Andhra today

Andhra today news and entertainment

31/08/2025

*4,000 మంది విద్యార్థులు - 5,000 దీపాలు*
*ఆవిష్కృతమైనఅద్భుతం*
*వెలుగులతో వినాయకుడి సాక్షాత్కారం*

కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ పాఠశాలలో చదువుతున్న 4,000 మంది విద్యార్థులు గణేశుడి భారీ ఆకృతిని ప్రదర్శించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించడం ద్వారా అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ డ్రోన్ కెమెరా ద్వారా పై నుండి చిత్రీకరించగా.. వెలుగుల కాంతిలో గణేశుడి ఆకృతి మరింత అందంగా కనిపించింది.

ఈ విషయమై పాఠశాల విద్యాసంస్థ అధ్యక్షుడు నెక్కంటి సూరిబాబు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు గణేశుడి ఆకృతిని దీపాలతో అలంకరించి దేవుడికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న ప్రాథమిక, హైస్కూల్ స్థాయి విద్యార్థుల సహకారంతో పర్యావరణహిత గణేశ విగ్రహాలను తయారు చేశారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, వారి సృజనాత్మకతను వెలికి తీయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

30/08/2025

గుంటూరు నగరంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

31న ఉదయం సరఫరా తర్వాత నెహ్రూనగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ త్రాగునీటి సరఫరా జరిగే 900 ఎంఎం డయా పైపైన్కు నెహ్రూనగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ చేయాడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు సిద్దం చేశారన్నారు. పైడ్లైన్ ఇంటర్ కనెక్షన్ పనులకోసం తక్కెళ్లపాడు హెడ్వాటర్ వర్క్స్ లోని ఫిల్టరేషన్ పాయింట్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీనివలన 31వ తేదీ సాయంత్రం నుండి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం వరకు తాగునీటి సరఫరా అంతరాయం కలుగుతుందని, 2వ తేదీ సాయంత్రం పాక్షికంగా 3వ తేదీ ఉదయం నుండి యధావిదిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. పనుల వలన నగరంలోని హెచ్ఎల్ఆర్, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, ఏఎంసి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోర్ట్ కాంపౌండ్, కెవిపి కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల, నగరాలూ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకి అంతరాయం కల్గుతుందన్నారు. కావున ప్రజలు సహకరించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

30/08/2025

నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు...!?
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

"నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు" అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీషీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో నిన్న వైరలయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు.
‘నిన్న నాకు ఒక వీడియో వచ్చింది. అందులో నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అని ఒకరు మాట్లాడుతున్నారు.

నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు?

ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను.
ఆ వీడియో వాళ్లకు 3 రోజుల ముందే వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు’ అని కోటంరెడ్డి అన్నారు....

*అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ* మంగళగిరి దాటి విజయవాడ వెళుతున్న సమయంలో గురువారం అర్ధరాత్రి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ద...
29/08/2025

*అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ*

మంగళగిరి దాటి విజయవాడ వెళుతున్న సమయంలో గురువారం అర్ధరాత్రి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగతనం జరిగింది. మంగళగిరి దాటాక రైలు కొంచెం స్లోగా వెళుతున్న అదను చూసి బోగి నెంబర్ S3-1 లో ఒక ప్రయాణీకురాలి బ్యాగ్ లాక్కుని దొంగ పారిపోయాడు. బ్యాగులో బంగారు గొలుసు
మొబైల్ ఫోన్ ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు rpf పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

*ఔదార్యం చాటుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి*పర్చూరు మండలం చింతగుంటపాలెం గ్రామానికి చెందిన కంది అంజిరెడ్డికి...
28/08/2025

*ఔదార్యం చాటుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి*

పర్చూరు మండలం చింతగుంటపాలెం గ్రామానికి చెందిన కంది అంజిరెడ్డికి రూ. 40వేల విలువైన ఎలక్ట్రిక్ టూ-సీటర్ ట్రైసైకిల్ ను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం తన కార్యాలయంలో అందజేశారు.

గత కొన్ని ఏళ్లుగా స్పైన్ టీబీతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న అంజిరెడ్డి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించిన కలెక్టర్ 40వేల విలువైన ఎలక్ట్రిక్ టూ-సీటర్ ట్రైసైకిల్ ను అంజిరెడ్డి కి అందజేసారు.

