
20/06/2025
20-6-2025
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ ప్రెసిడెంట్
7731000786
🌐🏜🚶🏻🚶🏻♀➖➖➖➖➖➖
నేడు 'ప్రపంచ శరణార్థుల దినోత్సవం' సందర్భంగా..!!
➖➖➖➖➖➖➖
★గతంలో ప్రపంచ యుద్దాలు జరిగినపుడు ఆయా దేశాల ప్రజలు శరణార్థులుగా మారేవారు. కానీ ప్రస్తుతం సంభవిస్తున్న ఉపద్రవాలు,కల్లోలాలు వల్ల కూడా ప్రజలు శరణార్థులుగా మారుతు న్నారు. ఐక్యరాజ్య సమితి వీరి సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి లో ఒక కమిషనరేట్ను నియమించి ప్రతీ ఏడాది ఆయా దేశాలలో ఉన్న సమస్యలు, శరణార్థుల వివరాలు సేకరించి వారి పునరావాసానికి చర్యలు చేపడుతొంది. జూన్ 20 వతేదీన అంతర్జాతీయ శరణా ్థుల దినోత్సవంగా నిర్వహిస్తున్నా రు. 2001 నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
■ To escape the violence, they leave everything behind – everything except their hopes and dreams for a safer future. UNHCR, the UN Refugee Agency, believes that all refugees deserve to live in safety.
● We stand together .
Please stand with us.
The petition asks governments to:
● Ensure every refugee child gets an education.
● Ensure every refugee family has somewhere safe to live.
● Ensure every refugee can work or learn new skills to make a positive contribution to their community.
■ శరణార్థులు సర్వం కోల్పోయి రక్షణ కోసం, నివాసం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే వారి భవిష్యత్ అంధకారంగా ఉండరాదు. వారు కూడా నిత్య జనజీవన స్రవంతిలో ఇతర పౌరులు మాదిరిగా జీవించాలన్నదే తన ప్రధాన ధ్యేయమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కిమూన్ పేర్కొంటున్నారు.
★ నేడు ప్రపంచ దేశాలకు శరణార్ధులు పెద్ద సమస్యగా మారింది. తాజా అంచనాల ప్రపంచ వ్యాప్తంగా 6.5కోట్ల మంది శరణార్థులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.*
■ 1990 ప్రాంతంలో కోట్లాది మంది శరణార్థులు ఏర్పడ్డారు. నాడు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు గల కారణం. నాడు 1.50 కోట్ల మంది తమ తమ స్వంత దేశంలోనే అన్ని ఆస్తులు పోగొట్టుకొని శరణార్థులుగా మారారు. మరో 2.70 కోట్ల మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు.
■ యుద్దాలు సంభవించినపుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, మతకల్లోలాలు జరిగినపుడు శరణార్థులు ఏర్పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి శరణార్దుల కోసం ఒక కమిషనరేట్ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కువుగా పాలస్తీనా దేశానికి చెందిన శరణార్ధులు ఎక్కువగా ఉన్నారు. వీరి లెక్కలు చూస్తే పాలస్తీనాకు చెందిన వారు 50లక్షల మంది ఉండగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారు 30 లక్షలు, ఇరాక్ శరణార్తులు 2 లక్షలు, సోమాలియన్లు ఏడు లక్షల మంది ఉన్నారు. ఇంకా కాంగోలియా వాసులు 5 లక్షలు, మయన్మార్ శరణార్దులు 4 లక్షలు, కొలబియన్లు 4 లక్షలు, సూడాన్ దేశస్తులు 4 లక్షల మంది ఉన్నారు. వీరందరి పునరావాసం కోసం ఐక్యరాజ్య సమితి నేటికి కృషి చేస్తూనే ఉంది.
■ సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సోమాలియా, దేశాలలో శరణార్ధుల సంఖ్య గత ఏడాది కంటే 8 శాతం పెరిగింది. దీనికి గల కారణం ఆయా దేశాలలో ఏర్పడిన సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. గత ఏడాది నివేదిక ప్రకారం 4,79,300 క్లయిమ్లు 44 దేశాలలో నమోదయ్యాయి. ఇలా ప్రతీ ఏడాది శరణార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
■ 1950 డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి జనరల్అసెంబ్లీ సమావేశమై వీరి గురించి తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులతో చర్చించింది. 1951 జూలై 28న వీరికోసం అంతర్జాతీయ చట్టాలను ఏర్పాటు చేసింది. 110 దేశాలలో 6,600 మంది సిబ్బంది శరణార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. 2000 సంవత్సరం డిసెంబరు 4న ఆఫ్రికా దేశానికి ఐక్యరాజ్యసమితి అండగా నిలిచి అక్కడ శరణార్థులను అక్కున చేర్చుకుంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ప్రతి ఏడాది వివిధ దేశాలలో వివిధ స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది.
■ ఈశాన్య ఆసియా దేశాలలో కూడా శరణార్థుల సమస్య నానాటికీ పెరుగుతొంది. గత ఏడాది జపాన్, కొరియా దేశాలలో 3,700 మంది శరణార్థులు మాత్రమే నమో దయ్యారు. అంతకుముందు 28 శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్లో శరణార్ధులు ఉన్నారు. ఆ తరువాత స్థానం సిరియాకు చెందుతుంది. చైనా, పాకిస్తాన్ దేశాల నుండి శరణార్థులు క్రమంగా పెరుగుతున్నారు.
■ శరణార్థులలో వృద్దుల నుండి పిల్లల వరకూ ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా యుద్ధాలు జరిగినపుడు శరణార్థులు మన దేశానికి వచ్చి చేరారు. అప్పట్లో వీరి పునరావాసానికి మన దేశం ఎన్నో చర్యలు చేపట్టింది.
◆ మనదేశంలో శరణార్థుల సమస్య పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది.*
★ ప్రపంచంలో ఉన్న 6 కోట్ల మంది శరణార్థులలో 3.50 కోట్ల మందికి పునరావాసం కల్పించగలిగారు. శరణార్థులకు నివాసంతో పాటు వారి పునరావాసానికి తగిన చర్యలు, వైద్యం, వారి పిల్లలకు చదువులు, పౌరసత్వం, ఉపాధిని కల్పించాల్సి ఉంది. కొన్ని దేశాలలో శరణార్థుల వల్ల మత కలహాలు ఏర్పడు తున్నాయి. వాటిని నివారించుకోవాల్సి అవసరం ఉంది. శరణార్థులలో 80 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. యుద్ధ శరణార్థులు కాకుండా క్షామం వల్ల, మత కల్లోలాలు, భూకంపాలు, ఉపద్రవాలు వల్ల ఎంతో మంది తమ జీవనాన్ని కోల్పోయి దుర్భర దారిద్రాన్ని అనుభవి స్తున్నారు. వీరిని అన్ని దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!