IHRC

IHRC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IHRC, Hyderabad.

20-6-2025షేక్ గౌస్ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRCనేషనల్ ప్రెసిడెంట్7731000786       🌐🏜🚶🏻🚶🏻‍♀➖➖➖➖➖➖నేడు 'ప్రపంచ శ...
20/06/2025

20-6-2025
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ ప్రెసిడెంట్
7731000786

🌐🏜🚶🏻🚶🏻‍♀➖➖➖➖➖➖
నేడు 'ప్రపంచ శరణార్థుల దినోత్సవం' సందర్భంగా..!!
➖➖➖➖➖➖➖

★గతంలో ప్రపంచ యుద్దాలు జరిగినపుడు ఆయా దేశాల ప్రజలు శరణార్థులుగా మారేవారు. కానీ ప్రస్తుతం సంభవిస్తున్న ఉపద్రవాలు,కల్లోలాలు వల్ల కూడా ప్రజలు శరణార్థులుగా మారుతు న్నారు. ఐక్యరాజ్య సమితి వీరి సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి లో ఒక కమిషనరేట్‌ను నియమించి ప్రతీ ఏడాది ఆయా దేశాలలో ఉన్న సమస్యలు, శరణార్థుల వివరాలు సేకరించి వారి పునరావాసానికి చర్యలు చేపడుతొంది. జూన్‌ 20 వతేదీన అంతర్జాతీయ శరణా ్థుల దినోత్సవంగా నిర్వహిస్తున్నా రు. 2001 నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

■ To escape the violence, they leave everything behind – everything except their hopes and dreams for a safer future. UNHCR, the UN Refugee Agency, believes that all refugees deserve to live in safety.

● We stand together .
Please stand with us.

The petition asks governments to:

● Ensure every refugee child gets an education.

● Ensure every refugee family has somewhere safe to live.

● Ensure every refugee can work or learn new skills to make a positive contribution to their community.

■ శరణార్థులు సర్వం కోల్పోయి రక్షణ కోసం, నివాసం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే వారి భవిష్యత్‌ అంధకారంగా ఉండరాదు. వారు కూడా నిత్య జనజీవన స్రవంతిలో ఇతర పౌరులు మాదిరిగా జీవించాలన్నదే తన ప్రధాన ధ్యేయమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్‌ పేర్కొంటున్నారు.

★ నేడు ప్రపంచ దేశాలకు శరణార్ధులు పెద్ద సమస్యగా మారింది. తాజా అంచనాల ప్రపంచ వ్యాప్తంగా 6.5కోట్ల మంది శరణార్థులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.*

■ 1990 ప్రాంతంలో కోట్లాది మంది శరణార్థులు ఏర్పడ్డారు. నాడు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు గల కారణం. నాడు 1.50 కోట్ల మంది తమ తమ స్వంత దేశంలోనే అన్ని ఆస్తులు పోగొట్టుకొని శరణార్థులుగా మారారు. మరో 2.70 కోట్ల మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు.

■ యుద్దాలు సంభవించినపుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, మతకల్లోలాలు జరిగినపుడు శరణార్థులు ఏర్పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి శరణార్దుల కోసం ఒక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కువుగా పాలస్తీనా దేశానికి చెందిన శరణార్ధులు ఎక్కువగా ఉన్నారు. వీరి లెక్కలు చూస్తే పాలస్తీనాకు చెందిన వారు 50లక్షల మంది ఉండగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారు 30 లక్షలు, ఇరాక్‌ శరణార్తులు 2 లక్షలు, సోమాలియన్లు ఏడు లక్షల మంది ఉన్నారు. ఇంకా కాంగోలియా వాసులు 5 లక్షలు, మయన్మార్‌ శరణార్దులు 4 లక్షలు, కొలబియన్లు 4 లక్షలు, సూడాన్‌ దేశస్తులు 4 లక్షల మంది ఉన్నారు. వీరందరి పునరావాసం కోసం ఐక్యరాజ్య సమితి నేటికి కృషి చేస్తూనే ఉంది.

■ సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, సోమాలియా, దేశాలలో శరణార్ధుల సంఖ్య గత ఏడాది కంటే 8 శాతం పెరిగింది. దీనికి గల కారణం ఆయా దేశాలలో ఏర్పడిన సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. గత ఏడాది నివేదిక ప్రకారం 4,79,300 క్లయిమ్‌లు 44 దేశాలలో నమోదయ్యాయి. ఇలా ప్రతీ ఏడాది శరణార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

■ 1950 డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి జనరల్‌అసెంబ్లీ సమావేశమై వీరి గురించి తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులతో చర్చించింది. 1951 జూలై 28న వీరికోసం అంతర్జాతీయ చట్టాలను ఏర్పాటు చేసింది. 110 దేశాలలో 6,600 మంది సిబ్బంది శరణార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. 2000 సంవత్సరం డిసెంబరు 4న ఆఫ్రికా దేశానికి ఐక్యరాజ్యసమితి అండగా నిలిచి అక్కడ శరణార్థులను అక్కున చేర్చుకుంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ ప్రతి ఏడాది వివిధ దేశాలలో వివిధ స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది.

■ ఈశాన్య ఆసియా దేశాలలో కూడా శరణార్థుల సమస్య నానాటికీ పెరుగుతొంది. గత ఏడాది జపాన్‌, కొరియా దేశాలలో 3,700 మంది శరణార్థులు మాత్రమే నమో దయ్యారు. అంతకుముందు 28 శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్‌లో శరణార్ధులు ఉన్నారు. ఆ తరువాత స్థానం సిరియాకు చెందుతుంది. చైనా, పాకిస్తాన్‌ దేశాల నుండి శరణార్థులు క్రమంగా పెరుగుతున్నారు.

■ శరణార్థులలో వృద్దుల నుండి పిల్లల వరకూ ఉన్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా యుద్ధాలు జరిగినపుడు శరణార్థులు మన దేశానికి వచ్చి చేరారు. అప్పట్లో వీరి పునరావాసానికి మన దేశం ఎన్నో చర్యలు చేపట్టింది.

◆ మనదేశంలో శరణార్థుల సమస్య పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది.*

★ ప్రపంచంలో ఉన్న 6 కోట్ల మంది శరణార్థులలో 3.50 కోట్ల మందికి పునరావాసం కల్పించగలిగారు. శరణార్థులకు నివాసంతో పాటు వారి పునరావాసానికి తగిన చర్యలు, వైద్యం, వారి పిల్లలకు చదువులు, పౌరసత్వం, ఉపాధిని కల్పించాల్సి ఉంది. కొన్ని దేశాలలో శరణార్థుల వల్ల మత కలహాలు ఏర్పడు తున్నాయి. వాటిని నివారించుకోవాల్సి అవసరం ఉంది. శరణార్థులలో 80 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. యుద్ధ శరణార్థులు కాకుండా క్షామం వల్ల, మత కల్లోలాలు, భూకంపాలు, ఉపద్రవాలు వల్ల ఎంతో మంది తమ జీవనాన్ని కోల్పోయి దుర్భర దారిద్రాన్ని అనుభవి స్తున్నారు. వీరిని అన్ని దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!

