Andhra today

Andhra today news and entertainment

31/07/2026

*దో సౌ దే*
*బార్డర్ చెకింగ్*
*తెలంగాణలో వసూళ్ల దందా*

కామారెడ్డి పోలీస్ పేరిట తెలంగాణలో బార్డర్ చెకింగ్ అంటూ లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలో ఏం సరుకు రవాణా అవుతుంది.. వాటికి సరైన పత్రాలు ఉన్నాయా.. లేదా.. అన్నది చెకింగ్ చేయకుండా 200 రూపాయలు తీసుకుని వదిలేస్తున్నారు "దో సౌ దే" అంటూ దబాయిస్తున్నారు. వారికి నేమ్ బ్యాడ్జ్‌లు కూడా లేకపోవడంతో అనుమానం వచ్చిన ఓ లారీ డ్రైవర్ వీడియో తీస్తూ నిలదీయడంతో పొంతన లేని సమాధానం చెప్పారు.

*పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం*మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా కార్యక్...
31/07/2026

*పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం*

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.

31/07/2026

*వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య*

శ్రీకాకుళం జిల్లా,
కొత్తూరులోని టైప్-4 కేజీబీవీ వసతిగృహంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న సవర పూజిత (16) అనే విద్యార్థిని వసతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట మండలం లక్కయ్యగూడ గ్రామానికి చెందిన పూజిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి కుటుంబ సభ్యులు విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

31/07/2026

*ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై చర్చించారు.

30/07/2026

ఇంజనీరింగ్ చదివినోళ్ళను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చులకన చేసి మాట్లాడారు. వాళ్ళను శుద్ధ వేస్ట్ అనేశారు. కనీసం వారికి తమ జాబ్ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. కావాలంటే ఎవరైనా వారికి ఒక తెల్ల పేపరిచ్చి టెస్ట్ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు.

*జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నడిగులు*"బెంగళూరును ఏలుతున్నాం" అన్న చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ వ్యాఖ్యలను పలు కన్నడ స...
30/07/2026

*జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నడిగులు*

"బెంగళూరును ఏలుతున్నాం" అన్న చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.‌ వైట్‌ఫీల్డ్‌లో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తీవ్ర స్థాయి నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగింది.

30/07/2026

పోలీసులు అడ్డుకోవడంతో జ‌గ‌న్‌ను చూసేందుకు పొలాలకు అడ్డం పడి నీళ్లు ఉన్న కల్వ‌ర్ట్‌ను దాటుకుని అంపోలు జైలు రోడ్డుకు చేరుకున్న అభిమానులు

30/07/2026

*కాళేశ్వరంలో చేపల వాన*

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వింత ఘటన చోటుచేసుకుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చేపలు వర్షంలా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు, నేలపై చేపలు కనిపించాయి. వీటి శరీరంపై బలమైన ముళ్లు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

*ఏపీ రెయిన్ రిపోర్ట్** 🟧శుక్రవారం (31-07-2026) మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ...
30/07/2026

*ఏపీ రెయిన్ రిపోర్ట్*

* 🟧శుక్రవారం (31-07-2026) మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

* 🟨 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు

* 🟥 ఉరుములు,మెరుపులతో ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు,హోర్డింగ్స్,విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచించారు

30/07/2026

*దస్తావేజు లేఖరుల ఉపాధి పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ అండ*

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏపీ రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ జారీ చేసిన జీవో నంబర్‌ 396ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

జీవో నంబర్‌ 396 దస్తావేజు లేఖరుల ఉపాధికి మరణశాసనంగా మారుతుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తే దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు తమ ఉపాధితోపాటు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు.

ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

Address

Guntur

Telephone

+917207665999

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share