Avani News

Avani News This is news page

చావలే చావలే చారు మజుందార్‌చాటండి గళమెత్తిచారుమజుందార్‌చచ్చిపోలేదనిచంపబడ్డాడని.
28/07/2025

చావలే చావలే చారు మజుందార్‌

చాటండి గళమెత్తి

చారుమజుందార్‌

చచ్చిపోలేదని

చంపబడ్డాడని.

జూలై 28 అనగానే విప్లవాభిమానులకు గుర్తొచ్చే అమరత్వం చారు మజుందార్‌ లాకప్‌డెత్‌. కలకత్తా లాల్‌బజార్‌ పోలీసు స్టే...

27/07/2025

భారత్ లో జరుగుతున్న ప్రజా యుద్దానికి సంఘీభావంగా, రాజ్యం చేస్తున్న కగార్ దాడిని ఖండిస్తూ అంతర్జాతీయ ప్రచారంలో ....

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారిని శత్రువులుగా చూస్తున్న‌ ఈ అణచివేత వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని మేము అన...
20/07/2025

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారిని శత్రువులుగా చూస్తున్న‌ ఈ అణచివేత వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని మేము అన్ని పౌర సంస్థలు, ప్రజాస్వామ్య సమూహాలు, ప్రగతిశీల వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇది కేవలం వ్యక్తిగత అరెస్టుల విషయం కాదు, ఇది అసమ్మతి హక్కు, సంఘటిత హక్కు,న్యాయమైన భవిష్యత్తును ఊహించుకునే హక్కు కోసం పోరాటం.

ఢిల్లీ పోలీసులు కార్యకర్తలను అక్రమంగా కిడ్నాప్ చేయడం మరియు నిర్బంధించడాన్ని ఖండించండి! రాజధానిలో రాజ్యాంగ వ్...

రూపేష్  శివ‌ గంగా జిల్లా  ఇలయంగురి సమీపంలోని ఇదయన్ వలసైకి చెందిన ఒక రైతు రేషన్ కార్డును ఉపయోగించి కన్యాకుమారిలోని ఒక అవు...
19/07/2025

రూపేష్ శివ‌ గంగా జిల్లా ఇలయంగురి సమీపంలోని ఇదయన్ వలసైకి చెందిన ఒక రైతు రేషన్ కార్డును ఉపయోగించి కన్యాకుమారిలోని ఒక అవుట్ లెట్ నుండి ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారని, ఆ సిమ్ కార్డును మావోయిస్టు కార్యకలాపాలకు ఉపయోగించారని పోలీసులు ఆరోపించారు.

తమిళనాడు కోర్టు మావోయిస్టు నాయకుడు రూపేష్ కు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం కేరళలోని వియ్యూర్ కేంద్ర జైలులో ...

"రుద్ర చాలా తెలివైన విద్యార్థి. ప్రజల ప్రయోజనాలను హృదయపూర్వకంగా కోరుకునే శ్రద్ధగల కార్యకర్త. నిర్బంధించబడిన ఇతరులకు ఏమి ...
19/07/2025

"రుద్ర చాలా తెలివైన విద్యార్థి. ప్రజల ప్రయోజనాలను హృదయపూర్వకంగా కోరుకునే శ్రద్ధగల కార్యకర్త. నిర్బంధించబడిన ఇతరులకు ఏమి జరిగిందో విన్న తర్వాత... టాయిలెట్ బౌల్స్‌లో తలలను ముంచడం , లైంగిక వేధింపుల బెదిరింపుల తర్వాత రుద్రకు కూడా అదే జరుగుతుందని మేము చాలా భయపడుతున్నాము. ప్రతిఘటించే గొంతులపై దుర్మార్గ‌మైన దాడి, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష ఫాసిస్ట్ దాడి జరుగుతున్నాయి" అని అతని స్నేహితులు అన్నారు.

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జాకీర్ హుస్సేన్ కళాశాల విద్యార్థి రుద్ర మూడు రోజులుగా కనిపించడం లేదు. 20 ఏళ్ల రుద్ర ...

19/07/2025

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) ప్రధానకార్యదర్శి నంబాళ్ళ కేశవరావు ఎలియాస్ బసవరాజుతో సహా మావోయిస్టులు, ఆద....

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దోపిడీ వర్గాల ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగ...
17/07/2025

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దోపిడీ వర్గాల ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరంన్నర కాలంగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక 'కగార్' యుద్ధం మధ్య ఈసారి మనం జూలై 28 అమరుల సంస్కరణ వారాన్ని జరుపుకుంటున్నాం. కగార్ దాడిలో మనపార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు (బీఆర్) సహా నలుగురు కేంద్రకమిటీ సభ్యులను, 15 మంది రాష్ట్రకమిటీ సభ్యులను, ఇతరులను కోల్పోయి తీవ్రమైన నష్టాలు కొనసాగుతున్న సమయంలో ఈ సంస్కరణ వారాన్ని జరుపుకుంటున్నాం.

*2025 జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణవారాన్ని పోరాటోత్తేజంతో పాటించండి. *పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్య సంఘటనన...

ఒకవైపు భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూనే మరోవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడిన మాటల పట్ల రైతులు అనేక అనుమానాలు...
15/07/2025

ఒకవైపు భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూనే మరోవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడిన మాటల పట్ల రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి నాయకత్వం వహించిన చన్నరాయపట్నం భూసేకరణ నిరోధక కమిటీ నాయకులు, చన్నరాయపట్నం హోబ్లీలోని 13 గ్రామాల నివాసితుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.

కర్ణాటకలోని దేవనహళ్లిలోని రైతులు దాదాపు 1200 రోజులుగా సాగిస్తున్న పోరాటం విజయం సాధించింది. ఏరోస్పేస్ పార్క్‌ను ....

ఢిల్లీలోని జెఎన్‌యు హాస్టల్ ముందు హిందూత్వ మిలిటెంట్ గ్రూపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఎబివిపి సభ్యులు దాడి చేస...
10/07/2025

ఢిల్లీలోని జెఎన్‌యు హాస్టల్ ముందు హిందూత్వ మిలిటెంట్ గ్రూపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఎబివిపి సభ్యులు దాడి చేసినప్పటి నుంచి నజీబ్ కనిపించడం లేదు.
నజీబ్ అప్పుడు ఎమ్.ఎస్.సి బయోటెక్నాలజీలో మొదటి సంవత్సరం విద్యార్థి; వయస్సు 27 సం.
మొదట్లో ఈ కేసును ఢిల్లీ పోలీసు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆ తరువాత సిబిఐలాంటి దేశంలోని ఉన్నత స్థాయి ఏజెన్సీలు పరిశోధన చేశాయి.
అయినప్పటికీ, ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయినాక కూడా, నజీబ్ ఎక్కడ ఉన్నాడో ఏ ఏజెన్సీ తెలుసుకోలేకపోయింది.

(maktoobmedia.com లో వచ్చిన ఈ ఆర్టికల్ ను తెలుగు అనువాదం చేసింది పద్మ కొండిపర్తి) జెఎన్‌యు విద్యార్థి నజీబ్ అహ్మద్ కనిపించ...

సత్యం 1970 జూలై 10న చావలేదు. సత్యానికి చావు లేదు. కురుపాం కొండల్లో ఒరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు. ఈ ఐ...
10/07/2025

సత్యం 1970 జూలై 10న చావలేదు. సత్యానికి చావు లేదు. కురుపాం కొండల్లో ఒరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు. ఈ ఐదు దశాబ్దాలలో తిరిగి తిరిగి పునర్జీవితం సాధిస్తూనే ఉన్నాడు. సత్యం ఫీనిక్స్ పక్షిలా చితాభస్మంలోంచి పదే పదే రెక్క విప్పుతూనే ఉంది. యాబై ఏళ్ల కిందటి పాలకులు మాత్రమే కాదు, ఈ యాబై ఏళ్లలో అనేక మంది పోలీసు అధికారులు, మంత్రులు, హోం మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రచారసాధనాల వ్యాఖ్యాతలు సత్యం మరణించాడని, సత్యం ఇక రాడని, మరణశాసనాలు రాస్తూనే ఉన్నారు. కాని సత్యం చావలేదు, సత్యానికి చావు లేదు. దోపిడీ పీడనలు ఉన్నంతవరకూ ఆ దోపిడీ పీడనల మీద ప్రజాపోరాట సత్యం నిత్య చిరంజీవి.

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – ల.....

భరించనలవి కాని దు:ఖం. కనురెప్పల తడి ఆరిపోయే దు:ఖం. ఇది  ఎందరిది? ఈ కన్నీటి ముసురు ఎప్పుడు మొదలైంది? విప్లవం ఇంత బాధామయ ...
08/07/2025

భరించనలవి కాని దు:ఖం. కనురెప్పల తడి ఆరిపోయే దు:ఖం. ఇది ఎందరిది? ఈ కన్నీటి ముసురు ఎప్పుడు మొదలైంది? విప్లవం ఇంత బాధామయ ఎంపిక అని తెలిసి తెలిసీ వాళ్లు ప్రజల్లోకి వెళ్లిపోయారు. సమాజాన్ని మానవీయంగా తీర్చిదిద్దడానికి తమ ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమై పోరాటంలో భాగమయ్యారు. ఆ ఎడబాటుతో, కడుపు కోతతో, రేయింబవళ్ల నిరీక్షణతో మాకు విప్లవమంటే ఏమిటో తెలియజేస్తూ వాళ్లు అట్లా జనంలో కలిసిపోయారు. విప్లవమంటే యుద్ధమే కాదు, శాంతి కూడా అని చెబుతూ మాంసపు ముద్దలై మా చేతుల్లోకి తిరిగి వచ్చారు. చితాభస్మమై తిరిగి లేచి పోరాట చరిత్రలో భాగమయ్యారు. చితి మంటలను, బూడిద కుప్పలను, ఎర్రెర్రని స్థూపాలను చూసి భయపడే రాజ్య పాలనతో మా కన్నీరే ఆనవాలుగా మా గుండెల్లో నిలిచిపోయారు.

ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించాలని అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమ....

06/07/2025

Communist Party of India (Maoist)Central Committee Statement Ful Text Condemn the Modi-Shah government’s stance of ‘we will hold peace talks with Pakistan but not with the Maoists and the Adivasis’ Demand the Telangana government to declare a ceasefire in Telangana. On the 29th of last month, ...

Address


Alerts

Be the first to know and let us send you an email when Avani News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Alternative Media

Alternative Media