15-06-25గౌస్ షేక్ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ కమీషన్నేషనల్ ప్రెసిడెంట్7731000786*Happy Father's Day ఫాదర్స్ డే ఎలా పుట్టిం...
15/06/2025

15-06-25
గౌస్ షేక్
ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ కమీషన్
నేషనల్ ప్రెసిడెంట్
7731000786

*Happy Father's Day ఫాదర్స్ డే ఎలా పుట్టింది..? ఎందుకు జరుపుకోవాలి..? చరిత్ర ఏం చెబుతోంది..!!*

నాన్న శ్రమజీవి.. కుటుంబ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తాడు. కుటుంబ బాధ్యతలు మోస్తూ.. తన జీవితంలోని సంతోషాలను కోల్పోతాడు.

తన ఇష్టాలు మర్చిపోయి.. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. తన పొట్టకట్టుకుని పిల్లల కడుపు నింపేందుకు అహార్నిశలు కష్టపడుతుంటాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది. తల్లి నవమోసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే.. ఆ బిడ్డను జీవితాంతం తండ్రి చూసుకుంటాడు. అయినా సమాజంలో తల్లికి దక్కిన ప్రేమ.. ఎందుకో తండ్రికి లేదనిపిస్తుంటుంది.

అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే .. నాన్న కష్టాలు రాకుండా కావలి కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై జీవన పోరాటం చేస్తాడు. తన అలసటని కూడా కనపడనీయకుండా బతుకుబండిని నడిపిస్తాడు. కుటుంబ కోసం తన జీవితాన్ని ధారబోసే తండ్రి ప్రేమ, త్యాగానికి గుర్తుగా ప్రతి యేటా ఫాదర్స్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది (2025) ఫాదర్స్ డే జూన్ 15వ తేదీన వచ్చింది. అసలు ఫాదర్స్ డే ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా మొదలైంది.. దాని చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

*జూన్ 15న ఫాదర్స్ డే..!!*

మనకు జీవితాన్ని ఇచ్చిన అమ్మా,నాన్నల్ని ప్రతిరోజు ప్రేమిస్తాం.. గౌరవిస్తాం. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకప్పుడు మనకు తెలియని ఫాదర్స్ డే, మదర్స్ డే లు మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఇండియాలో కూడా ఈ సెలబ్రేషన్స్‌కి ఇంపార్టెన్స్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఫాదర్స్ డే ఏటా జూన్ నెలలో వచ్చే మూడవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 15న ఫాదర్స్ డే. మన ఎదుగుదలకు కారణమైన తండ్రికి శుభాకాంక్షలు చెప్పడం.. బహుమతులు ఇవ్వడం.. వారి ఆశీస్సులు అందుకోవడం చేస్తారు.

*ఫాదర్స్ డే చరిత్ర..!!*

ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక చరిత్ర ఉంది. మొదటగా యునైటెడ్ స్టేట్స్‌లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. 1909లో సొనోరా అనే మహిళ సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన మదర్స్ డే సెలబ్రేషన్స్‌కి వెళ్తున్నప్పుడు పాదర్స్ డే జరపాలని ఆలోచన వచ్చిందట. సొనోరా తల్లి 16 సంవత్సరాల వయసులో చనిపోయిందట. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ ప్రసిద్ధ కవి, రచయిత మరియు శిల్పి. తనతో కలిపి ఐదుగురు తోబుట్టువులను పెంచడంలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని సొనోరా గ్రహించారట.

తండ్రులు కూడా గుర్తింపు ఇవ్వాలని వారు కూడా ప్రశంసలకు పాత్రులని భావించి స్పోకేన్ మినిస్టీరియల్ అసోసియేషన్‌కు ఫాదర్స్ డే ఆలోచనను ప్రతిపాదించారట సొనోరా. అలా మొదటి ఫాదర్స్ డే 1910 జూన్ 19న వాషింగ్టన్‌లోని స్పోకెన్‌లో జరిపారు. 1972 నుంచి రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఫాదర్స్ డే అధికారికంగా యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ సెలవుదినంగా గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఫాదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవుదినంగా నిర్వహించుకోవడం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది.

*తండ్రికి కూతురితో అనుబంధం..!!*

తండ్రికి కొడుకుతో కన్నా కూతురుతో ఉండే అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఏ విషయాన్నైనా తండ్రికి షేర్ చేయడానికి కొడుకు భయపడితే.. కూతురు ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మెట్టినింటికి వెళ్లిపోతుంటే తల్లి పైకి వెక్కి వెక్కి ఏడుస్తుంటే తండ్రి లోలోపల కుమిలిపోతాడు. కొడుకు పట్ల అమితమైన ప్రేమ ఉన్నా.. బాధ్యతలు నేర్పడంలో కాస్త కఠినంగా ప్రవర్తిస్తాడు తండ్రి . అయినా బిడ్డలంటే తండ్రికి పంచ ప్రాణాలు.

*తండ్రి కష్టం గురించి!!*

నిజంగానే నాన్న కష్టం గురించి మాట్లాడుకుంటే సమాజంలో పెద్దగా చర్చ జరగదు. కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రి పడే కష్టం కంటికి కనిపించదు. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అంటూ ఒక్కొక్క బాధ్యతల్ని పూర్తి చేసి వారికి మంచి భవిష్యత్ అందించేదాకా తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. ఆడవారితో కంపేర్ చేస్తే మగవారి జీవితం ఎక్కువగా బయట ప్రపంచంలోనే గడిచిపోతుంది. పిల్లలతో గడపడం వారితో సంతోషాలు, సరదాలు తక్కువ అనే చెప్పాలి. కుటుంబాన్ని పోషించడానికి రోజంతా శ్రమ పడి వచ్చి కాసేపు తన బిడ్డలతో గడిపే సమయం అరుదుగా దొరుకుతుంది. తండ్రి అంటే పిల్లలకు ఎక్కడో చిన్న భయం ఉంటుంది. తండ్రి పెట్టే ఆ భయం వెనుక అతను ఇచ్చే భద్రత, క్రమశిక్షణ దాగి ఉంటాయి.

