JIH AP Official

JIH AP Official Jamaat-e-Islami Hind AP is a socio-religious organization of India

ఖిద్మత్ (సేవ) సొసైటీలు: వెయ్యి కోట్ల టర్నోవర్: సిద్దీఖీకర్నూలులో నిర్వహించిన “క్యాపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్”లో ఎస్ఆర్డి...
17/08/2025

ఖిద్మత్ (సేవ) సొసైటీలు: వెయ్యి కోట్ల టర్నోవర్: సిద్దీఖీ

కర్నూలులో నిర్వహించిన “క్యాపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్”లో ఎస్ఆర్డిఎఫ్ డైరెక్టర్ అబ్దుల్ జబ్బార్ సిద్ధీఖ్ పాల్గొని ప్రసంగించారు. ఖిద్మత్ సొసైటీలు కృషి, అంకితభావంతో స్వల్పకాలంలోనే వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించాయని తెలిపారు. వడ్డీ రహిత సమాజ నిర్మాణంలో ఇది విశేషమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ప్యాట్రాన్ ముహమ్మద్ కరీముద్దీన్, సిద్ధిఖీ ఖాన్, బుర్హానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత చాంద్ బాషా వహించారు.

14/08/2025
ప్రెస్ రీలీజ్జమాఅతె ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లాహ్ హుసైనీ — అమెరికాతో సుంక వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరి...
09/08/2025

ప్రెస్ రీలీజ్

జమాఅతె ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లాహ్ హుసైనీ — అమెరికాతో సుంక వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి, విదేశాంగ విధానంలో సమతుల్యత అవసరం.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై అదనంగా 25% సుంకం విధించి, మొత్తం సుంకాన్ని 50%కి పెంచిన నిర్ణయంపై జమాఅతె ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లాహ్ హుసైనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య అనవసరమని, భారత ఆర్థిక వ్యవస్థకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికీ నష్టం కలిగిస్తుందని అన్నారు.

రష్యా నుండి కొనుగోళ్లు చేసినందుకు భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం అని, ఇతర దేశాలు కూడా రష్యా నుండి దిగుమతులు చేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. అధిక సుంకం వలన టెక్స్టైల్, కార్పెట్, ఆహార ఎగుమతుల వంటి శ్రమాధారిత రంగాల్లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతింటాయని, వేలాది కార్మికులు ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. అమెరికా వినియోగదారులు కూడా అధిక ధరలు, పరిమిత ఉత్పత్తి ఎంపికలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

భారత్‌ తక్షణ చర్యల్లో భాగంగా —

1. వాణిజ్య వైవిధ్యం: జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆసియాన్, బ్రిక్స్ వంటి భాగస్వామ్యాలతో సంబంధాలు బలపరచాలి.
2. ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తుల బలోపేతం: బ్రిక్స్ వంటి వేదికల్లో భారత్ నాయకత్వం వహించాలి.
3. అంతర్గత ఆర్థిక స్థిరత్వం: శ్రమాధారిత తయారీ, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసి, మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలి.

భారత ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడే స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానం అవసరమని పిలుపునిచ్చారు.

జారీ చేసిన వారు:
సల్మాన్ అహ్మద్
జాతీయ కార్యదర్శి, మీడియా విభాగం, జమాఅతె ఇస్లామీ హింద్
మొబైల్: 7290010191
చిరునామా: D-321, అబుల్ ఫజల్ ఎన్‌క్లేవ్, జామియా నగర్, ఓఖ్లా, న్యూ ఢిల్లీ - 110025

High level delegation of Jamaat-e-Islami Hind, led by its President Syed Sadatullah Hussaini along with JIH Vice Preside...
05/08/2025

High level delegation of Jamaat-e-Islami Hind, led by its President Syed Sadatullah Hussaini along with JIH Vice Presidents Prof. Salim Engineer, S Ameen ul Hasan and Asst. National Secretary Dr. Rizwan Rafeeqi met with H.E. Mr. Klas Nayman, Head of Poltical Affairs, Delegation of European Union to India.

