29/11/2025
ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో "రైతన్న మీ కోసం – రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్చార్జ్, గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నగారు,ఆధ్వర్యంలో రైతన్న మీకోసం - ముఖ్యఅతిథిగా కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు తిక్క రెడ్డి గారు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించి పరిష్కారంలో భాగస్వాములు కావాలని సూచించారు.అలాగే వ్యవసాయ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, రైతులకు అవసరమైన పరికరాలు, సహాయాలు సమయానుసారంగా అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, ఎల్ ఎల్ సి టీవీ చైర్మన్ రామస్వామి, జై శంకర్, రంగన్న, ఆదోని టౌన్ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, బసవరాజు, నాగరాజు, రమేష్, ధన సింగ్, రాముడు, సదేష్, భగవాన్ సింగ్, హనుమాన్ సింగ్, వీరసింగ్, లక్ష్మన్న, బాలు, రాజబాబు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.