*తండ్రిని గుర్తు పెట్టుకోవాలి..!!*

జీవితానికి ఓ దారి చూపించిన తండ్రిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్నప్పుడు మనం అడక్కుండానే మన ఇష్టాలు తెలుసుకుని నెరవేర్చిన తండ్రికి ఏది ఇష్టమో మీరెప్పుడైనా గమనించారా..? వారి చిన్న చిన్న ఆనందాలు గుర్తించారా..? కనీసం ఈరోజైనా మీ తల్లిదండ్రుల దగ్గర కాస్త సమయం గడపండి. వారితో మీరు పంచుకున్న ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకోండి. అందమైన బహుమతులు ఇవ్వండి. అన్నింటి కన్నా మీకు మేమున్నామనే భరోసా ఇవ్వండి.

కాలం మారిపోయింది.. రెక్కలొచ్చిన బిడ్డలు తల్లితండ్రుల్ని మర్చిపోతున్నారు. తమ దారి చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇదివరకులా పేరెంట్స్ కూడా బిడ్డలను కనడమే కానీ వారేదో తమని చూస్తారనే భ్రమలు వదిలి వాస్తవంలో జీవిస్తున్నారు. వారికి భవిష్యత్తు ఇచ్చి తమ అడ్రస్ వృద్ధాశ్రమాలే అని ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ఎదురుగా ఉన్నా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు కొందరైతే.. విదేశాల్లో స్థిరపడిపోయి పేరెంట్స్‌కి డబ్బులు పంపించి వారి బాధ్యతలు చూసేస్తున్నాం అనుకునే బిడ్డలు ఉన్నారు.

చాలామంది ఒంటరైన భార్యాభర్తలు ఉంటారు. లేదా పిల్లలు పంచుకోవడం వల్ల తలో చోట ఉన్నవారు ఉంటారు. వారున్న పరిస్థితి మనకెదురైతే అనే ఆలోచన చేయండి. ఒంటరిగా ఉన్న మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితం మొత్తం పిల్లల కోసమే కష్టపడి కనీసం చరమాంకంలో కలిసి బతుకుదామనుకున్న తల్లితండ్రుల్ని విడదీయకండి. వారి కంట కన్నీరు రాకుండా చూసుకోండి. తాము పస్తులున్నా మనకు తిండిపెట్టి.. బతుకునిచ్చిన తల్లితండ్రుల్ని బాధ్యతల పేరుతో పంచుకోకండి. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇదే వారికి అందరూ ఇవ్వగలిగిన విలువైన బహుమతి.

ఇక ఫాదర్స్ డే రోజు నాన్నకి ఇష్టమైన పనిచేయడం.. ఇష్టమైన బహుమతి ఇవ్వడం.. ఇష్టమైన ఫుడ్ తినిపించడం.. చేస్తే సంతోషపడతారు. కొడుకులు, కూతుర్లు ఇలాంటి సందర్భాల్లో అయినా తల్లితండ్రుల దగ్గరకు వస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేం. సెల్ ఫోన్ మెసేజ్ లలో, వీడియో కాల్స్ లో పంచే ప్రేమలకు.. ప్రత్యక్షంగా వారిని కలిసి కాసేపు గడిపిన సమయానికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఈరోజున ( జూన్ 15) పోస్ట్ పోన్ చేసుకుని మీ పేరెంట్స్ దగ్గర కాసేపు గడపండి. ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మీ జీవితానికి కారకులైన తల్లితండ్రుల్ని ప్రేమిచండి. కంటికి రెప్పలా కాపాడుకోండి. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు..!!

08-06-25షేక్ గౌస్ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRCనేషనల్ చైర్మన్7731000786**మానవ హక్కులు (Human Rights)**మానవ హక్క...
08/06/2025

08-06-25
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ చైర్మన్
7731000786

**మానవ హక్కులు (Human Rights)**

మానవ హక్కులు (Human Rights) అనేవి "మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు."

[1] ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి.

[2]వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి.కానీ, పైన చెప్పిన భావనలలో ఎందులోనూ దేనిని మానవ హక్కుగా పరిగణించాలో, పరిగణించకూడదో అనే విషయంపై ఏకాభిప్రాయం లేదు మరియు మానవ హక్కుల అమూర్త భావన అనేది ఎప్పుడూ తీవ్ర వేదాంత చర్చ మరియు విమర్శకు దారితీస్తూనే ఉంది.

[3] మానవ హక్కుల ఉద్యమం 1970లలో, ముఖ్యంగా పూర్వ మరియు పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజ వాదులతో, ప్రధానంగా ఐక్యరాజ్యసమితి మరియు లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ఎన్నో దేశాలు దీనిని ప్రపంచ స్థాయిలో ఉన్నత చర్చనీయాంశంగా భావించడంతో ఈ ఉద్యమం త్వరితంగా ఒక సామాజిక కార్యశీలత మరియు రాజకీయ శైలిగా రూపుదిద్దుకుంది.

[4] 21వ శతాబ్ద సమయానికి మానవ హక్కుల ఉద్యమం దానియొక్క అసలైన నిరంకుశ-వ్యతిరేక వాదం నుండి మానవత్వ వాదం మరియు తృతీయ ప్రపంచంలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి వంటి ఎన్నో విషయాలకు విస్తరించిందని మెయ్న్ వాదించాడు.

(5)ఈ ఉద్యమాన్ని తీర్చిదిద్దిన ఎన్నో మౌలిక భావనలు రెండవ ప్రపంచ యుద్ధం పరిణామ ఫలితంగా అభివృద్ధి చెందాయి, చివరికి ఇది 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా పారిస్‍లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు దారితీసింది. "మానవ హక్కులు" అనే పదం సాపేక్షంగా ఆధునికమైనది అయినప్పటికీ, ఈ ఆధునిక భావన యొక్క సైద్ధాంతిక పునాదులు వేదాంత చరిత్రలో పురాతన గ్రీస్ నగరం మరియు రోమన్ చట్టం అభివృద్ధి సమయంలో సహజ న్యాయ హక్కులు మరియు స్వేచ్ఛలు మొదలయ్యాయని చెప్పవచ్చు. మానవ హక్కుల భావన యొక్క నిజమైన పూర్వరూపం మధ్యయుగ సహజ చట్టం సంప్రదాయంలో భాగంగా ఏర్పడిన సహజ హక్కులు, ఇవి జాన్ లోకే, ఫ్రాన్సిస్ హచిసన్, మరియు జీన్-జాక్వెస్ బర్లమక్వి వంటి తత్వవేత్తలచే జ్ఞానోదయం సమయంలో ప్రాముఖ్యత సంతరించుకుని, అమెరికన్ విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవం సమయంలోని రాజకీయ ఉపన్యాసాలలో ప్రధానంగా వినిపించేది..!!

