Namaste Janasakti Telugu Daily

Namaste Janasakti Telugu Daily *నమస్తే జనశక్తి* జాతీయ తెలుగు దినపత్రిక

ఆంధ్రప్రదేశ్ ప్రచురణ కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, మరియు అనంతపురం

తెలంగాణ ప్రచురణ కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మరియు ఖమ్మం

2050 నాటికి పూర్తి సోలార్ నగరంగా అమరావతి. ప్రపంచంలోనే తొలి కార్బన్ ఫ్రీ నగరం గా అమరావతి!
23/04/2025

2050 నాటికి పూర్తి సోలార్ నగరంగా అమరావతి. ప్రపంచంలోనే తొలి కార్బన్ ఫ్రీ నగరం గా అమరావతి!

AP capital Amaravati to create a new record

ఆ డబ్బుకు అటూ ఇటూ.. ఒకరు 15000 లంచం తీసుకొంటూ పట్టుబడి అరెస్టయ్యి న్యాయమూర్తి అదేశాల ద్వారా రిమాండ్ చేయబడి సస్పెండ్ అయిన...
21/03/2025

ఆ డబ్బుకు అటూ ఇటూ.. ఒకరు 15000 లంచం తీసుకొంటూ పట్టుబడి అరెస్టయ్యి న్యాయమూర్తి అదేశాల ద్వారా రిమాండ్ చేయబడి సస్పెండ్ అయిన షబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ!.. మరొకరు 15000 కోట్లతో అనుకోకుండా దొరికిన జస్టిస్ మిశ్రా .. జడ్జ్ కావడంతో ఓ చిన్న బడిలీతో సరిపెట్టిన ఆయున్నత న్యాయస్థానం.

భీమోలు కేసుల్లో తీన్మార్ - ఒకే రోజు మూడు కేసుల్లో కీలక నిర్ణయం!వనజాక్షి అక్రమ మ్యూటేషన్ కి సరిగ్గా నేటి కి ఒక ఏడాది!- అక...
20/03/2025

భీమోలు కేసుల్లో తీన్మార్ - ఒకే రోజు మూడు కేసుల్లో కీలక నిర్ణయం!
వనజాక్షి అక్రమ మ్యూటేషన్ కి సరిగ్గా నేటి కి ఒక ఏడాది!
- అక్రమ మ్యుటేషన్ కేసులో యంఆర్ఓ వనజాక్షీ పై కోర్టు దిక్కారణ కేసులో ప్రాధమిక ఆదారాలున్నాయని హైకోర్ట్ ధృవీకరణ
- తప్పుడు వీలునామతో చనిపోయిన జమీందారు భార్యానంటూ తెరమీదకొచ్చిన రత్నానికి చుక్కెదురు?
- యజమాని వారసుడు మరియు అక్రమ కౌలుదారుడు సర్వారాయుడు భీమోలు భూములపై వేసిన యధాతధ పిటీషన్ కొట్టివేత!
- సర్వం రాయుడే’ అంటూ అప్పట్లో జనశక్తి చెప్పిందే నిజం అయ్యింది. కేసుల్లో అక్రమ వాటాదారుడిగా వున్న కీలక న్యాయవాడి బంధువులపై 45 ఎకరాలు ముటేషన్ చేసిన వనజాక్షి కి చిక్కులు. న్యాయవాడి పై బార్ కౌన్సిలలో పిర్యాదు.
- కోర్టు తీర్పుకు విరుద్దంగా అమ్ముకున్న 169.2 ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం. నాటి అధికారులపై చర్యలు వుంటాయో లేదో? వేచి చూడాల్సిందేనా!
+++

గోపాలపురం, 20 మార్చి 2025: అర్దశతాబ్దం భీమోలు పంచాయితిలో నిజంగా ఈరోజు తీన్మార్ నిర్ణయాలు వచ్చాయి. ఒకే రోజు అటు గౌరవ హైకోర్ట్ ఇంకా తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో మరొకటి ఒకదానికొకటిగా విడివిడిగా కలివిడిగా అసలు భూ యజమానులకు అనుకూలంగా తీర్పులు రావడం నిజంగా తీన్మార్ అనిపించింది.

