పుసుల్తాన్ కు ఘన నివాళులు
05/05/2024

బ్రిటీష్ వాళ్ళను గడగడలాడించిన దీ గ్రేట్ వారియర్ #టిప్పుసుల్తాన్ కు ఘన నివాళులు

https://youtu.be/y7DjMKHfVj0ప్రేమ, దయా, సహనం, మతసామరస్యం సౌభ్రాతృత్వం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర...
19/04/2024

https://youtu.be/y7DjMKHfVj0

ప్రేమ, దయా, సహనం, మతసామరస్యం సౌభ్రాతృత్వం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసం. అలాంటి పవిత్రమైన ఇఫ్తార్ విందులో ఓ హిందూ సోదరుడు పాడిన గేయం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది

కర్నాటక: 14 ఏళ్ల ఈతగాడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడుమంగళూరులోని జెప్పినమొగరులోని ప్రెస్టీజ్ ఇ...
18/04/2024

కర్నాటక: 14 ఏళ్ల ఈతగాడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు

మంగళూరులోని జెప్పినమొగరులోని ప్రెస్టీజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న షఫిన్ ముస్తఫా ఈత కళలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా చేతులు, కాళ్లు ఉపయోగించకుండా నీటిపై తేలియాడే అసాధారణ ఫీట్ సాధించాడు.
ఈ 14 ఏళ్ల స్విమ్మింగ్ ప్రాడిజీ ఇప్పుడు 2 గంటల, 30 నిమిషాల మరియు 13 సెకన్ల పాటు నీటిపై తేలుతూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును పొందుపరిచాడు.
పాఠశాల స్విమ్మింగ్ పూల్‌లో తేలుతూ షఫిన్ ముస్తఫా ఈ ఘనతను సాధించాడు, అక్కడ అతను తన కోచ్ అరోమల్ మార్గదర్శకత్వంలో బుధవారం ఉదయం 5:30 గంటలకు వ్యాయామాన్ని ప్రారంభించాడు. షాఫిన్ యువ స్విమ్మర్ అసాధారణమైన నైపుణ్యం మరియు స్థితిస్థాపకతను ప్రదర్శించాడు, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుర రికార్డును బద్దలు కొట్టాడు

ఆధునిక యుగ తధాగధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే(ఏప్రిల్ 11) రాష్ట్రపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 జయంతి.'ప్రాచీన యుగంలో బుద...
10/04/2024

ఆధునిక యుగ తధాగధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

(ఏప్రిల్ 11) రాష్ట్రపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 జయంతి.

'ప్రాచీన యుగంలో బుద్దుడు, ఆదునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు గురువులు' అని భారత రాజ్యంగా నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. దళిత, గిరిజన, బలిహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా 'రాజ్యాధికార సాధనకి' కృషి చెయ్యాలని ఫూలే సూచించారు. ఆ సూచనను డా. అంబేడ్కర్ మనస్పూర్తి గా అంగీకరించారు కనుకనే నవీన యుగంలో ఫూలే నాకు గురువని ఆయన అన్నారు.

భారతజాతికి స్పూర్తి నిచ్చిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర లోని పూణే నగరంలో జన్మించారు. తల్లితండ్రులు గోవిందరావు ఫూలే, చిమనాభాయి. బాల్యంలోనే తల్లిని కోల్పోయారు జ్యోతిరావు ఫూలే. మాలి కులంలో పుట్టిన ఫూలే చిన్ననాటి నుంచి ఆధిపత్య వర్గాల అహంకరానికి గురయ్యారు. పీష్వాల పాలనాకాలమది. క్రింది కులాల పిల్లలు కేవలం పశువులు, గొర్రెలు మేపటానికే పరిమితమయ్యేవారు. మట్టిపనులు చేసేవారు. ఫూలే పూర్వీకులు పీష్వాలకు పూలు, పూలదండలు తీసుకువెళ్ళేవారు. పూలదండలు అల్లేవారు కాబట్టే వారి కులానికి 'మాలి' అనే పేరు వచ్చింది.

