Praja Saradhi

  • Home
  • Praja Saradhi

Praja Saradhi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Praja Saradhi, News & Media Website, .
(1)

28/04/2025

నిరంకుసత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు..!

- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మున్సిపల్ వైస్ చైర్మన్ గా మదార్ సాహెబ్..!

మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ను కౌన్సిల్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌన్సిల్ సమావేశహాలులో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మదార్ సాహెబ్ ను వైస్ చైర్మన్ గా బలపరుస్తూ.. 17 మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వ్యవహరించి, కౌన్సిలర్ల ఆమోదాన్ని ధ్రువీకరించారు. దీంతో మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ గా ఎన్నిక లాంఛనమైంది. అనంతరం జాయింట్ కలెక్టర్, గురజాల ఆర్డీవో మురళి ఆయనకు డిక్లరేషన్ ఫామ్ అందజేశారు. అనంతరం మదార్ సాహెబ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎక్స్అఫీసీయో మెంబర్ గా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి, మదార్ సాహెబ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

నిరంకుసత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు..!

వైసిపి ప్రభుత్వం హయాంలో మాచర్ల మున్సిపాలిటీలో నిరంకుసత్వం రాజ్యమేలిందని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన టిడిపి, బిజెపి, జనసేన నాయకులపై దాడులు, కేసులు పెట్టి మరి 31 వార్డుల్లో 31 మంది వైసిపి నాయకులను కౌన్సిలర్ గా ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 10 నెలల కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.., వైసిపి కౌన్సిలర్లు స్వచ్ఛందంగా వచ్చి టిడిపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. మాచర్ల మున్సిపాలిటీ సర్వతో ముఖాభివృద్ధి సాధించే దిశగా కౌన్సిల్ పనిచేయాలని సూచించారు. పట్టణం అభివృద్ధి చెందితే, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కచ్చితంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇచ్చిన మాటకు కట్టుపడి ఉంటారు..!

జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబల హయాం నుంచి జూలకంటి కుటుంబం ప్రజలకు కట్టుబడి ఉంటుందని వైస్ చైర్మన్ మదర్ సాహెబ్ పేర్కొన్నారు. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు వైస్ చైర్మన్ పదవీని కానుకగా ఇచ్చారని తెలిపారు. అనంతరం మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వైసిపి ఎమ్మెల్యే అత్యుత్సాహం
08/04/2025

వైసిపి ఎమ్మెల్యే అత్యుత్సాహం

With Manikyarao Nomula – I just made it onto their weekly engagement list by being one of their top engagers! 🎉
08/04/2025

With Manikyarao Nomula – I just made it onto their weekly engagement list by being one of their top engagers! 🎉

08/04/2025

పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్ : తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాం.. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయ...
05/04/2025

ఆంధ్రప్రదేశ్ : తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాం.. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయాలి.. సూపర్-6 హామీలు అమలు చేయాలి.. దేశంలో ఇంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. మరొకటి లేదు.. పేదరిక నిర్మూలన జరగాలి.. తలసరి ఆదాయం పెరగాలి: సీఎం చంద్రబాబు

రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ : వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో కోట్ల రూపా...
04/04/2025

రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా, కంపరంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రెడ్బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని సంధ్యారాణి పేర్కొన్నారు.

పరిటాల రవి హత్యలు జగన్ రెడ్డి పాత్ర!
03/04/2025

పరిటాల రవి హత్యలు జగన్ రెడ్డి పాత్ర!

అమరావతి, ఏప్రిల్ 2: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) కోసం పోలీసుల వ...
02/04/2025

అమరావతి, ఏప్రిల్ 2: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని (Hyderabad) కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు.

కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు అయ్యింది. ఇప్పటికే విచారణకు రావాలంటూ కాకాణికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ విచారణకు మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అక్రమమైనింగ్‌కు సంబంధించి రెండు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న (మంగళవారం) మాజీ మంత్రి విచారణకు రావాల్సి ఉంది. అయితే నిన్నటి విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ఏపీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

హైదరాబాద్‌లో కాకాణికి మూడు నివాసాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌లోని నివాసానికి నెల్లూరు జిల్లా కావలి సీఐతో పాటు మనుబోలు ఎస్‌ఐ, సిబ్బంది వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నెల్లూరు పోలీసులు కాకాణిని కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు చూడగా.. ఆయన ఒక దగ్గర ఉండి మరో చోటు చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాలుగా పోలీసులు ఆయన తప్పుదోపట్టిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈరోజు కాకాణి నివాసంలో ఓ ఫంక్షన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే కాకాణి ఉన్నట్లు భావించిన ఏపీ పోలీసులు.. అక్కడకు చేరుకున్నారు. అయితే కాకాణి అక్కడ లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమయానికి విచారణకు రావాలి అన్న అంశాలను అందులో స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కాకాణి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతుండగా.. పోలీసు రావడంతో ఫంక్షన్‌లో ఒక్కసారి కలవరం మొదలైంది.

పరారీలో ఉంటూనే అక్రమైనింగ్ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి. ఈ క్రమంలో విచారణకు పిలిచేందుకు పోలీసులు ప్రయత్నించగా.. తాను విచారణకు అందుబాటులోకి వస్తానని.. పోలీసులకు సహకరిస్తానని చెబుతూనూ పలుమార్లు విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు.

ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా కాకాణి ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికెళ్లి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఆయన ఓ చోట ఉండగా.. ఫోన్ సిగ్నల్స్ మరోచోట చూపిస్తున్నాయి. మొబైల్ సగ్నల్ ఆధారంగా వెళ్తున్న పోలీసులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో ఉన్నట్లు ఏపీ పోలీసులు గుర్తించి వెళ్లి చూడాగా.. అక్కడకు కూడా కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

నాని గుండె ఆపరేషన్ సక్సెస్
02/04/2025

నాని గుండె ఆపరేషన్ సక్సెస్

నిత్యానంద క్షేమమేనట! #నిత్యానంద       నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటనవివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపో...
02/04/2025

నిత్యానంద క్షేమమేనట!
#నిత్యానంద

నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం 'కైలాస' ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు.

దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా, నిత్యానంద 'కైలాస' సౌత్ అమెరికాలోని ఈక్వెడార్లో ఉంది.

భక్తులారా ఊపిరి పీల్చుకోండి అంటూ కైలాసం దేశం చల్లని కబురు చెప్పడంతో నిత్యానంద భక్తులు కూల్ అయ్యారు.

విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు వెలుగులోకి!       హైదరాబాద్ లో అత్యా చారానికి గురైన జర్మనీ యువతి కేసులోసంచలన విషయాలు...
02/04/2025

విదేశీ యువతిపై రేప్.. సంచలన విషయాలు వెలుగులోకి!


హైదరాబాద్ లో అత్యా చారానికి గురైన జర్మనీ యువతి కేసులో
సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

నగర శివార్లలో అందమైన లొకేషన్లు ఉంటాయంటూ ఆ యువతిని నమ్మించి పాతబస్తీకి చెందిన మహ్మద్ అస్లాం (25)పహాడీ షరీఫ్ తీసుకెళ్లాడు. ఆమెతో వచ్చిన ఫ్రెండ్ కి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అందుకే ఆ యువతిపై దారుణం జరుగుతున్నా సరైన స్పృహ లేకపోవడంతో అతను స్పందించలేదని సమాచారం. ఆ యువతి జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి విషయాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Praja Saradhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share