AP Amaravathi

AP Amaravathi AP Amaravathi

02/01/2021

*విశాఖలో ప్రారంభమైన డ్రై రన్..*

కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ నేడు విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో.. పలు ఆసుపత్రులతో పాటు సింహాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్‌ను నిర్వహించనున్నారు. సుమారుగా రెండు గంటల పాటు ఈ డ్రై రన్ కొనసాగనుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు.. సుమారు 25 మందితో ఈ రోజు డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వాటిలో ఎదురయ్యే సవాళ్లను ఇబ్బందులను ఆరోగ్యశాఖకి పంపించనున్నారు.

02/01/2021

కృష్ణా......

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి యువకునికి తీవ్ర గాయాలు...

కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో పెద్ద కాలువ కట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...

ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం...

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వేమన సుసీల అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి...

వేమన ప్రకాశ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడగా రహదారి అంబులెన్స్ లో నందిగామ తరలింపు....

సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు...

02/01/2021

చిత్తూరు
వడమాలపేట దగ్గర లారీ దగ్ధం

చిత్తూరు జిల్లా వడమాలపేట దగ్గర లారీ దగ్ధమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూల్ డ్రింక్ సీసాలతో చెన్నై నుంచి తిరుపతికి లారీ బయలుదేరింది. వడమాలపేట వద్దకు రాగానే.. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైపోయింది. కాగా.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

02/01/2021

విజయనగరం

అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తల అరెస్ట్..

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో పలువురు టీడీపీ నేతలు అరెస్ట్‌‌ అయ్యారు. అర్థరాత్రి నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబు పోలీసుల అదుపులో ఉన్నారు. నేరం అంగీకరించాలని టీడీపీ నేతలపై... పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.

02/01/2021

జగన్‌రెడ్డి పాలనలో రోజుకో విగ్రహం ధ్వంసం: #అచ్చెన్నాయుడు

కోదండ రాముడి విగ్రహం ధ్వంసం హిందూ మతంపై దాడేనని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌రెడ్డి పాలనలో రోజుకో విగ్రహం ధ్వంసమవుతోందన్నారు. 19 నెలల పాలనలో 126 దాడులు జరిగాయని విమర్శించారు. తిరుమల పవిత్రతను మంటగల్పుతున్నారని.. టీటీడీ ఆస్తుల అమ్మకం, మాన్సాస్ ట్రస్ట్‌పై ఉన్న శ్రద్ధ.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరుపుతామని.. హామీ ఇచ్చి ఎందుకు జరపలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

17/07/2020

అమరావతి:

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సర్కార్ ఆదేశించింది.

https://youtu.be/8q_I7pej9tYచంద్రబాబు మీడియా సమావేశం
16/06/2020

https://youtu.be/8q_I7pej9tY

చంద్రబాబు మీడియా సమావేశం

Sri Nara Chandrababu Naidu addressing the media regarding today's Assembly session- Live Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updat...

అమరావతి :విషాదం విషాదం రాజధానిలో ఆగిన దళిత  రైతు గుండె. ఇతను రాజధానికి 31 సెంటు ఇచ్చి యున్నాడు రాజధాని తరలిపోతుంది అన్న ...
10/02/2020

అమరావతి :

విషాదం విషాదం రాజధానిలో ఆగిన దళిత రైతు గుండె.

ఇతను రాజధానికి 31 సెంటు ఇచ్చి యున్నాడు రాజధాని తరలిపోతుంది అన్న మనస్థాపంతో తో నరాలు చిట్లి మరణించినాడు కంచర్ల చంద్రం వయసు 43 సంవత్సరాలు తుళ్లూరు గ్రామం.

10/02/2020

బావకు రాజ్యసభ ఇవ్వండి…!

నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదు… కానీ మా బావ ఎంపీ సీటును త్యాగం చేశారు.. ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఏదో ఒక మంచి పదవి ఇస్తారని ఆశపడ్డాను. కానీ ఎక్కడా మా బావ పేరు వినిపించటం లేదు అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన బందువుల తో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డికి స్వయాన బావ అయిన అయోధ్యరామిరెడ్డి 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014, 2019లలో మళ్లీ పోటీ చేసే అవకాశం అయోధ్యరామిరెడ్డికి ఏ కారణాలతోనో జగన్‌ అవకాశం కల్పించలేదు. ఒకసారి ఎన్నికలలో ఓడిపోయి ఆర్దికంగా మా బావ దెబ్బతిన్నారు. మరో రెండు సార్లు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా.. జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేయలేదు. అలాంటి అయోధ్యరామిరెడ్డికి ఈ సారి రాజ్యసభ సీటు అయినా ఇప్పించాలని ఆళ్లరామకృష్ణారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారట. ముఖ్యమంత్రి జగన్‌ మెప్పు పొందేందుకు ఆళ్ల చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి.

10/02/2020

పల్నాడులో దొంగలు హల్ చల్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్నంలోని కుమ్మరిపాలెం లో ఒక ఇంట్లో చోరీ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం వివరాలు తెలియాల్సి ఉంది

10/02/2020

*✨ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు నేటి నుంచి బయోమెట్రిక్‌ హాజరు*

★ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు సోమవారం నుంచి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

★ *ఇకపై ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేక యాప్‌ను కేటాయించారు.
★ గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ నుంచి బయోమెట్రిక్‌ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
★ *ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు సదరు ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలి.**
★ *సోమవారం నుంచి తమకు కేటాయించిన యాప్‌ ద్వారా బయోమెట్రిక్‌ హాజరు ఉదయం, సాయంత్రం కచ్చితంగా వేయాల్సి ఉంది.*

Address

Amaravati
522007

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Amaravathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP Amaravathi:

Share