AAB Media

AAB Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AAB Media, News & Media Website, .

21/12/2024

కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన డిగ్రీ విద్యార్థినికి మగబిడ్డ.. గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్
డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ యువతికి కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను కలిసింది. అయితే ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆ యువతికి పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియని ఆ యువతి.. ప్రాణాలు తీసుకునేందుకు విషం తాగగా.. ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. అసలు విషయం ఆరా తీయగా.. కెమిస్ట్రీ టీచర్ తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి వెల్లడించింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

21/12/2024

తెలంగాణలో బెనిఫిట్ షోస్ బ్యాన్

ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద బడ్జెట్‌తో తీసినా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం

దేశ స్వాతంత్ర్య పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలు తీసినా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

21/12/2024

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి

కార్యక్రమంతో ట్రాఫిక్ ఆంక్షలు
నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు
మాసబ్ ట్యాంక్, లక్డికాపుల్, నాంపల్లి ,రవీంద్ర భారతి, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్.
ట్రాఫిక్‌లో నిలిచిపోయిన అంబులెన్స్‌లు

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట  మండలం తిమ్మనాయుడు పాలెం లో కొనసాగుతున్న  ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ సమావేశం
21/12/2024

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట

మండలం తిమ్మనాయుడు పాలెం లో కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ సమావేశం

213 బస్తాల రేషన్ బియ్యం అక్రమ నిల్వను  గుర్తించిన పత్తిపాడు ఎస్‌ఐ:కె.నాగేంద్ర గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్ర...
21/12/2024

213 బస్తాల రేషన్ బియ్యం అక్రమ నిల్వను గుర్తించిన పత్తిపాడు ఎస్‌ఐ:కె.నాగేంద్ర



గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామం, ఎన్‌హెచ్-16 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న గోడౌన్‌కు మధ్యవర్తులతో కలిసి వెళ్లి వెతికారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన 213 బస్తాల నుంచి ప్రభుత్వం పీడీఎస్‌ను సరఫరా చేసినట్లు గుర్తించారు బియ్యం దాదాపు 9585 కిలోలు. నిందితుడు చీమకుర్తి జయప్రకాష్‌నారాయణ, గుంటూరు విద్యానగర్‌లోని ప్రభుత్వ సరఫరా చేసిన పిడిఎస్‌ బియ్యాన్ని సేకరించి గోడౌన్‌లో నిల్వ ఉంచినట్లు ఫిర్యాదుదారుడికి తెలిసింది. నిందితుడిని ప్రశ్నించగా ప్రజల నుంచి ప్రభుత్వం సరఫరా చేసిన పిడిఎస్ బియ్యాన్ని సేకరించి 213 బస్తాల్లో ప్యాకింగ్ చేసి పౌల్ట్రీ ఫారాలకు అక్రమ లాభం కోసం విక్రయించినట్లు స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఈ విధంగా ఫిర్యాదుదారు మధ్యవర్తిగా డ్రాఫ్ట్ చేయడం ద్వారా 9585 కిలోల బరువున్న మొత్తం 213 బస్తాల ప్రభుత్వం సరఫరా చేసిన పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నివేదిక అందిన మేరకు ప్రత్తిపాడు ఎస్‌ఐ కె.నాగేంద్ర ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శాసనసభ సమావేశాలు  విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా...
21/12/2024

శాసనసభ సమావేశాలు


విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి గారిని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు.

లేజిస్లేచర్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు గారు కూడా స్పీకర్ గారితో ఉన్నారు.

  NEWS_TV_TELUGUనెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డ...
21/12/2024

NEWS_TV_TELUGU

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వేలాదిమంది కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

21/12/2024

భారత్-శ్రీలంక సంబంధాలు మరింత బలపడతాయి!

ప్రచురణార్థం స్వచ్ఛ తిరుపతి స్మార్ట్ సిటీ పేరుతో అవార్డులు తీసుకోవడం కాదు-- డ్రైనేజీ సమస్యలేని  తిరుపతి గా అభివృద్ధి చేయ...
21/12/2024

ప్రచురణార్థం

స్వ
చ్ఛ తిరుపతి స్మార్ట్ సిటీ పేరుతో అవార్డులు తీసుకోవడం కాదు-- డ్రైనేజీ సమస్యలేని తిరుపతి గా అభివృద్ధి చేయండి. సిపిఎం డిమాండ్


తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు ఏరులై పారుతున్న డ్రైనేజీ నీళ్లు వెదజల్లుతున్న దుర్గంధం.

