
20/05/2025
20.05.2025
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను కలిసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ
గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలిచి, మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోళ్ళు చేసేవారని, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్ జగన్కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో రైతులు ఎకరాకు 55-60 బస్తాల ధాన్యం పండించారని, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళు నిలిపివేయడంతో రైతులంతా ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయిన సత్యనారాయణ. అంతేకాక ప్రభుత్వం కొనుగోళ్ళు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్ళాల్లోనే ధాన్యం తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు.
అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్
వైయస్ జగన్ హామీతో సంతోషంగా తను పండించిన వరి కంకులను బహుకరించిన రైతు సత్యనారాయణ
ఈ సందర్భంగా వైయస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్.