యంఆర్ఓ వనజాక్షీ కోర్టు దిక్కారణ కేసులో ప్రాధమిక ఆదారాలున్నాయి - అమరావతి హైకోర్టు:
భీమోలు భూయాజమానుల తరపున శ్రీమతి కరిబండి సూర్యకుమారి దాఖలు చేసిన రిట్ పిటీషన్ నెం. 6289/2024 తుది తీర్పు ప్రకారం అప్పటికే పలు వాజ్యాలలో కోర్టును అధికారులను తప్పు దోవ పట్టించి అప్పటి ఆర్డీవో మల్లిబాబు ద్వారా కవులుదారులమంటూ అక్రమ దఃఖలాలు పొందిన బీమోలు భూదొంగల ముఠా పోతిరెడ్డి సర్వారాయుడి బృందానికి గత 2024 మార్చ్ 12 నాడే చెక్ పెట్టింది. భీమోలు గ్రామం యొక్క Ac.360.0 భూమిని వివాదాస్పద భూముల ఖాతాగా గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అయితే దీనికి విరుద్దంగా నాటి గోపాలపురం యంఆర్ఓ వనజాక్షీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్ట్ నేడు ధృవీకరించడం ఒక ఎత్తైతే. ఆమె నిర్లక్ష్యానికి మూల్యంగా 169.2 ఎకరాలను అసలు యాజమాన్య హక్కులేలేని కవులుదారులు అమ్మేసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన వారం రోజుల తర్వాత సదరు అక్రమ కవులుదారులు ఏ పత్రాలు లేకుండా భూమిని సుమారు రూ. 30 కోట్లకు అమ్ముకోవడం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ వెను వెంటనే అక్రమంగా భూములు కొనుకున్న విజయ దుర్గా అగ్రీ నర్సరీ ఫారం, బీమోలు భూదొంగల ముఠా పోతిరెడ్డి సర్వారాయుడి కుమార్తె సుభద్ర పేరున ఏడు ఎకరాలు, ఇంకా ఇదే కేసులో కీలక న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వారి సమీప బందువుల పేరిట నలభై ఎకరాలు రిజిస్టర్ జరగడం విశేషం. మొత్తం అక్రమ అమ్మకాల్లో 16 సెల్ డీడ్ లు వెరసి 169.2 ఎకరాలు వేగేశ్వరపురం, కోవూరు మరియు కోరుకొండ అనే మూడు సబ్ రిజీస్ట్రార్ ఆయపీసుల్లో 2024 మార్చి 16 మరియు 18 నమోదు వెనుక సదరు రిజిస్ట్రేషన్ శాఖతో పాటుగా వనజాక్షి కూడా కీలకంగా అవినీతికి పాల్పడారన్నది జగమెరిగిన సత్యం. అంతటితో ఆగని వనజాక్షి ఆక్రమంగా భూమి కొన్న వారికి కూడా సహకరించారు. హత్య ఏడాది సరిగ్గా ఇదే రోజున కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అక్రమ కొనుగోలుదారులకు బూమిని ఆన్లైన్ చేసిపారేశారు. వనజాక్షి అవినీతిలో రెండు ముఖ్యాంశాలు (1) పిటీషన్ 6289 ప్రకారం కోర్టు ఆదేశం ప్రకారం సకాలంలో భూములను వివాదాస్పదంగా గుర్తించకపోవడం, మరియు (2) ఆ భూములను ఎటువంటి హక్కులు లేని విక్రయించడానికి కవులుదారులు విక్రయించదానికి సహకరించడం మరియు అక్రమ యజమానులకు రాత్రికి రాత్రే 169.2 ఎకరాలను తప్పుగా మ్యుటేషన్ చేయడం వంటివి. భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన వారితో కలిసి అవినీతికి పాల్పడిన ఈమెపై బి. వనజాక్షిపై కోర్టు ధిక్కార చర్యకు హైకోర్టు పిటీషన్ సిసి నెంబర్ 2035/2024 ను నమోదు చేసిన శ్రీమతి కరిబండి సూర్యకుమారి శ్రమ సరిగ్గా ఏడాది తర్వాత ఫలించింది. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 10 నుండి 12 మేరకు ఈమెపై చర్యలు తీసుకోవడానికి ప్రాధమిక ఆధారాలు వున్నవంటూ నేడు న్యాయమూర్తి ఆదేశాలివ్వడం భీమోలు భూ వివాదాల్లో కీలక మలుపు అనే చెప్పవచ్చు. నకిలీ రిజిస్ట్రేషన్లను ఇప్పటికైనా రద్దు చేస్తారా. లేక కోర్టు దిక్కరణ కేసులో వున్న వనజాక్షికి వత్తాసుగా రెవెన్యూ అధికారులు వస్తారో?.. వేచి చూడాల్సిందే!

నామొగుడు- నా భూమి పధకానికి బ్రేక్? జమీందారు రెండో పెళ్ళాన్ని అంటూ ఎకరాలు కొట్టేయబోయిన రత్నానికి బ్రేక్?
ఓ ప్రక్క భూ యజమానులు, అక్రమ కౌలుదారులు, నష్టపోయిన అసలు పట్టదారులు ఈ భూములు మాదంటే మాదని యాభై ఏళ్లుగా కొట్టుకు చస్తావుంటే అసలు జమీందారు మారెడ్డి బుచ్చిరాజు రెండో పెళ్ళాన్ని అంటూ ఆటలో అరటిపండులా కొన్నెకరాలకు నేనే వారసురాలినంటూ గండృతు రత్నం వూరఫ్ మారెడ్డి రత్నం వూరఫ్ భూపతి రత్నం అంటూ ఒకమే రంగంలోకి దిగి, తనకు తన మొదటి భర్తకు తాను రెండో భార్యను అంటూనే అతను చనిపోయే ముందు అతని మిగులు ఆస్తులన్నీ తనకే రాసారంటూ 2000 సవత్సరంలో ఓ నకీలీ వీలునామా సృష్టించి ఏకంగా 2009 లో 7.40 ఎకరాలకు పాస్ బుక్కునే పుట్టించి సదరు ఆస్తి అదే యజమాని వారసుడు మరియు అక్రమ కౌలుదారుడు సర్వారాయుడుకి 2009 లో అమ్మినట్లుగా రిజిస్టర్ చేయించారు. ఆతర్వాత వీరిద్దరికీ వచ్చిన విబేదాల్లో కోవూరు కోర్టులో ఓయస్ నెంబర్ 16/ 2011 ఇంకా ఓయస్ నెంబర్ 299/2011 ప్రకారం సదరు అమ్మకాని ఆపాలని సర్వారాయుడుతోనే కేసులు వేసి ఓడిపోవడం గమనార్హం. అసలు 1957/ 1984/ 2000 ఇలా పలుదఫాలుగా జమిందారీ వారసులు మారెడ్డి జగ్గారావు ఇంకా మారెడ్డి బుచ్చిరాజు తమ సంతాన వారసులకు బోవములు పంచిన రిజిస్టర్డ్ వీలునామాల్లో ఎవరెవరికి ఎంట భూమి పంచారో విపులంగా రాశారు. అయితే 2000 సంవత్సరంలో శ్రీమతి రత్నం సృష్టించిన వీలునామాలో మారెడ్డి బుచ్చిరాజు తన సంతకం కాకుండా వేలిముద్ర వేయడం విషయాన్ని ఈరోజు రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిగిన విచారణలో మెజిస్ట్రేట్ దృష్టి తీసుకొని వచ్చారు న్యాయసలహాదారు అన్నపరెడ్డి విజయభాస్కర రెడ్డి. అదేసమయంలో రత్నం తన పేరిట వున్న దన్న వీలునామాలో మిగిన ఆస్తులన్నీ అని అంటూనే, ఏ ఒక్క భూమి ఆస్తికి సంబందించిన సర్వే నెంబర్లు లేకపోవడాన్ని కూడా న్యాయవాది జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరిన్ని శాఖయాలు ఇవ్వడానికి సమయం కోరగా జాయింట్ కలెక్టర్ తదుపరి వాయిదాను ఏప్రిల్ 4 వ తేదీకి వేశారు. అసలు రత్నం హక్కుదారు కాదన్న విషయాన్ని తదుపరి వాయిదాలో తేల్చేయడంతో పాటుగా ఆమె జమిందారీ అక్రమ కవులుదారుడు సర్వారాయుడు చేసిన భూ భాగవతాలపై మరిన్ని వివరాలు అటు కలెక్టర్ కి ఇటు హైకోర్టుకు ఇస్తామని భూ యజమాని కాకర్ల గంగరాజు తెలిపారు. తన భార్య కు ఆమె తల్లిగారు ఇచ్చిన 5.60 ఎకరాల భూమిని ఆక్రమంగ కొట్టేయడానికి సర్వారాయుడు రత్నం చేసిన ఇరువురి ప్రయత్నాలను అడ్డుకోగలిగామని, అయినా వారు చేసిన ఫోర్జరీలు, అక్రమ పత్రాలపై పోలీసు కేసు నమోదు చేస్తామన్నారాయన. అలాగే ఓ ప్రక్క జమీందారుగా, మరోపక్క అక్రమ కవులుదారుడిగా కోట్ల రూపాయల భూమి అమ్మిన సర్వరాయుడు, డాక్టర్ చదువుతున్న తన కూతుర దా. సుభద్ర పేరుతో ఇదే వివాదాస్పద భూమిలోని 7.0 ఎకరాలు చేయడం వెనుక మతలబు కూడా బయటకు తీస్తామన్నారు.

