Navtej Tv Telugu

  • Home
  • Navtej Tv Telugu

Navtej Tv Telugu It is a part of National News Channel Navtej Tv, providing news items from all over the world.

22/04/2025

సనాతన ధర్మంపై దాడి

* ప్రతిఘటించిన స్థానికులు
* కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పక్కనే ఉన్న శివమ్మ కాలనీలోని శ్రీ రాములవారి ఆలయ పరిసర ప్రాంతంలోని గోశాల ను మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు రామాలయం నిర్మించుకున్న తర్వాత పక్కనే సుమారు రెండు వందల గజాల స్థలంలో గోశాలను ఏర్పాటు చేసుకుని గోవులకు సేవ చేసుకుంటున్నారు. శివమ్మ కాలనీ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో గోమాతకు సేవ చేసుకుంటుంటే జీర్ణించుకోని కొందరు అల్లరి మూకలు దేశ్ పాండే పేరు చెప్పుకుని ఆలయ ప్రాంగణంలోకి చొరబడి ఫెన్సింగ్ వేసే దిశగా సుమారు రెండు వందల గజాల భూమిలో సిమెంట్ సహాయంతో కొన్ని పైప్ లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రేకులతో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఖాజా, అతని అనుచరులు హెచ్చరించి వెళ్లినట్టు స్థానికులు మీడియా కు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆలయ కమిటీ చైర్మన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆలయ ప్రాంగణంలో చొరబడి, శ్రీరాములవారి గోశాల స్థలాలు ఖాజేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు. సదరు గోశాల భూములు కాపాడుకోవటం కొరకు ఎంతవరకైనా వెలుతామని కబ్జాదారులను హెచ్చరించారు. సిమెంట్ సహాయంతో చుట్టూ ఫెన్సింగ్ కొరకు పాతిన పైపులను కొన్నింటిని స్థానిక మహిళలు తొలగించారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ గోశాల భూముల రక్షణకు పాటుపడాలని స్థానిక ప్రజలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ రాంచందర్ యాదవ్, బీజేపీ నాయకులు కృష్ణ, జక్కుల అంజి, పుట్ట మోహన్, సురేష్, నడిపి ఆంజనేయులు, అమర లక్ష్మమ్మ, కె. కుమారి, పద్మ, రాణమ్మ, ఏ. కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

ఆయనకు సంబంధం లేకపోతే... కబ్జాల భాగోతం అవాస్తవమైతే...లైట్ తీసుకోండి... కానీ, కబ్జాదారులెవరో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ...
02/04/2025

ఆయనకు సంబంధం లేకపోతే... కబ్జాల భాగోతం అవాస్తవమైతే...లైట్ తీసుకోండి... కానీ, కబ్జాదారులెవరో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉన్నది.

01/04/2025

అలవిగాని 420 హామీలిచ్చి వాటిని అమలు చేయలేక, గ్యారెంటీలను ఎగ్గొట్టడానికి అప్పులు అంటూ సాకులు వెతుకుతున్నారు.

ఆరు గ్యారెంటీల అమలు తెలియదు, 420 హామీల గురించి గుర్తులేదు, డిక్లరేషన్లను మర్చిపోయినం అంటూ కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా ఒకటే సమాధానం వస్తుంది.

- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్

01/04/2025

అటు శాసనసభలో, ఇటు శాసన మండలిలో స్పష్టమైన వ్యూహం, సరైన ప్రిపరేషన్‌, విభిన్న ఎత్తుగడలతో కాంగ్రెస్ సర్కార్ కు చుక్కలు చూపించిన కేసీఆర్ సైన్యం.

01/04/2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్లో పెండింగ్ టాక్స్ కలెక్షన్ లో నిమగ్నమైన స్థానిక జిహెచ్ఎంసి అధికారులు. టాక్సిన్ కట్టని షెటర్లకు తాళం వేసిన వైనం.
Note: Seized shutters without service any prior notice.

01/04/2025

అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్

అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు.

మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి.

మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి.

ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలన్నారు.

ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్ కు సూచన.

అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్.

అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.

01/04/2025
01/04/2025

హుజుర్ నగర్ సభలో రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి

జగదీష్ రెడ్డి కామెంట్స్ 👇

♦️రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు.

♦️సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు.

♦️ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది.

♦️అదే భాష అవే పదాలు.. ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా, మూర్ఖత్వం మారడం లేదు

♦️పచ్చి అబద్ధాలు.. అవే అర్థం లేని ఆరోపణలు.

♦️15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదు.

♦️సోనియా 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదు.

♦️కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదు.

♦️మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నరు.

♦️కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్ కు శాపనార్ధాలు పెడుతుండ్రు.

♦️ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారు.

♦️బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదు.

♦️ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడా సమాధానం లేదు.. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అధికారులు ఎత్తడమే లేదు.

♦️వానా కాలంలో ఏ పంట ఎంత కొన్నారు.. దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటమార్చి సన్నధాన్యానికి బోనస్ అన్నారు.

