వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery Agriculture information, farming vlogs, Tractors and implements Digital Creator in Agri and Farming.

"ఆవు దూడ" మీద "చిరుత పులి " కి ఉన్నపాటి కనికరం జాలి దయ అటవీ అధికారులకు లేకపోయింది. చిరుతకు ఎరగా ఆవు దూడని పెట్టారు.పంజాక...
16/09/2025

"ఆవు దూడ" మీద "చిరుత పులి " కి
ఉన్నపాటి కనికరం జాలి దయ అటవీ అధికారులకు లేకపోయింది.
చిరుతకు ఎరగా ఆవు దూడని పెట్టారు.

పంజాకు చిక్కితే చాలు.. దూడను నంజుకు తినే చిరుత ఎందుకో మనసు మార్చుకుంది. బోనులో తన కోసమే ఎదురు చూస్తోందన్నంత ఉత్సాహంగా దాంతో గడిపింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె శివార్లలో చిరుత సంచరిస్తోందని వచ్చిన ఫిర్యాదులతో అటవీ శాఖ అధికారులు ఓ బోను ఏర్పాటు చేశారు. ఎరగా ఒక లేగ దూడను అందులో పెట్టారు. ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన చిరుత బోనులో పడింది. అయినా అందులోని దూడను తినకుండా పక్కన కూర్చుంది. గురు వారం ఉదయం వచ్చిన అటవీ సిబ్బంది.. లేగ దూడ చిరుత పక్కనే కూర్చుని గడ్డి తినడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దూడను బయటకు తీసి, మత్తు మందు సాయంతో చిరుతను బంధించి తీసుకువెళ్లారు.

కిడ్నీలో రాళ్లు తొలగించే ఫెర్రోబాట్స్...కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ బాధ వర్ణనాతీతం... అది పడేవాళ్లకే తెలుస్తుంది.ఇక ఆ రాళ్లను...
16/09/2025

కిడ్నీలో రాళ్లు తొలగించే ఫెర్రోబాట్స్...

కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ బాధ వర్ణనాతీతం... అది పడేవాళ్లకే తెలుస్తుంది.
ఇక ఆ రాళ్లను తొలగించడానికి చేసే సర్జరీల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తీవ్రమైన రక్తస్రావం కావడం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం వంటివి వాటిల్లో కొన్ని. అందుకే రాళ్లను తొలగించిన తర్వాత కూడా పేషంట్లు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ నొప్పీ, బాధా ఇతరత్రా ఇబ్బందులూ లేకుండా కిడ్నీలోని రాళ్లను సులభంగా తొలగించేందుకు వీలుగా దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఫెర్రోబాట్స్ పేరుతో అతిచిన్న మ్యాగ్నెటిక్ రోబోట్స్ని ఆవిష్కరించారు. ఇంజక్షన్ ద్వారా ఈ అతిచిన్న రోబోట్స్ కిడ్నీలోని రాళ్లవద్దకు నేరుగా చేరుకుని పక్కనున్న కణానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, రక్తస్రావం కాకుండా సర్జరీ చేస్తాయట. దాంతో నొప్పీ, ఇన్ఫెక్షన్ల బాధ ఉండదనీ... పేషంట్లు కూడా త్వరగా కోలుకుంటారనవ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery it వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

వరి పంటపై తెగుళ్ల దెబ్బతాజాగా ఏర్పడిన అల్పపీడనం, వరుస భారీ వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వరి పంటకు శాపంగా మ...
16/09/2025

వరి పంటపై తెగుళ్ల దెబ్బ

తాజాగా ఏర్పడిన అల్పపీడనం, వరుస భారీ వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వరి పంటకు శాపంగా మారాయి. నాట్లు వేసిన దగ్గరినుంచే తెగుళ్ల ఉధృతి పెరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టినా, వాతావరణం అనుకూలించకపోవడంతో పంట ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తాయి.