అక్రమ భూములపై వేసిన యధాతధ పిటీషన్ కొట్టివేత!
ఓప్రక్క జాయింట్ కలెక్టరుకు ఈ 5.60 ఎకరాలు తనడంటూ రత్నం, తనకు అమ్మేసిందంటూ రత్నం వేర్వేరు పీటీషన్లతో గందరగోళం సృష్టించి లబ్దిపొందుదామనుకున్న ఈ ద్వయం అటు హైకోర్టులో కూడా తమ అక్రమణలపై చర్యలు వద్దంటూ మద్యంతర వుత్తర్వ్యూలను కోరుతూ ఈరోజే మరొక పిటీషన్ వేయటం గమనార్హం. అయితే రాజమండ్రిలో జాయింట్ కలెక్టరు కోర్టు జరుగుతున్న సమయంలోనే హైకోర్ట్ వీరి పిటీషన్ కొట్టివేసిందన్న విషయాన్ని అధికారులకు తెలిపిన న్యాయవాదులు సదరు వీరి ఆక్రమణ భూమిని వివాదాస్పద ఖాతాలోకి వెళ్ళకుండా అడ్డుకోగలిగారు.
ఇలా మూడు కీలక నిర్ణయాలతో భీమోలు భూముల తీర్పులు, నిర్ణయాలు ఆక్రమార్కులకు అడ్డకట్టవేయడం, అదికూడా యంఆర్ఓ వనజాక్షీ ఆక్రమార్కులకు దొంగ ముటేషన్ చేసిన అదే రోజున ఏడాది తర్వాత కేసులు కీలక మలుపు తిరగటం, ఒకే రోజు మూడు విజయాలు చూసిన భూయాజమానుల దీన్ని న్యాయ తీన్మార్ గా భావిస్తున్నారు. కేసుల్లో పిటిషనర్ కరిబండి సూర్యకుమారి ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. చివరగా ఈ రోజు ఉత్తర్వుతో, కవులుదారులు చేసిన అక్రమ ఆస్తుల అమ్మకాలకు రద్దుకు గీతం పాడినట్లేనా?.. వేచి చవడాల్సిందే.. మరింత పరిశోధనతో జనశక్తి మళ్ళీ మీ ముందుకు వస్తుంది.

ముసుగు జర్నలిస్టులను తాటతీస్తా అన్న  రేవంత్ రెడ్డి కి.. అవినీతి అదికారుల్ని.. నేతల్ని.. మేము టోలు తీస్తాం.. అని చెప్పలేమ...
15/03/2025

ముసుగు జర్నలిస్టులను తాటతీస్తా అన్న రేవంత్ రెడ్డి కి.. అవినీతి అదికారుల్ని.. నేతల్ని.. మేము టోలు తీస్తాం.. అని చెప్పలేమా.. సహచర పాత్రికేయులారా?

ఏపీజేయు 2025 నూతన కమిటీల్లో పాత్రికేయ నాయకత్వానికి ఆహ్వానంఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీజేయు-స్థాపితం:1991), రీరీ....
15/03/2025

ఏపీజేయు 2025 నూతన కమిటీల్లో పాత్రికేయ నాయకత్వానికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీజేయు-స్థాపితం:1991), రీరీ.నెంబర్ 100/2019 నిబద్దతతో కూడిన 34 ఏళ్ల చరిత్ర కలిగిన పారదర్శక పాత్రికేయ సంక్షేమ వ్యవస్థ. 2019 పునర్నిర్మితం ఐనప్పటినుండి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు విషయాల్లో ఆలోచనాత్మక దొరణిలో సమస్యలపట్ల అవగాహనతో కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ. సమకాలీన పరిస్థితులలో పాత్రికేయ మనుగడ, సంక్షేమం, భద్రత అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వాటిపై పోరాడటంతోపాటుగా నూతన ఉత్తేజ కార్యవర్గ ఏర్పాటు చేయయదలచిన నేపద్యంలో ఔత్సాహిక పాత్రికేయుల నుండి ఏపీజేయు అనుభంద విభాగాలలోనూ, రాష్ట్ర మరియు జిల్లా కమిటీలలోనూ పనిచేయడానికి ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్టు నాయకులుగా ఎదగాలన్న మీ ఆలోచన, సమస్యల పట్ల స్పందించే విషయ పరిజ్ఞానం మీకుంటే ఏపీజేయు మీకు అవకాశం ఇస్తుంది. సీనియర్లు, జూనియర్లు, ఔత్సాహికులు, టెక్నీషియన్స్, సంపాదకులు, న్యూస్ ప్రెజెంటర్స్, మహిళా జర్నలిస్టులు ఇంకా వెబ్ డిజిటల్ మీడియా రంగం ఏదైనా అందరికీ నాయకత్వ అవకాశం కల్పించే విధంగా ఏపీజేయు 2025 నూతన కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. ఆసక్తి గల జర్నలిస్టులు మీమీ స్పందనను వాట్స్అప్ నెంబర్ 9703883885 కు తెలియ చెయ్యండి. తొలుత మీ పేరు, ఫోన్ నెంబర్ మెసేజ్ పెడితే ఏపీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిమ్ములను సంప్రదిస్తారు... ఏపీజే