జ్యోతిరావు ఫూలే చిన్ననాటి నుండి చదువుపట్ల అమితమైన ఇష్టం చూపేవారు. ఏడేళ్ల వయసులో మరాఠా పాఠశాలలో చేరారు. ఇది సహించలేని కొన్ని వర్గాలవారు ఫూలే కుటుంభంపై దాడి చేశారు. శూద్రులు చదువుకుంటే కరువుకాటకాలు వస్తాయని, ధర్మం నశించిపోతుందని వాపోయారు. వారి ఆగ్రహానికి గురికావలిసి వస్తుందని భయపడిన ఫూలే తండ్రి చదువుని మద్యలో మాన్పించారు. అవి భాల్యవివాహపు రోజులు. పదమూడు సంవత్సరాల వయస్సులో ఫూలే సావిత్రిభాయిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఫూలే తన చదువును కొనసాగించేరు. ఆ రోజుల్లో ఒక ఆధిపత్య వర్గం వారి వివాహానికి ఫూలే వెళ్లారు. ఈ విషయం ఆరోజుల్లో పెద్ద కలకలం రేపింది. ఒక శూద్రడిని వివాహానికి పిలవడం పట్ల సంప్రదాయ ఆధిపత్య పెద్దలు యాగి చేశారు. ఫూలే రాకతో తమ వర్గం అపవిత్ర అయ్యీపోయిందని గగ్గోలు పెట్టారు. ఈ విషయం జ్యోతిరావు ఫూలే అవమానంగా భావించారు.

మహారాష్ట్ర ఋషులు తుకారాం, జ్ఞానేశ్వర్, క్రైస్తవ సంస్కర్త మార్టిన్ లూథర్ల రచనలు చదివి ఫూలే స్పూర్తి పొందారు. సమాజంలో అసమానతలకు కులవ్యవస్థే మూలమనే సత్యాన్ని జ్యోతిరావు ఫూలే గ్రహించారు. ఈ అసమానతలకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, బలహీనవర్గాల వారిని, ప్రజలను చైతన్యం చేయుటకు ఫూలే సంకల్పించారు. శూద్ర, అతిశూద్ర కులాలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఫూలే పిలుపునిచ్చారు. పూణే నగరం లో పాఠశాలను నిర్మించారు. తానే స్వయంగా విద్యావతిగా చేసిన భార్య సావిత్రిభాయిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయరాలుగా నియమించారు. సావిత్రిభాయి ఫూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలు.

మహిళలకు చదువు నేర్పి చైతన్యం చేస్తున్నందుకు జ్యోతిరావు ఫూలే కుటుంభంపట్ల కొన్ని వర్గాల వారు పలు ఆంక్షలు విధించారు. అయిన ఫూలే వెనకడుగు వేయలేదు, ఎవ్వరికీ బెదరలేదు. మహిళను విద్యావంతులుగా చేసే కృషిని ధైర్యంగా కొనసాగించారు. ఆ కృషిలో ఘనమైన పురోగతిని సాదించారు. శూద్ర, అతిశూద్ర కులాల మహిళలలో విద్యావికాశాన్ని సాదించినందుకు బ్రిటిష్ వలస పాలకులు ఫూలేని ఘనంగా సన్మానించారు.

ఫూలే, సావిత్రిభాయి దంపతులకు సంతానం కలగలేదు. ఒక వితంతువుకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే నామకరణం చేసి పెంచుకున్నారు. రైతు కూలీలు, వ్యవసాయదారుల కష్టాలను వివరిస్తూ *'గులాంగిరి'* అనే పుస్తకాన్ని ఫూలే రచించారు. ఇది ఆయన రచనలో కెల్లా తలమానికమైనది. అలాగే కొన్ని వర్గాలవారు చేస్తున్న దోపిడిని వివరిస్తూ *'తృతీయ రత్న'* అనే నాటకాన్ని కూడా ఫూలే వ్రాశారు. ఈ నాటకం పెద్ద సంచలనం సృష్టించింది. *'రైతు కోరడా'* అనేది ఫూలే మరో గ్రంధం. *"శూద్రులకు విద్యలేనందున జ్ఞానం లేకుండా పోయిందని, జ్ఞానం లేనందున నైతికత లుప్తమయ్యిందని, నైతికత లేనందున ఐక్యమత్యములోపించిందని, ఐక్యమత్యము లేనందున శక్తి కుంటుపడుతుందని, శక్తి లేకపోతే శూద్రులు అణిచివేతకు గురవుతున్నారని* ఫూలే మహాశయుడు వివరించారు.

*'సత్యశోధక సమాజాన్ని'* అనే సంస్థను స్తాపించి సత్య ధర్మాన్ని ఫూలే ప్రచారం చేశారు. స్త్రీ, పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసినప్పుడు ఫూలే ఆయన అనుచరులు వరద ప్రాంతానికి వెళ్ళి సహాయమందించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం అధర్స, స్పూర్తిదాయక గ్రంధం. సామాజిక సమరానికి ఒక ప్రతీక. సమసమాజ స్థాపనకు మార్గం. వర్తమాన భారతదేశంలో అసంఖ్యాకులు ఫూలే జీవితం, కృషి నుంచి స్పూర్తి పొందుతున్నారు. భావితరాలకు మానవతావిలువలు తెలియజేసేవిధంగా అన్ని స్థాయిలలో ఫూలే జీవితాన్ని పాఠ్యంశ్యము గా ఉంచాలని ఫులేవాదులు కోరుతున్నారు. ఫూలే జన్మదిన్నాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'సామజిక సాధికారత దినొస్తవంగా' ప్రకటించి అధికారకంగా జయంతి వేడుకలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే మరణించిన ఏడాదికి భారత రాజ్యంగ నిర్మాత డా. భీమ్ రావు రాంజీ అంబేడ్కర్ జన్మించారు. ఇది కాకతాళీయామే అయినా ఫూలే ఆశయ సాదనకు మరో మహాత్ముడు జన్మించినట్లయ్యింది. సమసమాజ స్థాపనకు, అనాగారిన వర్గలకోసం పాటుపడిన ఫూలే జన్మదిన్నాన్ని భారతీయులు అందరు గుర్తుంచు కోవాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం, దళిత, గిరిజన జాతి సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫూలే 1890 నవంబరు 28న కాలధర్మం చెందారు. దేశ, జాతి, ప్రజా స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన జ్యోతిరావు ఫూలేని మహారాష్ట్ర వాసులు *'రాష్ట్రపిత'గా* పిలుస్తుంటే, భారతదేశ ప్రజలు *'మహాత్ముడని'* తమ మనసుల్లో నిలుపుకున్నారు.

మహనీయుడు ఫూలే గార్ని స్మరించండి. ఈ వ్యాసాన్ని దయచేసి సామాజిక మాద్యమాలలో, సమాహాలలో పంచుకొని సామాజిక చైతన్యానికి కారకులు కండి ఆదర్శమూర్తి ఫూలే జీవితం ఆచరణీయం. ఫూలే జయంతి సందర్బంగా అందరం జోహార్లు పలికి మహనీయున్ని స్మరిద్దాం.

జర్నలిస్టులు పరిపాలకులుగా మారాలి...అక్షర యజ్ఞమే కాదు.. పాలకదక్షత కావాలి...సమాజహితాన్ని కాంక్షించే జర్నలిస్టులు సంఘటితమవ్...
07/04/2024

జర్నలిస్టులు పరిపాలకులుగా మారాలి...
అక్షర యజ్ఞమే కాదు.. పాలకదక్షత కావాలి...
సమాజహితాన్ని కాంక్షించే జర్నలిస్టులు సంఘటితమవ్వాలి...
మీకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నిరంతరం అండగా ఉంటుంది...
మన కోసం కూడా మనం ఆలోచిద్దాం...
సమష్టి ప్రయోజనాల కోసం పనిచేద్దాం...

మేడవరపు రంగనాయకులు పిలుపు...