Everyone has the Right to live Free from Poverty and the Chance to Thrive.The Sustainable Development Goals Aim to help ...
30/05/2025

Everyone has the Right to live Free from Poverty and the Chance to Thrive.

The Sustainable Development Goals Aim to help Eradicate Poverty so all People, Everywhere, Can Live with Dignity and Prosperity..!!

In conflict, Civilians Always Pay the Highest Price.Even Wars Have Rules..Civilians Must be Protected..At all Times and ...
30/05/2025

In conflict, Civilians Always Pay the Highest Price.

Even Wars Have Rules..

Civilians Must be Protected..

At all Times and in All Places.

They are Not a Target..!!

*International Human Rights Commission*

289-05-25*క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి..?1.ఎవరిమీదైనా పోలీసులు తప్పుడు ఆరోపణలతో ఒక వ్యక్తి/వ్యక్తులపై అన్యాయంగా క్రిమినల్ క...
29/05/2025

289-05-25

*క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి..?

1.ఎవరిమీదైనా పోలీసులు తప్పుడు ఆరోపణలతో ఒక వ్యక్తి/వ్యక్తులపై అన్యాయంగా క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ను పెట్టి వేధిస్తుంటే ఆ భాధితుడు / బాధితులు వాటిని రద్దు చేయమని సీఆర్పీసిలోని సెక్షన్‌ 482 ప్రకారం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు..

2.ఎవరైనా ఆర్థిక, అంగబలంతో గాని రాజకీయ పలుకభడితో కక్షపూర్తిముగా ఒక వ్యక్తి మీద తప్పడు కేసుపెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ వ్యక్తి కి ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా తప్పుడు ఆరోపణలతో ఆ కేసులో తనను ఇన్వాల్వ్ చేస్తే ఆ వ్యక్తి తగిన ఆధారాలతో ఆ "ఎఫ్ఐఆర్" ను రద్దు చేయమని ఒకవేళ ఆ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి "చార్జిషీట్" ను ఫైల్ చేస్తే దానిని కూడా రద్దు చేయమని సీఆర్పీసిలోని సెక్షన్‌ 482 కింద దాఖలు చేసే దానిని క్వాష్‌ పిటిషన్‌ అని అంటాము.

3.క్యాష్ పిటిషన్ ను కేవలం హైకోర్టులలో లేదా సుప్రీంకోర్టులో ఫైల్ చేయవచ్చు..

4.ఒకవేళ ఓకే కేసులో ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే వారిలో, కొందరికి ఆ కేసు ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయం గా ఇరికిస్తే వారు తమ పేర్లును ఎఫ్ఐఆర్ నుండి తొలగించడం కోసం కూడా క్యాష్ పిటిషన్ వేసుకోవచ్చు.ఆ వ్యక్తి నిర్దోషి అని మరియు తప్పుగా చిక్కుకున్నట్లు కోర్టుకు నమ్మితే హైకోర్టు ఆ వ్యక్తి పేరు ను రద్దు చేస్తుంది..

5.ఎఫ్ఐఆర్ను లేదా చార్జిషీట్ను రద్దు చేయడం అనేది కేసులోని వాస్తవాలతో కూడిన ఆధారాలు చూపటం మీద ఆధారపడి ఉంటుంది.

*క్వాష్ అంటే అర్థం..?*

1.క్వాష్ అంటే చెల్లదు, రద్దు చేయడం లేదా చెల్లదని ప్రకటించడం. చట్టపరమైన చర్యలకు ముగింపు పలకడానికి ఉపయోగించబడుతుంది..

2.కొంతమందిపై తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం ద్వారా వారి ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగించేలా ఇతరులను కేసుల్లోకి తప్పుగా ఇస్తారు. ఆ పరిస్థితిలో వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 లోని సెక్షన్ 482 ప్రకారం ఎఫ్ఐఆర్ ను రద్దు చేయమని క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టు/సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఎక్కువగా భార్యలు వారి భర్త మరియు అతని కుటుంబ సభ్యులు మీద అన్యాయంగా పెట్టే ఐపిసి సెక్షన్ 498-ఎ మరియు సెక్షన్ 3 మరియు 4 డి.పి యాక్ట్ కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు రద్దు అవుతున్నాయి..

3.ఒక కేసు తప్పుడు కేసు అని హైకోర్టు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ ను రద్దు చేయవచ్చు..!!

27-05-25Gouse ShaikInternational Human Rights Commission National President7731000786ఆస్తి పంపిణీ: వారసుల మధ్య ఆస్తులు ఎ...
27/05/2025

27-05-25
Gouse Shaik
International Human Rights Commission
National President
7731000786

ఆస్తి పంపిణీ: వారసుల మధ్య ఆస్తులు ఎలా పంచబడతాయి..?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత, ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా, వారసులు మధ్య వివాదాలు తప్పించుకోవడానికి మరియు న్యాయబద్ధమైన పంపిణీ కోసం హిందూ సక్సెషన్ యాక్ట్, 1956 ప్రకారం ఆస్తులు పంచబడతాయి. ఈ ఆర్టికల్ ద్వారా, ఒక వ్యక్తి వసీయత్/వీలునామా (Will) లేకుండా మరణించిన సందర్భంలో ఆస్తులు ఎలా పంచబడతాయి..?

*హిందూ సక్సెషన్ యాక్ట్, 1956 ప్రకారం ఆస్తి పంపిణీ:*

హిందూ సక్సెషన్ యాక్ట్, 1956 భారతదేశంలో హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కుల ఆస్తి వారసత్వాన్ని నియంత్రిస్తుంది. ఈ యాక్ట్ ప్రకారం, ఒక వ్యక్తి వసీయత్ లేకుండా మరణించిన సందర్భంలో (Intestate Succession), ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయి అనేది స్పష్టంగా నిర్వచించబడింది.

*వారసుల యొక్క క్లాస్ (Class):*

హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం, వారసులను మూడు కేటగిరీలుగా విభజించారు:

1. *క్లాస్ I వారసులు:*

ఇందులో మరణించిన వ్యక్తి యొక్క స్పౌస్ (భార్య/భర్త), పిల్లలు (కుమారుడు/కుమార్తె), మరియు తల్లి ఉన్నారు.
ఈ వారసులు మొదటి ప్రాధాన్యత కలిగి ఉంటారు మరియు ఆస్తిని సమానంగా పంచుకుంటారు.