తిరుపతి నగరంలోని తిరుమల బై పాస్ రోడ్ లో కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు డ్రైనేజీ నీళ్లు ప్రధానమైన రోడ్డులో ప్రవహిస్తున్నది. దుర్గంధం వెదజల్లుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు శనివారం ఉదయం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం సిపిఎం నగర కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులో నిత్యం యాత్రికులు వచ్చి పోయేటటువంటి ప్రాంతం ప్రధానంగా కొర్లగుంట జంక్షన్ లో ఎక్కువమంది విద్యార్థులు మహిళలు ఆ దారినే నడుచుకుంటూ వెళుతుంటారు.

దాదాపు నెలరోజుల పైబడి అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ఏరులై పారుతుంటే దుర్గంధం వెదజల్లి స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారు ఆవేదన చెందుతుంటే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు.

స్మార్ట్ సిటీ స్వచ్ఛ తిరుపతి అని అవార్డులు తీసుకోవడం కాదు తిరుపతి నగరంలో డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి.

తిరుపతిలో ఎక్కడ చూసినా ఏ సందులో చూసినా ఏ వీధిలో చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతుంటుంది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు కల్లుండి చూడలేని స్థితిలో ఈ సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఉన్నారు.

ఈ దుర్గంధం వల్ల అక్కడ స్థానికులు అనారోగ్యాల ఫాలవుతున్నారని తక్షణమే ఆ చుట్టుపక్కల వైద్యాధికారులను పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాలని ఆ ప్రాంతం మొత్తం ప్రతిరోజు స్ప్రే చేయించడం పాకింగ్ చేపించాలని డిమాండ్ చేశారు.

వెంటనే మున్సిపల్ అధికారులు కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున స్థానికులందరినీ సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి పి చిన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భగత్ రవి సిపిఎం నగర కమిటీ సభ్యులు రాజు నాయకులు వాసు మురళి రాము బాల తదితరులు పాల్గొన్నారు.

నమస్కారములతో
*కే వేణుగోపాల్ సిపిఎం నగర కార్యదర్శి*

ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడింది  ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు...
21/12/2024

ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడింది

ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు

భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది

రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేది

భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి

భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయి, రాష్ట్ర సంపద పెరిగింది

మ్యాన్యువల్ పహాణీల వల్ల రాష్ట్రంలో అనేక వివాదాలు ఏర్పడేవి... ధరణి ఆ సమస్యను తీర్చింది

భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది

దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించింది

గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావు... ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి

తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి అయ్యారు

ధరణికి ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు

భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చాము

ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది... దీని వల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయి

పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే... ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదపవద్దు

మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది

రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి... తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది

రాష్ట్రమంతా ఒకే సారి కాకుండా... దశల వారీగా రీసర్వే చేపట్టాలి

ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాకా... భూధార్ కార్డు ఎందుకు ?

ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి

ఇప్పటికన్నా ప్రభుత్వం నిజాలు చెప్పాలి

ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వ

హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోంది

భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు

భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలి

కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి

21/12/2024

*నాయుడుపేట లోని రింగ్ రోడ్డుపై రాకపోకలు ప్రారంభం, నిన్నటి నుండి నాయుడుపేట నుండి తిరుపతికి రాకపోకలను కొనసాగిస్తున్న ప్రయాణికులు

21/12/2024

అదానీ నుంచి వంద కోట్లు తీసుకున్నందుకు, జాతీయ స్థాయిలో రాహుల్ అదానీని తిడుతున్న వీడియోలు చూపించి మరీ నీ పరువు తీసిన కేటీఆర్ గారి దెబ్బకి, నువ్వు తీసుకున్న వంద కోట్లు వెనక్కి ఇచ్చేసిన సంగతి మరిచావా చిట్టి నాయుడు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when AAB Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share