MYTV siddipet

  • Home
  • MYTV siddipet

MYTV siddipet MYTV_SIDDIPET-NEWS

వెల్కటూర్ గోకులాశ్రమం వ్యవస్థాపకులు,సద్గురువులు డా.వై.మధుసుదన్ రావు కన్నుమూత సిద్దిపేట అక్టోబర్ 30 : (మైటీవీ సిద్దిపేట ఎ...
30/10/2025

వెల్కటూర్ గోకులాశ్రమం వ్యవస్థాపకులు,సద్గురువులు
డా.వై.మధుసుదన్ రావు కన్నుమూత

సిద్దిపేట అక్టోబర్ 30 : (మైటీవీ సిద్దిపేట ఎడిటర్)

సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ లో ఉన్న గోకులఆశ్రమంవ్యవస్థాపకులు,సద్గురువులు మధుసూదనార్యులు(డా.వై మధుసుదన్ రావు)(78) కన్నుమూశారు.గురువారం ఉదయం 11:30 గంటలకు అయన శివైక్యం చెందారని ఆశ్రమ శిష్యులు తెలిపారు.హైదరాబాద్ కు చెందిన వై మధుసూదన్ రావు తన ధర్మపత్ని వై. సరళ దేవీ గారితో కలిసి అచల గురు సిద్ధాంతాలు పాటిస్తూ తన గురువైన సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధముపూర్ గ్రామానికి చెందిన సద్గురు చెంద్రయ్య శిష్యరికంలో దివ్య జీవన తత్వ ద్యాన యోగ క్రియలు నేర్చుకున్న తరువాత గురూమర్గంలో నడుస్తూ. గురువు గారి ఆశయం నెరవేర్చడానికి గ్రామీణలకు సేవలు,సంపూర్ణ ఆరోగ్యంతోపాటు, దివ్య జీవన తత్వ యోగము అందించేందుకు సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామంలో శ్రీ వశిష్ట పరంపర ఆద్యత్మిక ట్రస్ట్ ను స్థాపించారు.ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన గోకులాశ్రమంలో ప్రజలకు ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నారు.గోశాల నిర్వహిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు దాని గురించి అవగాహన పెంచుతున్నారు. ఆశ్రమానికి వచ్చే వారికే కాకుండా విద్యార్థులు,రోగులకు,వారి బంధువులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. రోగులకు ఉచితంగా హోమియో మందులు పంపిణి చేస్తున్నారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు అందజేస్తున్నారు. పలు దేవాలయల్లో ఆద్యత్మిక భక్తి కార్యక్రమాలు మగ్దూమ్ పూర్.వెల్కటూర్లలో స్వాగత కమాన్లు నిర్మించారు,వెల్కటూర్ లోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేశారు.ఆశ్రమంలో ప్రతినెలా పౌర్ణమకి గురుపూజా నిర్వహించడం, అచల గురు పరం పర బోధనలు నిర్వహించడం జరుగుతుంది. అటు మగ్దూమ్ పూర్ తనకు బోధ నేర్పిన గురువు చెంద్రయ్య గారి సమాధి వద్ద కు మందిరం నిర్మించి అక్కడ కూడా గురుపూజ చేస్తున్నారు. పూర్వశ్రమం లో సరళ దేవీ మధుసూదన్ రావు దంపతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసిన పదవి విరమణ తరువాత సిద్దిపేట జిల్లా కు విచ్చేసి వెల్కటూర్లోనే స్థిరపడి గ్రామీణ ప్రజలకి ఆశ్రమం ద్వారా సేవలు అందిస్తున్నారు. రామ్ లాల్ ప్రభు మహారాజ్, చెంద్రాయ్యార్యులు తరువాత సద్గురువు మధుసూదనార్యులు మాత సరళా దేవీ అచల గురు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు.ఎప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి అధిదంపతులు భక్తి, జ్ఞానం,యోగ, ధ్యాన, సేవా కార్యక్రమం అందిస్తున్న క్రమంలో గురువారం రోజున సద్గురువు డాక్టర్ మధుసూదన్ రావు (మధుసూదనార్యులు )శివైక్యం చెందారు..శుక్రవారం నాడు వెల్కటూర్ లో గురువుగారి అంతిమ కార్యక్రమం జరుగుతుంది.గురుదేవుల మరణ వార్త తెలిసి వివిధ ప్రాంతాలలో ఉన్న శిష్యులు వెల్కటూర్ గోకుల ఆశ్రమానికి తరలి వచ్చి కడసారి దర్శనం చేసుకుంటున్నారు..

మైటీవీ సిద్దిపేట భక్తి ఛానల్ నివాళి
గోకులఆశ్రమం వ్యవస్థాపకులు,సద్గురువులు మధుసూదనార్యులు(డా.వై మధుసుదన్ రావు) మృతి పట్ల మైటీవీ సిద్దిపేట యూట్యూబ్ భక్తి ఛానల్ సంతాపం తెలుపుతోంది.. గురువు గారు సిద్దిపేట జిల్లాకు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడీంది. గురువు గారితో ఉన్న ఆత్మీయ అనుబంధం గుర్తు చేసుకుని అంజలి ఘాటించారు.

హరిశన్న తండ్రి,తోటపల్లి వాసి,తన్నీరు సత్యనారాయణరావు గారి మృతి పట్ల సంతాపంసిద్దిపేట అక్టోబర్ 28(మైటీవీ సిద్దిపేట ఎడిటర్)మ...
29/10/2025

హరిశన్న తండ్రి,తోటపల్లి వాసి,తన్నీరు సత్యనారాయణరావు గారి మృతి పట్ల సంతాపం
సిద్దిపేట అక్టోబర్ 28(మైటీవీ సిద్దిపేట ఎడిటర్)
మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు (76) గారు మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు.హైదరాబాద్ లోని కోకాపేటలోని కుమారుడు తన్నీరు హరీష్ రావు స్వగృహంలోనే వృద్దప్య,అనారోగ్యరీత్య సత్యనారాయణ రావు మృతి చెందారు. సత్యనారాయణ రావు గారి మరణం పట్ల మైటీవీ సిద్దిపేట భక్తి న్యూస్ ఛానల్ సంతాపం తెలుపుతున్నది.. ఆయన మృతి అత్యంత బాధాకరం.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూన్నది.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంచి నేత (అన్న హరీష్ రావు) ను అందించిన సత్యనారాయణ రావు చిరస్మరణీయూడని కొనియాడుతున్నాం.మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుగారికి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తన్నీరు సత్యనారాయణ రావు గారు వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేసి సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయ్యారు.. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సోదరి,సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం చింతమడక గ్రామానికి చెందిన కల్వకుంట్ల లక్ష్మమమ్మ ను సత్యనారాయణ రావు వివాహం చేసుకున్నారు..వీరి కుమారుడే మాజీ మంత్రి,సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు..

గ్రామంలో చెన్న కేశవ స్వామి ఆలయం నిర్మాణం..

బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో శ్రీ చెన్న కేశవ స్వామి దేవాలయం సత్యనారాయణరావు కుటుంబం నిర్మించినట్లు గ్రామస్తులు తెలిపారు..

ఇట్లు :-
మద్దుల బుచ్చి రాజం రెడ్డి
మైటీవీ సిద్దిపేట భక్తి న్యూస్ ఛానల్
యూట్యూబ్ ఛానల్

మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు గారి మరణం అత్యంత బాధాకరం...
29/10/2025

మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు గారి మరణం అత్యంత బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ.. హరీష్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇట్లు :-
మైటీవీ సిద్దిపేట భక్తి..
యూట్యూబ్ ఛానల్

28/10/2025

#హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు.
భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి,ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతారు.తులసీదాస్ రచించిన రామచరితమానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవారు.వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి.ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు.సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు,తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా,విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు.జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది.చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను,బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా,శవయాత్ర సాగిపోతున్నది.స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది.శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది.ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి,జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి,తన కమండలంలోని జలాన్ని చల్లాడు.ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది.ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు.ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు.
విచారణ ఇలా సాగింది.
పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !
తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
అది అంత గొప్పది.
పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?
తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.ఇది సత్యం..
పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము.దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి.అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక,మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు.మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.
తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !
పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను.నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు.అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి.ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి,ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు.ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు.ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.
ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది.ఏమి కావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మచరితార్థమవుతుంది.నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా,వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు.అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.
అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ,గానం జరుగుతూనే ఉంది.ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.అప్పటినుండీ యిప్పటి వరకూ హనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై తీరుస్తూనే వున్నది. హనుమాన్ మాల వేసుకున్న వారు ప్రతినిత్యం రెండు సార్లు పూజ సమయం లో చాలిసా చదువుతారు..

#హనుమన్..నామస్మరణం...సర్వపాప నివారణం...

భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామికి అనాధి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. హనుమంతుడు సహవేనుడు.గొప్ప రామభక్తుడు. అతి శక్తి వంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచి పోయాడు.వీరత్వానికి ప్రతిక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీహనుమాన్‌ చాలీసాలో చెప్పాడు.

ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు.హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది.రావణ వథానంతరం అయోధ్యలో శ్రీసీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు.అప్పుడు హనుమ రామచంద్ర ప్రభూ,నాహృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి పోవాలని, అదేవిధంగా ప్రతిక్షణం రామనామస్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామా! నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంత కన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా! ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను..నాయీ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు.అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు.
సీతా మాతకూడ తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది.దేశంలోని ప్రతి పల్లెలో రామయణం ఉన్నట్లుగానే,ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది.హనుమ ఉన్న ఊరు నిత్యకల్యాణం పచ్చతోర ణంగా శోభిల్లుతుంది.తులసీదాసు రచించిన హనుమాన్‌ చాలీసాను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్ప కుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడతాడు. ప్రతి రోజూ హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు. భూతప్రేత పిశాచ బాధలు తొలగుతాయి.

ప్రతి ఇంట్లో తప్ప నిసరిగా హనుమ ఫొటోను పెట్టుకోవాలి.ఆ పటానికి నిత్యం పూజలు చెయ్యాలి. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రతి రోజూ హను మను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగు తుంది.చదువులలో,ఆట పాటల్లో గొప్పగా రాణిస్తారు.ప్రతి మంగళ వారం,ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి,అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యివేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరువేరుతాయి.
హనుమదాలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి.ప్రసన్నాంజ నేయుడు,వీరాంజనేయుడు,అభయాంజనేయుడు, పంచ ముఖాంజనేయుడు దాసాఆంజనేయుడు, వీరాంజనేయడు,రామాంజనేయుడు.. ఇలా..అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు.హనుమనును భక్తితో మనం స్మరిస్తే..బుద్ధి బలం,యశస్సు,ధైర్యం, నిర్భయత్వం మనలో పెరుగుతుంది.హనుమంతుడు మహాజ్ఞాని,దివ్యావ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్త్రోత్తాన్ని రచించి వారి వలన తత్త్వ జ్ఞానోపదేశం పొందాడు. ప్రతి ఒక్కరూ క్రమం తప్ప కుండా పదకొండు రోజులు గాని, ఇరవై ఒక్క రోజుగాని సుందరా కాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటాము.మానసిక పరమైన ఆనందం కలుగుతుంది.ఆంజనేయస్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళ లాడుతుంది.జై హనుమాన్ జై జై హనుమాన్...

28/10/2025

కార్తీక మాసం ప్రారంభమైంది.. దేవాలయాల్లో.. కార్తీకదీపం వెలిగించి తమ భక్తి ని మహిళా మణులు చాటుకుంటున్నారు.. సిద్దిపేటలోని అనేక దేవాలయాల్లో నిత్యము జరుగుతున్న కార్తిక దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమం ఇది.

27/10/2025

సిద్దిపేటలోని వినాయక నగర్ లో ఉన్న శ్రీ వరసిద్ధి హనుమాన్ దేవాలయ 13 వ వార్షికోత్సవ పూజలు ఘనంగా జరిగాయి..ఈ సందర్బంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు... పట్టణ నడి బొడ్డున హెడ్ పోస్టఫీస్ వెనుక పి ఆర్ ఆఫీస్ ముందు ఉన్న ఈవర సిద్ధి హనుమాన్ గుడి వద్దకు వచ్చే భక్తులు #తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్తామ హనుమాన్ యత్న మస్తాయా దుఃఖ క్షయ కరోబవ # అంటూ మహా మంత్రాన్ని జపిస్తూ 11 సార్లు ఆంజనేయుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడి ప్రజలు తెలిపారు.. అంతేకాకుండా ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ గద్దె పైన ఉంది... నిజరూపము, అలంకార రూపం చూసినవారికి అదృష్టం కలుగుతుందని తెలిపారు..

27/10/2025

చారిత్రక సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి వీధిలో శ్రీ చంద్రమౌళీశ్వర నవగ్రహ దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం రోడ్డు విస్తరణలో భాగంగా జీర్ణోద్ధరణ చేయబడింది. గౌరీభట్ల మెట్రామ శర్మ (మెట్టయ్య పంతులు) వారి కుమారులు, వారి మనుమలు ఈ ఆలయాన్ని వంశపారంపర్య అర్చకులుగా, నిర్వాహకులుగా విశేషమైన కార్యక్రమాలను చేపడుతూ పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తూ నిత్య దూప, దీప, నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.శని పీడలతో బాధపడేవారు,నవగ్రహ దోషాల నివారణకై ఇక్కడికి వచ్చి నిత్య పూజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. ఎంతో మహిమాన్వితమై,నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే దేవతలుగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయ విశేషాలను మైటీవీ సిద్దిపేట ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.

25/10/2025

చారిత్రక సిద్దిపేట లోని రాఘవేంద్ర నగర్ కాలనీ లో ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం 10 వ వార్షికోత్సవ పూజలు శుక్రవారం జరిగాయి..

Address


Alerts

Be the first to know and let us send you an email when MYTV siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share