తెగుళ్లతో పంట నష్టపోతోంది

ప్రస్తుతం వానాకాలంలో వరి సాగులో 86 శాతం వరకు సన్న రకాలే పండిస్తున్నారు. అయితే, వరుసగా కురిసిన వర్షాలు, మబ్బు వాతావరణం, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, ఉకృపోత వంటి కారణాలతో తెగుళ్లు అధికమయ్యాయి. నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో జూన్‌లో నారు వేసి, జూలైలో నాట్లు వేశారు. పొలాలు ఏపుగా పెరగడంతో దోమ వ్యాప్తి, బూడిద తెగులు (బాక్టీరియా ఆకు ఎండు తెగులు) ఎక్కువయ్యాయి. ఇప్పటికే రైతులు రెండు మూడు సార్లు ఖరీదైన పురుగుమందులు పిచికారీ చేసినా వైరస్ నియంత్రణలో రాలేదు. దోమలతో పాటు మొగి పురుగు కూడా ఆశించి దిగుబడులను తగ్గించే పరిస్థితి ఏర్పడింది.

ఆగస్టులో ఆలస్యంగా వేసిన నాట్లకు మొదటి నుంచే పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ రసాయనిక మందులు పనిచేయకపోవడంతో రైతులు కొత్త రకం, ఖరీదైన మందులు వాడుతున్నారు. దీంతో ఎకరానికి సుమారు రూ.2,500 వరకు అదనపు ఖర్చు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే నెలలో కోతలు ప్రారంభం కానున్న వేళ, తెగుళ్లు పెరుగుతుండటంతో దిగుబడులు తగ్గిపోతాయనే భయం కలుగుతోంది. వాతావరణం అనుకూలిస్తే తప్ప పంట పూర్తిగా చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధిక రసాయనాల వాడకంతో నష్టం

గత కొన్నేళ్లుగా రైతులు సేంద్రియ ఎరువులు వాడడం మానేశారు. పశువుల ఎరువులు, పంటల మార్పిడి పద్ధతులు (జీలుగ, జనుము సాగు) పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో భూమిలో సహజ పోషకాలు తగ్గిపోవడంతో రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. నత్రజని ఎరువులు అధికంగా వాడటంతో భూమి శక్తి దెబ్బతింటోంది.

నాట్ల దగ్గరినుంచే తెగుళ్లు ఎక్కువవ్వడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, భారీ వర్షాల ప్రభావం కారణంగా అగ్గి తెగులు, దోమ, మొగి వ్యాప్తి పెరిగింది. ఫలితంగా రైతుల పెట్టుబడులు పెరుగుతున్నా, ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
్యవసాయం లో యాంత్రీకరణ Farm Machineryrs వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

ఏం రుచిరా..!చిత్రాడ బీరకాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి బీర విత్త నా...
15/09/2025

ఏం రుచిరా..!

చిత్రాడ బీర

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి బీర విత్త నాలు. తీయగా ఉండే ఈ బీరకాయలతో కూర చేసు కుంటే రుచి అదిరిపోతుందని ప్రతీతి. అందుకే వీటిని తమ పొలాల్లో పండించడానికి ఎంతోమంది రైతులు ఈ విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళతారు.

ప్రస్తుతం విత్తనాల కోసమే ఇక్కడ 50 ఎకరాల్లో చిత్రాడ బీరను సాగు చేస్తున్నారు. కాయలు బాగా ఎండిన తర్వాత విత్తనాలు తీసి, కిలో రూ.1,500 చొప్పున అమ్ముతారు. ప్రస్తుతం హైబ్రిడ్ రకాలు ఎన్ని వచ్చినా చిత్రాడ బీర రుచి ముందు దిగదుడుపేనని మూడు తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న నాగసత్యవతి వివరించారు.
్యవసాయం లో యాంత్రీకరణ Farm Machineryత్రీకరణ Farm Machinery

పంటల అవసరానికి మించి యూరియా వినియోగిస్తున్నరైతులు» డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలతో పోలిస్తే యూరియా అగ్వ» దీంతో యూరియా వై...
15/09/2025

పంటల అవసరానికి మించి యూరియా వినియోగిస్తున్నరైతులు

» డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలతో పోలిస్తే యూరియా అగ్వ

» దీంతో యూరియా వైపే మొగ్గు..

» నిరుటికన్నా పెరిగిన అమ్మకాలు
దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు.. విదేశాల నుంచి దిగుమతులూ తగ్గడంతో యూరియాకు కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అయితే రైతుల తీరూ ఈ కొరతకు కారణమే అనిపిస్తోంది. వేసిన పంటలకు మోతాదుకు మించి ఇష్టారీతిన చల్లటం, భవిష్యత్తు అవసరాల కోసం బస్తాలకు బస్తాలు నిల్వ చేసి పెట్టు కోవడం, డీఏపీ, కాంప్లెక్ ఎరువుల ధరతో పోలిస్తే తక్కువ ధరకే లభ్యమవుతున్న కారణంగా అన్నదా తలు యూరియావైపే మొగ్గుచూపుతుండటంతో అది బంగారమవుతోంది. పైగా వ్యవసాయేతర అవసరా లకూ యూరియాను మళ్లించడం, సరుకును వ్యాపా రులు బ్లాక్ మార్కెట్ కు తరలించడంతోనూ సాగు అవసరాల కోసం యూరియాకు తీవ్ర కొరత ఏర్ప డింది. ఆశ్చర్యం ఏమిటంటే.. వచ్చే యాసంగి సీజన్ లో సాగుచేసే పంటలకోసం కూడా కొందరు రైతులు యూరియా బస్తాలు కొనుగోలుచేసి నిల్వచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery లో యాంత్రీకరణ Farm Machinery

ఎరువులు ఉచితం!అజొల్లా విత్తనం వేస్తే చాలు... వారంలో ఆ పొలమంతా పచ్చగా పరుచుకుని టన్నుల కొద్దీ ఎరువుగా మారుతుంది. ఇక అక్కడ...
14/09/2025

ఎరువులు ఉచితం!

అజొల్లా విత్తనం వేస్తే చాలు... వారంలో ఆ పొలమంతా పచ్చగా పరుచుకుని టన్నుల కొద్దీ ఎరువుగా మారుతుంది. ఇక అక్కడ నుంచి రోజూ రెండు కేజీల చొప్పున నత్రజనినీ, ఇతర ఎరువులనీ పంటపొలాలకు అందిస్తుంది. ఈ మొక్క పొలంలో ఉంటే ఏడాదికి 450 కేజీల నత్రజనితోపాటు ఇతరత్రా ఎరువులు ఉచితంగా అందినట్లే: అందుకే దీన్ని 'లివింగ్ బయో ఫెర్టిలైజర్ అంటారు. వియత్నాం, చైనా దేశాలు రసాయన ఎరువులకు బదులుగా పందల ఏళ్లుగా ఈ మొక్కని వరిపంటలో ఎరువుగా ఉపయోగిస్తున్నాయి. 'ఈ మొక్కతో ఎరువులకయ్యే ఖర్చు మాత్రమే కాదు... కలుపు మొక్కల నివారణకయ్యే ఖర్చులూ కలిసివస్తాయి. ఎందుకంటే అజొల్లా ఉన్న చోట కలుపు మొక్కలు పెరగవు, దోమలు దరిచేరవు. వరిలో దీనిని అంతరపంటగా వేయడం వల్ల రైతులకు సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి 20 శాతం పెరుగుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

