Bapatla District News

Bapatla District News | News |
Sharing the latest news and business updates from Bapatla District and beyond. Stay tuned for all-India news and insightful reviews.

Follow us to stay connected and informed.

*ఇక మొబైల్ యాప్తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్లో అమలు*బీహార్ :కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్...
29/06/2025

*ఇక మొబైల్ యాప్తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్లో అమలు*

బీహార్ :

కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు.

అమరావతి :*వివాహమైన మహిళను వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కి మార్చుకునే ఆప్షన్ సచివ...
29/06/2025

అమరావతి :

*వివాహమైన మహిళను వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కి మార్చుకునే ఆప్షన్ సచివాలయంలో కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ తో పాటు పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.*

*భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయం!*తిరుమల :ఏపీలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే ...
29/06/2025

*భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయం!*

తిరుమల :

ఏపీలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. టీటీడీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఇది అమల్లోకి వస్తే దేశంలోనే మొదటిసారిగా ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఇలాంటి బీమా సౌకర్యం కల్పించినట్లు అవుతుంది.

* పల్నాడు జిల్లాలో దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు* జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద, 12 గేట్లు ఎత్తివేత* తిరుమల శ్రీవారి ...
29/06/2025

* పల్నాడు జిల్లాలో దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

* జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద, 12 గేట్లు ఎత్తివేత

* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

* ఏపీలో 10 జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నిర్ణయం

* బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగురాష్ట్రాలకు వర్షసూచన

* ఢిల్లీ-గురుగ్రామ్‌ మధ్య AI టెక్నాలజీతో డిజిటల్ హైవే

* గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు, 81 మంది మృతి

* పాకిస్తాన్‌లో భూకంపం, తీవ్రత 5.2గా నమోదు

* ఇంగ్లాండ్‌తో టీ20లో భారత మహిళల జట్టు విజయం

* ISSలోని శుభాంశుతో మాట్లాడిన ప్రధాని మోదీ

* పంద్రాగస్టు నుంచి మహిళలకు ఫ్రీ బస్: CM చంద్రబాబు

* APలో రేమండ్ రూ.1,200 కోట్ల పెట్టుబడులు: TDP

* PJR ఫ్లైఓవర్ ప్రారంభించిన CM రేవంత్

* 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: CM రేవంత్

* అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్.. ఆఖరి మృతదేహం అప్పగింత

* గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 60 మంది మృతి

* RAW కొత్త చీఫ్ గా పరాగ్ జైన్

*-[|----|]-*

*✒️- (29)(6)(25)_History🤟🏽*

* 1864: శాస్త్రవేత్త అశుతోశ్ ముఖర్జీ జననం

* 1916: బోయింగ్ విమానం మొదటిసారిగా ఎగిరిన రోజు

* 1965: రచయిత్రి బోయపాటి రోజా రమణి జననం

* 1973: మ్యూజి

29/06/2025

పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు ₹6,000/- అకౌంట్ లో జమ:

(సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ నిష్పత్తి 60:40 గా ఉంటుంది. అంటే, 60% నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తే, 40% నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.)

1)పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పది నెలలకు గాను ₹6,000/- అకౌంట్లో జమ చేస్తారు.
2)అర్హతలు: విద్యార్థి యొక్క పాఠశాల దూరం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.

-మొదటి దశలో : పది జిల్లాల్లో పైలెట్ ప్రోగ్రాం కింద ప్రారంభించి, సుమారు 600 పాఠశాలలు, 10,000 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
-డబ్బులు ఎలా చెల్లిస్తారు: విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఖాతాలకు డబ్బులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి.
@ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?:
పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు పెంచడం, డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడం
తల్లిదండ్రులపై పడుతున్నారవాణాచార్జిల భారాన్ని తగ్గించడంతో విద్యార్హతల్లో మెరుగుదల వస్తుంది
ఈ పథకం “సమగ్ర శిక్ష అభియాన్” ఆధారంగా అమలవుతుంది.

@అమలు చేసే విధానం:
జూలై నెల 5న విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఈ ప్రోగ్రాం పై తుది నిర్ణయం తీసుకొని అన్నారు.
విద్యార్థులను ఆటో లేదా పబ్లిక్ బస్సుల ద్వారా తరలించేందుకు స్పష్టత ఇవ్వనున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ కి డబ్బులను డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా అసిస్టెంట్ చేయబడుతుంది.

@అప్లికేషన్ ప్రాసెస్ ఎలా?:
-కొత్తగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
-ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యానికి దరఖాస్తు చేసుకోవడానికి buspassonline.apsrtconline.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
-12 ఏళ్లలోపు ఒక విద్యార్థులకు , 15 ఏళ్లలోపు బాలికలకు బస్సు పాస్ ఉచితం
-20 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
@ బస్సు పాస్ పొందడానికి క్రింది సర్టిఫికెట్స్ కావాలి:
-స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్
-విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
-విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
-విద్యార్థి ఒక డేటా స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లోని ఇది అమలు చేస్తున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం ని ప్రారంభించడం జరుగుతుంది

________________
-తలిదండ్రులారా... మారుదాం....! మారుద్దాం ...!!!
-తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం..మన పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం....
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మన పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".*

29/06/2025

*అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం.*
*బంగాళాఖాతంలోనూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.*

*ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం.*

*వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు.*

*ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.*

*గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్.*

*మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరిక.*

The most ambitious journey of   begins in 10days ❤️‍🔥To the Ambara Godugu & it's Mystery... Everything Will Change🔥  🎥
29/06/2025

The most ambitious journey of begins in 10
days ❤️‍🔥

To the Ambara Godugu & it's Mystery... Everything Will Change🔥

🎥

29/06/2025

నిన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో భేటీ

నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ

29/06/2025

దివంగత సాయి చంద్ విగ్రహావిష్కరణ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

విగ్రహావిష్కరణ సందర్భంగా కన్నీళ్ళు పెట్టుకున్న సాయిచంద్ భార్య రజని సాయిచంద్

బ్రేకింగ్ న్యూస్మహా న్యూస్ చానల్  పై దాడి కేసులో BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా అందరికి బెయిల్ మంజూరు చేసిన కోర్ట...
29/06/2025

బ్రేకింగ్ న్యూస్

మహా న్యూస్ చానల్ పై దాడి కేసులో BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా అందరికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు

29/06/2025

శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక కలకలం

ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తుల ఆందోళన

ఇదేంటని ప్రశ్నించిన భక్తుడి నుంచి లడ్డు లాక్కున్న అధికారులు

ప్రసాదంలో బొద్దింక వ్యవహారంపై స్పందించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు

ఈ ఘటన నిజంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఈవో

29/06/2025

*డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్*
(*మ్యాప్ న్యూస్ రిపోర్టర్ చిలకలూరిపేట*)
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్‌కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Address

Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Bapatla District News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bapatla District News:

Share