Andhra today

Andhra today news and entertainment

20/06/2025

*ఇది రాజకీయం కాదు.. అరా(చ)జకీయం*

నరకండి.. చంపండి.. అన్నవాళ్ళను జగన్ వెనకేసుకుని వచ్చారా.. లేక వెటకారంగా మాట్లాడారా.. అన్న అంశాన్ని కాసేపు పక్కనబెడితే... మీరూ, మీ వాళ్ళు ఏమైనా వేమన పద్యాలు, సుమతీ శతకాలు వల్లె వేస్తున్నారా ముఖ్యమంత్రి గారూ...!?

మీరు కూడా అంతకు మించి మాట్లాడుతున్నారు కదా!

ఒకాయన కొడకల్లారా.. అంటారు!
మరొకాయన రండ్రా చూసుకుందాం అంటారు!
ఇంకొకాయన కట్ డ్రాయర్‌తో నడిపిస్తానంటారు!

ఇక మీరైతే ఏకంగా తాట తీస్తా.. తోక కత్తిరిస్తా.. అని బహిరంగంగా జగన్‌ను ఉద్ధేశించే హెచ్చరికలు జారీ చేస్తున్నారు!

ఇంకా రాసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ.. ప్రస్తుతానికి ఇవి చాలు!

మీరు, మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు జగన్ తీరును ఖండించే నైతికత లేదు కదా!!

ఈ రాష్ట్రంలో ప్రతిరోజూ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎదుటి వారిని ఎంత మాట బడితే అంత మాట అంటున్నారు. మళ్ళీ తామొక్కరిమే మంచోళ్ళన్నట్టు ఎదుటి వారి మాటలను ఖండిస్తున్నారు.

ఎవరు ఎవర్ని ఎందుకు తిడుతున్నారో అసలు అర్ధమే కావడం లేదు. ఒక సమయం, సందర్భం లేకుండానే నోరు పారేసుకుంటున్నారు.

ఇది రాజకీయం కాదు.. అరాజకీయం!

20/06/2025

ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు తండ్రి ఛాలెంజ్ కు సిద్ధమా...!? 👇🏻

నా కొడుకుపై నీచమైన ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కాబట్టి దమ్ముంటే వాటిని నిరూపించాలి..

ఒకవేళ నిరూపించలేకపోతే సత్తెనపల్లి నడిబజారులో గాజులు వేసుకుని తిరగాలి



19/06/2025

*బహిరంగగా మద్యం సేవిస్తున్న నలుగురు అరెస్ట్*

*గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ప్రాంతంలో మద్యం సేవిస్తున్న నలుగురు మందుబాబులను పొన్నూరు అర్బన్ సీఐ వీరానాయక్ గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తానని మీడియాకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకొని భారీ అపరాధ రుసుం విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు.*

19/06/2025

బెట్టింగ్‍లో చనిపోయిన వ్యక్తికి విగ్రహం ఏమిటి?

బెట్టింగ్‍లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడమేంటి? అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈరోజు ఆమె విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్‍లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలకు మాజీ సీఎం జగన్ పరామర్శా! అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. జగన్ నిన్నటి బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారు. జగన్ బలప్రదర్శనలో ఇద్దరి మృతికి బాధ్యులెవరు? అని ఆమె అడిగారు. బలప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండని, బలప్రదర్శనలు కాదని షర్మిల హితవు పలికారు.

19/06/2025

నరకండనే రాజకీయ నాయకుడిని ఎక్కడైనా.. ఎప్పుడైనా.. చూశారా...!?
- సీఎం చంద్రబాబు

నరకండి.. చంపండి.. పొడిచేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా ? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సంఘటనలను ఆయన ప్రస్తావించి, పలు ప్రశ్నలు వేశారు. పోలీసులను, పబ్లిక్ ని ఎవరైనా తిడతారా? అని అడిగారు. ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు.

