9TV news Adoni AP

  • Home
  • 9TV news Adoni AP

9TV news Adoni AP Get the lates news updates cover in Adoni Town

స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రివర్యులు 150వ జయంతి సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ...
16/08/2025

స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రివర్యులు 150వ జయంతి సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల సర్కిలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. ఆదోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.సాయినాథ్ మాట్లాడుతూ విజయ భాస్కర రెడ్డి గారు కేంద్రంలో ఎన్నో పదువులను పొంది కేంద్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మచ్చలేని మహా మనిషిగా పేరొందారు అని కొనియాడారు. కర్నూలు జిల్లా పెద్దాయనగా పేరు సంపాదించారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా రాష్ట్రంలో ఎన్నో సేవలందించారన్నారు..

ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మునిసిపల్ కౌన్సిలర్ దిలీప్ దోక, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ రావు, యువజన అధ్యక్షులు దేవి శెట్టి వీరేష్,NSUI రాష్ట్ర నాయకులు శ్రీనిథ్, చేతన్ దోక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాయన్న తదితరులు పాల్గొన్నారు

స్వాతంత్ర దినోత్సవం రోజున వరుసగా రెండవ సంవత్సరం ఖాజీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురి...
16/08/2025

స్వాతంత్ర దినోత్సవం రోజున వరుసగా రెండవ సంవత్సరం ఖాజీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు
వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ ద్వారా వందల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మధు ఆసుపత్రికి లైఫ్ టైం అవార్డు అందించిన ఖాజీ ఇండియా ఫౌండేషన్
స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన అక్బర్ అలీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Career development లో MS ACADEMY తరుపున మనియా ఇలియాస్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
వైద్య రంగంలో అద్భుత సేవలు అందించిన మాధవి లతకు ఖాజీ ఇండియా ఫౌండేషన్ తరపున లైఫ్ టైం అవార్డు అందజేత

ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక సేవలు చేస్తున్న ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నగేష్ కాకుబాల్ కు అందిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలు అందించిన యాసీన్ భాషకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

ఇలా వివిధ రంగాల్లో అద్భుత సేవలు అందించి రాణించిన పలువురికి హాజీ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ హాజీ అల్తాన్ స్థానిక సంస్కృతి ఫంక్షన్ హాల్ లో భారీ సమావేశం ఏర్పాటు చేసి వారి సేవలను గుర్తించి వారికి అవార్డు మొమెంటు అందించి శాలువా మరియు పూలమాలలతో సత్కరించారు

స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకు తున్న ఈవేళ కూటమి కుట్రలకు బలైపోతున్న దివ్యాంగుల జీవితాలు ఎన్నికల ముందు దివ్యాం...
15/08/2025

స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకు తున్న ఈవేళ కూటమి కుట్రలకు బలైపోతున్న దివ్యాంగుల జీవితాలు ఎన్నికల ముందు దివ్యాంగుల సాధికారాతే మా ద్యేయం వారి ఆత్మగౌరవమే మా లక్ష్యం అని అలివి కానీ హామీలతో దివ్యాంగులను నమ్మించి వారి ఓట్లతో గద్దెనెక్కిన కూటమి అధికారం చేపట్టిన ఆరు నెలలకే దివ్యాంగుల పట్ల వారి కుట్రలు పథకం ప్రకారం అమలుకు నాంది పలికి సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ లకు తెర తీసి పింఛన్ దారుల అర్హతను పునర్ పరిశీలన చేసుకోమని వారిని నానా ఇబ్బందులు పెడుతూ నేడు కుట్రలో చివరి అంకానికి రావడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల 20వేల మంది దివ్యాంగులైన అర్హులు పెన్షన్లు పొందుతూ ఉంటే వారందరికీ వైకల్య పునర్ పరిశీలన చేసి వారిలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో లబ్ధిదారులను అనర్హులుగా చిత్రీకరించి వారి జీవితాలపై ఆర్థిక మూలాలపై దెబ్బతీసే విధంగా నేడు ప్రభుత్వం కుట్రపూరితంగా పెన్షన్లు తొలగింపు ప్రక్రియకు కంకణం గట్టుకునిపుట్టు వైకల్యంతో ఉన్నవారికి పోలియో వ్యాధిగ్రస్తులకు వారి వైకల్య శాతంలో భారీ మార్పులు చేస్తూ ఇప్పటివరకు పర్మినెంట్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారికి వారి వైఖల్య శాతాన్ని తగ్గించి ఉదా.. 20 30 సంవత్సరాల నుండి 90% వైఖల్యం ఉన్న వారిని నేడు పునర్ పరిశీలన చేసి 60 శాతం వైకల్యాన్ని ధ్రువీకరించి టెంపరరీ సర్టిఫికెట్లు మంజూరు చేయటం చాలా దారుణం రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో దివ్యాంగులకు మెరుగైన జీవన భద్రత కల్పిస్తానని ప్రభుత్వం ద్వారా అందించేటువంటి అన్ని సంక్షేమ పథకాలలో వారికి రావలసిన రాయితీలు వాటాలు ఇప్పించే దానిలో నేను బాధ్యత తీసుకొని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని నన్ను నమ్మండి అని దివ్యాంగులను వంచించిన మోసం చేసిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు వారు కూడా కనీసం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పట్ల నోరు మెదపకపోవడం కడు శోచనీయమని దివ్యాంగుల సమాజం మొత్తం గగ్గోలు పెడుతున్న వారికి చీమకుట్టినట్టైనా లేదు ఒక విధంగా చెప్పాలంటే దివ్యాంగుల సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి కూటమి ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకొని వారి విలువైన ఓట్లు వేసి వారికి అధికారాన్ని అందించారు ఇటువంటి దివ్యాంగులను సైతం పవన్ కళ్యాణ్ గారు మరిచిపోవటం చాలా దారుణం అని ఇప్పటికైనా ప్రభుత్వం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి మరోసారి వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దివ్యాంగుల సమాజానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ సంఘటన చేస్తామని వైఎస్ఆర్సిపి దివ్యాంగుల విభాగం మండల అధ్యక్షులు హనుమంత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో అతి త్వరలోనే దివ్యాంగుల పట్ల కొనసాగుతున్న దారుణాలను వారికి జరుగుతున్న అన్యాయాలను మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారి ఆదేశాలతో ఖచ్చితంగా అర్హులైన దివ్యాంగుల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం గట్టిగా పోరాటం చేస్తుందని లబ్ధిదారులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తుందని ఈ కార్యక్రమంలో దివ్యాంగులను దివ్యాంగ సంఘాలను ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు పోయి జరుగుతున్న దాస్టికాన్ని ఎండగడతామని హనుమంత రెడ్డి హెచ్చరించారు