♦️ఎంత ధాన్యం కొన్నారు? ఎంత బోనస్ ఇచ్చారు? అంటే సమాధానం లేదు..

♦️నిన్న హుజూర్ నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని ప్రదర్శించిండు.

♦️మళ్ళీ కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే పని లేదు.

♦️మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదు.

♦️ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటారని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడకుండా ఎండగడుతున్నారు.

♦️రేవంత్ రెడ్డి ఉరివేస్తా అంటే.. ప్రజలే నీకు ఉరివేసే రోజులు దగ్గరపడ్డాయి.

♦️నీ గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు.. కేసీఆర్ గురించి మాట్లాడనిదే నీకు పూట గడవదు.

♦️పక్క దేశాలు చూడు.. ప్రజలు తిరుగబడితే ఎలా కూలిపోయాయో తెలుస్తుంది.

♦️పద్ధతి భాష మార్చుకోవాలి.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

♦️గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలి.

♦️రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు.. అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదు.

♦️నీళ్లు ఇవ్వమంటే రైతుల పొలాలు వేసుకోరు.. నేడు నీళ్ళు ఇస్తామని ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారు.

♦️ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుంది.. చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలి.

♦️ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలి.

♦️కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 9000 లక్షల క్యూసెక్కుల నీరును పారించాము.

♦️కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.. అయినా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదు..

♦️NDSA ఒక సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు.

♦️చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదు.

♦️రైతులు మేలుకోవాలి.. కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలి.

01/04/2025

రేవంత్ రాక్షస రాజ్యంలో రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ, 400 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్టర్లకు కట్టబెట్టేందుకు, విద్యార్థులు అందరి నోర్లలో మట్టి కొట్టేవిధంగా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.

రోహిత్ వేముల స్పూర్తితో ఆ భూములను కాపాడుకోవడానికి విద్యార్థులు నిరసన తెలిపితే వారి పైన అత్యంత దుర్మార్గంగా దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, డా. దాసోజు శ్రవణ్

31/03/2025

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం సర్వే నంబర్ 342 లోని ప్రభుత్వ భూముల్లో పాగావేసిన భూకబ్జాదారులు. పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేస్తూ కెమెరాకు చిక్కిన వైనం. ఈ కబ్జాదారులపై పీడియాక్ట్ పెట్టి జైలుకు పంపుతారా... తమకేమీ పట్టదు అన్నట్టు వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటారా...? మేడ్చల్ జిల్లా కలెక్టర్ kindly respond. 🥲🥲

29/03/2025

ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా షట్టర్ లకు తాలాలు వేశారు.

06/07/2024
పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?పార్టీయే నాయకులను తయారు చేస్తది తప...
01/07/2024

పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?

పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు

నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది

రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం : కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

కాగా.. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై చర్చించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి,. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కె. వాసుదేవ రెడ్డి గురుకులాల ఉద్యోగ నియామకాల్లో ...
01/07/2024

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కె. వాసుదేవ రెడ్డి

గురుకులాల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి

స్పెషల్ కేటగిరీలో గందరగోళం జరిగింది

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9,210 పోస్టులతో గురుకులాల నోటిఫికేషన్ వచ్చింది

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిజల్ట్స్ ఇచ్చి నియామకాల పేరుతో హడావిడి చేశారు

వికలాంగుల కోటా కింద కొంతమందిని అపాయింట్మెంట్ చేశారు

ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వెళ్తే మిమ్మల్ని రిజెక్ట్ చేశామని అధికారులు చెప్తున్నారు

స్పెషల్ కేటగిరి, డిసేబుల్డ్ కేటగిరి కింద జాబ్ ఇచ్చే వారికి ముందుగానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి.

కానీ రేవంత్ రెడ్డి హడావిడిగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు.

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటే భాద్యులు ఎవరు

గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది

ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వలేదు

వికలాంగుల కోటాలో రిజెక్ట్ చేసిన ఉద్యోగాలను వెంటనే వారికి పోస్టింగ్స్ ఇవ్వాలి

లేకపోతే స్పెషల్ కేటగిరి అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయిస్తారు

మెగా డీఎస్సిలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారు

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది...?

హైదరాబాద్ నుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నారు

వారం రోజుల పాటు సీఎం,ఏడుగురు మంత్రులు ఢిల్లీలో వున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి

గాంధీ హాస్పిటల్ లో నిరుద్యోగులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్🔹రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్...
01/07/2024

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్

🔹రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడానికి కారణం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది

🔹ఫాక్స్‌కాన్ సంస్థను తెలంగాణకు తీసుకువచ్చింది కేటీఆర్.. దీన్ని కాంగ్రెస్ ఘనతగా గొప్పలు చేసుకుంటున్నారు

🔹సీతారామ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం

🔹కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

🔹దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది

🔹బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు

🔹కంటోన్మెంట్ భూముల విషయంలో స్పెషల్ మీటింగ్‌కు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా హాజరు కాలేదు

🔹రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు

🔹పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్

🔹రాహుల్ గాంధీ అశోక్ నగర్ వద్దకు వచ్చి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు

🔹కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది.. కాంగ్రెస్ మెగా డీఎస్సీ ఏమైంది

🔹మోతీలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

🔹గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది

🔹కాంగ్రెస్ గ్యారెంటీలు వెనక్కి వెళ్లి స్కాంలు ముందుకు వచ్చాయి

🔹రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు.