అంజిరెడ్డి ఆ ఎలక్ట్రిక్ సైకిల్ ను నడుపుతుంటే జిల్లా కలెక్టర్ ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోవడం... "అవును... ఆయన ఓ గొప్ప మనసున్న మంచి కలెక్టర్" అని పలువురు కలెక్టర్ వెంకట మురళిని కొనియాడారు.

28/08/2025

గుంటూరు జెడ్పీ ప్రాంగణంలో ఏసీబీ దాడులు

30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఐపీవో ముత్తి శ్రీనివాసరావు

పరిశ్రమల శాఖలో ఐపీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు

పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్

బాధితుడు మండేపూడి కమలాకర్ తో తొలుతగా 30వేలు ఇచ్చేందుకు ఒప్పందం

జడ్పీ ప్రాంగణంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఐపీవో శ్రీనివాసరావు

అదే సమయంలో దాడి చేసిపట్టుకున్న ఏసీబీ అధికారులు

శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

28/08/2025

*పవన్ "గాలి" కొదిలేసిన "సుగాలి" కేసు*
*సుగాలి ప్రీతికి సేనాని నమ్మకం ద్రోహం*
- ప్రీతి తల్లి సుగాలి పార్వతి

నా కుతురుని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు..

8సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను..

న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అయిన తరువాత గాలికి వొదిలేశారు..

మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పై అన్నారు..

14 నెలలు ఐయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..

అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి.

కేంద్రం పై ఒత్తేది తీసుకుని వొచ్చి సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి..

సేనతో సేనాన్ని అంటున్నారు..నా కూతురుకి న్యాయం చేయలేకపోయారు..

హోం మంత్రికి శ్రీకాంత్ పెరవలి పై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు..

ఎమ్మెల్సీ అనంతపద్ విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు..

గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?

ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని హోమ్ మినిస్ట్రీస్ ని అడుగుతున్నాను..

గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను..

సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ కాంపియన్ చేస్తాం.

నిరాహార దీక్ష కి కూడా పునుకుంటాం..

8సంవత్సరాలు అవిటి తనం తో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?

లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?

ప్రతిపక్షం ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వొచ్చకా ఎందుకు గుర్తులేదు..

జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం..

*బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం**తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు**ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్**ఉత్...
28/08/2025

*బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం*

*తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు*

*ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్*

*ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు*

*ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక*

*అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు*

*శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం.. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో.. ప.గో, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్లలో వర్షాలు*

*తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు*

*మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన*

*తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు*

28/08/2025

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి విషమంగా మారింది.

శ్రీవైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి చెందారు. 23 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన కత్రా సమీపంలోని వైష్ణోదేవి యాత్ర ట్రాక్‌పై చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. నిరంతర వర్షాల కారణంగా ఇంకా కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు తెలిపారు.

28/08/2025

వరదల్లో చిక్కుకున్న వారిని భుజాలపై మోస్తూ..

తెలంగాణ రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి (D) ఎల్లారెడ్డి (M) అన్నసాగర్లో వరదలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు, SDRF సిబ్బంది భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అటు సిరిసిల్ల(D) గంభీరావుపేటలో అప్పర్ మానేర్ వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్లతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు కామారెడ్డి, MDKలో 504 మందిని రక్షించారు.👌👌

28/08/2025

70 కిలోల బంగారం.. 350 కిలోల వెండి.. వెరసి 264 కోట్ల రూపాయలతో ముంబైలో వెలిసిన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన గణేష్ విగ్రహం!

27/08/2025

*గుంటూరులో రోడ్డెక్కిన కండోమ్స్*

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సైడు కాలువల్లోని కండోమ్స్ రోడ్డు పైకి వచ్చాయి.‌ నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే అరండల్‌పేటలోని ఓ లాడ్జి ముందు గల రోడ్డుపై ఒక్కసారిగా వీటిని చూసిన ప్రజలు చీదరించుకుంటున్నారు.

Address

Guntur

Telephone

+917207665999

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share