పెద్ద తుంబలం గ్రామంలో బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసీంపీరా, బీజేపీ సీనియర్ నాయకులు శంకరయ్య, బీజేపీ sc మోర్చా k శ్రీన...
15/08/2025

పెద్ద తుంబలం గ్రామంలో బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసీంపీరా, బీజేపీ సీనియర్ నాయకులు శంకరయ్య, బీజేపీ sc మోర్చా k శ్రీనివాసులు, దయ్యలా హుసేని స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా. గ్రామం లో గల ప్రాథమిక మరియు ZPHS ఉన్నత పాఠశాల మరియు పంచాయతీ ఆఫీస్ లో జెండా ఆవిష్కరణ లో భాగంగా పాల్గొన్నారు

15/08/2025

Ilyas maniyar received
Khazi India foundation ADONI award
MILLAT EDUCATION SOCIETY ADONI affiliated to
MS IAS ACADEMY HYDERABAD
Academy’s mission is to empower the IAS IPS aspirants . Every year June ms IAS academy conducts upsc civil service free coaching entrance exam nationwide across 24 states in 100 + centres we honoured ADONI also one of the center. Many aspirants have become IAS IPS OFFICERS and we wish ADONI aspirants May be selected. Millat educational society ADONI. mission is to empower ADONI graduates (aspirants) to become IAS IPS IRS OFFICERS.

15/08/2025

ADONI LIFETIME ACHIEVEMENT AWARD 2025

ఆదోని, ఆగస్టు 15:ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, పార్టీ ఇన్‌చార్జ్ వర్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి...
15/08/2025

ఆదోని, ఆగస్టు 15:
ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, పార్టీ ఇన్‌చార్జ్ వర్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు గారి, ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ మీనాక్షి నాయుడు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని, ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు,

కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు.

ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు చ...
15/08/2025

ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షుడు బి దేవా మాట్లాడుతూ ఈరోజు ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి వాళ్ళ ప్రాణా త్యాగపలమే ఈ స్వతంత్రం మనకు రావడం జరిగింది కావున అందరు కూడా వాళ్ళ స్ఫూర్తితో మన దేశం కోసం భావితరాల కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కావున ఈరోజు చూస్తా ఉన్నాం స్వాతంత్రం దేశ ప్రజలందరికీ వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పలాలను అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కుతూ రాక్షస పాలన కొనసాగిస్తా ఉన్నారు 15 నెలలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు కేవలం అబద్ధపు హామీలతో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రజలకు గొంతు నొక్కడం చేస్తా ఉన్నారే గాని ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు కావున ప్రజలందరూ కూడా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది పులివెందులలో జరిగిన బై ఎలక్షన్ లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా ప్రజలు ప్రజల హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారేని మనమందరు కూడా ఒకసారి గమనించాలి రానున్న రోజుల్లో ఇది ఈ సంస్కృతి దేనికి సంకేతంగా భావించాలో కూటమి ప్రభుత్వమే ప్రజల తెలపాలి మీరేం చేసినా మల్ల వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సువర్ణపాలన అందించే విధంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ నారి ప్రధాన కార్యదర్శి ఉచ్చిరప్ప గంగాధర్ జమీల్ షఫీ సునార్ ఖాదర్ స్టేట్ ప్రధాన కార్యదర్శి నాసిర్ ఏసోబు నారాయణ మళ్లీ పూర్ణ హమాన్ బాబా రాఘవేంద్ర దేవేంద్ర బొబ్బిలి వెంకటేష్ గుండా మళ్లీ బాబు సమీర్ సీనా రామంజి చలపతి ఇర్ఫాన్ హనుమంతు నాగరాజ్ నూర్ ఫయాజ్ భాస్కర్ బాసిర్ లక్ష్మన్న వీరేష్ రామంజి గోపాల్ రామకృష్ణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Address


Alerts

Be the first to know and let us send you an email when 9TV news Adoni AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share