CR NEWS

CR NEWS CR NEWS
CHEIF EDITOR: K.Raja ranga,M.Pharmacy
Contact :8919234472..

రైల్వే స్టేషన్ లో తనిఖీలు (03.07.2025)కర్నూల్ జిల్లా...కర్నూలు రైల్వే స్టేషన్ , రైళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు....ఎవరైనా నిషే...
04/07/2025

రైల్వే స్టేషన్ లో తనిఖీలు (03.07.2025)

కర్నూల్ జిల్లా...

కర్నూలు రైల్వే స్టేషన్ , రైళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు....

ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.... అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ఐజి శ్రీ ఆకే రవి కృష్ణ ఐపియస్ ఉత్తర్వుల మేరకు కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారులు కర్నూలు పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా కర్నూలు రైల్వేస్టేషన్ లో మీడియాతో మాట్లాడారు.

కర్నూలు పోలీసులు , ఈగల్ టీo , స్పెషల్ పార్టీ పోలీసులు , డాగ్స్ స్క్వాడ్ బృందాలు, రైల్వే ఆర్‌పీఎఫ్ , జి ఆర్ పి పోలీసులు సంయుక్తంగా గంజాయి, మత్తు పదార్ధాల నిర్మూలనకు కర్నూలు రైల్వేస్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు.

కర్ణాటక రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం కు కర్నూలు మీదుగా వెళ్లే యశ్వంతపూర్ To యోగి నగరి రిషికేష్ రైలు లో ( ట్రైన్ నెంబర్ 06597 ) జనరల్ బోగి నుండి ఎసి బోగిలను అన్నింటిని తనిఖీలు చేయడం జరిగిందన్నారు.
ఎలాంటివి లభ్యం కాలేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా కు ఒక ట్రైన్ ను కేటాయించి తనిఖీలు చేయాలని ఆదేశాలున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి, మత్త పదార్దాల నిర్మూలనకు , అక్రమరవాణాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశారని, ఈ నెంబర్‌కు సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

అనంతరం కర్నూల్ రైల్వే స్టేషన్ లోని పార్సిల్ కార్యాలయంలో డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజారావు, అబ్దుల్ గౌస్, గుణశేఖర్ బాబు, కర్నూలు టు టౌన్ ఎస్సై సతీష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం ,కర్నూల్.

ఆదోని పట్టణంలోని 1st వార్డులో రెండవ రోజు *సుపరిపాలన తొలి అడుగు* *విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు న‌డిపిస్తున్నాం*-  ...
03/07/2025

ఆదోని పట్టణంలోని 1st వార్డులో రెండవ రోజు *సుపరిపాలన తొలి అడుగు*

*విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు న‌డిపిస్తున్నాం*-
*మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు*
*అభివృద్ధే ల‌క్ష్యంగా కూట‌మి పార్టీల ముంద‌డుగు*
రాష్ట్రంలో అభివృద్ధే ల‌క్ష్యంగా మూడు కూట‌మి పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నామ‌ని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు. ఇప్ప‌టికే రాబోవు నాలుగేళ్ళ‌లో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దానిపై ప‌క్కా ప్ర‌ణాళిక ఉంద‌న్నారు. ప్రజలు కూట‌మి పార్టీపై పెట్టుకున్న ఆకాంక్షలను మనం కాపాడుకోవాలని కూట‌మి నాయ‌కుల‌కు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం మన బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. సంక్షేమం అంటే ఏంటో చూపించిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేస్తున్నామ‌ని, ఐటీ రంగంలో నూత‌న ఓర‌వ‌డికి శ్రీకారం చుట్ట‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పడం కూడా చాలా ముఖ్యమ‌ని, రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకుంటు, 2014-19 సంవ‌త్స‌ర స‌మ‌యంలో మంచి పరిపాలన అందించామ‌ని తెలిపారు.
👉 *ఏపీ సీఎం కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ*
*రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం*
2024 ఎన్నిక‌ల్లో ప్రజలు సరైన సమయంలో... సరైన నిర్ణయం తీసుకుని కూట‌మి ప్ర‌భుత్వానికి అధికారం వ‌చ్చేలా చేసార‌ని అన్నారు. దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని స‌రైన మార్గంలో న‌డిపిస్తూ, పున‌ర్నిర్మాణ‌మే ల‌క్ష్యంగా అడుగులు
ప్ర‌స్తుతం సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదని, ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాలని గత వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏ మీ చేయలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పార్వతి ,కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, రామస్వామి యువ నాయకులు భూపాల్, చౌదరి మారుతి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి ,వాల్మీకి వెంకటేష్ ,వాల్మీకి బాబుల్ నాయుడు,శ్రీరాములు,గోపాల్ రెడ్డి,ఫకృద్దీన్ అయ్యన్న,మారుతి రావు,మరియు
తెలుగుదేశం పార్టీ బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు

03/07/2025

Rainfall report on 03.07.2025 of Adoni Division.
1.Kowthalam : 44.6 mm
2.Peddakadabur : 43.6 mm
3.Yemmiganur : 38.6 mm
4.Gonegandla : 25.6 mm
5.Adoni : 21.6 mm
6.Nandavaram : 18.2 mm
7.Mantralayam : 13.6 mm
8.Kosigi : 12.6 mm
9.Holagunda: 9.4 mm
Total rainfall : 227.8 mm
Average rainfall : 25.3 mm
Dy.S.O.Adoni

03/07/2025

పోటేత్తిన భక్త సంద్రోహం..
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కర్నూలు జిల్లా..

02/07/2025

కొనసాగుతున్న అభివృద్ధి పనులు.. #ఆదోని
🕉️ శ్రీ కోట చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం🕉️
🌺కర్నూలు జిల్లా,🕉️ ఓం నమశ్శివాయ🕉️

*ఆదోని/జూలై:-02*నూతన సబ్ రిజిస్టర్ గా సునంద...     *ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వారి ఛాంబర్ నందు  ఆదోని సబ్ కలెక్టర్ మౌ...
02/07/2025

*ఆదోని/జూలై:-02*
నూతన సబ్ రిజిస్టర్ గా సునంద...
*ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వారి ఛాంబర్ నందు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలసిన ఆదోని సబ్ రిజిస్టర్ సునంద..

తుంగభద్ర జలాశయం కొనసాగుతున్న వరద..పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు..ప్రస్తుతం నీటి మట్టం:1625.20 అడుగులుఇన్ ఫ్లో 29...
02/07/2025

తుంగభద్ర జలాశయం కొనసాగుతున్న వరద..

పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు..

ప్రస్తుతం నీటి మట్టం:1625.20 అడుగులు

ఇన్ ఫ్లో 29.645 క్యూసెక్కులు..

అవుట్ ఫ్లో 1701 క్యూ సెక్కులు..

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు..

ప్రస్తుతం నీటి నిల్వ 77.144 టీఎంసీలు.

కర్నూలు జిల్లా SP  ఆదేశాల మేరకు, ఆదోని DSP పర్యవేక్షణలో ఆదోని 1 టౌన్ CI K.శ్రీరాం  మరియు సిబ్బంది, 01.07.2025 వ తేదీన ఆద...
02/07/2025

కర్నూలు జిల్లా SP ఆదేశాల మేరకు, ఆదోని DSP పర్యవేక్షణలో ఆదోని 1 టౌన్ CI K.శ్రీరాం మరియు సిబ్బంది, 01.07.2025 వ తేదీన ఆదోని 1 టౌన్ పరిధిలో special Drive నిర్వహించి 39 మంది మీద 28 Open Drinking కేసులు మరియు 11 Drunk & Drive కేసులు నమోదు చేయడమైనది. వీరిని రేపు ఉదయము కోర్టులో హాజరు పరచడము జరుగుతుంది. K. Sree Ram, Inspector of Police, Adoni I Town PS.

బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షులును కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కునిగిరి నీలకంఠ ఈరోజు విజయవాడలో ఎస్వీ కన్వెన్షన్ హాల్ నంద...
01/07/2025

బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షులును కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కునిగిరి నీలకంఠ

ఈరోజు విజయవాడలో ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక వేడుకల్లో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, వారు మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ అధ్యక్షతన రాష్ట్రంలో బిజెపి పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోటోలు కనిపిస్తున్న వ్యక్తి పేరు వీరేష్ ఈ పిల్లవాడు గత 31 సంవత్సరాలు క్రితం ఆదోని నుండి తప్పిపోవడం జరిగినది ఈయన చిన్నప్ప...
30/06/2025

ఫోటోలు కనిపిస్తున్న వ్యక్తి పేరు వీరేష్ ఈ పిల్లవాడు గత 31 సంవత్సరాలు క్రితం ఆదోని నుండి తప్పిపోవడం జరిగినది ఈయన చిన్నప్పుడు మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా నుండి తప్పిపోవడం జరిగినది ప్రస్తుతం వీళ్ళు తండ్రి పేరు జనార్ధన్ వీళ్ళ నాన్నమ్మ గారి పేరు అంజనమ్మ ఈ పిల్లవాడు తల్లిదండ్రులు ఆచూకీ కోసం మన సబ్ కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగినది కావున ఈ పిల్లవాడి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన ఫోన్ నెంబర్ 9004178396 కు సమాచారం ఇవ్వగలరని కమిషనర్ తెలుపడమైనది..

*ఆదోని/జూన్ 30:-**సోమవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో  "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్...
30/06/2025

*ఆదోని/జూన్ 30:-*
*సోమవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ *

*ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ బాలకృష్ణారెడ్డి, డిఎల్పిఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, ఆదోని డివిజన్ వ్యవసాయశాఖ అధికారులు బాల వర్ధి రాజు,ఆర్టీవో పరిపాలన అధికారి రమాదేవి, ఉప తహశీల్దారు బాబు, పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్దారు రుద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

Address

Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when CR NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share