9TV news Adoni AP

9TV news Adoni AP Get the lates news updates cover in Adoni Town

https://youtu.be/7KdC9t1yRHc?si=7BcT0xRubZM2bzBJ
10/10/2025

https://youtu.be/7KdC9t1yRHc?si=7BcT0xRubZM2bzBJ

ఆదోని మైనారిటీ కాలనీలో నివసిస్తున్న మహబూబ్ బాషా గారు గత 6 నెలలుగా లివర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయన వ....

10/10/2025
10/10/2025

ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేల్స్ టాక్స్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “జీఎస్టీ 2.0 ద్వారా ప్రభుత్వాలు పన్ను స్లాబులు తగ్గించడం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా మధ్య తరగతి మరియు చిరు వ్యాపారులకు ఊరట కల్పించాయి,” అన్నారు.

10/10/2025

ఆదోని:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకుడు చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలు సేకరిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి చాటారు.

ఆదోని భారీగా కర్ణాటక మద్యం పట్టివేతఇద్దరు అరెస్ట్.. 2ద్విచక్ర వాహనాలు సీజ్కర్ణాటక మద్యం అక్రమ రవాణా పై ఎక్సైజ్ పోలీసులు ...
10/10/2025

ఆదోని భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

ఇద్దరు అరెస్ట్.. 2ద్విచక్ర వాహనాలు సీజ్

కర్ణాటక మద్యం అక్రమ రవాణా పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. కౌతాళం పరిధిలోని బుడుమలదొడ్డి క్రాస్ వద్ద కౌతాళం మూకయ్య, చిరుతపల్లి వీరేష్ రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 12 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకుని రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు సిఐ కె సైదులు తెలిపారు. మరో వ్యక్తి తలారి ఉసేని పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేసిన అమ్మకాలు చేసిన నేరమన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

10/10/2025

కాలువలు లేకుండా రోడ్లు వేపిస్తే మల్ల పాడైపోయే అవకాశం

10/10/2025

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న ఆదోని ట్రాఫిక్ పోలీసులు

ఆదోని ట్రాఫిక్ సీఐ అబ్దుల్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెళ్తున్న మరియు వస్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లపై మద్యం సేవించి వాహనం నడుపుతున్నారో లేదో పరీక్షించారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఘటనలు జరగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని తెలిపారు.

https://youtu.be/1qXWhy00Hhk
09/10/2025

https://youtu.be/1qXWhy00Hhk

ఆదోని ట్రాఫిక్ సీఐ అబ్దుల్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద డ్రంక్ అం....

https://youtu.be/avsjkoWEGm0
09/10/2025

https://youtu.be/avsjkoWEGm0

మార్కెట్ యార్డ్ బసాపురం రోడ్డు.కాలువలు లేకుండా రోడ్లు వేపిస్తే మల్ల పాడైపోయే అవకాశం. పెద్ద హరిరాణం గోవర్ధన్ రె...

సీఎం రిలీఫ్ ఫండ్ దిక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారధి గారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రజలకు వరం లాంటిది కాబట్టి ...
09/10/2025

సీఎం రిలీఫ్ ఫండ్ దిక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారధి గారు.

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రజలకు వరం లాంటిది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి గారు అన్నారు.
గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 30 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 1776921 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నటువంటివారు ఆ బిల్లులను జాగ్రత్త వహించి నేరుగా నాకు ఇస్తే వాటిని సీఎం కార్యాలయానికి పంపించి ఖర్చుపెట్టిన డబ్బులు 40% నుంచి 60% వరకు వచ్చే విధంగా చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ గారు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయ్ కృష్ణ గారు, డైరెక్టర్లు రత్న బాయ్ గారు,రామకృష్ణ గారు, శ్రీనివాస్ ఆచారి గారు, పట్టణ అధ్యక్షులు తోవి నాగార్జున గారు, రూరల్ అధ్యక్షులు ఉషా రాజుగారు, యువ మోర్చా మండల అధ్యక్షులు రవిశంకర్ గారు, ఎం కాసిం పీరా బి.జె.పి. పెద్దతుంబళం మండల మైనారిటీ అధ్యక్షుడు నరసింహ గారు, మండల కార్యదర్శిలు బాలముని శేఖర్, కోసిగయ్య తదితరులు పాల్గొన్నారు

09/10/2025

ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కొత్త అధ్యక్షులు సయ్యద్ బాషా గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా అధ్యక్షులు జమాల్ సిద్ధిఖీ గారు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు, అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

కార్యక్రమం విజయవంతంగా సాగి, మైనారిటీ మోర్చా భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు.

Address

Adoni

Alerts

Be the first to know and let us send you an email when 9TV news Adoni AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share