వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery Agriculture information, farming vlogs, Tractors and implements Digital Creator in Agri and Farming.

            వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machineryy
30/06/2025

వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machineryy

సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ                   -ప్రొ. యశ్‌పాల్‌             ‘జనవిజ్ఞానం’ సౌజన్యంతో అతడో పల్లెటూరి రైతు....
29/06/2025

సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ
-ప్రొ. యశ్‌పాల్‌
‘జనవిజ్ఞానం’ సౌజన్యంతో

అతడో పల్లెటూరి రైతు. అతనికి వున్నదల్లా ఓ పంపుసెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగమూ అతనికి తెలుసు. దాని ప్రతి కదలికా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడూ అది మొరాయిస్తుంది. అయితేనేం? దాన్ని బుజ్జగించి (మరమ్మతు చేసి) దారిలో పెట్టుకోవడం అతనికి చిటికెలో పని! ఆ రైతు కొడుక్కి పదేళ్లు. వాడికి ఈ పంపుసెట్టు పని అంటే మహా సరదా.

జుగాడ్‌ ఇలా పుట్టింది…
ఒకరోజు మన రైతు మెదడులో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. ‘ఈ డీజిల్‌ పంపు సెట్టుని బండి చక్రాలకు జత చేస్తే ఎలా ఉంటుంది?’ ఇదీ అతని ఆలోచన. వడ్రంగి దగ్గరికి వెళ్లి ఓ బండి చేయించాడు. చక్రాలకు టైర్లు తొడిగించాడు. పంజాబులో చెడిపోయిన సైనిక జీపులు కావలసినన్ని దొరుకుతాయి. వాటి నుంచి కొంత సామగ్రి సంపాదించాడు. ఇంకేం మన బండికి స్ప్రింగు, షాక్‌ అబ్జార్బర్లు, గేరు బాక్స్‌, క్లచ్‌, స్టీరింగ్‌ అన్నీ సమకూరాయి.

ఇప్పుడు బండి చక్రాలకు పంపు సెట్టును ఓ బెల్టుతో మన రైతు అనుసంధానించాడు. అంతా కలిపి రూ.40 వేలు ఖర్చయింది. పదిమంది దీంట్లో ఎక్కవచ్చు. గంటకు 40 కిలోమీటర్లు పోతుంది. దీనికి ‘మారుత’ అనే పేరు పెట్టి మన రైతు గారు సకుటుంబంగా ఎక్కి ‘చల్‌ చల్‌ బండి’ అంటూ షికార్లు కొట్టసాగాడు.

ఇంకేముంది చూస్తుండగానే ఇది ‘రైతు మోటారు’గా మారిపోయింది. రైతులందరూ ఇదే దారి పట్టారు. కొందరైతే ఈ వాహన నిర్మాణ కళాకౌశలం కరతలామలకం చేసుకొని నిపుణులైపోయారు! వాడుకలో దీనిపేరు జుగాడ్‌’గా స్థిరపడింది. పంజాబ్‌ నుండి హర్యానాకు, అక్కడి నుండి రాజస్థాన్‌కు పాకి పోయింది.

క్రమంగా ఈ ‘పల్లెటూరు టాక్సీ’ ధర కూడా తగ్గిపోయింది. సొంతదారులే రిపేర్లు చెయ్యడం నేర్చుకోవడంతో పోషణా పాలనా మరింత సులువై కంపెనీ వాహనాలకు కష్టకాలం వచ్చేసింది!

తేనెటీగలతో మ్యాజిక్కు
పాటియాలాలో మరో రైతు. అక్కడో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం వుంది. దాని సాయంతో అక్కడి రైతులు సంవత్సరానికి నాలుగు పంటలు పండిస్తున్నారు. అయినా ‘సరిపోక’ మన రైతు ఒకరోజు ఆ కేంద్రానికి వెళ్లి ‘నేను మధ్యంతర పంటగా పొద్దు తిరుగుడు వేశాను’ అని అక్కడి శాస్త్రజ్ఞులకు సెలవిచ్చాడు. వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది.
‘ఆశపోతు అమాయక శిఖామణి’ అనుకొని ‘పొద్దుతిరుగుడు కూడా వేస్తే పక్షులు ఎక్కువై అసలు పంటకే మోసం వస్తుంది తెలుసుకో’ అని మందలించారు.

అందుకా రైతు ‘ఇన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఆ మాత్రం తెలీదా నాకు. అందుకే పొలంలో తేనెటీగలను కూడా పెంచుతున్నా’ అని చెప్పి వాళ్ళని ‘ఓరి పిచ్చి దద్దమ్మల్లారా’ అన్నట్టు చూశాడు. ‘తేనెటీగలు పక్షులకు ప్రత్యామ్నాయ ఆహారం ఇచ్చి పంట జోలికి పోకుండా చూస్తాయి’. దీనికి జవాబు దొరక్క, ఏ పి.హెచ్‌.డి కి దీన్ని ఎవరూ సబ్జెక్టుగా తీసుకున్న దాఖలా కనిపించక శాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కొన్నారు. రైతు మాత్రం నాలుగు పంటలు, పొద్దు తిరుగుడుతో పాటు కావలసినంత తేనె కూడా ‘పండించుకున్నాడు’.

అంతా శ్రమైకజీవన ఫలం. ఇలాంటి కథలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆదిమ మానవుడు గుహాంతరాల నుంచి ప్రస్థానం ప్రారంభించి, సహస్రాబ్దాలనూ సముద్రాలనూ దాటి ఇంత దూరం ప్రయాణించడమంతా ఎలా జరిగింది? సామాన్య మానవుడి శ్రమైక జీవనం, అనుభవ పాండిత్యం, వ్యవహార విజ్ఞానం, ఆలోచనా శైలి, పని నైపుణ్యం, కళా కౌశలం కంటే శాస్త్రాన్నీ, చరిత్రనూ ఇంత దూరం నడిపించిన శక్తులేమున్నాయి? మన ఇతిహాస పురాణ కావ్యాల రచయితలుగా పండితులుగా కొందరిని మనం చెప్పుకోవచ్చు. కానీ వీటి మూలాలను మనం ఈ అనామక సామాన్య మానవ జీవన స్రవంతుల నుంచి గాక ఎక్కడ వెతకాలి? ఈ ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి.

నేడు ఆయుర్వేద ఔషధాలు ఏ మహానుభావుల పేర్లతోనైనా చలామణి కావచ్చు. కానీ వాటిని వెతికి పట్టుకున్నదీ, పరీక్షించిందీ మన ‘అనాగరిక ఆటవికులే’ కదా! చెకుముకి నుంచి నిప్పు రాజేసిన వాడు, కొయ్య దుంగల నుంచి చక్రాన్ని దొర్లించిన వాడు సగటు మనిషి గాక మరెవడని గదా మనం గుర్తించాల్సింది? సమిష్టి జీవన పోరాటం నుంచి గాక ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని గదా మనం తర్కించాల్సింది.

శాస్త్రం రెక్కలు తొడిగాక, పరిశోధనా సంస్థలు వెలిశాక, విశ్వ రహస్యాలను ఛేదించే రోజు వచ్చాక శాస్త్రమూ సగటు మనిషీ ఎవరికి వారైపోతున్నారా? ఈ సహస్రాబ్దపు మహా మేధావులెవరు? తత్వవేత్తలెవరు? పరిశోధకులెవరువ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery ఈ సామాన్యులకు స్థానం ఎక్కడైనా దొరుకుతోందా? వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

28/06/2025

దినేష్ జైన్ అనే అతని బిడ్డ కనిపించుట లేదు...మిత్రులారా, మీ అందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నా బిడ్డ నిన్న 11:...
27/06/2025

దినేష్ జైన్ అనే అతని బిడ్డ కనిపించుట లేదు...

మిత్రులారా, మీ అందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నా బిడ్డ నిన్న 11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి ఏడుస్తోంది. మీ అందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నా బిడ్డను కనుగొనడంలో మీరు సహాయం చేయండి. నా బిడ్డ ఫోటోను వీలైనన్ని ఎక్కువ మంది కి షేర్ చేయండి. మరియు మీకు ఏదైనా సమాచారం తెలిస్తే, ఇచ్చిన నంబర్లకు కాల్ చేయండి
మిత్రులారా, సమయం వృధా చేయకుండా, వెంటనే మీ గ్రూప్‌లో షేర్ చేయండి. 9221402598

మీ (దినేష్ జైన్)

27/06/2025

కొంచెం కార్తెల మీద అవగాహన పెంచుకోండి దీనివల్ల మీకు పంట ఏది వేయాలి అలాగే ఈ యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనే అవగాహన వస్తుంది....
25/06/2025

కొంచెం కార్తెల మీద అవగాహన పెంచుకోండి దీనివల్ల మీకు పంట ఏది వేయాలి అలాగే ఈ యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనే అవగాహన వస్తుంది.
ట్రెండు మారి పాతతరం వచ్చినట్టు మళ్లీ మనకు ఇవి ఎంతగానో సహకారం అందిస్తాయి.
మన పూర్వీకుల జ్ఞానం వృధాగా పోదు దయచేసి ప్రతి రైతన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machineryrm Machinery

పెళ్లయిన నెలకే భర్తను చంపించిన భార్య !*నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి*అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగిత...
23/06/2025

పెళ్లయిన నెలకే భర్తను చంపించిన భార్య !
*నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి
*అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం
*అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం
*ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్‌
*ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం
*హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం
*పోలీసుల అదుపులో పలువురు నిందితులు?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. పెళ్లయిన నెలరోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా.. ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు.. ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌(32)కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని భావించారు. అయితే, ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్‌... తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్‌ 17న తేజేశ్వర్‌ అదృశ్య మవగా.. ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్‌ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా... ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి.

తల్లీకూతుళ్లతో ఉద్యోగికి సంబంధం?
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. అదే బ్యాంకులో క్యాషియర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్‌ను పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్‌ చేసిన ఐశ్వర్య... సదరు బ్యాంకు ఉద్యోగితో మాత్రం 2,000 సార్లు ఫోన్‌ మాట్లాడినట్టు పోలీసులు కాల్‌ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్‌ నాగేశ్‌ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారం.. కొంతమంది జూన్‌ 17న తేజేశ్వర్‌ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. తేజేశ్వర్‌ను వాహనంలో ఎక్కించుకొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Like & share వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery
20/06/2025

Like & share వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery

Please like & share
19/06/2025

Please like & share

Address

Road No 19
Chanda Nagar
500091

Alerts

Be the first to know and let us send you an email when వ్యవసాయం లో యాంత్రీకరణ Farm Machinery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share