I got 1 reaction and 1 reply on my recent top post! Thank you all for your continued support. I could not have done it w...
28/02/2025

I got 1 reaction and 1 reply on my recent top post! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

వెనకబడిన కులాలంటూ వెంపర్లాడి .. ఇలాంటి కులాన్ని తాకట్టు పెట్టి బతికేవాళ్లకి పదవి ఇవ్వటమే జగన్ చేసిన పెద్ద తప్పు..!.. పార్టీకోసం పని చేసిన ఒక్కడికి ఇవ్వకుండా.. ఇలాంటి బెవార్స్ గాళ్లకు పదవులిచిన జగకు కు అభినందనలు!

28/02/2025

I gained 5 followers, created 4 posts and received 3 reactions in the past 90 days! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

27/12/2024

సమాజాన్ని మోసం చేసి దోచేసిన పాత్రికేయురాళ్లను.. ఎవరేమి చేయలేకపోయినా?.. వాళ్లు కనిపెంచుకున్న పిల్లలు అడ్డంగా తన్ని తగలేయకుండా ఉండరని మా చీలీ వుందంతం చెప్పకనే చెబుతుంది?.. ఆల్ ది బెస్ట్!

వెనకబడిన కులాలంటూ వెంపర్లాడి .. ఇలాంటి కులాన్ని తాకట్టు పెట్టి బతికేవాళ్లకి పదవి ఇవ్వటమే జగన్ చేసిన పెద్ద తప్పు..!.. పార...
15/12/2024

వెనకబడిన కులాలంటూ వెంపర్లాడి .. ఇలాంటి కులాన్ని తాకట్టు పెట్టి బతికేవాళ్లకి పదవి ఇవ్వటమే జగన్ చేసిన పెద్ద తప్పు..!.. పార్టీకోసం పని చేసిన ఒక్కడికి ఇవ్వకుండా.. ఇలాంటి బెవార్స్ గాళ్లకు పదవులిచిన జగకు కు అభినందనలు!

15/12/2024

నిరంజన్ రెడ్డి గారిదేం లేదు.. అల్లు బెయిల్ వ్యూహం నాదే అంటున్న సీనియర్ పాత్రకేయణీ?.. సుప్రీమ్ న్యాయవాది చీలీ'కుమారి!.. కవిత బెయిల్ లోనూ అప్పట్లో తనదే వ్యూహం అని ప్రకటించుకున్న ఈమె 2020 ఇండియా ఇంటర్నేషనల్ క్వీన్ అందాలపోటీల్లో విజేతగా నిలవడం కూడా విశేషం?

Mrs. Vijaya Cheeli is an inspiring figure who has dedicated her life to making a positive impact on the world. Her unwav...
11/12/2024

Mrs. Vijaya Cheeli is an inspiring figure who has dedicated her life to making a positive impact on the world. Her unwavering commitment to social causes, particularly the upliftment of underprivileged children, is truly commendable. Her numerous awards, including the Best Humanity Award from the Telangana Government, are a testament to her selfless service and unwavering dedication.
It's individuals like Mrs. Cheeli who truly embody the spirit of compassion and humanity, inspiring others to follow in their footsteps and contribute to a better world.

13/10/2024

జనసేనలోకి రాపాక వరప్రసాద్..?
ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జనసేన నేతలు నిర్వహించిన ఓ కార్యక్రమానికి సమావేశానికి రాపాక వరప్రసాదరావు కూడా హాజరయ్యారు. గతంలో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆయనకు అక్కడ గుర్తింపు లభించకపోవడంతో మళ్లీ జనసేన గూటికి చేరుతున్నారట?

Address

MIG 147 HOUSING BOARD COLONY, , NALLAPADU Road
Guntur
522005

Alerts

Be the first to know and let us send you an email when Namaste Janasakti Telugu Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Namaste Janasakti Telugu Daily:

Share