19/06/2025

ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు

అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం

ఇరాన్-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం

అయితే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు

*రింగ్ తిప్పుతున్న సీఎం, మాజీ సీఎం*ఇదేంటి హెడ్డింగ్ ఇలా ఉంది.. ఇద్దరూ ఒకేసారి రింగెలా తిప్పుతారని అనుకుంటున్నారా...!రింగ...
19/06/2025

*రింగ్ తిప్పుతున్న సీఎం, మాజీ సీఎం*

ఇదేంటి హెడ్డింగ్ ఇలా ఉంది.. ఇద్దరూ ఒకేసారి రింగెలా తిప్పుతారని అనుకుంటున్నారా...!

రింగ రింగా.. రింగ రింగా.. రింగ రింగారే.. అని తిప్పడానికి ఇది రాజకీయ రింగో, లేక రసజ్ఞుల పొంగో కాదండీ బాబు!

"హెల్త్ రింగ్"

ప్రతి సమావేశంలోనూ పదేపదే హెల్త్ ట్రాకర్ రింగ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించే హెల్త్ రింగ్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎడమ చేతి మధ్య వేలిని అలంకరించింది.

తాను ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి రింగ్ వాడుతున్నట్లు పలుమార్లు చెప్పిన చంద్రబాబు.

చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి కూడా అలాంటి రింగ్ కనిపించడంతో సర్వత్రా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది .

19/06/2025

విశాఖలో కళ్ళు తెరవని ట్రాఫిక్ పోలీసులు. యోగ డే కి మూడు రోజుల ముందే వాహనదారులకి చుక్కలు. కిలోమీటర్ల మేర గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్. హెల్మెట్ లేని వారిపై చలనాలు వడ్డించడంపైనే వైజాగ్ ట్రాఫిక్ పోలీసుల దృష్టి.

19/06/2025

*తమిళనాడులో 'ప్రళయ చేప' దర్శనం*
*వ్యక్తమౌతున్న భూకంప, సునామీ భయం*

తమిళనాడు సముద్ర తీరంలో 'ఓర్ ఫిష్' మత్స్యకారుల వలకు చిక్కింది.. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో ఈ 'ప్రళయ చేప' వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

19/06/2025

రప్పా రప్పా కుర్రోడు తెలుగు తమ్ముడు కాదంట!

*భీమా కోసం టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడట*

నరుకుతాం - చంపుతాం అంటే మంచిదేగా అంటాడా...!?*నేరాలను ప్రోత్సహిస్తే తాటతీస్తాం**సీఎం చంద్రబాబు*మాజీ సీఎం వైఎస్ జగన్ సినిమ...
19/06/2025

నరుకుతాం - చంపుతాం అంటే మంచిదేగా అంటాడా...!?

*నేరాలను ప్రోత్సహిస్తే తాటతీస్తాం*

*సీఎం చంద్రబాబు*

మాజీ సీఎం వైఎస్ జగన్ సినిమా డైలాగ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 'ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా? చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు. రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను వదిలేయాలా? అలాంటి వారిని హీరోలుగా చిత్రీకరిస్తారా? ఉన్మాదులుగా మారిన వారిని మార్చగలమా? ఇలాంటి వారిని వదలం. తాట తీస్తాం' అని హెచ్చరించారు.

19/06/2025

చిలకలూరిపేట సుగాలి కాలనీలో టీడీపీ మహిళ నేత శిరీష ఆత్మహత్యయత్నం

ఓ షాపింగ్ మాల్లో జరిగిన వివాదంపై మాట్లాడేందుకు మూడు రోజుల క్రితం చిలకలూరిపేట టౌన్ పిఎస్ కి వెళ్లిన శిరీష

సిఐ రమేష్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని శిరీష ఆరోపణ

అవమాన భారంతో నేడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశానన్న శిరీష

చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న శిరీష.

Address

Guntur

Telephone

+917207665999

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share