Another delegation comprising of JIH Vice Presidents Prof. Salim Engineer, Malik Motasim Khan and Asst. National Secretaries, Dr. Rizwan Rafeeqi and Laeeq Ahmad Khan visited the Embassy of the Republic of the Gambia in New Delhi and met with H.E. Mustapha Jawara, Hon'ble High Commissioner, Mr. Ebrima Mboob, Deputy Head of Mission and counsellors and Secretaries at the Embassy of the Republic of the Gambia.

Delegation urged the European Union and the government of the Republic of Gambia to play the proactive, concrete and meaningful role in helping to end the suffering in Gaza. Delegation urged the respective authorities through Hon'ble ambassadors to strongly condemn the Israeli atrocities, provide humanitarian aid to Palestinians and advocate for establishment of Independent Sovereign state of Palestin.

ఢిల్లీ: గాజాలో యుద్ధం (అమాయకులపై రక్తపాతం) తాత్కాలికంగా కాదు,పూర్తిగా నిలవాలంటూ జమాఅతె ఇస్లామీ హింద్ ప్రతినిధి బృందం యూర...
05/08/2025

ఢిల్లీ: గాజాలో యుద్ధం (అమాయకులపై రక్తపాతం) తాత్కాలికంగా కాదు,పూర్తిగా నిలవాలంటూ జమాఅతె ఇస్లామీ హింద్ ప్రతినిధి బృందం యూరోపియన్ యూనియన్, గాంబియా రాయబార కార్యాలయాలను కలిసింది. జేఐహెచ్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లాహ్ హుసైని నేతృత్వంలో రెండు బృందాలు ఈ సమావేశాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా గాజా మీద ఇజ్రాయేలు జరుపుతున్న అఘాయిత్యాలను ఖండించేందుకు, మానవతా సహాయం అందించేందుకు, స్వతంత్ర పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

పాలస్తీనా ప్రజలతో ఐక్యతగా నిలుస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆగస్టు 1న SIO ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. "పాల...
02/08/2025

పాలస్తీనా ప్రజలతో ఐక్యతగా నిలుస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆగస్టు 1న SIO ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. "పాలస్తీనా ఐక్యతా వారంల" భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో జమాఅతె ఇస్లామీ హింద్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీక్ సాహేబ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భర్గవ్, MJAC కన్వీనర్ మునీర్ సాహేబ్ , ముస్లిం అడ్వొకేట్స్ అసోసియేషన్‌కి చెందిన అబ్దుల్ మతీన్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు..ఈ ధర్నాలో, గాజాలో పెరిగిపోతున్న ఆకలి చావులను ప్రత్యేక దృశ్య ప్రదర్శన నిర్వహించారు. ఆకలితో బలహీనపడుతున్న చిన్నారులు, వైద్య సహాయం లేక విలవిలలాడుతున్న వృద్ధులు వంటి దృశ్యాలు ప్రజల మనసులను కదిలించాయి. మానవ హక్కుల ప్రతినిధులు, ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ – పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దమన, విధ్వంస చర్యలను ఆపాలని, భారత్, ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇజ్రాయేల్ అమానుష అకృత్యాలను ఖండించండి!  ప్రజలకు మానవీయ సహాయం అందించండి! జోర్డాన్‌కు భారత ముస్లిం ప్రతినిధుల విజ్ఞప్తి భా...
01/08/2025

ఇజ్రాయేల్ అమానుష అకృత్యాలను ఖండించండి! ప్రజలకు మానవీయ సహాయం అందించండి!
జోర్డాన్‌కు భారత ముస్లిం ప్రతినిధుల విజ్ఞప్తి

భారతదేశంలోని ప్రముఖ ముస్లింల సంస్థల ఉమ్మడి ప్రతినిధి బృందం, ఢిల్లీలో జోర్డాన్ రాయబారిగా ఉన్న మాన్యులు యూసుఫ్ ముస్తఫా అలీ అబ్దుల్ ఘనీ గారిని కలసి గాజా ప్రజల పరిస్థితిపై తమ ఆందోళనను వ్యక్తం చేసింది. జోర్డాన్ రాయబార కార్యాలయంలో ఉపమిషన్ అధిపతి ఫలాహ్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గాజాలో ఇజ్రాయేలు చేస్తున్న అమానుష అకృత్యాలను తీవ్రంగా ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు మానవీయ సహాయం అందించాలనీ, అలాగే స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటుకు మద్దతుగా గళమెత్తాలని ప్రతినిధి బృందం జోర్డాన్ ప్రభుత్వాన్ని కోరింది.

ఉమ్మడి ప్రతినిధి బృందం

సయ్యద్ సాదతుల్లాహ్ హుసైని, అధ్యక్షులు – జమాఅతె ఇస్లామీ హింద్
డా. సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇల్యాస్, అధికార ప్రతినిధి – ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
అజీముల్లా ఖాస్మీ, జాతీయ సమన్వయకర్త – జమీయతుల్ ఉలమా-ఎ-హింద్

మలిక్ మోతసిమ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి – ఏపీసీఆర్ఆర్
డా. షీస్ ఇద్రీస్ తైమీ, కార్యదర్శి – మార్కజీ జమీయత్ అహ్లె హదీస్ హింద్
అబ్దుల్ హఫీజ్, జాతీయ అధ్యక్షుడు – స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా
రిజ్వాన్ అహ్మద్ రఫీకి, అసిస్టెంట్ సెక్రటరీ – జమాఅతె ఇస్లామీ హింద్
యూనుస్ మల్లా , జాతీయ కార్యదర్శి – ఎస్‌ఐఓ ఆఫ్ ఇండియా




రాజమండ్రి: జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్ట...
30/07/2025

రాజమండ్రి: జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన మట్టిలో చేతులు - హృదయంలో దేశం ఉద్యమం ఈ ఆదివారంతో ముగిసింది. ఈ ఉద్యమం ముగింపు సమావేశం రాజమండ్రిలో అమిరే హల్ఖ మొహమ్మద్ రఫీఖ్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రఫీఖ్ మాట్లాడుతూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇస్లామిక్ విలువలపై ఆధారపడిన జాతీయ వేదిక CIO అని అన్నారు. ప్రకృతి పట్ల ప్రేమతో కూడిన విద్య బాల్యం నుండే ప్రారంభం కావాలని మరియు పిల్లలను సరిగ్గా నడిపించినప్పుడు, వారు ప్రపంచాన్ని మార్చగలరని పిల్లలలో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత మరియు పరిరక్షణ భావాన్ని పెంపొందించడమే లక్ష్యం అని తెలిపారు. పిల్లల్లో పర్యావరణ పై ఆవగాహన కొరకు వ్యాసరచన పోటీలతో పాటుగా డ్రాయింగ్, క్రాఫ్ట్ , కవిత్వాలు, గ్రీన్ ప్లెడ్జ్ కార్యక్రమాలు మరియు విభిన్న ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

గాజాలో మానవీయ విషాదం: భారత్ తక్షణం స్పందించాలి!న్యూఢిల్లీ, జూలై 28, 2025:ప్రెస్ రిలీజ్ భారతదేశంలోని ప్రముఖ ముస్లిం సంస్థ...
28/07/2025

గాజాలో మానవీయ విషాదం: భారత్ తక్షణం స్పందించాలి!

న్యూఢిల్లీ, జూలై 28, 2025:

ప్రెస్ రిలీజ్

భారతదేశంలోని ప్రముఖ ముస్లిం సంస్థలు, మత పండితులు, పౌర సంఘాలు నేడు న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు గాజాలో మానవీయ విపత్తు మరింత ఉద్ధృతమవుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ధైర్యమైన, నైతికంగా స్థిరమైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీడియాతో మాట్లాడిన వారంతా గాజాలో పరిస్థితిని "అభూతపూర్వ మానవీయ విపత్తు"గా అభివర్ణించారు. “గాజా ఆకలితో చనిపోతోంది. సమయానికి చర్యలు తీసుకోకపోతే అది చరిత్రపరమైన నేరంగా నిలుస్తుంది” అని హెచ్చరించారు.

