Andhra today

Andhra today news and entertainment

30/05/2026

*బాపట్లలో ఇసుకాసురులు*

బాపట్ల నియోజకవర్గం కేంద్రంగా ఇసుక అక్రమ రవాణ దందా భేషుగ్గా సాగుతోంది. అనుమతులు లేకుండా పట్టపగల ఇసుక అక్రమ రవాణాకు ఇసుకాసురులు తెగబడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. అయితే అధికారుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు. కనుకనే ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వారి నెంబర్లను మైనింగ్ అధికారులు బ్లాక్ లో పెడుతున్నారు.

30/05/2026

*మండుటెంఠలకు మాడుతున్న మొబైల్స్*

భగభగ మండే వేడికి మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మనుషులు చేసిన మొబైల్స్ ఒక లెక్కా. ప్రచండ భానుడి ప్రతాపానికి స్మార్ట్ ఫోన్లు కూడా మలమల మాడిపోతున్నాయి. మీకు నమ్మకం కలుగకపోతే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా వెళ్ళాల్సిందే. ఆ జిల్లాలోని మక్దంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చంద్ర గౌడ్‌ ఫోన్ జేబులో ఉండగానే ఓవర్ హీటెక్కి పేలిపోయింది. ఆ... ఇది తెలుసుకోవడానికి అంత దూరం ఏం వెళ్తాంలే అంటారా..! అయితే ఈ వీడియో చూడండి..!!

30/05/2026

*ఉండవల్లి కెనాల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం*
*ఎదురెదురుగా ఢీకొన్న ఆటోలు*

రాజధాని పరిధిలోని ఉండవల్లి సెంటర్ గుంటూరు కెనాల్ (కొత్త కాలువ) బ్రిడ్జిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఉండవల్లి నుండి విజయవాడ వైపు ఒక ఆటో వెళ్తుండగా, అదే సమయంలో విజయవాడ నుండి ఉండవల్లి వైపు మరో ఆటో వస్తోంది. ఈ క్రమంలో కెనాల్ బ్రిడ్జిపైకి రాగానే రెండు ఆటోలు ముఖాముఖి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఒక ఆటో రోడ్డుపైనే తలకిందులుగా తిరగబడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

*స్వచ్ఛంద వేశ్యా వృత్తి నేరం కాదు*-  సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు *ఇకపై పోలీసుల వేధింపులు చెల్లవు*స్వచ్ఛంద...
29/05/2026

*స్వచ్ఛంద వేశ్యా వృత్తి నేరం కాదు*
- సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

*ఇకపై పోలీసుల వేధింపులు చెల్లవు*

స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసు విషయమై విచారణ జరిపిన జస్టిస్ జె.బి.పర్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని వయోజనులుగా పరిగణిస్తారు. అలాగే లైంగిక కార్మికులు కూడా భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం, సమాన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులు.

*ఇకపై పోలీసుల వేధింపులు చెల్లవు*

సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం చేయకూడదన సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దాడులు (రైడ్స్) జరిగినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించరాదని స్పష్టం చేసింది.

లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ, వ్యభిచార గృహాలు (Brothels) నడపడం మరియు ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా (Human Trafficking) ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా నేరం. అయితే కండోమ్‌లు కలిగి ఉండటం సెక్స్ వర్కర్‌కు వ్యతిరేకమైన నేరంగా పరిగణించరాదని.. వారి ప్రైవసీని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించవద్దనీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

29/05/2026

*శాస్త్రి వీధిలో అశాస్త్రీయం*
*జనావాసాల మధ్యనే గోవధ*

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఇళ్ల మధ్యనే విచ్చలవిడిగా గోవధకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. గతంలో ఎన్నడు లేని విధంగా పట్టణ నడిబొడ్డున ఉన్న జనావాసాల మధ్యనే కొందరు గోవులను వధిస్తున్నారు. అది కూడా శాస్త్రి వీధిలో కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వన్ టౌన్ పోలీసులు స్థానిక శాస్త్రి వీధికి చేరుకొన్నారు. గోవధకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మోతి నగర్, సైదా పేటలో సైతం ఇళ్ల మధ్యనే గోవధ జరుగు తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

29/05/2026

*రెండు లారీల ఢీ*

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తెలంగాణ వైపు నుంచి వస్తున్న లారీ దాచేపల్లిలోకి రాగానే మూలమలుపు తిరుగుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో లారీ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది.

ఈ ప్రమాదంలో లారీల్లో ఉన్న డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కున్న క్షతగాత్రుడిని బయటికి లాగి నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

29/05/2026

*రోడ్డు వెడల్పు పేరిట మా ఆస్తికి నష్టం*
- గుర్రుమంటున్న గార్డెన్స్ వాసులు

మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వెడల్పు చేసే ఉద్దేశ్యంతో మా ఆస్తికి నష్టం కలిగిస్తున్న జీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బృందావన్ గార్డెన్స్, మెయిన్ రోడ్డులోగల స్థల యజమానులు మరియు స్వాధీనదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

జి.ఎం.సి. మాస్టర్ ప్లాన్ ప్రకారం బృందావన్ గార్డెన్స్ సెంటర్ ఎన్.జి. రంగ విగ్రహం నుండి స్తంభలగరువు సెంటర్ చేబ్రోలు హనుమయ్య విగ్రహం వరకు ఉన్న రోడ్డును విస్తరించాలని మున్సిపల్ ప్రణాళికా శాఖ సిబ్బంది మమ్మల్ని సంప్రదించి, ప్రతిపాదించినట్లు తెలియజేశారు.

వారు మా ప్రహరీ గోడను గుర్తించి, మా కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేయమని కోరినట్లు తెలిపారు. అలా చేయని పక్షంలో, బలవంతంగా మా కట్టడాలను కూల్చివేస్తామని జీఎంసీ అధికారులు మమ్ములను బెదిరిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు .

ఎన్.జి. రంగ విగ్రహం నుండి కుందుల రోడ్డు వరకు ఇప్పటికే 80 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉందని చెప్పారు. మా షాపు గోడలు కూల్చివేసి, స్వాధీనం చేసుకుని దానిని వెడల్పు చేయవలసిన అవసరం లేదని అన్నారు. మేము ఎంత నచ్చజెప్పినా జీఎంసీ అధికారులు మా మోర వినడం లేదని, మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎన్.జి. రంగ విగ్రహం నుండి చెబ్రోలు హనుమయ్య విగ్రహం వరకు ఉన్న రోడ్డు 80 అడుగుల వెడల్పుతో ఉండాలని ప్రతిపాదించబడిందని తెలిపారు. 2026 సంవత్సరపు డబ్ల్యూ.పి. దాఖలు చేశామని చెప్పారు. ఎస్.ఆర్.ఓ. ఫైల్‌లో నమోదు చేయబడిన మా పత్రాల ప్రకారం, నల్లపాడులో, ఉత్తరం వైపు ఉన్న రహదారి 80 అడుగుల వెడల్పుతో ఉందని చెప్పారు.

మరియు ఎన్.జి. రంగ విగ్రహం నుండి కుందుల రోడ్డు వరకు ఉన్న ప్రస్తుత రహదారి కూడా 80 అడుగుల వెడల్పుతోనే ఉందని తెలిపారు. మా ఆస్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రహదారికి ఉత్తరపు అంచున కాలువ వేస్తే సరిపోతుందని సూచించారు. ఒకవేళ అధికారులు రహదారిని 80 అడుగులకు మించి వెడల్పు చేయాలనుకుంటే, వారు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ మాధవరావు, గడ్డంశెట్టి సత్యనారాయణ, ఎండీ అజీజ్ అహ్మద్, పోకూరి మణికంఠ చంద్ర శేఖర్, తాళ్లూరు వెంకట చంద్ర శేఖర్, ఎండీ ముభాషిర్ అహ్మద్, జాగర్లమూడి సుజాత, గోగినేని జ్యోతి కుమారి, కుందా ఇందిరా రాణి, తోటకూర వెంకట రమణ, ప్రతీతి లావణ్య, ప్రత్తిపాటి విజయశంకర్, పాపినేని శేషగిరిరావు, కొసరాజు సత్య కిరణ్, కొసరాజు నీహారిక, మురికిపూడి అమర్ జనార్దన్ కుమార్, అదిగోపుల రవితేజ, ఎండీ ఫరూక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

29/05/2026

*విరిగిపడిన విద్యుత్ స్తంభాలు*
*కరెంట్ లేక ప్రజలకు కష్టాలు*

గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, కట్టెంపూడి ప్రధాన రహదారిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో గురువారం రాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తులు విద్యుత్తు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొన్నూరు రూరల్ విద్యుత్ శాఖ అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

*ఢిల్లీ వెళ్ళిన షర్మిల**రాహుల్ గాంధీతో భేటీ*ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కేనా...!?ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్ల...
29/05/2026

*ఢిల్లీ వెళ్ళిన షర్మిల*
*రాహుల్ గాంధీతో భేటీ*

ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కేనా...!?

ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్లనుందా..? అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. కర్ణాటక నుంచి షర్మిలకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల, రాహుల్ గాంధీతో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది.

*చిన్నమల్లయ్య ఎక్కడ...!?*{నెల రోజులుగా కానరాని ఆచూకీ}వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత...
29/05/2026

*చిన్నమల్లయ్య ఎక్కడ...!?*
{నెల రోజులుగా కానరాని ఆచూకీ}

వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సీఐ చిన్నమల్లయ్యపై గత నెల 29న వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే సీఐ చిన్నమల్లయ్య పరారయ్యారని, నెల రోజులు గడిచినా ఇప్పటికీ ఆయన ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారు

ఈ నెల 2న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చిన్నమల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన సమయంలో చిన్నమల్లయ్య బ్రాహ్మణపల్లిలోనే ఉన్నప్పటికీ, అరెస్టులో జాప్యం కారణంగా తప్పించుకున్నారని, ఇందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో రెండేళ్లు సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసిన అనుభవంతో చిన్నమల్లయ్య సెల్‌ఫోన్ వినియోగించకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, సీఐ కుమారుడు తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తూ సంబంధిత సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. సీఐ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

29/05/2026

*నెత్తిపై జుట్టుంటేనే ఉపాధి హామీ*

ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో విచిత్రమైన లోపాలు బయటపడ్డాయి. గుండుతో ఉన్న కార్మికుడిని ఉపాధి హామీ యాప్ గుర్తించడం లేదు. అదే గుండుపై పక్కనే ఉన్న ఓ మహిళ జుట్టును కప్పితే వెంటనే గుర్తిస్తోంది.

దీంతో కార్మికులంతా కడుపుబ్బా నవ్వుకుని ఇదెక్కడి చోద్యం అంటూ నోళ్ళు నొక్కుకుంటున్నారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఇటీవల కొండగట్టు అంజన్నకు శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కార్మికుడు తలనీలాలు సమర్పించుకున్నాడు. అయితే ఉపాధి హామీ పనికి వెళ్లి అటెండెన్స్ కోసం ఫోటో దిగుతుండగా, గుండుతో ఉండడం వల్ల అతన్ని యాప్ గుర్తించలేదు. దీంతో పక్కనే ఉన్న మహిళ జుట్టును గుండుపై పరచగానే అటెండెన్స్ నమోదుకు ఫోటోను ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్ అంగీకరించింది.

Address

Guntur

Telephone

+917207665999

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share