పెరట్లోనే దాణా

వ్యవసాయం చేసే రైతులకి మాత్రమే అజొల్లా ప్రయోజనాలు పరిమితం అనుకుంటే పొరపాటు, పాడి, పౌల్ట్రీ, ఆక్వా రంగాల్లో ఉండేవారికి ఈ మొక్క ఎంతో మేలు చేస్తుంది. పశువులూ, కోళ్లూ, చేపల్లాంటి వాటిని పెంచాలంటే రైతులు దాణాకే ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ అజొల్లాని దాణాగా ఉపయోగించడం వల్ల 60శాతం ఖర్చు తగ్గుతుందట. ఎందుకంటే ప్రొటీన్లూ, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉండే ఈ మొక్కలని ఆవులూ, గేదెలతోపాటు చేపలూ. కోళ్లూ, మేకలూ, కుందేళ్లూ ఇష్టంగా తింటాయి. బయట కిలో దాణా ఖర్చు రూ.80 రూపాయలుంటే కిలో అజొల్లాని పెంచడానికి రూపాయిలోనే ఖర్చు అవుతుంది. ఈ మొక్కని పెంచుకోవడం కష్టం కూడా కాదు. పెరట్లోనూ, దాబా సైనా, కుంటల్లో, కుండీల్లో ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు.. అందుకే కేరళ, తమిళనాడుల్లో పెద్దఎత్తున ఈ మొక్కని సాగుచేస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, కామారెడ్డి ప్రాంతాల్లోని రైతులు అజొల్లాని సాగులో భాగం చేసుకుంటున్నారు. స్టార్టప్ కంపెనీల్లో కొన్ని.... దీన్ని రెడీమేడ్ ఎరువుగా మార్చి ఆన్లైన్లో అమ్ముతుంటే, మరికొన్ని జీవ ఇంధనంగా మార్చి కార్పొరేట్ కంపెనీలకు అమ్మి పెద్దఎత్తున లాభపడుతున్నాయి. ఈసాగు పట్ల ఆసక్తి పెరగడంతో ప్రభుత్వాలు కూడా విత్తనాలు కొనడానికీ, ప్లాస్టిక్ షీట్ల కొనుగోళ్లకీ మహిళలకు రాయితీలు ఇచ్చి ప్రోత్స హిస్తున్నాయి. మొక్క చిన్నదే కానీ ప్రయోజనాలు ఘనం.

వ్యవసాయ క్షేత్రాల్లో బీర్ సీసాల ముక్కల వల్ల రైతుల సమస్యగ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల పెరుగుతున్న సమస్యల్లో ఒకటి బీర్ సీసాలను...
14/09/2025

వ్యవసాయ క్షేత్రాల్లో బీర్ సీసాల ముక్కల వల్ల రైతుల సమస్య

గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల పెరుగుతున్న సమస్యల్లో ఒకటి బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పొలాల్లో పడేయడం. రోడ్ల పక్కన, పంట పొలాల్లో మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను విసిరేయడం సాధారణంగా మారింది. వీటిలో చాలావరకు పగిలిపోవడంతో గాజు ముక్కలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

పొలాల్లో పని చేసే రైతులు, మహిళలు, పశువులు ఈ గాజు ముక్కలపై కాలు పెట్టి గాయపడుతున్నారు. చిన్న చిన్న గాయాలనుంచి తీవ్రమైన గాయాల వరకు రైతులు ఎదుర్కొంటున్నారు. పంట కోత సమయంలో ఈ ముక్కలు పంటలో కలిసిపోవడంతో నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా వరి కోతలో ఈ సమస్య మరింతగా ఎదురవుతోంది.

రైతులు చెబుతున్నదేమిటంటే – మద్యం తాగేవారు రోడ్డు పక్కన కూర్చుని సీసాలను పగలగొట్టి పొలాల్లో పడేస్తారని. ఆ గాజు ముక్కలు నేలలో కలిసిపోవడంతో తొలగించడం కూడా కష్టమవుతోంది. పశువులు గాయపడి చావడానికి కూడా కారణమవుతున్నాయి.

ప్రజల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోవడం బాధాకరం. అందువల్ల అధికారులు, గ్రామ పెద్దలు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి పనులను ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగడం, సీసాలను విసరడం వంటి చర్యలను అరికట్టాలి.

వ్యవసాయం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుల శ్రమను గౌరవించాలి. గాజు సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, సురక్షితంగా నిర్వహించడం వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery చేయండి. వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

గుండె పోటు ముప్పు పెరుగుతున్నది – నిపుణుల హెచ్చరికన్యూఢిల్లీ: టైప్–2 మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు మరింతగా ప...
13/09/2025

గుండె పోటు ముప్పు పెరుగుతున్నది – నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ: టైప్–2 మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం శరీరంలో రక్తనాళాలను దెబ్బతీస్తూ గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు వెల్లడించాయి.



మధుమేహం – గుండె సంబంధం
• రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ కావడం వల్ల రక్తనాళాల గోడలు కఠినతరం అవుతాయి.
• దీంతో రక్తప్రసరణ సరిగా జరగక గుండెకు ముప్పు పెరుగుతుంది.
• గుండె పోటు, స్ట్రోక్, రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశముంది.



వైద్యుల సూచనలు
1. మధుమేహం ఉన్నవారు తరచుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి.
2. రక్తంలో చక్కెర స్థాయులను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
3. నిత్యం వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.
4. పొగ తాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానుకోవాలి.



పరిశోధకుల హెచ్చరిక

ఇటీవల వెలువడిన ఒక వైద్య పరిశోధనలో – మధుమేహం ఉన్నవారిలో గుండె పోటు వచ్చే అవకాశం 2–3 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. రక్తనాళాల బలహీనత, కొవ్వు పేరుకుపోవడం, రక్తపోటు పెరగడం వల్ల ఈ ప్రమాదం మరింత అధికమవుతుంది.



తేలికైన మార్పులు – పెద్ద రక్షణ

డాక్టర్ల సూచనల మేరకు జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే మధుమేహం ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా నడక, సంతులిత ఆహారం, బరువు నియంత్రణ, ఒత్తిడి తగ్గించడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



🌿 మధుమేహాన్ని కట్టడి చేస్తే గుండెను రక్షించుకోవచ్చు అని నిపుణులు పునరుద్ఘాటిస్తున్నారు.
Share & save

7 రోజుల్లోనే ‘సేంద్రియ ఎరువు’హైదరాబాద్‌కు చెందిన యువతి సమతా అభివృద్ధి చేసిన వినూత్న పరికరం వ్యవసాయ రంగంలో పెద్ద మార్పును...
13/09/2025

7 రోజుల్లోనే ‘సేంద్రియ ఎరువు’

హైదరాబాద్‌కు చెందిన యువతి సమతా అభివృద్ధి చేసిన వినూత్న పరికరం వ్యవసాయ రంగంలో పెద్ద మార్పును తీసుకువస్తోంది. ఈ యంత్రం సహాయంతో కేవలం 7 రోజుల్లోనే పచ్చి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేయొచ్చు. సాధారణంగా కాంపోస్ట్ తయారవ్వడానికి 60 రోజులు పట్టే పనిని ఈ యంత్రం వారంలోనే పూర్తి చేస్తుంది.

పరికరం ప్రత్యేకత
• పండ్ల తొక్కలు, కూరగాయల అవశేషాలు, ఆహార వ్యర్థాలు వంటి చెత్తను వేసి 7 రోజుల్లోనే నాణ్యమైన ఎరువుగా మార్చేస్తుంది.
• ఒకేసారి 400 కిలోల వరకు వ్యర్థాలను ప్రాసెస్ చేయగలదు.
• వ్యవసాయానికి అవసరమైన సేంద్రియ ఎరువును తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అందిస్తుంది.

రైతులకు లాభాలు

ఈ యంత్రం రైతులకు ద్విగుణీకృత లాభాలను ఇస్తుంది.
1. పంటలకు రసాయనాల కంటే సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి వస్తుంది.
2. పచ్చి చెత్త సమస్య కూడా తగ్గుతుంది.
3. పర్యావరణానికి మేలు కలుగుతుంది.

సమతా లక్ష్యం

సమతా అభిప్రాయం ప్రకారం – “ప్లాస్టిక్, రసాయనాల వాడకం తగ్గించడమే కాకుండా, సహజమైన పద్ధతుల్లో పంటలు పండించాలనే సంకల్పంతోనే ఈ యంత్రం రూపొందించాం. రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపింది.

భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటికే ఈ పరికరాన్ని పలు ప్రాంతాల్లో ప్రదర్శించి రైతుల ప్రశంసలు అందుకున్నారు. వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, రైతులకు తక్కువ ధరలో అందించే ప్రయత్నంలో ఉన్నారు.

🌱 పచ్చి చెత్త సమస్యకు పరిష్కారం, రైతులకు ఆశాజ్యోతి, పర్యావరణానికి రక్షణగా నిలుస్తున్న ఈ సేంద్రియ ఎరువు యంత్రం వ్యవసాయ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుంది.

తల్లి తండ్రుల బాధ వివరించలేం. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఇలాంటి ఘటనలు జరగకుండా, అందరూ జాగ్రత్త పడేలా షేర్ చేయండి.🔹వాటర...
12/09/2025

తల్లి తండ్రుల బాధ వివరించలేం. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఇలాంటి ఘటనలు జరగకుండా, అందరూ జాగ్రత్త పడేలా షేర్ చేయండి.
🔹వాటర్ హీటర్ పట్టుకుని బాలుడు మృతి.

పేపర్ కప్ప.. క్యాన్సర్ ముప్పుఇటీవలి కాలంలో టీ, కాఫీ షాపులలో పేపర్ కప్పుల వినియోగం విస్తృతమైంది. ప్లాస్టిక్ కప్పుల వాడకాన...
12/09/2025

పేపర్ కప్ప.. క్యాన్సర్ ముప్పు

ఇటీవలి కాలంలో టీ, కాఫీ షాపులలో పేపర్ కప్పుల వినియోగం విస్తృతమైంది. ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని తగ్గించడానికి పేపర్ కప్పులను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం పేపర్ కప్పులలో వేడి పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

పేపర్ కప్పుల లోపల సన్నని ప్లాస్టిక్ పొర (పాలిథిలిన్) ఉంటుంది. వేడి టీ, కాఫీ వంటివి పోయినప్పుడు ఈ పొర కరిగి మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదల అవుతాయి. వీటిని మనం తాగినప్పుడు అవి శరీరంలో పేరుకుపోతాయి. ఇది క్రమంగా గుండె సంబంధిత వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, కిడ్నీ సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక పరిశోధన ప్రకారం, ఒక్క పేపర్ కప్పులో 100 మిల్లీలీటర్ల వేడి పానీయం పోసిన 15 నిమిషాల్లో దాదాపు 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలు పానీయంలో కలుస్తాయి. ఇవి నేరుగా మన శరీరంలోకి చేరుతాయి.

ప్రత్యామ్నాయాలు

వైద్యులు, పర్యావరణ నిపుణులు పేపర్ కప్పుల బదులు స్టీల్, గాజు లేదా మట్టి పాత్రలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇవి పర్యావరణానికీ మేలు చేస్తాయి, ఆరోగ్యానికీ హానికరం కావు.

సారాంశం:
ప్లాస్టిక్‌కు పేపర్ కప్పులు ప్రత్యామ్నాయం అయినా, అవి కూడా పూర్తిగా సురక్షితం కావు. ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే సంప్రదాయ పాత్రల వాడకం ఉత్తమం.

ఇకనుండి ఏ స్కూలైనా సరే - ప్రభుత్వ పాఠశాల కావచ్చు,ప్రైవేట్ స్కూలు కావచ్చు, CBSE కావచ్చు,మిషనరీ స్కూల్ కావచ్చు  - గోరింటాక...
12/09/2025

ఇకనుండి ఏ స్కూలైనా సరే - ప్రభుత్వ పాఠశాల కావచ్చు,ప్రైవేట్ స్కూలు కావచ్చు, CBSE కావచ్చు,మిషనరీ స్కూల్ కావచ్చు - గోరింటాకు పెట్టుకున్నారనో,బొట్టు పెట్టుకున్నారనో,చేతికి తాడు కట్టుకున్నారనో ఏ విద్యార్థినీ బయటకు పంపలేరు. ఆర్డర్స్ పాస్ చేసిన కేంద్రప్రభుత్వం.

Address

Road No 19
Chanda Nagar
500091

Alerts

Be the first to know and let us send you an email when వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share