Political Hot Potatoes

Political Hot Potatoes Projects and works (Product / service – media – entertainment ) that matter for people

If you like to publish your news and stories, video's, photo's please email us at [email protected] or send whatsapp at 9440662699
We will publish them on our website at http://www.rajadhanivartalu.com
also on this POLITICAL HOT POTATOES page

రాజధాని అమరావతిలో విజయవంతంగా ముగిసిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటనప్రజారాజధాని అమరావతిలో 3 రోజుల...
09/04/2026

రాజధాని అమరావతిలో విజయవంతంగా ముగిసిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన

ప్రజారాజధాని అమరావతిలో 3 రోజులపాటు జరిగిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన బుధవారంతో విజయవంతంగా ముగిసింది. ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ మిషన్‌లో భాగంగా రాజధాని నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు పర్యటిస్తున్న WB & ADB బృందం.. తమ పర్యటన ప్రణాళికలలో భాగంగా బుధవారం రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో పలు సెషన్లు నిర్వహించింది. పలు సెషన్లలో CRDA అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS గారు పాల్గొని, రాజధాని అమరావతి నిర్మాణ పనులు పురోగతి తదితర అంశాల గురించి WB & ADB బృందానికి వివరించారు.

ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, రాజధాని ప్రాంతంలో విపత్తులు సంభవించకుండా, ప్రమాదాలు జరగకుండా అమలు కావాల్సిన పటిష్ట ప్రణాళికల అమలు, రాజధాని అమరావతిలో అందరికీ అందుబాటులో హౌసింగ్ సముదాయాల కల్పన, రహదారుల నిర్వహణ, నీటి వనరులు, వ్యర్ధ జలాల నిర్వహణ, సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ప్రణాళికలు, రాజధాని అమరావతిలో అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యకమాల నిర్వహణ, ఆయా కార్యక్రమాలలో కమ్యూనికేషన్స్ విభాగం యొక్క పాత్ర తదితర అంశాలపై WB & ADB బృందం చర్చలు నిర్వహించి APCRDA అధికారులకు పలు సూచనలు చేసింది. ఆయా సెషన్లలో PgMC సిబ్బంది, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, PMC సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

World Bank & Asian Development Bank Team Visit to Amaravati Concludes SuccessfullyThe three-day visit of the joint team ...
09/04/2026

World Bank & Asian Development Bank Team Visit to Amaravati Concludes Successfully

The three-day visit of the joint team from the World Bank (WB) and the Asian Development Bank (ADB) to the People’s Capital, Amaravati, concluded successfully on Wednesday.

As part of the WB–ADB Joint Mission, the team visited Amaravati to review the progress of capital city development works. On Wednesday, as part of their scheduled itinerary, multiple sessions were conducted at the APCRDA Headquarters in Rayapudi.

During these sessions, APCRDA Additional Commissioner Sri A. Bhargava Teja, I.A.S., participated and presented detailed updates to the WB and ADB team on the progress of Amaravati capital city development works and related initiatives.

The discussions covered key areas including investment promotion, implementation of robust disaster prevention and risk mitigation plans, provision of inclusive and accessible housing in the capital region, road maintenance, water resource management, wastewater management, comprehensive master planning, and the ex*****on of social welfare programmes in Amaravati. The WB and ADB team also reviewed the role of the Communications Department in these initiatives and provided valuable suggestions to APCRDA officials.

Officials from PgMC, representatives of contracting agencies, and personnel from PMC organisations also participated in the sessions.

విజయవాడ జగన్ మోహన్ రెడ్డి   “మావిగన్ జోకర్” - వైఎస్ షర్మిలా రెడ్డి3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ ...
09/04/2026

విజయవాడ

జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్ షర్మిలా రెడ్డి

3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు - వైఎస్ షర్మిలా రెడ్డి

వారసులం అని చెప్పుకునే జగన్ YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదు- వైఎస్ షర్మిలా రెడ్డి

YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే ..జగన్ CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ? - వైఎస్ షర్మిలా రెడ్డి

YSR వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు ? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారు- వైఎస్ షర్మిలా రెడ్డి

YSR ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు. YSR ఐడియాలజీ కాంగ్రెస్ తోనే సాధ్యం - వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC ఛీఫ్

#జోహార్ YSR #

- ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ..

- ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర..

- కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం.

- కాంగ్రెస్ నాయకుడు, నాన్న YSR ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవ్వాళ్టికి పదిలం.

- ప్రతిపక్ష నేతగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం.

- 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం.

- ప్రజలకు నేనున్నాననే బరోసా కల్పించిన అభయహస్తం.

- రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం.

- వారసులం అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే..

- ఆయన ఆశయాలకు వారసులు కాలేదు.

- YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే ..

- జగన్ గారు CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ?

- మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే,

- పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేశారు ?

- YSR తన జీవిత కాలం వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎలా మారారు ?

- YSR హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు ?

- దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై RSS వాదులు దాడులు చేస్తుంటే YSR వారసుడుగా జగన్ గారు ఎందుకు ఖండించలేదు ?

- 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు.

- ఇప్పుడు “మావిగన్ జోకర్” గా మిగిలారు.

- సంక్షేమానికి సారథి దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR.

- ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే.

- ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం,

- ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర.

- మిగతా రాష్ట్రాలకు ఆనాడు YSR పథకాలు ఆదర్శం.

- YSR ఐడియాలజీ బ్రతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే.

- మహానేత ఆశయాలు మళ్లీ కాంగ్రెస్ తోనే సాధ్యం.

- ఈ సందర్భంగా ప్రతి YSR అభిమానికి చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నా.

- దివంగత నేత ఆశయ సాధనకు హస్తంతో జతకడతాం.

- ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ కాంగ్రెస్ తో తీసుకు వద్దాం.

YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR

Jagan behind YSR 's death - Min Atchennayudu questions...
09/04/2026

Jagan behind YSR 's death - Min Atchennayudu questions...

21/10/2024

విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

- YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం.

- మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం.

- పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం.

- నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే..

- సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి గారు తన హయాంలో పథకాన్ని నీరు గార్చారు.

- విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు.

- బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారు.

- తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారు.

- దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదు.

- YSR తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే..

- అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు.

- బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్ గారు.

- అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం,

- ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు.

- నాడు YCP ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోంది.

- వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం.

- ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గారిని డిమాండ్ చేస్తున్నాం.

- బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది.

- వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని
కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

03/09/2024

వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వ దలచిన దాతల కొరకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లోపల నిర్దేశిత పాయింట్ నెలకొల్పబడింది.
ఇందుకు సంబంధించి శ్రీ మనజీర్, ఐఏఎస్ ను 79067 96105 లో సంప్రదించగలరు.

29/08/2024

Develop Amaravati as Artificial intelligence city...

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని

90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారుల‌కు సీఎం చంద్రబాబు ఆదేశం

రాజ‌ధానిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగితన పూర్తి చేయాలన్న సీఎం

అమరావతి :- అమ‌రావ‌తి రాజ‌ధాని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాల‌ని, ఆ దిశగా ప్ర‌ణాళిక‌లు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం స‌మీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ స్పుర‌ణ‌కు వ‌చ్చేలా అమ‌రావ‌తి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజ‌ధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌల‌భ్యత ఉట్టిప‌డేలా రాజ‌ధాని నిర్మాణం ఉండాల‌న్నారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని అని, అలాంటి గొప్ప రాజ‌ధాని ప‌ట్ల గ‌త ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజ‌ధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌ధాని ప‌నులు వేగంగా పున‌రుద్ధరించాల్సి ఉంద‌న్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం, ప‌నులు చేప‌ట్టడానికి టెండ‌ర్లు పిల‌వ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో ఆయ‌న స‌మీక్షించారు. జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గ‌త టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేప‌ట్టామో అంత‌కుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు క‌ద‌ల్లేద‌ని, గ‌త ప్రభుత్వం ఈ నిర్మాణాల‌ను పూర్తీగా వ‌దిలేసింద‌ని అధికారులు సీఎంకు సూచించారు. ఇప్పుడు ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి చేయ‌నున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ భ‌వ‌న నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాల‌యాన్ని అందుబాటులోకి తేవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణాల‌కు కూడా అత్యాధుని టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు.