ఆంధ్రప్రదేశ్ సమాచారం న్యూస్ ఏప్రిల్ 06:
స్వేచ్ఛాయుత.. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల వివక్షతో, అనాలోచిత విధానాలతో వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నప్పుడు సమాజహితాన్ని కాంక్షించే కలం వీరులు పాలకులు కావాలి అని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జర్నలిస్టులు కూడా సమసమాజ నిర్మాణం కోసం ప్రజాక్షేత్రంలో నిలబడాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సమాజహితాన్ని కోరే విద్యావంతులు, న్యాయ కోవిధులు, మేధావులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, నిస్వార్థపరులు రాజకీయాల్లోకి రావాలని, పాలకులుగా ఉండాలని ప్రజలు కోరుకునేవారు. కానీ నేడు కొందరు వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారు. సమాజంలో వస్తున్న విపరీత ధోరణులు, తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువంటి రాజకీయ నాయకుల పల్లకి మోయడానికి కొందరు తయారవుతున్నారు. దీంతో సమ సమాజం, సమాజాభివృద్ధి అనేది ప్రకటనలకే పరిమితమవుతోంంది. ఇటువంటి ధోరణి మారాలని, ప్రజలకు వివక్ష లేకుండా సంక్షేమం, అభివృద్ధి సాధించాలంటే, రాష్ట్ర, దేశ ప్రగతి సాధించాలంటే జర్నలిస్టులు ప్రశ్నించడమే కాదు పాలించడానికి ప్రజాక్షేత్రంలోకి రావాలని రంగనాయకులు పిలుపునిచ్చారు.

*హైదరాబాద్* : హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్ లోని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఆత్మీయ సమీక్షా సమావేశంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో 'ఫోర్త్ ఎస్టేట్'గా పేర్కొనే మీడియా రంగంలో జర్నలిస్టులుగా కొనసాగుతున్న మనం నిరంతరం సమాజం కోసం ఆలోచిస్తాం. జనాన్ని జాగృతం చేయడానికి పని చేస్తాం. ఉద్యోగుల నుంచి ఉద్యమకారుల వరకూ చేసే పోరాటాలకు, ఉద్యమాలకు మద్దతిస్తాం. అందరి సమస్యలూ పరిష్కరించడానికి కలం కరవాలంతో అక్షర యుద్ధం చేస్తాం. న్యాయం జరిగే వరకూ విడిచిపెట్టం. కానీ, మనకు సమస్యలొస్తే పరిష్కరించేదెవరు? ఎవరూ ముందుకు రారు. సరికదా మనపైనే ఎదురుదాడి ప్రారంభమవుతుంది. బెదిరింపులూ వస్తాయి. బాధ్యత కలిగిన వృత్తిలో కొనసాగే మనమే కొన్ని సందర్భాల్లో బాధితులుగా మారిపోతాం. సమాజ హితాన్ని కాంక్షించే మనకే సమన్యాయం దొరకదు. మన సమస్యలు పరిష్కారం కావాలన్నా, మన సంక్షేమానికి కృషి జరగాలన్నా అందరం సంఘటితం కావాలి. కలిసి అడుగెయ్యాలి. మన కోసం మనం ఆలోచిద్దాం. సమష్టి ప్రయోజనాల కోసం పనిచేద్దాం. మంచి నాయకత్వం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజకీయం రంగు మార్చుకుంది. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం.. వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయంగా దిగజారింది. ఎంత నోరు నొక్కి పెట్టినా... ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నిస్తూనే ఉంటారు.. దానికి పాలకులు సమాధానం చెప్పితీరాలి.. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి.. కలం వీరులు కదంతొక్కాలి అని రంగనాయకులు స్పష్టం చేశారు.

దేశ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లెందుకు సర్వశక్తులు ధారబోస్తున్న జర్నలిస్టులను "ఫోర్త్ ఎస్టేట్" గా ప్రభుత్వాలు ఎంతోకాలంగా గుర్తించాయి. కానీ ఏదైతే “ఫోర్త్ ఎస్టేట్" గా పిలువబడుతున్న జర్నలిజం రంగంలో జర్నలిస్టులు గత కొన్నేళ్లుగా దగాపడుతూనే ఉన్నారు. ఇప్పటికే జర్నలిజం రంగానికి రావాల్సిన జర్నలిస్ట్ లు ఈ రంగాన్ని ఈసడించుకుని వేరే రంగాల వైపు వెళ్ళిపోతున్నారు. ఇక అక్షర జ్ఞానం లేనివారితో పాటు సమాజాన్ని ఏ విధంగా మేల్కొలుపు చేయలేని వారు, స్వప్రయోజనాలకు, రాజకీయ అవసరాలకు జర్నలిజం రంగాన్ని అడ్డు పెట్టుకుని ఈ రంగాన్ని ఓ అవినీతి కూపంలా మార్చేశారు కొందరు వ్యక్తులు. వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రస్తుత కలం యోధులకు, జర్నలిస్ట్ సంఘాలకు ఉందని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం భావిస్తుందన్నారు. కాలానుణంగా వ్యవస్థలూ మార్పు చెందుతూ వచ్చాయి. కానీ వ్యక్తిగత వాదం కంటే వ్యవస్థ ముఖ్యం. సమసమాజం మన లక్ష్యం. ఆలోచించండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. మన హక్కులను మనం సాధించుకుందాం.. ప్రజాపాలన అని గొంతుచించుకోవడం తప్ప ఇది స్వార్థ రాజకీయం. ఇక్కడ అవసరాలు, అవకాశవాదాలు మాత్రమే ఉంటాయి. పాలకుల వద్ద ప్రాధేయపడొద్దు.. మన న్యాయమైన డిమాండ్ లను సాధించుకోవడమే. స్వార్థపరులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు మధ్య, జర్నలిజం మనుగడ ప్రశ్నార్థకం అయిన నాడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అక్షరజ్ఞానం లేని వారు అంగబలం, అర్ధబలంతో రాజకీయరంగంలో అడుగుపెడుతున్నారు. వారు ప్రజలందరికీ పాలకులు అవుతున్నారు. హాస్యాస్పదం కదూ .. కానీ ప్రజాస్వామ్యం మాటున ఇది అందరికీ అలవాటు అయింది. మనకు కూడా. ఆలోచించండి. విజ్ఞతతో నూతన నిర్ణయాన్ని తీసుకోండి. స్వేచ్ఛాయుత జర్నలిజానికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసే వారికే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటెయ్యండి. లేదా సమసమాజం కోసం తాపత్రయపడే, ఉత్సాహం కలిగిన జర్నలిస్టులు ఎన్నికల్లో నిలబడండి. మీకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అండగా ఉంటుంది, వారి గెలుపు కోసం కృషి చేస్తుందని మేడవరపు రంగనాయకులు హామీ ఇచ్చారు.

రంజాన్‌లో ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు: అధ్యయనాలు Fasting in Ramzan may prevent cancer: Studiesరంజాన్ ఇస...
23/03/2024

రంజాన్‌లో ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు: అధ్యయనాలు Fasting in Ramzan may prevent cancer: Studies

రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెల. దివ్య ఖురాన్ అవతరించిన నెల. పవిత్ర రంజాన్ మాసం లో ఉన్న ఆచారాలలో ప్రధానమైనది మరియు తప్పని సరి అయినది రోజువారీ ఉపవాసం. రంజాన్ ఉపవాసం లో వ్యక్తులు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉంటారు, ఆకలి మరియు దాహం యొక్క భాగస్వామ్య అనుభవాల ద్వారా క్రమశిక్షణ మరియు సానుభూతిని పెంపొందించుకుంటారు.

రంజాన్ ఉపవాసం అనేక శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది. రంజాన్ ఉపవాసం ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయం మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించును అని పరిశోధనల ద్వార వెల్లడి అయినది.

ఉపవాస సమయంలో ఊపిరితిత్తుల పనితీరు మరియు శ్వాసకోశ ఆరోగ్యంలో మెరుగుదలలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అనేక అధ్యయనాలు రంజాన్ ఉపవాసం మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి మధ్య ఉన్న సంబంధాన్ని మిశ్రమ ఫలితాలతో అన్వేషించాయి.

కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాలు రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఉపవాసం యొక్క సంభావ్య రక్షిత ప్రభావాన్ని నివేదించాయి. ఉదాహరణకు, ఉపవాసం ఇన్సులిన్ (రక్తం నుండి చక్కెరను గ్రహించడంలో సహాయపడే హార్మోన్) స్థాయిలలో మార్పులకు దారితీయవచ్చు, ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది.

కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదంపై రంజాన్ ఉపవాసం యొక్క ప్రభావాన్ని అధ్యయనాలు పరిశోధించాయి. అడపాదడపా ఉపవాసం జీర్ణశయాంతర ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి, ఉదాహరణకు మంటను తగ్గించడం, గట్ మైక్రోబయోటా కూర్పును మెరుగుపరచడం మరియు ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ కారకాలు కొలొరెక్టల్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించగలవు.

