Bapatla District News

Bapatla District News | News |
Sharing the latest news and business updates from Bapatla District and beyond. Stay tuned for all-India news and insightful reviews.

Follow us to stay connected and informed.

బాపట్ల జిల్లా:  వెదుళ్ళపల్లి  పోలీస్ స్టేషన్ను తనిఖీ  చేసిన జిల్లా ఎస్పీ  బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్.
25/09/2025

బాపట్ల జిల్లా:

వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్.

*ఫ‌ర్ స్క్రోలింగ్*24-09-2025                                                                                            ...
24/09/2025

*ఫ‌ర్ స్క్రోలింగ్*
24-09-2025
*శాస‌న‌స‌భ‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారి కామెంట్స్*

👉 చేప‌ల పెంప‌కపు అభివృద్ధి ప్రాధికార సంస్థ స‌వ‌ర‌ణ బిల్-2025 కు శాస‌న‌స‌భ ఆమోదం తెల‌ప‌డం ప‌ట్ల స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

👉 ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

👉 సీఎం చంద్ర‌బాబు ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోన్ గా విభజించి అభివృద్ధిపై దృష్టిపెట్టారు

👉 ఆక్వా రైతులు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్ర‌ర్ అవ్వాలి, రిజిష్ట్ర‌ర్ అయిన రైతుల‌కు మాత్ర‌మే స‌బ్సిడీ విద్యుత్ యూనిట్ కు రూ. 1.50 వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించిన మంత్రి అచ్చెన్న‌

👉 ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టి ఆక్వా పంట‌ల‌కు జీయో ట్యాగ్ చేసి చెరువుల‌ను గుర్తిస్తున్నాం

👉 ముమ్మ‌డివ‌రం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అడిన‌టువంటి ప్రశ్నలకు స‌మాధానం ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

👉 రాష్ట్రంలోని ఆక్వా రైతుల‌కు స‌బ్సిడీలో 64,500 విద్యుత్ క‌లెక్ష‌న్స్ ఇవ్వొచ్చు... ఇప్ప‌టికి 50,000 విద్యుత్ క‌లెక్ష‌న్స్ ఇచ్చామ‌ని తెలిపిన మంత్రి అచ్చెన్న‌

👉 ఎమ్మెల్యేలు బాధ్య‌త‌గా తీసుకొని ఆక్వా బిల్ , రిజిష్ట్రేష‌న్ల గురించి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని కోరిన మంత్రి అచ్చెన్న‌

👉 స‌బ్సిడీ విద్యుత్ అంద‌చేయ‌డం వ‌ల‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి 1100 కోట్లు ఖ‌ర్చు అవుతుంది...ఖ‌ర్చు ముఖ్యం కాదు.. ఆక్వారంగాన్ని గాడిలో పెడుతున్నామ‌ని ఆనందం ముఖ్యం...

👉 రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉండేలా రైతుల‌తో, ఆక్వా రంగ పెద్ద‌ల‌తో మాట్లాడి ఆక్వా చ‌ట్టాన్ని రూపొందించాం...

👉 20 శాతం మంది ఆక్వా రైతులు ఇప్ప‌టివ‌ర‌కు రిజిష్ట్రేష‌న్ చేయించుకోలేదు... వారికోసం 50 శాతం లేట్ ఫీజ్ తో మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తాం

👉 ఆక్వా క‌ల్చ‌ర్ బిజినెస్ ఆప‌రేష‌న్ లైసైన్స్ జీవిత‌కాలం ఒక సంత్స‌ర కాలం నుండి 5 ఏళ్లు త‌గ్గించేందుకు నిర్ణ‌యం తీసుకున్నాం

👉 ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు, సబ్సిడీలు, మార్కెట్ అవకాశాల కల్పన, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామ‌ని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు

*పవన్ కల్యాణ్ 'O G' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ*  బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో...
24/09/2025

*పవన్ కల్యాణ్ 'O G' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ*

బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది.

ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ప్రస్తుత ట్రెండింగ్ మూవీ 'O G' సినిమాకు విడుదలకు ముందే తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. 'O G' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది టీజీ హైకోర్టు. ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంకాగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్గాగా మారింది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'OG' సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ మెమో.. సాధారణ టికెట్ ధరలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, దీన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.

'OG' సినిమా, పవన్ కల్యాణ్ను గ్యాంగ్స్టర్ రొల్లో చూపించిన హై-యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 25. రేపు విడుదల కానున్న నేపథ్యంలో, హై కోర్టు ఆదేశం సినిమాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.

ఇండస్ట్రీ వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం, కోర్టును పునర్విచారణకు పిటిషన్ వేయాలని సూచిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోతే, సినిమా ప్రమోషన్, ఓపెనింగ్ డే కలెక్షన్లు దెబ్బతింటాయని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు విషయం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా భారీ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం ఇటీవల వివాదాస్పదంగా మారుతోంది. కాగా, రేపు (ఈనెల 25న) ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ కేసులో ముఖ్యమైన అంశాలు:

ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్.

ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసిన తెలంగాణ హోంశాఖ.

హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహేష్ యాదవ్.

టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారాలు లేవన్నా పిటిషన్ తరపు న్యాయవాది.

హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది.

టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయన్న పిటిషన్ న్యాయవాది.

గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న పిటీషనర్ న్యాయవాది.

పిటీషనర్ న్యాయవాది వాదనను పరిగణలో తీసుకున్న హైకోర్టు.

టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్.

తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా

బతుకమ్మ: ఈ పూల పండుగ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?తొమ్మిది రోజుల పాటు మహిళలే కేంద్రంగా జరిపే సామూహిక ఉత్సవం బతుకమ్...
24/09/2025

బతుకమ్మ: ఈ పూల పండుగ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?

తొమ్మిది రోజుల పాటు మహిళలే కేంద్రంగా జరిపే సామూహిక ఉత్సవం బతుకమ్మ. తెలుగు నేలలో తెలంగాణలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది బతుకమ్మ.

తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ, అస్తిత్వ ఉద్యమాల్లో బతుకమ్మది చెరగని స్థానం అని సాంస్కృతిక పరిశోధకులు చెప్తుంటారు.

ఇంతకీ.. బతుకమ్మ తెలంగాణకే పరిమితమా? అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు?

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తే పరిస్థితులు మారుతాయా? ఆ ‘దేశాన్ని’ పాలించేదెవరు?పాలస్తీనా దౌత్యవేత్త హుసమ్ జోమ్లా...
24/09/2025

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తే పరిస్థితులు మారుతాయా? ఆ ‘దేశాన్ని’ పాలించేదెవరు?

పాలస్తీనా దౌత్యవేత్త హుసమ్ జోమ్లాట్‌ను ఈ నెల మొదట్లో లండన్‌లోని చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో చర్చలకు పిలిచారు.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని వాగ్దానం చేసిన దేశాల జాబితాలో యూకే, ఫ్రాన్స్, ఇతర దేశాలతో పాటు బెల్జియం కూడా చేరింది.

బ్రిటన్‌కు పాలస్తీనియన్ మిషన్ హెడ్‌గా ఉన్న డాక్టర్ జోమ్లాట్.. ఇది అత్యంత ముఖ్యమైన క్షణమని అన్నారు.

''న్యూయార్క్‌లో మీరు చూడబోయేది ద్విదేశ పరిష్కారాన్ని అమలు చేసేందుకు నిజమైన చివరి ప్రయత్నం కావొచ్చు'' అని చెప్పారు.