హ్యాపీనెస్ట్‌నూ గ‌త ప్రభుత్వం నిలిపేసింది

టీడీపీ ప్రభుత్వం రాజ‌ధానిలో చేప‌ట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైన ముఖ్యమంత్రి స‌మీక్షించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో నివాస‌ముండాల‌ని కోరుకునే వాళ్ల కోసం 14 ఎక‌రాల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూపొందించామ‌ని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు గ్రహ‌ణం ప‌ట్టింద‌న్నారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంట‌లో అమ్ముడ‌పోయాయ‌ని, అయితే త‌రువాత వ‌చ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపేయ‌డంతో కొనుగోలుదారులు వెన‌క్కివెళ్లిపోయార‌ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనివ‌ల్ల సీఆర్డీఏకు భారీ న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. హ్యాపీనెస్ట్ లో గ‌త ప్రభుత్వం చ‌ర్యల‌తో ఏర్పడ్డ న‌ష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాల‌ని అధికారును ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మ‌ళ్లీ పున‌రుద్ధరించాల‌న్నారు. రాజ‌ధానికి సంబంధించి ఇంకా 3,558 ఎక‌రాలు సేక‌రించాల్సి ఉంద‌ని, రాజ‌ధాని ప‌రిధిలోని రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నార‌ని సీఎంకు అధికారులు తెలిపారు. అయితే డెవ‌ల‌ప్ చేసిన ప్లాట్లను ఆ రైతుల‌కు కేటాయించే విష‌యంలో చిన్న చిన్న అభ్యంత‌రాలున్నాయ‌ని అధికారులు వివ‌రించ‌గా రైతుల‌తో మాట్లాడి దాన్ని ప‌రిష్కరించి ముందుకెళ్లాల‌ని సీఎం సూచించారు. రాజధానిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్షించారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచి మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ ప‌నులు పూర్తయ్యాయ‌ని అధికారులు వివ‌రించారు. బిల్డింగ్ నిర్మాణం, క్లియరెన్స్ లో టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు. జంగిల్ క్లియరెన్స్ మదింపునకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎం అన్నారు. క్లియరెన్స్ పనులు కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించాలన్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నులు వేగ‌వంతం చేయండి

విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో చేప‌ట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. విశాఖప‌ట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేప‌డ‌తామ‌ని ఏపీ మెట్రోరైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్ణా రెడ్డి సీఎంకి వివ‌రించారు. ఫేజ్-1లో 46 కిలో మీట‌ర్ల మేర రూ.11,400 కోట్ల వ్య‌యంతో మెట్రో రైలు నిర్మిస్తామ‌ని, త‌రువాత ఫేజ్‌-2లో 30 కిలోమీట‌ర్ల మేర రూ.5,734 కోట్ల‌తో మెట్రో రైలు నిర్మిస్తామ‌న్నారు. ఫేజ్-1 మెట్రో రైలు ప‌నులు మొద‌లు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. అలాగే విజ‌య‌వాడ‌లో 38 కిలోమీట‌ర్ల మేర రూ.11వేల కోట్లతో చేప‌ట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు ప‌నులను కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించారు.

Address

Rayapudi
Amaravati
522237

Opening Hours

Monday 9am - 10am
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm

Alerts

Be the first to know and let us send you an email when Political Hot Potatoes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share