ప్రస్తుతం 20 లక్షలకుపైగా ప్రజలు తీవ్రమైన ఆకలితో, వైద్య సేవల లేకపోవడంతో, శుభ్రతా సదుపాయాల లేకుండానే బతుకుతున్నారు. 90 శాతం హాస్పిటల్లు బాంబుల దాడులతో ధ్వంసమై మూతపడ్డాయి. పిల్లలూ, బిడ్డలూ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు అనస్థీషియా లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇది ఆత్మరక్షణ కాదు – ఇది ప్రజలపై వ్యూహాత్మక విధ్వంసం అని వారు స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితిలో భారత స్థాయి ప్రతినిధి యుద్ధవిరమణపై చేసిన ప్రకటనను వారు స్వాగతించారు. "గాజా కోసం మన దేశం తాజాగా ఇచ్చిన ప్రకటనను మేము హర్షిస్తున్నాం. ఇది స్వతంత్ర పాలస్తీన పట్ల మన నిబద్ధతను తెలియజేస్తోంది" అని పేర్కొన్నారు.

అయితే భారతం కేవలం ఆందోళన వ్యక్తం చేయడం కాక, అంతర్జాతీయంగా నైతిక నాయకత్వాన్ని చేపట్టాలని వారు కోరారు. "పౌరులపై బాంబు దాడులు, ఆసుపత్రులు, పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడం వంటి యుద్ధ నేరాల్ని ఖండించాలి. భారత్‌కు ఈ విధ్వంసాన్ని నిరసించడానికి చరిత్రతో కూడిన ప్రతిష్ట కూడా ఉంది, అంతర్జాతీయ మద్దతు కూడగట్టే సామర్థ్యం కూడా ఉంది" అని వివరించారు.

గాజాకు సహాయం అందించే మానవీయ మార్గాలను వెంటనే ప్రారంభించాలని, ఇజ్రాయెల్‌తో ఉండే అన్ని రకాల సైనిక, వ్యూహాత్మక సహకారాన్ని యుద్ధం పూర్తయ్యే వరకు నిలిపివేయాలని సూచించారు. "భారత్ చరిత్రలో ఎప్పుడూ అణచివేతకు గురైన వారి పక్షంలో నిలిచింది. అదే వారసత్వాన్ని ఇప్పుడు నిలబెట్టాల్సిన సమయం ఇది" అని వారు పేర్కొన్నారు.

పాలస్తీన పట్ల మద్దతు కేవలం ముస్లింల అంశం కాదని, ఇది మానవత్వం, న్యాయం, గౌరవం పట్ల ప్రతి ఒక్కరిదీ బాధ్యత అని వారు అన్నారు. విద్యార్థులు, పౌరులు, మత నాయకులు, ప్రొఫెసర్లు – అందరూ ఫిలిస్తీన్ కోసం తమ స్వరం వినిపించాలని వారు కోరారు.

కొన్ని చోట్ల పాలస్తీన పట్ల మద్దతును అణచివేయడం లేదా నేరంగా పరిగణించడం జరుగుతోందన్న వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా పట్ల మద్దతు ఇవ్వడం ఉగ్రవాదం కాదు. ఇది మానవహక్కుల, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ. ప్రజలు భయపడకుండా, నిర్బంధం లేకుండా వారి అంతరాత్మ స్వరాన్ని వినిపించే స్వేచ్ఛను కలిగి ఉండాలి" అని అన్నారు.

ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాలను తెంచి, ఒకతాటిపై ఏర్పడి బర్బర దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా ముస్లిం దేశాలనూ వారు కోరారు.

కాన్ఫరెన్స్ చివర్లో గాజాలో తక్షణం యుద్ధవిరమణకు, నిర్బంధంలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సాయం అందించే మానవీయ మార్గాలను సృష్టించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమీయత్ ఉలమా-ఎ-హింద్, జమాఅతె
ఇస్లామీ హింద్, జమీయత్ అహ్లె హదీస్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తదితర ముస్లిం సంస్థల నాయకులు ఉద్దేశించి, మీడియాకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

-

జై హింద్ క్యాంప్ వాసులను పరామర్శించిన జమాఅతె ఇస్లామీ హింద్ ప్రతినిధి బృందంవసంత్ కుంజ్‌లోని జై హింద్ క్యాంప్‌ను జమాఅతె ఇస...
24/07/2025

జై హింద్ క్యాంప్ వాసులను పరామర్శించిన జమాఅతె ఇస్లామీ హింద్ ప్రతినిధి బృందం

వసంత్ కుంజ్‌లోని జై హింద్ క్యాంప్‌ను జమాఅతె ఇస్లామీ హింద్ (JIH) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సలీం ఇంజినీర్, సామాజిక కార్యకర్త నదీం ఖాన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బీహార్ జిల్లాకు చెందిన సుమారు 1100 కుటుంబాలు నివసిస్తున్న ఈ క్యాంప్‌ వాసులు కుదుపుతో ఉన్నారు. ఖాళీ చేయాల్సినట్లు, కూల్చివేతకు సంబంధించిన ఆదేశాల నేపథ్యంలో ఇళ్లను కోల్పోయే పొరపాటులో ఉన్నారు.

గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి విద్యుత్, మరుగుదొడ్లు, శానిటేషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరం.

ప్రతినిధి బృందం స్థానిక ప్రజా ప్రతినిధి (ప్రధాన్), మసీదు ఇమాం మరియు ఇతర ప్రజలతో భేటీ అయి వారి బాధలను అడిగి తెలుసుకుంది. అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

జై హింద్ క్యాంప్ వాసుల పట్ల దయతో వ్యవహరించాలని, ప్రాథమిక సౌకర్యాల సరఫరా వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాధికారులకు జమాఅతె ఇస్లామీ హింద్ కోరింది.

జూలై 22, 2025 – ప్రెస్ రిలీజ్ జైలు నుంచి విడుదలైన నిర్దోషులకు నష్టపరిహారం చెల్లించాలి – వారిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చ...
23/07/2025

జూలై 22, 2025 – ప్రెస్ రిలీజ్

జైలు నుంచి విడుదలైన నిర్దోషులకు నష్టపరిహారం చెల్లించాలి – వారిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే బదులు అసలైన నిందితులను అరెస్ట్ చేయాలి: మాలిక్ మోతాసిం ఖాన్

న్యూఢిల్లీ, జూలై 22:

2006 జూలై 11న ముంబయిలో జరిగిన ట్రైన్ పేలుళ్ల కేసులో అరెస్టయిన 12 మంది నిర్దోషులుగా విడుదలైన విషయంపై జమాఅతె ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు మలిక్ మోతసిమ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 మంది సుమారు 19 సంవత్సరాలు జైలు జీవితం అన్యాయంగా గడిపారు.

అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "బాంబే హైకోర్టు 671 పేజీల తీర్పులో పరిశోధన లోపాలను, ఆధారాల లోపాలను బట్టబయలు చేసింది. దర్యాప్తు, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఆ తీర్పు స్పష్టంగా చూపుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులోకి వెళ్లడం అనవసరమైన చర్య అవుతుంది" అని ఆయన అన్నారు.

మలిక్ మోతసిమ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ –
"ఈ 12 మంది నిర్దోషులపై అనేక సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. వారు జైళ్లలో శారీరక, మానసిక హింసలకు గురయ్యారు. వారి కుటుంబాల జీవితాలు చిద్రమయ్యాయి. నిజమైన నిందితులు ఇప్పటికీ బయటే వున్నారు. ధ్వంసకారుల్లో 189 మంది మరణించారు, 800 మందికిపైగా గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టులోకి వెళ్లడం కంటే కొత్తగా, సమగ్రంగా దర్యాప్తు ప్రారంభించి అసలైన నిందితులను పట్టుకోవాలి."

అంతేకాదు, న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు. "దెబ్బతిన్నవారికి నష్టపరిహారం ఇవ్వాలి. తప్పుల్ని పునరావృతం కాకుండా చూడాలి. భవిష్యత్‌లో విచారణలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి" అని మలిక్ మోతసిమ్ ఖాన్ అన్నారు.

**ప్రెస్ రిలీజు విడుదల చేసినవారు:**
**సల్మాన్ అహ్మద్**
జాతీయ సహాయ కార్యదర్శి, మీడియా విభాగం
కేంద్ర కార్యాలయం – జమాఅతె ఇస్లామీ హింద్
మొబైల్: 7290010191
చిరునామా: డి-321, అబుల్ ఫజల్ ఎన్‌క్లేవ్, జామియా నగర్, ఓఖ్లా, న్యూఢిల్లీ – 110025

-----------------------------
మీడియా విభాగం
జమాఅతె ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్

ముస్లిం మహిళల విస్మృత చరిత్రను వెలికి తీయాలి – జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం సదస్సు పిలుపుఇండియన్ సొసైటీ నిర్మాణంలో ...
19/07/2025

ముస్లిం మహిళల విస్మృత చరిత్రను వెలికి తీయాలి – జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం సదస్సు పిలుపు

ఇండియన్ సొసైటీ నిర్మాణంలో ముస్లిం మహిళల పాత్రపై జాతీయ చరిత్ర వెబినార్

న్యూఢిల్లీ, జూలై 19, 2025: భారతదేశ నిర్మాణంలో ముస్లిం మహిళల నిరీక్షితమైన, పాఠ్యగ్రంథాల్లో ప్రస్తావించని కృషిని గుర్తించేందుకు జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ చరిత్ర వెబినార్ నిర్వహించింది. “ముస్లిం మహిళల భారత సమాజ నిర్మాణానికి చేసిన సేవలు” అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో విద్య, స్వాతంత్ర్య సమరం, సాహిత్యం, సామాజిక పునఃసంఘటన వంటి అనేక రంగాల్లో ముస్లిం మహిళల పాత్రపై లోతైన చర్చ జరిగింది.

ఈ సదస్సుకు నాయకత్వం వహించిన జాతీయ కార్యదర్శి రహ్మతున్నిస్సా గారు – చరిత్రను ‘His-story’గా కాకుండా ‘Her-story’గా పరిశీలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. “వాస్తవ చరిత్రను అధ్యయనం చేయకుండా, మతపరమైన చీలికలతో వక్రీకరించడం సమాజానికి ప్రమాదకరం” అని ఆమె స్పష్టం చేశారు.

ప్రధానోపన్యాసకురాలిగా పాల్గొన్న డా. సంగీత సక్సేనా, బిహార్, బెంగాల్ చరిత్ర ఆధారంగా అనేక ముస్లిం మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో ఎలా భాగమైనారో వివరించారు. డా. తుహినా ఇస్లాం, అలియా యూనివర్శిటీ, కోలకతా – వాహిద్ జహాన్ బేగం సేవలపై వివరించగా, మౌలిక విద్యలో మహిళల పాత్రను చాటిచెప్పారు.

ఈ కార్యక్రమం మహిళల మౌఖిక చరిత్రలు, పితృస్వామ్య వ్యవస్థ కారణంగా వెలుగు చూడని గొప్ప జీవితాలను పరిశోధనకు తీసుకురావాల్సిన అవసరాన్ని రేకెత్తించింది. NCERT పాఠ్యపుస్తకాల వక్రీకరణల నేపథ్యంలో, ముస్లింల చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఈ సదస్సు మళ్లీ గుర్తుచేసింది.

Address

Labbipet
Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when JIH AP Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share