2. *క్లాస్ II వారసులు:*

క్లాస్ I వారసులు లేనప్పుడు, క్లాస్ II వారసులు ఆస్తిని పొందుతారు.
ఇందులో తండ్రి, సహోదరులు, సోదరీమణులు, మరియు ఇతర విస్తృత కుటుంబ సభ్యులు ఉంటారు.

3. *అగ్నేట్స్ మరియు కాగ్నేట్స్:*

క్లాస్ I మరియు క్లాస్ II వారసులు లేనప్పుడు, ఆస్తి అగ్నేట్స్ (పురుష వంశం ద్వారా సంబంధం ఉన్నవారు) లేదా కాగ్నేట్స్ (స్త్రీ వంశం ద్వారా సంబంధం ఉన్నవారు) మధ్య పంచబడుతుంది.

*కుమార్తె యొక్క హక్కులు:*

2005లో హిందూ సక్సెషన్ యాక్ట్ లో సవరణ చేయబడింది. ఈ సవరణ ప్రకారం, కుమార్తెకు కూడా కుమారుడితో సమానమైన హక్కులు ఇవ్వబడ్డాయి. అంటే, కుమార్తె కూడా పిత్రార్జిత ఆస్తిలో సమాన భాగాన్ని పొందుతుంది. ఇది లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన మార్పు.

*సక్సెషన్ సర్టిఫికేట్ యొక్క అవసరం:*

వసీయత్ లేని సందర్భంలో, వారసులు సివిల్ కోర్టు నుండి సక్సెషన్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా, వారసులు మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు (బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు మొదలైనవి) క్లెయిమ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది మరియు కుటుంబ వివాదాలు ఉన్న సందర్భాల్లో కోర్టు కేసులు కూడా రావచ్చు..

*వసీయత్/వీలునామా యొక్క ప్రాముఖ్యత:*

వసీయత్ (Will) ఒక ముఖ్యమైన లీగల్ డాక్యుమెంట్. ఇది వ్యక్తి యొక్క ఆస్తులు మరియు వ్యవహారాలను ఎలా నిర్వహించాలి అనే దానిని స్పష్టంగా తెలియజేస్తుంది. వసీయత్ ద్వారా, వ్యక్తి తన ఆస్తులను ఎవరికి ఎలా పంచాలి అనే దానిని నిర్ణయించవచ్చు. ఇది కుటుంబ వివాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

*చిట్కాలు:*

1. *వసీయత్ (వీలునామా ) రాయడం:*

వసీయత్ రాయడం చాలా సులభం. ఇప్పుడు ఆన్లైన్ వసీయత్ కూడా తయారు చేయవచ్చు.కానీ, ఏదైనా తప్పులు లేకుండా ఉండాలంటే, లాయర్ సహాయంతో వసీయత్ తయారు చేయడం మంచిది.

2. *నామినీ వివరాలు:*

బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు మరియు ఇన్సురెన్స్ పాలిసీలలో నామినీ వివరాలను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం.

*ముగింపు:*

ఆస్తి పంపిణీ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తప్పించుకోవడానికి వసీయత్ రాయడం చాలా ముఖ్యం. హిందూ సక్సెషన్ యాక్ట్, 1956 ప్రకారం, ఆస్తులు న్యాయబద్ధంగా పంచబడతాయి. కానీ, వసీయత్/వీలునామా ఉంటే ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది.

*హ్యుమన్ రైట్స్ మరియు లీగల్ అవేర్నెస్ ఛానెల్ ను ఎందుకు ఫాలో చేయాలి..?*

*ఉచిత సమాచారం:* అన్ని రకాల కేసులపై ఉచితమైన మార్గదర్శన.

*సులభమైన వివరణ:*

చట్టపరమైన పరిభాషను సాధారణ భాషలో వివరించడం.

*ఇటీవలి అప్డేట్స్:*

చట్టపరమైన మార్పులు మరియు వాటి ప్రభావాలపై తాజా సమాచారం.తప్పకుండా తెలియవలసిన సమాచారం సంబంధించిన చట్టాల గురించి అవగాహన ఉండాలి..!!

26/05/2025

26-5-2025
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ ప్రెసిడెంట్
7731000786

*మానసిక బానిసత్వానికి చరమగీతం.. స్వేచ్ఛాలోచన...!!

ఎవరికి తోచింది వారు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. నీ ఆలోచన, నీ పక్కవాడికి నీ సమాజానికీ నీ దేశానికి, మొత్తం ప్రపంచానికీ పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణీ కాదు, నీ ఇష్టా ఇష్టాల్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వమానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది. అందువల్ల స్వేచ్ఛా లోచనను మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు.

యధార్థాల పునాదిపై వైజ్ఞానిక అవగాహనతో, తర్కబద్ధంగా, హేతు సహితంగా మేధో పరమైన ఒక తాత్త్విక ఆలోచనా ధోరణే స్వేచ్ఛాలోచన..! అయితే ఈ నిర్వచనం ఇలా ఉన్న ఫళాన రూపుదిద్దుకోలేదు. అందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అన్ని బంధాల్ని వదిలేసి భగవదాన్వేషణలో గడిపిన వారు కొందరు, తొలి రోజుల్లో... 'తమదే స్వేచ్ఛాలోచన' అని అనుకున్నారు. అయితే ఆలోచనలు పదునెక్కిన కొద్దీ నిర్వచనం ఇలా మలుపు తిరిగింది. వారి ఆలోచనకే ఎదురు తిరిగింది.

'స్వేచ్ఛాలోచన' ఈ ఆధునిక యుగంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. 'హేతువాదం' అనేది మనకు ముందునుంచీ ఉన్నా, ఈ స్వేచ్ఛాలోచన అనేది దాన్ని కూడా ఇముడ్చుకుని విస్తరించిన అతి పెద్ద విశాలమైన గొడుగు. ఛాందసాన్ని ఖండిస్తూ, మతాల్ని పక్కకు నెట్టేస్తూ, ఎక్కడ దేనితోనూ రాజీపడకుండా ముందుకొచ్చిన ఒక నూతన ఆలోచనా ధోరణీ - స్వేచ్ఛాలోచన! ఫ్రీ థాట్‌ అనే ఈ 'పదం' పదిహేడో శతాబ్దంలో వాడుకలోకొచ్చింది. సంప్రదాయ బద్ధమైన మతవిశ్వాసాల్ని ప్రశ్నించడానికి అప్పుడు ఈ పదం ఉపయోగపడింది. క్రమంగా వాడుకలోకి వచ్చింది. అయితే పద్దెనిమిదో శతాబ్దంలో విలియం కింగ్‌డన్‌ క్లిఫర్డ్‌ అనే గణిత శాస్త్రవేత్త ఈ పదానికి ప్రాచుర్యం తెచ్చాడు. ''అసమగ్రమైన కారణాల్ని, రుజువుల్ని ఎవరూ ఎక్కడా విశ్వసించగూడదు'' అని అన్నాడు.

