వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery Agriculture information, farming vlogs, Tractors and implements Digital Creator in Agri and Farming.

07/11/2025

07/11/2025

హడలెత్తిస్తున్న ఆఫ్రికా నత్తలు !▪️ పంటల్ని నమిలేస్తున్నాయి ▪️ కూరగాయలు, బొప్పాయి పంటలపై ముప్పేట దాడి ▪️ ఒక జంట నత్తలకు 2...
07/11/2025

హడలెత్తిస్తున్న ఆఫ్రికా నత్తలు !
▪️ పంటల్ని నమిలేస్తున్నాయి ▪️ కూరగాయలు, బొప్పాయి పంటలపై ముప్పేట దాడి ▪️ ఒక జంట నత్తలకు 2 వేల గుడ్లు !!
(న్యూస్ క్లిప్పింగ్ కామెంట్ బాక్స్ లో)

వీటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి !!

ఆఫ్రికా నత్తలు (African Giant Snails / Achatina fulica) — ఇవి అసలు తూర్పు ఆఫ్రికా (East Africa, ముఖ్యంగా కెన్యా–టాంజానియా ప్రాంతం) కి చెందిన జాతి. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉష్ణ మండల దేశాలలో ఇవి "ఇన్వేసివ్ స్పీసీస్" (invasive species – స్థానిక జీవ వ్యవస్థను దెబ్బతీసే విదేశీ జాతి) గా వ్యాప్తి చెందాయి.

🌍 ఇవి ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చాయి ?

హార్టికల్చర్ మరియు గార్డెన్ ఇంపోర్ట్స్ ద్వారా (1990–2000 దశకాల్లో)
కొంతమంది తోటల్లో అలంకార (ornamental) నత్తలుగా లేదా విద్యార్థుల బయాలజీ ప్రాజెక్టుల కోసం ఈ ఆఫ్రికా నత్తలను దిగుమతి చేసుకున్నారు !
ఆ తర్వాత అవి తప్పించుకుని బయటకు వచ్చి, అనుకూల వాతావరణం వల్ల విస్తరించాయని భావిస్తున్నారు !!

మట్టితో, మొక్కలతో పాటు అనుకోకుండా చేరడం.. మొక్కల నర్సరీలు, హార్టికల్చర్ సెంటర్లు లేదా ఎరువులలో ఈ నత్తల గుడ్లు మట్టిలో ఉండి ఇతర ప్రాంతాలకు చేరాయి !
ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఇలా వ్యాప్తి మొదలైందని తెలుస్తుంది !!

కాలుష్యానికి తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఇవి వేడి, తడి వాతావరణంలో వేగంగా పెరుగుతాయి !
ప్రతి నత్త ఏటా 1000కి పైగా గుడ్లు పెట్టగలదు, కాబట్టి జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుందని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు !!

వ్యవసాయ పంటలు (అరటి, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పూల మొక్కలు) నాశనం చేయడంతో పాటు.. ఈ నత్తలు లంగ్‌వార్మ్ పారాసైట్ అనే మనుషులకు ప్రమాదకరమైన పరాన్నజీవిని కూడా మోసుకెళ్లగలవు అంటన్నారు !!

ఉప్పు లేదా నిమ్మరసం చల్లి చంపడం,
రాత్రిపూట చేతితో సేకరించి నాశనం చేయడం,
గాలి చొరబడే కంటైనర్‌లో సేకరించి ఎండలో ఎండబెట్టి నిర్వీర్యం చేయడం,
నర్సరీలు, ఫార్మ్‌ల వద్ద మట్టి తరలించే ముందు నియంత్రణ చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని అరికట్టవచ్చు అని అధికారులు తెలియజేస్తునారు !!

06/11/2025

06/11/2025
బొప్పాయి .. ఆంధ్రప్రదేశ్ అస్త్రం విదేశాలకునంద్యాల చాగలమర్రి మండల రైతులు అధికంగా బొప్పాయి చేస్తుంటారు. చిన్నవంగలితో పాటు ...
06/11/2025

బొప్పాయి .. ఆంధ్రప్రదేశ్ అస్త్రం విదేశాలకు

నంద్యాల చాగలమర్రి మండల రైతులు అధికంగా బొప్పాయి చేస్తుంటారు. చిన్నవంగలితో పాటు వైఎస్సార్ కడప జిల్లా కానగూడూరు, క్రిష్ణంపల్లె గ్రామాల్లో 1200 ఎకరాల్లో పండిస్తారు. విత్తనం నాటిన నుంచి తొమ్మిది నెలలకు పంట చేతికొస్తుంది. పండ్ల సేకరణ తర్వాత 13 నెలల తర్వాత మిగిలినవి. ముదురు కాయలకు గాట్లు పెట్టి పాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజామునే కాయలకు గాట్లు పెడితే రెండు గంటల్లోనే పాలు ఊరుతుంది. ఇలా సేకరించిన రాయచోటి, రాజంపేటకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 20లీటర్ల పాలు రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. ఎకరానికి 3 నుంచి 4 డ్రమ్ముల పాలు సేకరిస్తున్నారు. ఎకరానికి పాలసేకరణ ద్వారా రైతుకు రూ.24వేల ఆదాయం వస్తుంది. సేకరించిన పాలను పరిశ్రమల్లో మందులు, కాస్మోటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నైలలో పాటు నాణ్యతను బట్టి విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉ...
05/11/2025

ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్లో టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర విధించారు, చివరకు 2023 డిసెంబర్లో ఉల్లిపాయల ఎగుమతిపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2024 మే నాటికి ఎత్తివేశారు, కానీ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. చివరకు ఉల్లిపాయలపై విధించిన 20% సుంకాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం ఎత్తేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉల్లి దిగుబడి బాగా పెరగడంతో, మార్కెట్లో సరఫరాను కేంద్రం పునరుద్ధచించినప్పటికీ, ఎగుమతుల్లో క్షీణత కొనసాగింది.

వందకు అయిదు కేజీల అరటి పండ్లు..మార్కెట్లో కిలో 50 రూపాయలు .ఎగబడి కొన్న జనం.. నిమిషాల్లో ట్రాక్టర్ ఖాళీ.ఆదివారం ఓ రైతు బం...
04/11/2025

వందకు అయిదు కేజీల అరటి పండ్లు..మార్కెట్లో కిలో 50 రూపాయలు .ఎగబడి కొన్న జనం.. నిమిషాల్లో ట్రాక్టర్ ఖాళీ.ఆదివారం ఓ రైతు బంగళా రకానికి చెందిన అరటి పండ్లను వంద రూపాయలకు అయిదు కిలోల వంతున విక్రయించాడు. నెల్లూరు రూరల్ మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన గురు అనే రైతు తన ట్రాక్టర్ లో అరటిపండ్ల గెలలను పొదలకూరుకు తీసుకొచ్చి మెయిన్ రోడ్డు పక్కన ఉంచి అమ్మాడు. దారిన వెళుతున్న ప్రజలు అరటి పండ్లను ఎగబడి కొనుగోలు చేశారు. క్షణాల్లో ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న అరటి పండ్లన్నీ అమ్ముడు పోయాయి. పట్టణంలోని వ్యాపారులు కిలో 40 నుంచి 50 రూపాయల దాకా విక్రయిస్తున్నారు.

రైతుమిత్రులు గమనించగలరు.
04/11/2025

రైతుమిత్రులు గమనించగలరు.

'వక్క'సారి నాటితే వందేళ్లుకనీసం 60 ఏళ్లకు పైగా వక్క తోటలతో స్థిరమైన ఆదాయంకొబ్బరికి సమానంగా దీర్ఘకాలిక పంటఉమ్మడి ఖమ్మం జి...
04/11/2025

'వక్క'సారి నాటితే వందేళ్లు

కనీసం 60 ఏళ్లకు పైగా వక్క తోటలతో స్థిరమైన ఆదాయం

కొబ్బరికి సమానంగా దీర్ఘకాలిక పంట

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు

ఇప్పుడిప్పుడే మొదలవుతున్న దిగుబడి

దీర్ఘకాలిక ఆదాయం వచ్చే కొబ్బరి తోటల జాబితాలో 'వక్క'పంట కూడా నిలుస్తోంది. ఈ రెండు పంటలు కనీసం 60 నుంచి 100 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తున్నాయి. తద్వారా రెండు నుంచి మూడు తరాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క సాగుకు అవకాశం ఉంది. ఒకవేళ వక్కపంటను నేరుగా సాగు చేస్తే కొన్నేళ్లపాటు అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా పొందొచ్చు.

పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఎ...
04/11/2025

పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన నేపథ్యంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్, సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. సాధారణంగా ఇప్పటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా.. ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిందని ఆ లేఖలో ప్రస్తావించారు.

“ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతులకు నష్టం చేసేలా ఉంది.

తేమ శాతం విషయంలో 20శాతం వరకు ఉన్నా సరే పత్తి పంట సీసీఐ కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ యాప్పై అవగాహన లేకపోవడం వల్ల కూడా పత్తి రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తి వేసి పాత పద్ధతిలో పత్తి కొనుగోళ్లు చేయాలి. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి" అని మంత్రి తుమ్మల కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Address

Road No 19
Chanda Nagar
500091

Alerts

Be the first to know and let us send you an email when వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share