రాక్ సాల్ట్ గుండె, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) అనేది సహజ ఖనిజం. సముద్రపు ఉప్పు మాదిరి దీన్...
24/09/2025

రాక్ సాల్ట్ గుండె, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

రాక్ సాల్ట్ (రాతి ఉప్పు) అనేది సహజ ఖనిజం. సముద్రపు ఉప్పు మాదిరి దీన్ని సముద్రం నుంచి తీయరు, రాక్స్ (ఖనిజ గనుల) నుంచి తీస్తారు.

భారత్‌లో ముఖ్యంగా దీన్ని ఉపవాస (వ్రత్) సమయంలో వాడుతుంటారు. దీన్ని స్వచ్ఛ మైనదిగా భావిస్తారు.

దీని రంగు తెలుపు లేదా లేత గులాబి రంగు లేదా నీలం రంగుల్లో ఉంటుంది.

సోడియం క్లోరైడ్ మాత్రమే కాక, అదనంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఈ ఉప్పులో ఉంటాయి.

పాలస్తీనా రాజ్యం: యూరోపియన్ దేశాలు గుర్తించినా, అమెరికా మద్దతు లేకుండా సాధ్యమేనా?బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిలో ప...
24/09/2025

పాలస్తీనా రాజ్యం: యూరోపియన్ దేశాలు గుర్తించినా, అమెరికా మద్దతు లేకుండా సాధ్యమేనా?

బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించడం వందేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలో ఒక చారిత్రాత్మక అడుగు.

ఇది కూడా దౌత్యపరమైన(డిప్లొమాటిక్) జూదం కూడా. ఎందుకంటే, ప్రధాన యూరోపియన్ శక్తులు ఈ ఘర్షణ అతి తీవ్రమైన స్థాయికి చేరిందని, అందువల్ల ఇంతకుముందు తాము తీసుకోని నిర్ణయం.. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయి.

గాజాలో సంక్షోభం నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇజ్రాయెల్, హమాస్ రెండింటినీ విమర్శిస్తూ "శక్తి కంటే హక్కు గెలవాలి" అని అన్నారు.

సౌదీ అరేబియా మద్దతుతో యూకేతో కలిసి నడుస్తూ, మేక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం.. 'టూ స్టేట్ సొల్యూషన్' ఆలోచనను సజీవంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఐ లవ్ మొహమ్మద్' బ్యానర్ వివాదమేంటి, యూపీ నుంచి గోద్రా వరకు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బా...
24/09/2025

ఐ లవ్ మొహమ్మద్' బ్యానర్ వివాదమేంటి, యూపీ నుంచి గోద్రా వరకు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బారావఫాత్ (ఈద్ మిలాద్-ఉన్-నబి) సందర్భంగా 'ఐ లవ్ మొహమ్మద్' బ్యానర్ ఏర్పాటుపై వివాదం చెలరేగింది.

దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో యూపీతోపాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు.

ఈ ప్రదర్శనలపైనా కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో 'ఐ లవ్ మొహమ్మద్' అనే బ్యానర్‌తో నిర్వహిస్తున్న ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

24/09/2025

*తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం*

Movie updates 25 September 2025OG ❤️‍🔥🔥
24/09/2025

Movie updates

25 September 2025
OG ❤️‍🔥🔥

*నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.* సా.5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు. నేటి నుంచ...
24/09/2025

*నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.*

సా.5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు. నేటి నుంచి అక్టోబర్‌ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్న టీటీడీ. ఇవాళ సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. రాత్రి పెద్దశేష వాహనసేవలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. పెద్దశేష వాహనంతో ప్రారంభం కానున్న శ్రీవారి వాహనసేవలు.

✒️ఒక్కో ప్రభుత్వోద్యోగికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా!  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో రూ.1.25కోట్ల నుంచి ర...
24/09/2025

✒️ఒక్కో ప్రభుత్వోద్యోగికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా!



రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో రూ.1.25కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది.

బ్యాంకులో శాలరీ ఎకౌంట్ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది

Address

Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Bapatla District News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bapatla District News:

Share