అంటే అది ఒక వైజ్ఞానిక సిద్ధాంతమైనా కావొచ్చు, లేదా మామూలు విషయమైనా కావొచ్చు. ఏమైనా సరైన కారణాలు, రుజువులు చూపకపోతే అది విశ్వసనీయమైంది కాదని ఖరాఖండీగా తేల్చిచెప్పినవాడు క్లిఫర్డ్‌. 1870లో ఈ విషయంపై ఆయన ప్రకటించిన వ్యాసం గొప్ప సంచలనం సృష్టించింది. క్లిఫర్డ్‌ శాస్త్రవేత్తే కాకుండా స్వేచ్ఛాలోచన వ్యాప్తికి నడుం బిగించిన కార్యకర్త కూడా! అందుకే 1878లో ''కాంగ్రెస్‌ ఆఫ్‌ లిబరల్‌ థింకర్స్‌''ను ఏర్పరిచాడు.

ఈ విశ్వాన్ని నడిపిస్తున్న 'ఒక మహత్తర శక్తి' ఏదో ఉందనే భావనను ఈ స్వేచ్ఛాలోచనా పరులు కొట్టి పారేశారు. సంప్రదాయం, ఛాందసం స్వేచ్ఛాలోచనకు అడ్డంకులవుతాయని గ్రహించారు. బైబిల్‌కు, ఏసుకు రుజువులు కనుగొనడం శుద్ధ దండగ అని అన్నారు. 'కారణం' విధించే షరతులకు ఈ ఉట్టుట్టి అంధవిశ్వాసాలు ఎలాగూ నిలబడవు. అందువల్ల స్వేచ్ఛాలోచనా పరులు 'మతం' అవాస్త మైందని పైగా హాని కారకమైందనీ భావించారు. అదే విషయం ఎలుగెత్తి ప్రకటించారు కూడా!
మతం కోసం మనిషి కాదు, మనిషి కోసం మతం ఏర్పడింది..మానవీయంగా మారేందుకు మతం వదిలేయాలి..సమానత్వం పొందేందుకు మతం వదిలేయాలి..!!

జంతువుల స్పర్శను అనుమతిస్తూ మానవుల స్పర్శను నిషేధించే మతం
మతం కాదు - మూర్ఖత్వం ఒక వర్గాన్ని విద్యకు, సంపదకు దూరం చేసి
బహిష్కరించే మతం - మతం కాదు - దుర్మార్గం.ఇదీ స్వేచ్ఛాలోచనాపరులు చెప్పే విషయాల సారాంశం..! ఎవరెవరో విదేశీయులు చెప్పిన విషయాలు రాస్తారు... మరి మన దేశం మన సంస్కతి, మన విషయాలు రాయరెందుకూ అని ఆక్షేపించే వారిని ఆలోచించమంటున్నాను. మన శాస్త్రవేత్తలు, మన విద్యావేత్తలు, మన కవులూ - కళాకారులూ చెప్పే విషయాలు మన జనం బుర్రకెక్కించుకుంటున్నారా..? కొంచెం ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది కదా..?

చెట్టాపట్టాల్‌ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోరు అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోరు..అన్నారు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు.
మతములన్నియు మాసిపోవును..మానవత్వమె వెలిగి నిలుచును... అని అన్నారు కదా..? ఏదీ మరీ..? మతోన్మాదులతో సమాజంలో ఇన్ని సమస్యలెందుకు వస్తున్నారు..?

సరే, ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక స్వేచ్ఛాలోచనకు గియార్డనో బ్రూనో 1600 సంవత్సరంలో ఒక మైలురాయి అయ్యాడు. పదిహేడో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఇదొక ఉద్యమరూపం తీసుకుంది. బైబిల్‌కు చర్చ్‌లకు (అంటే మత) వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా ఏకతాటిపైకొచ్చారు. కరపత్రాలు, చిరుపొత్తాలూ పంచారు. 1881లో తొలిసారి ''ద ఫ్రీ థింకర్‌'' పత్రిక బ్రిటన్‌ నుండి వెలువడింది. సహించలేని మతవాదులు దుర్మార్గమైన దాడులకు, హత్యలకు పాల్పడ్డారు. ఫ్రాన్స్‌లో లా బర్రి అనే యువ కార్యకర్తను చిత్రహింసలు పెట్టారు. అంతే కాదు, అతని మృతదేహాన్ని చితిమీద కాల్చడానికి ముందు తల నరికేసి చంపారు. రోమన్‌ కాథలిక్‌ల మత ఊరేగింపు సాగిపోతున్నప్పుడు అతను శాల్యూట్‌ చేయలేదని అభియోగం మోపారు. నిజానికి విషయం అది కాదు.

అతని ఆలోచనా ధోరణికి మత పెద్దలు వణికిపోయారన్నది అసలు నిజం. అతనితో పాటు అతని చితిపై వోల్టేర్‌ 'ఫిలసాఫికల్‌ డిక్షనరీ'ని కూడా కాల్చేశారు. ఆ తర్వాత క్రైస్తవ అసహనం ప్రపంచ మానవాళికి గుర్తుండే విధంగా పారిస్‌లో ఒక వీధికి అమరుడైన లా బర్రి పేరు పెట్టడం, ఒక ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ యువకుడు ప్రజా హృదయాల్ని ఎంతగా గెల్చుకున్నాడన్నది అర్థం చేసుకోవాలి. పందొమ్మిదో ఏట 1 జూలై 1766లో అమరుడైన డి లా బర్రి స్మారక స్థూపం దగ్గర మతాన్నీ చర్చ్‌లను అసహ్యించుకునేవారు, మత దారుణాలకు నిరసన తెలిపేవారు ప్రతి ఏటా సుమారు పదిహేను వేల మంది సమావేశమవుతారు. మత క్రౌర్యాన్ని శతాబ్దాలుగా, శాంతియుతంగా చావుదెబ్బ కొట్టడమంటే ఇదే..!