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ  పెంచొద్దు* ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతికుత్బుల్లాపూర్ నియోజకవర్...
01/07/2024

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు

* ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామల గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ శివారు గ్రామ ప్రజలతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిహెచ్ఎంసి పరిధిలోగల వందలాది గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని, అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామలు కూడా సరియైన అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడ నివసిస్తున్న వారియొక్క మరణించిన తాతలు, తండ్రుల పేరున ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు తమ పేరున రిజిస్ట్రేషన్ కాకపోవడం మూలన ఇప్పటివరకు మరణించినవారిపేరుమీదనే పన్నులు చెల్లిస్తున్నామన్నారు. తాము ఇక్కడి స్థలాలలో నిర్మాణాలు చేపట్టేందుకు జిహెచ్ఎంసి,పురపాలక సంఘాలు మరియు కార్పోరేషన్లు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడి రెవెన్యూ అధికారులు గ్రామ కంఠ ధ్రువీకరణ పత్రాలుగానీ, కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు కానీ ఇవ్వడం లేదని అన్నారు. ఇక్కడి ఇండ్లు ఇండ్ల స్థలాలకు బ్యాంకువారు రుణాలు ఇవ్వడంలేదని,రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తాము ఇండ్లు నిర్మించుకునేందుకు అధిక వడ్డీతో ప్రైవేటు అప్పులు తీసుకొని,లేదా ఉన్న నాలుగైదు గుంటల భూమిని అమ్ముకొని ఇండ్లు నిర్మించుకుంటే జిహెచ్ఎంసి వారు 100% ఇంటి పన్ను అధికంగా వేస్తున్నారని వాపోయ్యారు. కాబట్టి ఇక్కడి ఇండ్లు,ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని కోరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి శివారు గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోల రవీందర్ ముదిరాజ్ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, బుచ్చిరెడ్డి,, సంబంధిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

09/04/2024

కుత్బుల్లాపూర్ ల్యాండ్ గ్రాబ్బర్ లపై మైనంపల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల తర్వాత రాజకీయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భూకబ్జాదారులపై పంజా విసురుతుంది. ఇదే విషయమై బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన కొందరు భూకబ్జాదారులపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒక రేంజ్ లో మండిపడ్డారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని చిత్తూగా ఓడించిన కొందరు ల్యాండ్ గ్రాబ్బర్ లు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అయిన 85,500 మెజారిటీ ఓట్లతో తమ సత్తా చాటుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కుత్బుల్లాపూర్ లో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఇంతగా కాంగ్రెస్ పార్టీ ని కుత్బుల్లాపూర్ లో అధపాతాలానికి తొక్కిన భూకబ్జాదారులు కొందరిపై రౌడీ షీట్ లు ఓపెన్ కావటంతో తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికి కొందరు మధ్యవర్థుల సహాయంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న కొందరు భూకబ్జాదారులపై స్థానికులు కొందరు మైనంపల్లి హన్మంత రావుకు ఫిర్యాదు చేయగా ఘాటుగా స్పందించిన మైనంపల్లి హన్మంత్ రావు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలోనే ఓ భూకబ్జాదారుడికి ఫోన్ చేసి ఘాటుగా హెచ్చరించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నువ్వు పార్టీ మారగానే ఏం మారిపోదు.. నీపై వందకు పైగా స్థానికులు ఫిర్యాదులు చేశారు. తమాషాలు చేస్తే... నేనే లోపలేపిస్తా... ఇమ్మిడియేట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫోటోలు డిలీట్ చెయ్ అంటూ ‘గాలిపోచమ్మ బస్తీ ఫౌండర్, గాలిపోచమ్మ ఆలయకమిటీ చైర్మన్’ బానా నర్సింహా అలియాస్ బోదాస్ నర్సింహా... అతని సోదరుడు డాన్ శీను లను హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేచి చూడాలి, భూకబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా దండుకున్న ‘రౌడీ బ్రదర్స్’ పై చర్యలు ఎలా ఉండబోతున్నాయో... అంటూ స్థానిక ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

- బ్యూరో రిపోర్ట్, నవతేజ్ టీవీ, తెలంగాణ స్టేట్.

Address


Alerts

Be the first to know and let us send you an email when Navtej Tv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navtej Tv Telugu:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share