ఉపవాసం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్‌ల అభివృద్ధిని నిరోధించగల సంభావ్య విధానాలలో గ్లూకోజ్ లభ్యత తగ్గడం, మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ, సెల్యులార్ పునరుత్పత్తి మరియు ఆటోఫాగి (అనవసరమైన శరీర భాగాన్ని తొలగించడం) ఉన్నాయి.
క్యాన్సర్ అభివృద్ధి మరియు పురోగతిలో గ్లూకోజ్ లభ్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు గ్లూకోజ్ జీవక్రియను మార్చడం ద్వారా ఉపవాసం క్యాన్సర్ ప్రమాదాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ కణాలు సాధారణ శరీర కణాలతో పోలిస్తే గ్లూకోజ్ కోసం పెరిగిన డిమాండ్‌ను చూపుతాయి. ఉపవాస సమయంలో, రక్తప్రవాహంలో గ్లూకోజ్ లభ్యత తగ్గుతుంది, ఇది ఇతర శక్తి వనరులను ఉపయోగించుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ శక్తి వనరు మార్పు క్యాన్సర్ కణాలపై ఒత్తిడిని సృష్టిస్తుంది, ఉపవాసం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది.

సెల్యులార్ వాతావరణాన్ని స్థిరంగా ఉంచడంలో, కణాల మనుగడను ప్రోత్సహించడంలో మరియు పార్కిన్సన్స్ వ్యాధి, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ మొదలైన వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో ఆటోఫాగి కీలకం. ఉపవాసం పోషకాల యొక్క తాత్కాలిక లేమి కారణంగా కణాల లోపల జీవక్రియ ఒత్తిడిని ప్రేరేపిస్తుంది, ఇది కణాల యొక్క ముఖ్యమైన స్థితిని మారుస్తుంది మరియు ఆటోఫాగీని ప్రేరేపిస్తుంది.

ప్రొఫెసర్ యోషినోరి ఓహ్సుమీకి 2016లో ఆటోఫాగి యొక్క మెకానిజమ్స్ మరియు ఉపవాసంతో దాని సంబంధాన్ని కనుగొన్నందుకు ఫిజియాలజీ మరియు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి లభించింది,.

ఉపవాసం ఆటోఫాగీని ప్రేరేపిస్తుంది, ఇది కణాల యొక్క హానికరమైన భాగాలను తొలగిస్తుంది, ఫలితంగా ఆరోగ్యకరమైన సెల్యులార్ సమగ్రత, క్యాన్సర్ ప్రారంభ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు జీవితకాలం పెరుగుతుంది. ఉపవాసం ద్వారా ప్రేరేపించబడిన ఆటోఫాగి శరీరంలో దీర్ఘకాలిక మంటను కూడా తగ్గిస్తుంది, ఇది క్యాన్సర్ అభివృద్ధికి కారణాలలో ఒకటి.

మరోవైపు, ఉపవాసం శరీరం నిర్విషీకరణ మరియు శుభ్రపరచడానికి అనుమతిస్తుంది, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుంది మరియు పునరుజ్జీవనం మరియు నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. ఇది జీవక్రియ ఆరోగ్యం, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.

చాలా మంది వ్యక్తులు ఉపవాసము మానసిక స్పష్టత మరియు దృష్టిని పెంచినట్లు నివేదిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలలో తక్కువ హెచ్చుతగ్గులతో, అభిజ్ఞా పనితీరు మెరుగుపడవచ్చు, ఇది అధిక చురుకుదనం మరియు ఏకాగ్రతకు దారితీస్తుంది.

మొత్తంమీద, రంజాన్ ఉపవాసం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సంపూర్ణ విధానాన్ని అందిస్తుంది. ఉపవాసం శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక కోణాలను కలిగి ఉంటుంది, ఇందులో కణితి పెరుగుదలకు తక్కువ ఆతిథ్య వాతావరణాన్ని సృష్టించడం కూడా ఉంటుంది.

Address


Alerts

Be the first to know and let us send you an email when Ap Top News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ap Top News Channel:

  • Want your business to be the top-listed Media Company?

Share