1815-48 మధ్య కాలంలో జర్మనీలో స్వేచ్ఛాలోచన సమాఖ్య ఏర్పడింది. చిన్న చిన్న గ్రూపులన్నీ కలిసి ''యూనియన్‌ ఆఫ్‌ ఫ్రీరిలిజియస్‌ కమ్యూనిటీస్‌ ఆఫ్‌ జర్మనీ''గా ఏర్పడింది. అప్పటి వరకూ ఉన్న ఏ మతంలోనూ చేరకుండా, దేనినీ బలపరచకుండా తమకు తామే స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించుకోవడానికి ఒక యూనియన్‌ ఏర్పాటయ్యింది. పైగా 'స్వేచ్ఛా మానవ వాదు'లంతా తమ సభ్యులేనని ఆ యూనియన్‌ ప్రకటించుకుంది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హేతువాదుల - నిరీశ్వర వాదుల సంఘాలెన్నో జర్మనీలో రూపుదిద్దుకున్నాయి. అయితే 1933లో అడోల్ఫ్‌ హిట్లర్‌ ప్రాభవం పెరిగిన దశలో ఆ సంఘాలు, సమాఖ్యలూ అన్నీ నిషేధానికి గురయ్యాయి.ప్రభుత్వాల ఒత్తిడిగానీ, చర్చ్‌ల పెత్తనం గానీ తమపై ఉండగూడదని బలంగా నమ్మే జర్మన్‌వారు కొందరు అమెరికా వలస వెళ్ళారు. క్రమంగా అక్కడ తమ కార్యక్రమాలు కొనసాగించారు.

ఆ విధంగా జర్మన్‌ స్వేచ్ఛా పరుల ప్రభావం అక్కడి అమెరికన్‌లపై పడింది. ఫలితంగా 'ఫ్రీ ప్రెస్‌ అసోసియేషన్‌', 'ఫ్రీ ఎంక్వైరర్‌, వర్కింగ్‌ మెన్స్‌ పార్టీ', 'ఈక్వల్‌రైట్స్‌ పార్టీ' వంటి ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. 1800 సంవత్సరాన్ని ''అమెరికా స్వేచ్ఛాలోచన స్వర్ణయుగం'' అని చెప్పొచ్చు. ఎందుకంటే 'నేషనల్‌ లిబరల్‌ లీగ్‌' ఫిలడెల్ఫియాలో ఏర్పడి ఎంతో శక్తివంతంగా పనిచేసింది. 1852లో విస్కాన్‌సిన్‌లో ఏర్పడ్డ ఓ సంఘం ఇప్పటికీ చురుకుగా పనిచేస్తోంది. ద ట్రూల్‌ సీకర్‌ సమాఖ్య 1873లో ఏర్పడి పనిచేయడం ప్రారంభించింది. జర్మన్‌ వలసవాదుల ప్రభావంతో అమెరికాలో 'స్వేచ్ఛాలోచన' ఊపిరి పోసుకుంది.

బెల్జియంలోనూ, నెదర్లాండ్స్‌లోనూ స్వేచ్ఛాలోచనకు ప్రాధాన్యమిచ్చే సంస్థలు బలపడ్డాయి. ముఖ్యంగా నెదర్లాండ్స్‌లో స్వేచ్ఛాలోచన పునాదిగా కొన్ని రాజకీయ పార్టీలే ఏర్పడ్డాయి. 2009లో హేతువాద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ ఏర్పడి తన ప్రభావం చూపడం ప్రారంభించింది.

అలాగే కెనడాలో ''సెక్యులర్‌ థాట్‌ హ్యూమనిస్ట్‌ అసోసియేషన్‌'' వంటివెన్నో పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాల, మత సంస్థల ప్రమేయం లేకుండా శ్రామిక వర్గానికి చైతన్యవంతమైన, స్వేచ్ఛాలోచనా పూరితమైన, విద్యను అందించాలని ఆలోచనా పరులు యూరోప్‌లో ఒక ప్రణాళికను రూపొందించారు. ఇందులో వైజ్ఞానిక సమాచారానికి, వార్తలకు డార్విన్‌ పరిణామ సిద్ధాంతానికి, భూసిద్ధాంతానికి, ప్రకృతి అధ్యయనానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ఆ ప్రణాళిక విస్తృతమౌతున్న దశలో క్యూబా, దక్షిణ అమెరికా, లండన్‌లలోని పాఠశాలలు ఆ పాఠ్యాంశాలకు ఆకర్షించబడ్డాయి. పూర్తిగా కాథలిక్‌ చర్చ్‌ల ఆధీనంలో ఉన్న విద్యావ్యవస్థ కట్టలు తెంచుకుని బయటికి రాసాగింది.

స్వేచ్ఛాలోచనకు ఉన్న విలువ గురించి తత్త్వవేత్త బెట్రండ్‌ రస్సెల్‌ 1944 లో ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన ఏమన్నారంటే, తనకున్న విశ్వాసాల్ని ప్రకటించడమే స్వేచ్ఛాలోచనా పరుడి పనికాదు. వాటిని ఏవిధంగా ఎలా ప్రకటించాడన్నది ముఖ్యం. తన పూర్వీకులెవరో చెప్పిన వాటిని యధాతధంగా యుక్తవయసులో విశ్వసించడం కాదు. అదొక మానసిక బానిసత్వం..!! అందులో స్వేచ్ఛాలోచన ఏముందీ..? బుద్దీ, జ్ఞానం పెరిగాక ఆలోచనా శక్తిని ఉపయోగించి ఏర్పరుచుకున్న దృక్పథం ఏదైతే ఉందో... వాస్తవానికి దగ్గరగా ఏదైతే ఉందో.. అది స్వేచ్ఛాలోచన..!!

స్వేచ్ఛాగా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయమే స్వేచ్ఛాలోచన అవుతుంది. అయితే అతను ఇక్కడ రెండు విషయాలలోంచి బయటపడాలి. ఒకటి - సంప్రదాయాల ఒత్తిడికి, ప్రొద్బలానికీ లొంగకుండా ఉండడం. రెండు - అతని ఇష్టా ఇష్టాలలో పడి కొట్టుకుపోకుండా ఉండడం. ఈ రెండింటిలోంచి పూర్తిగా బయటపడడం అంత తేలికైన విషయం కాదు. ఎవరికైనా కష్టమే..! అయితే అసాధ్యం కాదు..!!

27/06/2024

27-6-2024
www.g24tvnews.com

*🏊🏼‍♀నీటిలో ఊపిరి పీల్చలేమెందుకు..?🏊‍♂

✳మానవులు నీటి లోపల శ్వాసను తీసుకోలేరు ... కారణం మన ఉపిరితిత్తులకు నీటి లోపల ఆక్షిజన్ ను విడదీయడానికి కావాల్సిన సామర్ధ్యం ... అంటే దానికి కావలసిన ఉపరిత వైశాల్యం లేదు . అంటే కాకుండా మన ఉపిరితిట్టుల్లోని గోడలకు ఉండే పొరలు గాలికేగాని నీటికి అలవాటు పది లేవు .

ఇక చేపల విషయానికి వస్తే , అవి పీల్చుకొనే ఆక్షిజన్ నీటిలో భాగమైన ఆక్షిజన్ కాదు , వాతావరణం లో ఉండి నీటిలో కరిగే ఆక్షిజన్ వాయువుని. . అలా నీటిలో కరిగిన ఆక్షిజన్ ను చేపలు తమ మొప్పల సాయం తో పీల్చుకొంతాయి . నీటినుంచి ఆక్షిజన్ ను విడదీయడం అంట సులభం కాదు . గాల్లో అదే ఘనపరిమాణం గలది నీటిలో కన్నా 20 రెట్లు అధికం గా ఆక్షిజన్ ఉంటుంది . . అంతేగాకుండా నీటి బరువు , సాంద్రత , గాలికన్నా ఎంతో ఎక్కువ . అందువల్ల నీటిలో తిరుగాడటం మనకు ఎంతో కష్టం , చేపల దేహము నీటిలో తెరగడానికి అనువుగా నిర్మితమై ఉంటుంది . నీటిలో చేపలు మొప్పలు పనిచేయడానికి కారణం అవి శీతల రక్తం (ColdBlood) గల జలచరాలు కావడమే . వాటి శ్వాశ తీసుకోవడానికి మనలాగా ఆక్షిజన్ ఎక్కువ మోతాదులో అవసరములేదు . నీటిలో తక్కువ మోతాదులో వాతావరణం నుంచి కరిగిన ఆక్షిజన్ సరిపోతుంది ... ఆ ఆక్షిజన్ పరిమాణము మనం శ్వాసించడానికి సరిపోదు .

27/06/2024

27-6-2024
www.g24tvnews.com

*⭕బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నది ఎవరు..?

✳పెద్దపెద్ద నక్షత్రాలు కాంతిహీనం అయినప్పుడు అంతరిక్షంలో ఏర్పడే చీకటి క్షేత్రాలనే అంతరిక్షశాస్త్ర పరిభాషలో 'బ్లాక్ హోల్స్' అంటారు. 1907లో జర్మన్‌కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞడు కార్ల్ స్వార్జ్‌ఛేల్డ్ బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నాడు.
బ్లాక్ హోల్‌లో గురుత్వాకర్షణశక్తి చాలా ఎక్కువ. ఏదైనా వస్తువు దీనిలోకి వెళితే తిరిగిరాదు. కాంతి కూడా ఆకర్షణశక్తి నుండి తప్పించుకుని పోలేదు. కాంతిని బ్లాక్‌హోల్‌లోకి ప్రసరింపజేసినా అది పరావర్తనం చెందదు.

సూర్యుడి కంటే ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు మృతప్రాయాలైనప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయని కార్ల్ సిద్ధాంతంపరంగా నిరూపించాడు. ఏదానా కారణం వల్ల నక్షత్రం లోపలవున్న పదార్థం తరిగిపోతూ వుంటే. నక్షత్రం ఉష్ణోగ్రకత కూడా తగ్గిపోయి నక్షత్రంలోని అణువులు ప్రోటానులు, న్యూట్రానులు, ఎలక్ట్రానులుగా విడిపోతాయి.
న్యూట్రాన్ నుండి వెలువడే కాంతి తగ్గిపోవడంతో క్రమంగా కాంతి పూర్తిగా వెలువడని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే బ్లాక్‌హోల్ అంటారు.

27/06/2024

27-06-2024
www.g24tvnews.com

*సముద్రపు నీటిలో బంగారం కరిగి ఉంటుందట..నిజమేనా..? Gold is disolved in Sea water.Is it true..?

✳ అవును.నిజమే.సముద్రాపు నీటిలో ప్రతి 10 ఘనపు కిలోమీటర్ నీటిలో 1 కిలో బంగారం కరిగి ఉంటుంది.భూమి మీద ఉన్న మొత్తం సముద్రపు నీటి నుండి బంగారాన్ని వేరు చేస్తే ఆ వచ్చే బంగారం ఎంత ఉంటుందో తెలుసా..!ప్రపంచ జనాభా అందరికి ఒక్కొక్కరికి 10 కిలొల బంగారం ఇవ్వవచ్చు.ఐతే సముద్రపు నీటి నుండి బంగారాన్ని తయారు చేయడం అంత తేలికైన పని కాదు.ఎందుకంటే అంత నీటి నుండి దాన్ని రసాయన ప్రక్రియ ద్వారా వేరు చేయడమంటే దానికి చాలా వ్యయం అవుతుంది.అంటే 1 కిలో బంగారం కావాలంటె దానికి ఖర్చు కొట్ల రూపాయలలో ఉంటుంది.

27/06/2024

27-06-2024
www.g24tvnews.com

*🔴ఆకాశంలో కొన్ని విమానాల వెనుక దట్టమైన పొగ చార కనిపిస్తుంది. ఎందుకని..?

✳విమానం వెనుక ఆకాశంలో పొగ చార కనిపిస్తే అది జెట్‌ విమానమే. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంతో బయటకు వచ్చే పొగనే జెట్‌ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఆ విమానానికి అంత వేగం రావడానికి కారణం దాని వెనుక నుంచి దూసుకువచ్చే జెట్‌.

ఇదెలా జరుగుతుందంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి 'చర్య'కూ, దానికి సమానమైన ప్రతిచర్య వ్యతిరేకదిశలో ఉంటుంది. ఒక రబ్బరు బెలూన్‌ను బాగా వూది ఒక్కసారిగా వదిలేస్తే అందులోని గాలి వేగంగా బయటకు దూసుకు రావడం దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్‌ విమానాలు, రాకెట్లు పనిచేస్తాయి.

జెట్‌ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అరలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంటుంది. అలా చేరిన గాలిపై ఆ అరలో అత్యధిక పీడనాన్ని కలిగిస్తారు. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిగాలి ఉన్న అరలో పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. అలా మండిన ఇంధనం వాయుధార రూపంలో విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో, వూదిన బెలూన్‌ నుంచి గాలి వచ్చినట్టుగా, బయటకు దూసుకొని వస్తుంది. వాయువు వేగం వల్ల ఏర్పడే ప్రతిచర్య వల్ల, జెట్‌ విమానం ముందుకు పయనిస్తుంది. జెట్‌ విమానం ప్రయాణించే ఎత్తులో ఉండే వాతావరణంలోని గాలి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల విమానం నుంచి వచ్చే జెట్‌ చిందర వందరగా చెదిరిపోదు అందుకనే విమానం వెళ్లిన తర్వాత కూడా ఆ వాయుధార కనబడుతుంది. ఆ పొగ వల్ల కాలుష్యం ఏర్పడదు.

Address

Hyderabad

Telephone

+917731000786

Website

Alerts

Be the first to know and let us send you an email when IHRC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to IHRC:

Share