17/10/2025
గత వైసీపీ ప్రభుత్వం లో వీరారెడ్డి, రాజారెడ్డి, మహేష్ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ పేరుతో సంస్థను ప్రారంభించి ఉద్యోగాల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి మోసాన్ని ప్రభుత్వం బయటికి తీసింది వారికోసం పోలీస్ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తన పేరు బయటికి రాకుండా మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేస్తూ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పొంతన లేని ఆరోపణలు చేస్తున్నారు. మోసం చేసిన వారిని పట్టుకుంటాం పాత్రధారులు సూత్రధారులు అందరికీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం.