26/11/2022
◆ * సంక్షేమ పాలనతో పేదల జీవితాల్లో సంతోషాలు*
◆ *53వ రోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 05వ డివిజన్ వెంకటాపురం-3 సచివాలయ పరిధిలో పర్యటించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని*"
*◆ స్థానిక 5వ డివిజన్ కార్పొరేటర్ గరికపూడి ఇమ్మానియేల్ జయకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నానికి భారీ గజమాలలు, పూల జల్లులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు..*
*◆ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును లబ్ధిదారుల గడప గడపకు వెళ్లి స్వయంగా పరిశీలించిన ఆళ్ల నాని*
*◆ సంక్షేమ పాలన అమలు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన లబ్దిదారులు..*
◆ *అర్హత ఉండి సాంకేతిక కారణాలతో సంక్షేమ పధకాలు అందని వారికి సత్వరమే లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆళ్ల నాని సూచనలు*
------
ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న నవ రత్నాల సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటిలో సంతోషాలు వెల్లి విరిసాయని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని అన్నారు.
శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 53వరోజు ఏలూరు కార్పొరేషన్ 05వ డివిజన్ వెంకటాపురం-3 సచివాలయ పరిధిలోని టీచర్స్ కాలనీ మెడికల్ షాప్ సెంటర్ వద్ద నుంచి ప్రారంభం అయిన కార్యక్రమం అశేష జన నీరాజనాలు నడుమ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
స్థానిక కార్పొరేటర్ గరికపూడి ఇమ్మానియేల్ జయకర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు, మహిళలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఘన స్వాగతం పలికారు.
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా టీచర్స్ కాలనీ,శ్రీరామ్ నగర్ సహ పలు కాలనీలోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ పధకాల అమలు తీరును ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతి నెలా టైం కి అందుతుందా తల్లీ, అమ్మ ఓడి వస్తుందా అమ్మా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ మమేకం అయ్యారు..
ప్రతి గడపకు వెళ్లిన ఆళ్ళనాని వృద్ధులు, చిన్నారులతో మమేకం అయ్యారు.
గడప గడపలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనతో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయని, అర్హత కలిగి ఉండి ఏదైనా మరే ఇతర కారణంతో అయినా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారి సమస్య పరిష్కరించి వారికి కూడా లబ్ది చేయాలనే ఉద్దేశ్యం తోనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆళ్ల నాని తెలిపారు.. ఏలూరులో ప్రతి గడపలో వస్తున్న అశేష స్పందన జగనన్న సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్సనం అని ఆళ్ల నాని అన్నారు..
అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్య చికిత్స అందేలా ఆళ్ల నాని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ "జగనన్న సంక్షేమ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంతో జీవిస్తున్నారని, పేదవాడికి అందుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అక్కసుతో ప్రతి పక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగనన్నకు అండగా నిలిచి మరోసారి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని జగనన్నకు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారని" ఆళ్ల నాని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం, డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయ నిర్మల, పొలిమేర దాసు, దేవరకొండ శ్రీనివాస్, గరికపూడి ఇమ్మానియేల్ జయకర్, సుంకర చంద్రశేఖర్, కడవ కొల్లు సాంబా, కో-అప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాధ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కోరాడ బాబు, వైయస్సార్ సిపి నాయకులు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, కిలాడి దుర్గారావు, నున్న కిషోర్, మోటమర్రి సదానంద్, దాసరి రమేష్, ఇనపనూరి జగదీష్, బండారు కిరణ్ కుమార్, కొల్లిపాక సురేష్, మజ్జి కాంతారావు, తోటకూర కిషోర్, విఠల చంద్రశేఖర్,లక్కొజు గోపి, సుల్తానా, లూటుకుర్తి సుభాష్ , ఎల్లపు మోజెస్, పిట్టా ధనుంజయ్, శివరావు, , పల్లెల గంగా నాగమణి, రాజేంద్ర, ముదింటి ప్రవీణ్, పలు దళిత సంఘాల నాయకులు, లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, దొంగ రామాంజనేయులు, ప్రత్తిపాటి తంబీ మునిసిపల్ కమిషనర్ షేక్ షాహీద్, ఎమ్మార్వో సోమశేఖర్, P.O కృష్ణ మూర్తి, పలు శాఖల అధికారులు, అడ్మిన్ సరస్వతి, వెంకటాపురం-3 సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పారీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు